• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రైల్లో గంజాయి.. నిందితుల కోసంపోలీసుల వేట

GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్‌ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నిందితులు మాత్రం పరారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు,త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

February 16, 2025 / 06:11 AM IST

ఆటో డ్రైవర్‌ దాడి.. మాజీ ఎమ్మెల్యే మృతి

గోవా మాజీ MLA, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్ (68) మృతిచెందారు. కర్ణాటకలోని ఓ హోటల్ నుంచి లావో బయటకు వస్తుండగా కారు ఢీకొట్టిందని ఆటోడ్రైవర్ గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. అనంతరం లావో లాడ్జిలోకి వెళ్లగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు.

February 15, 2025 / 08:28 PM IST

పద్మాపురంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామం సమీపంలో NH5 రోడ్డు పనులకు సూపర్వైజర్‌గా పని చేస్తున్న ఏనుగు ప్రతాప్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 15, 2025 / 12:53 PM IST

కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

HYD: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 15, 2025 / 12:38 PM IST

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 15, 2025 / 12:05 PM IST

కన్న కొడుకును హత్య చేయించిన తల్లి

AP: మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును తల్లి హత్య చేయించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మ మూడో కుమారుడు శ్యాంబాబు మద్యానికి బానిసై దొంగతనాలు చేసేవాడు. ఇటీవల మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

February 15, 2025 / 11:26 AM IST

మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

SKLM: ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి సర్పంచ్ పిట్ట శశిరేఖ చెక్ పవర్‌ను రద్దు చేసినట్టు ఎంపీడీఓ రామారావు శుక్రవారం తెలిపారు. 2021 నుంచి 2025 వరకు నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య పనుల్లో సర్పంచ్ రూ.85 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్లు పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు.

February 15, 2025 / 08:21 AM IST

ఆన్‌లైన్‌లో రూ.1.55లక్షల స్వాహా

కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు  వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 15, 2025 / 08:11 AM IST

గాజువాకలో రోడ్డు ప్రమాదం.. మృతుని వివరాలు ఇవే

VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 14, 2025 / 04:03 PM IST

బెంగళూరుకు యాసిడ్ దాడి బాధితురాలు

AP: అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి ఘటన యువతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిని కత్తితో పొడిచి ముఖంపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసిన విషయం తెలిసిందే. గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 29న యువతి పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

February 14, 2025 / 02:23 PM IST

HYD రోడ్డుప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన BMW కారు

HYD: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కవాగు సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

February 14, 2025 / 01:26 PM IST

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

కృష్ణా: అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

February 12, 2025 / 08:17 AM IST

మహిళపై అత్యాచారయత్నం

CTR: బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

February 12, 2025 / 07:25 AM IST

బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

VSP: లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 12, 2025 / 07:02 AM IST

MHBD: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

MHBD:  గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్-నర్సంపేట నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇండ్ల రమేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 12, 2025 / 05:03 AM IST