SRPT: బాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అర్వపల్లిలోని జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి వద్ద నాగారం మండలం ఫణిగిరి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న గద్దకూటి మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు.
TG: మెదక్ జిల్లాలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం (40) మంజుల (35) భార్యాభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భర్త ఉరేసుకున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
AP: కడప హరిత ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర, కర్ణాటక బార్డర్లోని మంచినీళ్లకోట వద్ద డివైడర్ని ఢీకొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు.
TG: హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు MBNR జిల్లా మక్తల్కు చెందిన వర్షిత (16)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు HYD ప్రగతి కాలేజీకి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి మంజునాథ్ నిన్న సూసైడ్ చేసుకున్నాడు.
హాంకాంగ్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 151కి చేరింది. మరో 104 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రజలు సాయం చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.1029 కోట్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శారదానగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురు బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ATP: యువత, విద్యార్థులను గంజాయి బారిన పడకుండా కాపాడేందుకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. నవోదయ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న షికారి శీనా, షేక్ మహమ్మద్ ఖాన్ అనే ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది.
TG: కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఉదయం 8:10 గంటలకు శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్కు.. బాంబు ఉందని మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించారు. ప్రస్తుతం ఫ్లైట్ ఇంకా ల్యాండ్ కాకపోవడంతో.. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నగరంలో గంజాయి రవాణా నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు సహా కీలక ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్తో కలిసి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా మార్గాలను గుర్తించేందుకు చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ATP: చట్టాన్ని కళ్లుగప్పి 35 ఏళ్లుగా తిరుగుతున్న ఒక రాబరీ కేసులోని నిందితుడు నరసింహులును అనంతపురం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 1992లో కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సును అడ్డగించి దోపిడీ చేసిన కేసులో ఇతను నిందితుడు. బెయిల్పై విడుదలైన తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి అతడిని పట్టుకున్న పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు.
MNCL: మందమర్రి మండలం సన్రోన్ పల్లిలో సొంత తమ్ముడు తన అన్నను రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అన్నదమ్ములైన గోపాల్, కుమార్ మధ్య ఇటీవల కుటుంబ కలహాలు చెలరేగాయి. ఈ క్రమంలో నిందితుడైన కుమార్ ఆగ్రహంతో రోకలి బండ తో గోపాల్ను తల మీద కొట్టి హత్య చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
AP: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కుడికాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి వివాహానికి ఇరుకుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇద్దరూ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి కోసం గాలిస్తున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీహార్కి చెందిన ఓ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇవాళ అతను భోజనం కోసం ఇంటికి రాగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో తలుపులు పగలకొట్టి.. లోపలికి వెళ్లాడు. ఆ గదిలో కుమార్తెతో పాటు మరో గుర్తుతెలియని యువకుడి మృతదేహాలు కనిపించాయి.
AP: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కపిలతీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఇండోనేషియా భారీ వరదలతో అతలాకుతలమైంది. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్లో నదులు పొంగిపొర్లాయి. దీంతో వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఈ వరదల వల్ల దాదాపు 502 మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వందమందికిపైగా గల్లంతయ్యారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.