• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

బాలురు మిస్సింగ్ చేదించిన పోలీసులు

NTR: విజయవాడ పటమటకు చెందిన నలుగురు బాలురు గురువారం సాయంత్రం స్కూల్ అనంతరం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన సీఐ పవన్ కిషోర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నలుగురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టగా బందర్ బీచ్‌లో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించారు.

August 22, 2025 / 04:02 PM IST

ప్రేమించి మోసం చేసిన కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన సాన రవికుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శ్రావణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మానభంగం చేశాడు. ఈ కేసులో ముద్దాయిపై నేరం రుజువు కావడంతో ఈరోజు కడప ఏడవ ఏడీజే కోర్టు జడ్జి రమేష్ కుమార్ ముద్దాయి రవికుమార్‌కు యావజ్జీవ కారాగారశిక్ష, రూ.1,50,000 జరిమానా విధించారు.

August 22, 2025 / 03:50 PM IST

సముద్రంలో మునిగిపోయిన మత్స్యకార బోటు

VSP: విశాఖపట్నంలో ఒక ఫిషింగ్ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. అయితే అందులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఐఎన్‌డీ ఏపీబీ 5 యంయం 817 అనే ఫిషింగ్ బోటులోకి అనుకోకుండా నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

August 22, 2025 / 02:29 PM IST

అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని వ్యక్తి మృతి

KMR: బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ ఉదయం ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనం తీసుకొని బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు చెప్పారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

August 22, 2025 / 10:52 AM IST

ఆగ్రా వాటర్ ఫాల్స్‌లో తెలంగాణ జవాన్ మృతి

NRML: ముధోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన వైమానిక జవాన్ లక్ష్మీప్రసాద్ ఆగ్రాలోని ధమ్మోహ వాటర్ ఫాల్లో గల్లంతై గురువారం మృతి చెందాడు. తోటి ఉద్యోగులతో కలిసి జలపాతానికి వెళ్లిన లక్ష్మీప్రసాద్ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వైమానిక అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి రోదనలు మిన్నంటాయి.

August 22, 2025 / 06:06 AM IST

మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

KMR: లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు ప్రకాష్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మట్ట కింది పల్లెకు చెందిన చిన్నక్కను కల్లు కాంపౌండ్ వద్ద ప్రకాష్ నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మృతురాలి సెల్ ఫోన్ దొంగిలించడంతో సాంకేతిక విచారణ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.

August 21, 2025 / 05:30 PM IST

చదువుల ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య

NZB: పట్టణంలోని రోటరీ నగర్‌కు చెందిన యువకుడు నోముల రాజేశ్వర్ చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతి తర్వాత ఇంటర్ చదవాలనే ఉద్దేశం లేకపోయినా, ఇంట్లో చదువుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వర్ బుధవారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానిక నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

August 21, 2025 / 05:00 PM IST

‘విద్యార్థి మృతి బాధాకరం’

KDP: వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో P2 చదువుతున్న విద్యార్థి నరసింహ నాయుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలన్నారు.

August 21, 2025 / 04:30 PM IST

గంజాయితో ఎనిమిది మంది అరెస్ట్

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో రెట్టవానిపాలెం గ్రామం వద్ద రూరల్ ఎస్సై రాజారావు 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నలుగురు, అల్లూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేమని తెలిపారు.

August 21, 2025 / 04:19 PM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

KKD: పెద్దాపురానికి చెందిన బ్యాండ్ కళాకారుడు ఆదినారాయణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం తుని వద్ద తేటగుంట వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. పెద్దాపురంలో బ్యాండ్ కళాకారుడిగా సుపరిచితుడైన అతని మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

August 21, 2025 / 04:00 PM IST

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

KMR: మహరాష్ట్రకు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. బిక్కనూర్‌కు చెందిన మహిళ నుంచి బంగారు నగలను దొంగిలించిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిన అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 3 తులాల బంగారం, 2 కార్లు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

August 21, 2025 / 03:59 PM IST

తాటి చెట్టుపై నుంచి జారిపడిన గీత కార్మికుడు

NZB: సిరికొండలో తాటిచెట్టుపై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అట్టిమల్ల శ్రీనివాస్ గౌడ్ గురువారం తాటిచెట్టుపై కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి కాలు విరిగింది. ఇంటికి పెద్ద దిక్కైన ఆయన కాలు విరగడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

August 21, 2025 / 02:35 PM IST

పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి గాయాలు

KRNL: వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి 44 మార్గంలో ఈద్గా వద్ద గురువారం గ్యాస్ సిలిండర్ పేలి యేసు రాజు, సుకన్య దంపతులు గాయపడ్డారు. మొబైల్ క్యాంటీన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు, వంట చేస్తుండగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

August 21, 2025 / 11:06 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

KMM: పెనుబల్లి మండలం వీఎం బంజరలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వెళుతున్న బైక్ ఢీకొంది ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

August 21, 2025 / 10:35 AM IST

చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు దుర్మరణం

NZB: బైక్​ చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోచంపాడ్​ గ్రామానికి చెందిన అఖిల్(26) తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్​పై వస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ వెల్ఫేర్ వసతి గృహం సమీపంలో బైక్​ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

August 21, 2025 / 10:12 AM IST