BDK: డబ్బులు ఇప్పించిన విషయంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన పినపాక మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ ఓ వ్యక్తికి అప్పు ఇప్పించాడు. ఆ వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురైన ప్రణయ్ రెండు రోజుల క్రితం పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు.
TG: కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఓ వ్యక్తి కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని బేగంబజార్లో చోటు చేసుకుంది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్యను గొంతుకోసి, కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన సిరాజ్ పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నట్ల...
HYD: బేగంబజార్ పీఎస్ పరిధిలో తోప్ ఖానాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన సిరాజ్ నగరానికి వలస వచ్చి తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు. కాగా, గురువారం రాత్రి సిరాజ్ భార్య, చిన్న కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
HYD: బేగంబజార్ పీఎస్ పరిధిలో తోప్ ఖానాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన సిరాజ్ నగరానికి వలస వచ్చి తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు. కాగా, గురువారం రాత్రి సిరాజ్ భార్య, చిన్న కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
HYD: బహదూర్పుర పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిషన్ బాగ్ ప్రాంతంలో జనవాసాల నడుమ ఉన్న స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
TG: పలు కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ధూల్పేట్ గంజాయి డాన్ అంగూర్ బాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ధూల్పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు. అంగూర్ బాయిపై ధూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మంగళ్హాట్లో 4 కేసులు, అసిఫ్నగర్, గౌరారం స్టేషన్లలో 10 ...
AP: మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈనెల 8న హెడ్కానిస్టేబుల్ ప్రసాద్.. అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమో...
HYD: బోయిన్పల్లిలోని ఓ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తనీష్ రెడ్డి అనే విద్యార్థి పాఠశాల భవనం 2వ ఫ్లోర్ నుంచి గురువారం కింద పడిపోయాడు. ప్రమాదం జరిగినా విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. గతంలోను ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని పడి మృతి చెందినట్లు సమాచారం.
MDK: పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఇటీవల జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో నారాయణఖేడ్ మండలం నిజాంపేట్కు చెందిన బుద్ధం దత్తు రాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుండి మూడు తులాల బంగారం పుస్తెలతాడు, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దిండిగల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్టేషన్కు తరలించారు.
TG: HYDలోని దోమలగూడ పరిధి అరవింద్ కాలనీలో భారీ దోపిడీ జరిగింది. బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం చోరీ అయింది. వ్యాపారి రంజిత్, అతని సోదరుడి ఇళ్లలోకి 10 మంది దుండగులు చొరబడి కత్తులతో బెదిరించి లాకర్లోని 2.5 కిలోల బంగారం తీసుకెళ్లారు. మూడు ఫోన్లు, ఐట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ ఎత్తుకెళ్లారు. కాగా.. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్కు గాయాలయ్యాయి.
AP: ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. మొబైల్ డేటా అయిపోయిందని తల్లిని ఫోన్ అడగగా.. ఇవ్వలేదని తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కోపంతో కత్తితో గొంతుపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె గాయాలపాలైంది. ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: బాలికపై అత్యాచార ఘటనలో మడకశిర మండలం బేగార్లపల్లికి చెందిన రాజేశ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్బన్ సీఐ రాగిరి రామయ్య తెలిపారు. మడకశిరలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో మరో నిందితుడు అరెస్టయ్యాడు. నిందితుడు శివను ఈ రోజు అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 2న మహిళా కానిస్టేబుల్ నాగమణిని తన తమ్ముడు పరమేశ్ హత్య చేసిన విషయం తెలిసిందే. పరమేశ్కు శివ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలులో నాగమణి హత్యకు గురైంది.