E.G: రాజమండ్రిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించనున్న ఆర్చ్ నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మన సంస్కృతి..సంప్రదాయం ఉట్టిపడేలా సుమారు రూ.20 లక్షలతో ఆలయం వద్ద ఆర్చ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.