• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ప్రాణం తీసిన వరద నీరు!

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన షరీఫ్ ఉద్దీన్(27) అనే వ్యక్తి బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద గల్లంతయ్యారు. నిన్న కురిసిన భారీ వర్షానికి బల్కంపేట వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఈ అండర్ బ్రిడ్జి కింద భారీగా వరదనీరు నిలిచిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై తన ఇంటికి వెళ్తున్న షరీఫ్.. బైక్ అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

September 18, 2025 / 07:12 AM IST

ORRపై లారీ బోల్తా.. ప్రయాణికులకు ఇబ్బంది

HYD: పెద్ద అంబర్‌పేట్ ORRపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు నుంచి ఫెర్టిలైజర్స్ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. లారీలో ఎక్కువ లోడ్ వేసుకొని వేగంగా టర్న్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గాయాలైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.

September 18, 2025 / 07:10 AM IST

కరవాకలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కోనసీమ: మామిడికుదురు మండలంలోని కరవాకలో వైనుతీయ నది తీరం వద్ద బుధవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

September 18, 2025 / 07:00 AM IST

వర్షపు నీటిలో పడి వాహనదారుడు మృతి

TG: హైదరాబాద్‌లోని SR నగర్‌లో విషాదం నెలకొంది. బల్కంపేట్ అండర్‌గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఓ వాహనదారుడు వర్షపు నీటిలో పడి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

September 18, 2025 / 01:10 AM IST

నకిలీ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌పై దాడి

మేడ్చల్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ శారదానగర్‌లో శివసాగర్ ఫలూడ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసారు. ఇందులో నకిలీ ఐస్ క్రీమ్ తయారుచేస్తున్న దేవిలాల్ జాట్ (51) వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్‌ను ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

September 17, 2025 / 08:54 PM IST

విద్యుత్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

RR: చేవెళ్ల విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ బినామీగా ఉన్న ఏడీఈ రాజేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాజేష్ ఇంటి బాత్ రూమ్‌లో 20 లక్షల రూపాయల నగదు లభ్యం అయింది. ఏడీఈ అంబేద్కర్‌తో పాటు ఆయన బినామీల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

September 17, 2025 / 08:23 PM IST

యువతిని వేధించిన బాబాయి.. కేసు నమోదు

సత్యసాయి: పెనుకొండ మండలంలోని బీటెక్ విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఆమె సొంత బాబాయి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. నిందితుడు ఆ యువతికి అర్ధరాత్రి వీడియోకాల్ చేసి ‘పిన్ని ఊరికెళ్లింది. మంచి మూడ్‌లో ఉన్నా’ అంటూ మెసేజ్‌లు చేసి, తన ప్రైవేట్ పార్ట్ ఫొటోను పెట్టాడు. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కియా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసలు కేసు నమోదు చేశారు.

September 17, 2025 / 08:10 PM IST

కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ MD అరెస్ట్

TG: కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ MD శ్రీకాంత్‌ని హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరిట తమను మోసం చేశాడంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో MD శ్రీకాంత్‌ని అదుపులోకి తీసుకున్నారు.

September 17, 2025 / 03:16 PM IST

రాజేంద్రనగర్ హత్య యువతి కేసు..UPDATE

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన హత్య కేసులో మృతి చెందిన యువతిని నాంపల్లికి చెందిన రేష్మా బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

September 17, 2025 / 02:47 PM IST

బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

NLR: ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BV నగర్‌కు చెందిన వెంకటేశ్‌తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

September 17, 2025 / 02:03 PM IST

బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 17, 2025 / 01:57 PM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్, కారు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 17, 2025 / 12:41 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని కల్లుగీత కార్మికుడు మృతి

భువనగిరి – చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లూనాపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన కల్లు గీత కార్మికుడిగా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.

September 17, 2025 / 12:12 PM IST

రైలు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

KKD: తుని రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఆదిత్య కళాశాల విద్యార్థి గరికిన హేమన్ రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకటనగరం గ్రామానికి చెందిన హేమన్ రాజు మంగళవారం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారి పడడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి.

September 17, 2025 / 12:00 PM IST

ఆంజనేయస్వామి దేవాలయంలో హుండీ చోరీ

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం శివారు పాపంపేట గ్రామంలో అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో వున్నటువంటి హుండీని నిన్న రాత్రి తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దొంగిలించిన హుండీ తాళాలను పగలగొట్టి హుండీలోని డబ్బులు తీసుకొని కాళీ హుండీని గ్రామ శివారు పక్కన ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

September 17, 2025 / 09:33 AM IST