• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి

WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపూర్ మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకడి గిరి (45) ఆదివారం ఉదయం చేపల వేటకు రిజర్వాయర్‌లోకి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 9, 2025 / 10:16 AM IST

నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

MBNR: ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది.

March 9, 2025 / 09:40 AM IST

పుత్తూరు హైవేపై రోడ్డు ప్రమాదం

CTR: పుత్తూరు మండలం తడుకు సమీపంలో హైవేపై భారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం రాత్రి బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న హైవే కల్వర్టు గోడని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో లారీ భారీగా దెబ్బతింది. ఎవరికి ప్రాణనష్టం కలగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 9, 2025 / 08:40 AM IST

ఫైనాన్స్ ఉద్యోగిపై వ్యక్తి దాడి

CTR: పుంగనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం ఓ ఫైనాన్స్‌లో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతో శ్రీరామ ఫైనాన్స్ ఉద్యోగి నందీశ్ గ్రామానికి వెళ్లి డ్యూలు కట్టాలని అడగగా, మాటామాటా పెరిగి పురుషోత్తం వేట కొడవలితో నందీశ్‌పై దాడి చేయడంతో గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేసి కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

March 9, 2025 / 08:01 AM IST

షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధం

WNP: షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అల్వాల గ్రామానికి చెందిన హరికృష్ణకు చెందిన పూరిగుడిసె విద్యుతాఘాతం వల్ల పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రూ.2 లక్షల నగదు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.

March 9, 2025 / 05:25 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన అక్క హత్య!

HYD: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని సొంత అక్కని ప్రియుడి సహాయంతో చెల్లి హతమార్చింది. రైల్వే ఉద్యోగి లక్ష్మీకి అరవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మీ రైల్వే క్వార్టర్స్‌లో తన అక్క జ్ఞానేశ్వరి (మతిస్థిమితం సరిగా లేదు)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉందని ఇద్దరు కలిసి జ్ఞానేశ్వరిని హత్య చేసి ఒక గుంతలో వేసి చెత్తాచెదారాన్ని కప్పివేశారు.

March 8, 2025 / 08:00 AM IST

మదర్స్ ఆర్బిక్ పాఠశాలలో పేలిన సిలిండర్

JGL: జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్ సా – అరాబిక్ పాఠశాల ముందు ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

March 7, 2025 / 06:36 PM IST

ఉపాధి పనిలో వృద్ధురాలికి గాయాలు

ASR: రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామానికి చెందిన ఉపాధి కూలి బి.కొండమ్మ శుక్రవారం ఉదయం గాయపడింది. తంటికొండ గ్రామంలో చెరువు పూడికతీత పని చేస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఆమెకు చేతికి తీవ్రమైన గాయమైంది. ఆమె బంధువులు అందుబాటులో లేకపోవడం ఫీల్డ్ అసిస్టెంట్ మంగారాజు, తోటి కూలీలు రాజవొమ్మంగి ఆసుపత్రి తరలించగా వైద్య సహాయం అందజేశారు.

March 7, 2025 / 10:53 AM IST

గుంటూరులో భారీ చోరీ

GNTR: నగరంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విద్యానగర్‌కు చెందిన సత్యన్నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 70 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దొంగలు చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 7, 2025 / 08:25 AM IST

లోడింగ్ గన్‌తో విమానం ఎక్కిన బాలుడు

ఆస్ట్రేలియాలోని అవలోన్ విమానాశ్రయంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలోని ఓ 17 ఏళ్ల బాలుడు ఎక్కాడు.  విమానంలోకి ఆ బాలుడు లోడింగ్ గన్ తో ఎక్కాడు. అతడు గన్ బయటకు తీయగానే విమానంలోనే ఉన్న మాజీ బాక్సర్ భారీ క్లార్క్ అప్రమత్తమై నిలవరించాడు. మాజీ బాక్సర్ చాకచక్యంతో ముప్పు తప్పింది. విమానాశ్రయం కంచెలో దూరి బాలుడు విమానం ఎక్కడని పోలీసులు తెలిపారు.

March 7, 2025 / 08:19 AM IST

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

MNCL: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య SI సురేశ్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన లావణ్య మంగళవారం పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం HYDకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కాగా ఆమె భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.

March 7, 2025 / 08:09 AM IST

గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కోరంగి పోలీసులు ఐదు కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? తదితర వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

March 5, 2025 / 10:21 AM IST

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

NLR: మనుబోలు మండల పరిధి అప్పయ్యగేటు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డైవర్‌తో సహా పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

March 5, 2025 / 04:08 AM IST

నగరంలో కత్తిపోట్ల కలకలం

NZB: నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్‌లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 4, 2025 / 08:03 PM IST

తప్పిన పెను ప్రమాదం

NLR: టిప్పర్‌ను ఓ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన సంఘటన వెంకటాచలం మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి ఏం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

March 4, 2025 / 12:03 PM IST