• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

TG: కరీంనగర్ జిల్లా సిర్సపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్-రజిత దంపతులు పెద్ద కుమారుడు అభిలాష్ (19) సింగాపురం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇవాళ ఇంట్లోని బాత్రూంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 5, 2025 / 03:03 PM IST

చిన్నగంజాంలో ఐదుగురు జూదరులు అరెస్ట్

BPT: చిన్నగంజాం మండల పరిధిలోని మసీదు పేటలో ఉన్న స్మశానం వద్ద రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు గురువారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న వ్యక్తుల నుంచి రూ. 3,200ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

December 5, 2025 / 08:10 AM IST

BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను వెనక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 4, 2025 / 08:42 PM IST

చక్రాయపాలెంలో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం శాంతినగర్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి చెన్నై వెళ్తున్న లారీ చక్రాయపాలెం సమీపంలో బ్రేక్ డౌన్ అయింది. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న పాల ఆటో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో అద్దంకి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 4, 2025 / 07:39 AM IST

మంత్రాల నెపంతో హత్య.. యువకులు అరెస్ట్

HYD: ఉస్మానియా యూనివర్సిటీ PS పరిధిలోని హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో మాబు సింగ్(54) అనే వ్యక్తిని కొంతమంది యువకులు చంపారు. చుట్టుపక్క సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. అరెస్టైన వారిని ఈస్ట్ జోన్ డీసీపీ ఇవాళ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.

December 3, 2025 / 08:04 PM IST

ఆటోలో మృతుదేహాలు కలకలం

HYD: నగరంలో ఓ ఆటోలో మృతుదేహాలు కలకలం రేపాయి. చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఓ ఆటోలో  రెండు మృతదేహాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమచామరం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను గమనించగా పలు మత్తు పదార్థాలు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 3, 2025 / 03:25 PM IST

గుండె పోటుతో ఎస్సై మృతి

HYD: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజయ్ సవంత్(58) గుండె పోటుతో మృతి చచెందారు. బుధవారం అబ్దుల్లాపూర్ మెట్‌లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండడంతో మంగళవారం రాత్రి అయన పోలీస్ స్టేషన్‌లో నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండె పోటు రావడంతో అక్కడికడే ప్రాణాలు విడిచాడు. కాగా, SI నాచారంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

December 3, 2025 / 02:02 PM IST

పరారీలో ఉన్న ఎమ్మెల్యేకు బిగ్ షాక్

కేరళ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పటికే రేప్ కేసులో పరారీలో ఉన్న ఆయనపై.. తాజాగా మరో 23 ఏళ్ల యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కాంగ్రెస్ కమిటీకి మెయిల్ చేసింది. ఇన్నాళ్లు ఆయన పవర్‌కు భయపడ్డానని వాపోయింది. ఈ ఫిర్యాదును పోలీసులకు పంపామని పార్టీ చీఫ్ జోసెఫ్ తెలిపారు.

December 3, 2025 / 12:09 PM IST

ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరికీ గాయాలు

KDP: వల్లూరు మండలం గోటూరు టోల్ గేట్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు నడుపుతున్న ఆటో, కమలాపురం వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం కడపకు తరలించారు.

December 3, 2025 / 10:50 AM IST

ఏసీబీ కస్టడీకి కొండలరావు.. మూడో రోజు విచారణ

TG: నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న బిక్కిన కొండలరావును అధికారులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకోగానే ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడికల్ టెస్టులు పూర్తయ్యాక విచారణ జరిపి, మరిన్ని నిజాలు రాబట్టనున్నారు.

December 3, 2025 / 10:20 AM IST

లారీలు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలం అశోక్ దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక లారీ క్యాబిన్‌లోకి మరొకటి చొచ్చుకుపోవడంతో, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు జేసీబీ సాయంతో తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు.

December 3, 2025 / 09:33 AM IST

సూళ్లూరుపేటలో రోడ్డు ప్రమాదం

TPT: సూళ్లూరుపేట హోలీ క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేటకు వెళ్లేందుకు హైవే పైకి వస్తున్న కారును చెన్నై నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఓ పక్క జోరున వర్షం కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.

December 3, 2025 / 09:08 AM IST

రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్.. అన్ననే చంపేశాడు

TG: కరీంనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నరేష్ అనే వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారు. స్నేహితుడు రాకేష్, డ్రైవర్ ప్రదీప్‌తో కలిసి చంపేసి అన్న వెంకటేష్ పేరుపై వచ్చిన రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

December 3, 2025 / 08:55 AM IST

మరణ మృదంగం.. 465 మంది మృతి

శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను విలయం సృష్టిస్తోంది. వరద బీభత్సానికి మృతుల సంఖ్య 465కు చేరగా, మరో 366 మంది గల్లంతయ్యారు. కష్టకాలంలో లంకకు భారత్ అండగా నిలిచింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ చేపట్టి.. తక్షణ సాయంగా 53 టన్నుల నిత్యావసర సరుకులను పంపించింది. పక్క దేశానికి ఆపద వస్తే ముందుంటామని భారత్ మరోసారి నిరూపించుకుంది.

December 3, 2025 / 07:13 AM IST

వాహనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్

TG: మలక్‌పేటలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే సమయంలో రహదారిపై టిప్పర్ అదుపుతప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. బస్సు, లారీని ఢీకొడుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

December 3, 2025 / 06:35 AM IST