MBNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్ (45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్య గౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో బుధవారం చనిపోయాడు.
NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల రాములు-అనూషల కుమారుడు బత్తుల నితిన్(8) షాప్కి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయై అక్కడికక్కడే మృతిచెందాడు.
JGL: మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున గాతం తిరుపతి తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి ఆయన సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మల్యాల మండలం మ్యాడంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లు కూలడంతో.. కట్టెలు మీద పడటంతో.. పూర్తిగా కాలిపోయాడు. మృతుడిని గాతం తిరుపతిగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
ఆడుకుంటూ వెళ్లి పొలంలోని 150 అడుగుల బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించినా.. ఫలితం లేకుండా పోయింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. అయితే బాలుడు అపస్మారకస్థితిలో ఉండటంతో.. ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని దౌస జిల్లాలో...
BDK: ట్రాన్స్ఫార్మర్ను డీసీఎం ఢీకొట్టిన ఘటన మణుగూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మణుగూరులోని విజయనగరం పెట్రోల్ బంక్ సమీపంలో డీసీఎం అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
NGKL: కల్వకుర్తిలో బుధవారం రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఎస్పీ కార్యాలయ సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ఉన్న ఆటోను పట్టుకొని తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు గుట్కా ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు.
ADB: పత్తి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రూరల్లో చోటుచేసుకుంది. బోరింగ్ గూడకు చెందిన రైతు కోడప లక్ష్మణ్ తన పత్తిని ట్రాక్టర్లో మార్కెట్ యార్డ్కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో టేమ్రి గూడ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలవలేదని వెల్లడించారు.
GNTR: మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35)గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.
E.G: రాజానగరం మండలం చక్రద్వారబంధంలో బుధవారం సాయంత్రం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమండ్రిలోని ఓ షోరూంలో ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశారు. ఈక్రమంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా సీటు కింద ఉన్న బ్యాటరీ నుంచి శబ్దం వచ్చింది. ఆగి చూసేసరికి ఒక్కసారిగా మంటలు ఎగసి క్షణాల్లోనే కాలిబూడిదైందని బాధితుడు వాపోయారు.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ స్థాయిలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డెలివరీ చేస్తున్న రెండు అనుమానిత వస్తువులను పట్టుకోగా.. మైనపు రూపంలో ఉన్న 12.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9.95 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు… ఆ విమానాశ్రయంలో పని చేస్తున్న ముగ్గురి వ్యక్తులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్...
ATP: విడపనకల్ మండలం కడదరబెంచి వద్ద ప్రమాదవశాత్తు కంకర క్వారీ మిషన్లో పడి బీహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ (19) అనే కూలి మృతి చెందాడు. క్వారీ మిషన్ ఆన్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న తోటి కూలీలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
WNP: మోరిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన సాకలి వెంకటస్వామి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న మోరీలో పడి బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలపగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన చక్రినాయక్ బుధవారం రాయచోటి పెద్దబిడికిలో జరిగిన తన అన్నపెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం బైక్పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా వద్ద పాలవ్యాను బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన...
KDP: నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి రోడ్డు రోలర్ను తీసుకువస్తున్న లారీ టేకూరుపేట సమీపంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు రోలర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.