• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

ప్రకాశం: పెద్దదోర్నాల, శ్రీశైలం అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పరుచూరుకు చెందిన శేషారావు, నాగూర్ సాహెబ్‌కు కాళ్లు విరిగాయి. వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 18, 2024 / 09:22 AM IST

ప్రేమ జంటపై కొడవళ్లతో దాడి..పారిపోయిన ప్రియురాలు

KRNL: గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ సమీపంలో ప్రేమ జంటపై కొందరు యువకులు నిన్న వేటకొడవళ్లతో దాడి చేశారు. యువతి తప్పించుకొని పారిపోగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరుకు చెందిన అరవింద్, ఓ యువతి ప్రేమలో ఉన్నారు. నిన్న ఇరువురూ LLC కాలువ వద్దకు చేరుకుని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు వారిపై దాడి చేశారు. 

December 18, 2024 / 09:17 AM IST

జిల్లాలో యువకుడి దారుణ హత్య

SRCL: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ మండలం నూకలమర్రిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నూకలమర్రికి చెందిన రషీద్‌ను తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా తెలిపారు. రషీద్ గంగాధర మండలంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివర...

December 18, 2024 / 09:16 AM IST

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ELR: అనుమానంతో భర్త భార్యను కడతేర్చిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురులో చోటుచేసుకుంది. లాము రమేష్ భార్య మనీషా (27) వీరికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే ఇటీవల తరచూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా సోమవారం మరోసారి గొడవ జరిగింది. దీంతో రమేష్ మనీషా గొంతు నులిమి చంపేసాడు. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

December 18, 2024 / 08:44 AM IST

భార్యను హత్య చేసిన భర్త

కృష్ణా: ఆగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలో అనుమానం పెనుభూతమై భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కార్మికుడు లాము రమేశ్ తన భార్య మనీషా (27)ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. సోమవారం జరిగిన ఘటన మృతురాలి అన్న యేసురత్నం తెలుసుకొని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

December 18, 2024 / 08:31 AM IST

సంగంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం

NLR: సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ.. బద్వేల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108లో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.

December 18, 2024 / 08:15 AM IST

విజయవాడలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం

కృష్ణా: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల అజయ్ మంగళవారం అర్ధరాత్రి బుడమేరు బస్టాండ్ వద్ద బైకుపై వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ స్నేహితులకు సమాచారం అందించి, ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్నేహితులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 18, 2024 / 08:00 AM IST

బీహర్ రాష్ట్రానికి చెందిన యువకుడి హత్య…

WGL: కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం బీహార్ యువకుడి హత్య జరిగింది. బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందిన దిల్ కుష్ కుమార్(18)గా స్థానికులు గుర్తించారు. గత కొంతకాలంగా తన సోదరుడు దూలచంద్ నగరానికి వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరితో గత కొంతకాలంగా నగరానికి చెందిన ఇద్దరు మేస్త్రిలతో గొడవ జరుగుతుంది. వారే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

December 18, 2024 / 07:58 AM IST

ట్రాక్టర్, బొలెరో వాహనం ఢీ.. వ్యక్తి మృతి

NGKL: అచ్చంపేట పట్టణంలోని హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారి వై జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో బాణాల గ్రామానికి చెందిన నగేశ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

December 18, 2024 / 07:00 AM IST

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి

KMM: కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తల్లాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అలుగుల వెంకటేశ్వర్లు(35) స్థానిక వెంచర్లో కాంక్రీట్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పని ప్రదేశంలో 33 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

December 18, 2024 / 05:49 AM IST

కారు ఢీకొని గాయపడ్డ యువకుడు మృతి

అన్నమయ్య: కారు ఢీకొని గాయపడిన యువకుడు మృతిచెందినట్లు తాలూకా సీఐ కళవెంకటరమణ తెలిపారు. మదనపల్లి మండలం, కొత్తవారిపల్లి పంచాయితీ, కాశీరావుపేట వద్ద ఉండే కంకర ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం బైక్‌ను కారు ఢీకొని ప్రవీణ్ కుమార్(20) తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులో చిక్సత పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.

December 18, 2024 / 04:15 AM IST

సత్తుపల్లిలో ప్రమాదం.. జంగారెడ్డిగూడెం వాసికి గాయాలు

ELR: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి. 108లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుడు జంగారెడ్డిగూడెం అని తెలుస్తుంది. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.

December 18, 2024 / 04:09 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే, GRP పోలీసులు అరెస్టు చేశారు. రోహన్ రాజు ఒడిశా నుంచి సోలాపూర్‌కు  గంజాయి తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు శంకర్, పవర్, శరత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

December 18, 2024 / 04:00 AM IST

మణిపూర్‌లో భారీగా ఐఈడీలు స్వాధీనం

మణిపూర్‌లో భారీగా ఐఈడీలను పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భారత సైన్యం, మణిపూర్ పోలీసులు ఇంఫాల్ జిల్లాలోని మాపిథెల్ రిడ్జ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో  21.5 కేజీల ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

December 18, 2024 / 03:23 AM IST

భారీగా ఎర్రచందనం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

గుజరాత్‌ పఠాన్‌లోని ఎర్రచందనం గోడాన్‌‌లపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలోనే భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన 155 దుంగలను స్వాధీనం చేసుకొని.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

December 17, 2024 / 07:57 PM IST