విశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలను మోసం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసి కె.లక్ష్మీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నరసింహ్మమూర్తి తెలిపారు. ఈ నెల 14న ఓ మహిళను హోటల్కు పిలిచి మత్తుమందు ఇచ్చి నగలు, నగదు, ఫోన్తో పరారయ్యాడు. అతనిపై 52 కేసులు, రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.