• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

దుండిగల్‌లో దొంగలు పడుతున్నారు.. జాగ్రత్త..!

MDCL: దుండిగల్ పరిసర ప్రాంతాలలో గత రెండు నెలల్లో 8కి పైగా దొంగతనాలు జరిగాయి. సాధారణ మనుషుల వలె ఉంటూ, రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు స్పెషల్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో దుండిగల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు పకడ్బందీగా లాక్ వేసుకోవాలని, సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

November 11, 2025 / 08:10 AM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 11, 2025 / 07:59 AM IST

ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి కీలక విషయాలు!

ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ i20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను గుర్తించారు. అతడు వైద్యుడైన మహ్మద్ ఉమర్‌గా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

November 11, 2025 / 07:46 AM IST

ఢిల్లీలో పేలుడు.. ఐ20 కారుకు పుల్వామా లింక్!

ఢిల్లీలో పేలుడుకు కారణమైన i20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిట్టచివరి సారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ దీన్ని కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

November 11, 2025 / 07:05 AM IST

BREAKING: మరో ట్రావెల్స్ బస్సు దగ్ధం

TG: HYD-విజయవాడ హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కిందకి దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు దగ్ధమైంది. HYD నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో బస్సు సిబ్బంది.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో కిందికి దిగిపోయారు. బస్సులో 29 మంది ఉన్నారు.

November 11, 2025 / 06:04 AM IST

అమలాపురంలో బాలిక కిడ్నాప్‌ కలకలం

AP: కోనసీమ జిల్లా అమలాపురంలో బాలిక కిడ్నాప్‌ కలకలం రేపింది. ఓ యువకుడు ఐమాండ్స్‌ పాఠశాల నుంచి కముజు నిషిత(10) అనే బాలికను అపహరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి నిషితకు దూరపు బంధువైన మట్టపర్తి సత్యమూర్తి(చంటి)గా గుర్తించారు. నిషిత కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.

November 10, 2025 / 10:48 PM IST

ఢిల్లీ పేలుడు.. 13కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా, 30 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పేలుడు ధాటికి కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలను అక్కడి నుంచి తరలించారు.

November 10, 2025 / 09:26 PM IST

ఢిల్లీ పేలుడు కేసు.. ఒకరు అరెస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని విచారిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

November 10, 2025 / 08:51 PM IST

‘క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం’

ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని వెంటనే LNJP ఆస్పత్రికి తరలించారు. మొత్తం 15 మందిని ఆస్పత్రికి తీసుకురాగా, అందులో 8 మంది అప్పటికే చనిపోయారని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధ్రువీకరించారు. క్షతగాత్రుల్లో ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేలుడు కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

November 10, 2025 / 08:44 PM IST

BREAKING: ఎర్రకోట దగ్గర భారీ పేలుడు

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరగడంతో ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

November 10, 2025 / 07:15 PM IST

సోమవరం ప్రమాద ఘటనలో 4కు చేరిన మృతుల సంఖ్య

KKD: కిర్లంపూడి మండలం సోమవరం జాతీయ రహదారిపై పెళ్లి కారు భీభత్సం సృష్టించిన ఘటనలో చికిత్స పొందుతూ మరో యువతి మృతిచెందింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన యువతి కూండ్రపు దుర్గా చైతన్య ఇవాళ ఉదయం మరణించింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది.

November 10, 2025 / 02:46 PM IST

విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

AP: కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడప నగర శివారు శ్రీచైతన్య పాఠశాలలో జస్వంతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం రిమ్స్ మార్చురీకి తరలించారు.

November 10, 2025 / 12:54 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి… ఇద్దరికీ తీవ్ర గాయాలు

NDL: పాణ్యం మండలం బలపనూరు గ్రామ సమీపంలో ఇవాళ జాతీయ రహదారిపై తెల్లవారుజామున మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం అతివేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

November 10, 2025 / 11:23 AM IST

ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి

బీహార్‌లో సరాన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి పైకప్పు కూలి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 10, 2025 / 09:40 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో మృతి

NZB: జక్రాన్‌పల్లి మండలంలో దారుణ ఘటన జరిగింది. అర్గుల్ చెరువులో చిట్ల ప్రభాకర్‌ (50) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం చేపలు పడుతుండగా గాలాలో చిక్కిన చేపను తీయబోయి నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ ఘటనపై మృతుడి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. మహేష్‌ సోమవారం తెలిపారు. 

November 10, 2025 / 08:40 AM IST