CTR: గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప ఇంట్లో వన్యమృగాలను వేటాడడానికి తయారు చేసుకున్న నాటు బాంబులను మిద్దెపై నిల్వ ఉంచారు. వాటిని ఆయన పెంచుకున్న వేట కుక్క కొరకడంతో అక్కడిక్కడే మృతిచెందింది. నాటు బాంబు పేలుడుతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
BPT: పట్టణంలోని బృందావనం వద్ద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టిందా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అనే వివిధ కోణాలలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
NLR: ఆత్మకూరు మండలంలో నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. చేజర్ల మండలం ఆదూరుపల్లిలోని పెంచలయ్య లారీ కాటా దుకాణాన్ని నిన్న రాత్రి 10 గంటలకు మూత వేసి వెళ్లారు. రాత్రి వేళ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.లక్ష వరకు నష్టం జరిగిందని బాధితుడు పెంచలయ్య వాపోయారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయా? లేదా కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.
కడప: చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది.
KKD: తుని కట్రాల కొండ తాండవనిధిలో రెండు రోజుల కిందట గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమయింది. శనివారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళుతుండగా నీటిలో ఆ వ్యక్తి పడిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. అప్పటినుంచి గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాలేదు. తాజాగా సోమవారం తాండవ నది శివారులో తేలుతూ మృతదేహం కనిపించింది.
ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ శివారులో బొగ్గుల బట్టిలో పనిచేస్తున్న సుబ్బమ్మ అనే వివాహిత కుటుంబ సమస్యల కారణంగా విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
ELR: కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈనాడులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.23,000 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
CTR: మాయమాటలతో యువతిపై అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కార్వేటినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)తో యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆదివారం రాత్రి పళ్లిపట్టులో సినిమా చూడటానికి ఇద్దరూ వెళ్లారు. మార్గమధ్యలో యువకుడు పొలాల్లోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని యువతి తండ్రికి చెప్పింది. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
GNTR: రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న షేక్ కాజా మొహిద్దీన్(32) సోమవారం మృతి చెందాడు. వారి బంధువుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లిలోని ఓ ఫైనాన్స్ విభాగంలో కాజా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. పాటిబండ్ల గ్రామంలో తన తల్లిని చూసేందుకు ఆదివారం ఉదయం వచ్చి మొహిద్దీన్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
కృష్ణా: విజయవాడ నుంచి అమరావతి వెళుతున్న ఆర్టీసీ మెట్రో బస్సులో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికుల వివరాలు.. మందడం సెంటర్ వద్దకు రాగానే బస్సు టైర్ల నుంచి మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో బస్సు నుంచి దిగి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేసినట్లు తెలిపారు.
AP: కాలువలో కారు కొట్టుకుపోయి ఇద్దరు మరణించిన ఈ ఘటన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చింతవారిపేట సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. దంపతులు తమ ఇద్దరు కుమారులతో విశాఖ నుంచి పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త ప్రమాదం నుంచి బయటపడగా అతని భార్య, పెద్ద కుమారుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో కుమారుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో నకిలీ అధికారులు పోలీసులకు చిక్కారు. కందుకూరు DSP బాలసుబ్రహ్మణ్యం వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన లతీఫ్, సిరాజ్ నకిలీ ఆర్టీవోల అవతారం ఎత్తారు. నేషనల్ హైవేపై వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. ఈక్రమంలో ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు దగ్గర సోమవారం ఈ ఇద్దరిని ఎస్ఐ అంకమ్మ అరెస్ట్ చేశారు.
ప్రకాశం: చీమకుర్తి పట్టణంలో ప్యాకెట్ల రూపంలో గంజాయిని తీసుకెళ్తున్న మహిళ డి.భాగ్యమ్మను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనపరచుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
అన్నమయ్య: రాయచోటిలో నలుగురు అంతరాష్ట్ర బైక్ దొంగలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.65 లక్షలు విలువ చేసే 37 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్, మరో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. బైకులు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అభినందించారు.
కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. నేలపూడి విజయ్ కుమార్ కుటుంబం కలిసి విశాఖపట్నం వెళ్లి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త విజయ్ కుమార్ కారు డోర్ తీసుకొని నీటిలో నుంచి బయటకు రాగా, భార్య ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, రిషి గల్లంతయ్యారు.