TG: HYD శాలిబండ అగ్నిప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్లోని రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. పేలుళ్ల దాటికి గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి బయట పడ్డ కాసేపటికే మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైంది. కారులో CNG పేలలేదని డ్రైవర్ స్పష్టం చేశాడు.
TG: శాలిబండలో ఎలక్ట్రానిక్ షాపు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: బాచుపల్లి-మియాపూర్ రోడ్డులో మమత మెడికల్ సర్వీసెస్ అకాడమీ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ విషయాన్ని గమనించి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలక్ట్రికల్ పోల్కు అమర్చిన వైర్ సహాయంతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: పాకాల మండలం ముద్దలపల్లి సమీపంలో సోమవారం రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి (30) మృతి చెందాడు. ప్రయాణంలో ఎలా పడిపోయాడనే అంశంపై స్పష్టతరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: కంభంలోని చెక్ పోస్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన యువతి ఆచూకీ లభ్యమైంది. గుంతకల్లులోని హన్వేష్ నగర్కు చెందిన లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు.
TG: HYDలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం జరిగింది. ఆస్పత్రి బిల్డింగ్లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఎమర్జెన్సీ వార్డులో రినోవేషన్ పనులు చేస్తుండగా.. భవనం పెచ్చులు ఊడటంతో ఈ ఘటన జరిగింది. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు.
సత్యసాయి: గోరంట్ల మండలం మార్పురి గ్రామానికి చెందిన ప్రమీలమ్మ (48) ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం రాత్రి ఇంట్లో కింద పడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆమె మరణించారు. నాలుగు సంవత్సరాల క్రితం భర్త మృతి చెందడం ఇప్పుడు ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తెహ్రీ జిల్లాలో నరేంద్రనగర్ వద్ద ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
NLR: ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి గ్రామ సమీపంలో ఓ కారు సోమవారం అదుపుతప్పి బోల్తాపడింది. పుల్లాయపల్లి చెందిన కొందరు ఎర్రబల్లిగడ్డ వెళ్తుండగా శకునాలపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఎకరికీ ఏం కాకాపోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. కాగా, కారు నుజ్జునుజ్జు అయింది.
AP: తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రెక్ ఫెయిల్ కావడంతో ఓ కారు బోల్తా పడింది. మొదటి ఘాట్ రోడ్డు 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. కారు బోల్తా పడి రోడ్డుకి అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన భక్తులు తమిళనాడు వాసులుగా పోలీసుల గుర్తించారు.
TG: హైదరాబాద్ శామీర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై కారులో ఒక్కసారిగా మంటల చెలరేగి వాహన డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మంటలు వచ్చాక అతను అందులోనే చిక్కుకుని బయటపడలేకపోయాడు. ఈ క్రమంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క దాడిలో నలుగురు గ్రామస్థులు గాయపడ్డారు. గాంధీ సెంటర్ వద్ద వీధుల్లో తిరుగుతూ వచ్చిన కుక్క బిళ్ళ రాజు, పాల యాదగిరి, శేఖర్, రాజేందర్ తదితరులపై దాడి చేసింది. కుక్క దాడిలో గేదెలు కూడా గాయపడ్డాయని గ్రామస్తులు తెలిపారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
GNTR: వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపల్లిపాడు చెరువు వద్ద జూదం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ సమక్షంలో పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి టాస్క్ ఫోర్స్ బృందం చర్యలు చేపట్టింది. పాల్గొన్న 5 మందిపై కేసులు నమోదు చేశారు.