AKP: చోడవరం సబ్ జైల్ నుంచి శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు. బెజవాడ రాము, నక్క రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లోని జైల్ వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుంచి పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది. రాము చోరీ కేసులో నిందితుడు నక్కా రవి కుమార్ పెన్షన్ సొమ్ము మాయం చేసిన కేసులో నిందితుడు.
ATP: రాయదుర్గం మండలం ఆయుతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మానేశ్ (9) అనే బాలుడు శుక్రవారం చెరువులో పడి మృతి చెందాడు. మరో బాలుడితో కలిసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. మరో బాలుడు గ్రామంలోకి వెళ్లి సమాచారమివ్వడంతో గ్రామస్థులు పరుగెత్తి వెళ్లి బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
TG: ఇబ్రహీంపట్నం జూపూడిలో 2 రోజుల క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం కూనయపాలెంకు చెందిన గోపిగా గుర్తించారు. అయితే, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
SRD: నారాయణఖేడ్లో 16 ఏళ్ల మైనర్ బాలికపై ప్రేమ పేరుతో అత్యాచారం జరిగిన ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. అత్యాచారం చేసిన యువకుడు బాలికను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. బాధితురాలిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో గురువారం రాత్రి జరిగిన వినాయక చవితి ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఇద్దరిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన ఆ ఇద్దరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
GDL: పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన ఎర్రవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన సల్వమ్మ పంట పొలాలలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటుకు గురైందని సమీప కూలీ కార్మికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
సత్యసాయి: ధర్మవరం కొత్తపేటలో ఇవాళ సాయంత్రం వ్యక్తి దారుణ హత్యకు గురవడంతో కలకలం రేగింది. ప్రైవేట్ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడు కొత్తపేటకు చెందినవాడని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
HYD: వ్యక్తిగత కారణాలతో ఒక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన చీర సాయిప్రకాశ్(22) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సికింద్రాబాద్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో గురువారం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమైన ఘటనలో, పెద్ద కూతురు మోక్షిత (8) మృతదేహం తాండ్ర సమీపంలో లభ్యం కావడంతో కలకలం రేగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన తండ్రి వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ముగ్గురు పిల్లలు అదృశ్యం అయిన కేసులో ఈ విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి.
KRNL: ఆదోని పట్టణంలోని కార్వాన్పేట కాలనీలో ఇంటి ముందు పని చేసుకుంటున్న వృద్ధురాలిపై రోడ్డుపై ఉన్న కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుక్కను విడదీయడానికి ప్రయత్నించినా అది వదలలేదు. బాధితురాలిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KRNL: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్దికేరలో గురువారం చోటుచేసుకుంది. సాయినగర్కు చెందిన తాసిలి హనుమంతు(50) తన స్వగృహంలో ఉరి వేసుకున్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దాదాపు రూ. 10 లక్షల మేర అప్పులు ఉన్నాయని భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో తండ్రి వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మృతులు మోక్షిత, వర్షిణి, శివధర్మ.. చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు ప్రకాశం జిల్లా బోయలపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.
HYD: ప్రేమ విఫలం కావడంతో 3 రోజుల క్రితం పురుగుల మందు తాగిన యువతి HYDలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి(21) ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లవ్ ఫెయిల్ అయ్యి పురుగుల మందు తాగగా గాంధీకి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: ఆమడగూరు మండలం మారుతీపురం సమీపంలో కర్ణాటకకు చెందిన ముత్తప్ప అనే వ్యక్తి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికంగా 5 ఎకరాల పొలం తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. మృతుడి మెడ, గొంతుపై గాయాలు ఉండటంతో హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: టెక్కలి నియోజకవర్గం మద్దిలవానిపేట గ్రామానికి చెందిన పెద్ద తామరపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు బి. బాలరాజు గురువారం మృతి చెందారు. ఈ సందర్భంగా YSRCP టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి పి .తిలక్ బాలరాజు మృతదేహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.