• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

డ్రగ్స్ ముఠా అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

HYD: కూకట్‌పల్లిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్‌ను స్వాధినం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ AP నుంచి HYDకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్‌గా గుర్తించారు.

June 3, 2025 / 02:01 PM IST

కొండపల్లిలో బాలుడుపై వీధి కుక్కల దాడి

NTR: ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం వీది కుక్క బాలుడుపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలపై వీధి కుక్కలు దాడి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

June 3, 2025 / 01:37 PM IST

ఆత్రేయపురం ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

కోనసీమ: ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌కు దగ్గర ఉన్న ఆంజనేయస్వామి మందిరంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, హుండీ పగలగొట్టి వేలాది రూపాయల సొమ్ములను చోరీ చేశారు. ఈ విషయం గ్రామస్తులు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

June 3, 2025 / 07:16 AM IST

విధి నిర్వహణలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

GNTR: మేడికొండూరు సెంటర్‌లో సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనిల్‌ను అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొనడంతో అతని కాలు పూర్తిగా తెగిపోయింది. వెంటనే స్పందించిన మేడికొండూరు పోలీసులు అనిల్‌ను హుటాహుటిన ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.

June 3, 2025 / 06:22 AM IST

వడ్లపూడిలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

VSP: దువ్వాడ సమీపంలోని వడ్లపూడి పరిధిలో గ్రీన్ సిటీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సోమవారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది హత్యా లేక ఆత్మహత్య అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

June 2, 2025 / 05:36 PM IST

నైజీరియన్‌ దేశస్తుడి వద్ద భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

నైజీరియన్‌ దేశస్తుడి వద్ద నార్కొటిక్‌ బ్యూరో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంది. నిందితుడి వద్ద రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. అలాగే అతని నుంచి 2 సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇమ్మాన్యుయేల్‌ అలియాస్‌ మ్యాక్స్‌వెల్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

June 2, 2025 / 05:17 PM IST

ఆశ్రమ స్థల వివాదంలో వైసీపీ నేతలు

విశాఖ బీచ్ రోడ్డులోని శాంతి ఆశ్రమ స్థల వివాదంలో శనివారం రౌడీషీటర్లు దౌర్జన్యం చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఈ వ్యవహారంలో ఉన్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 23 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఓ మహిళను ఉన్నారు.

June 2, 2025 / 09:18 AM IST

భార్య, కుమార్తెపై చాకుతో దాడి

W.G: మద్యానికి బానిసై భార్య, కుమారైపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన శనివారం ఇరగవరం మండలంలో జరిగింది. మండలంలోని అర్జునుడుపాలెంకు చెందిన రాంబాబు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీ తులసి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన వీరిని స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

June 1, 2025 / 04:51 AM IST

యాక్సిడెంట్‌లో యువకుడు మృతి

ELR: రాజాపోతేపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన ప్రకాష్ (30)గా స్థానికులు చెబుతున్నారు. బైక్‌పై వెళ్తుండగా రాజుపోతేపల్లి అడ్డురోడ్డు వద్ద వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తుతో పాటు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

May 31, 2025 / 05:04 PM IST

జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీ

NLR: సంగం మండలంలోని సిద్దిపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

May 30, 2025 / 07:53 PM IST

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

CTR : చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. యాదమరి మండలం కొయ్యూరు వద్ద ఉన్న కొత్త చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు శుక్రవారం చనిపోయారు. మృతులు తుమ్మెదపాలేనికి చెందిన సిద్ధు (11), సోమిరెడ్డిపల్లికి చెందిన అభిలేశ్(13)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 30, 2025 / 05:08 PM IST

అమెరికాలో గుండెపోటుతో యువకుడు మృతి

కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన గూల విట్టల్ కుమారుడు గుల గోవర్ధన్(28) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన యువకుడు చెన్నైలో ఉద్యోగం చేసి అనంతరం అమెరికా వెళ్లి ఉన్నత చదువులకై వెళ్లి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

May 29, 2025 / 07:45 PM IST

కత్తులతో దాడి చేసుకున్న తండ్రి, కుమారుడు

TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పులు చేసిన కుమారుడు తండ్రిపై దాడికి దిగాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడ్డ తండ్రి కుమారుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

May 29, 2025 / 02:22 PM IST

మదనపల్లెలో టీడీపీ యువ నాయకుడిపై దాడి

అన్నమయ్య: మదనపల్లెలో టీడీపీ యువ నాయకుడిపై అల్లరి మూకలు దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం సాయంత్రం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక సైదాపేటకు చెందిన జబిఉల్లా ఖాన్ సీటీఎం రోడ్డులో వస్తుండగా.. గొడవ జరగడం చూసి సర్ది చెప్పేందుకు వెళ్లాడు. మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటూ అల్లరి మూకలలో మల్లి అతని కొడుకు పండు తదితరులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలిపాడు.

May 28, 2025 / 08:07 PM IST

వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత సూసైడ్

SDPT: వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగదేవపూర్ (M) చాట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ వివరాలు.. జనగామ మండలం వెంకిర్యాలకి చెందిన శిరీష(21)కి చాట్లపల్లికి చెందిన వంశీధర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వంశీధర్ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో మంగళవారం మనస్తాపానికి గురైన శిరీష సూసైడ్ చేసుకుంది. 

May 28, 2025 / 02:14 PM IST