• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి

మెక్సికోలో రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. 98 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పసిఫిక్‌ సముద్రం-గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను కలిపే లైనుపై ఓక్సాకా-వెరాక్రూజ్‌ మధ్యలో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆ దేశ అటార్నీ జనరల్‌ ఆఫీసు దర్యాప్తు జరుపుతోంది.

December 29, 2025 / 08:31 AM IST

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

AP:  ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా AC బోగీలో మంటలు చెలరేగాయి. లోకో పైలట్, గార్డ్ వెంటనే అప్రమత్తమై అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌లో రైలు నిలిపివేశారు. మంటలు B1 నుంచి రెండో బోగీకి అంటుకున్నాయి. దీంతో రైల్వే సిబ్బంది ఇతర బోగీలను వేరు చేయగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

December 29, 2025 / 02:41 AM IST

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

BDK: మణుగూరు దమ్మకపేట వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రోడ్డు మీదికి వస్తున్న సమయంలో ఈ-బయ్యారం నుంచి అతివేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే బీటీపీఎస్‌కు చెందిన ఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తెలగవరపు కోటేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 28, 2025 / 06:40 PM IST

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి

ప్రకాశం: గుంటూరు నగర శివారు NH-16పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్నారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్‌గా పోలీసులు గుర్తించారు.

December 28, 2025 / 06:30 PM IST

BREAKING: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ 

TG: హైదరాబాద్‌లోని పబ్‌లలో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. క్వేక్ ఎరీనా పబ్‌లో సోదాలు చేసిన అధికారులు.. అక్కడి యువతకు పరీక్షలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాలపై పోలీసులు దాడులు చేయగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది.

December 28, 2025 / 04:26 PM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి క్యాబ్‌లో తరలిస్తున్న 5.39 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాయిచరణ్, చేతన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌తో పాటు 6 లిక్కర్ బాటిళ్లు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

December 28, 2025 / 03:30 PM IST

BREAKING: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ టాటానగర్‌లోని ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 28, 2025 / 11:28 AM IST

ఛత్తీస్‌గఢ్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తన్నూరు గ్రామస్థులు ఒక్కసారిగా బొగ్గు నిర్వహణ ప్లాంట్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ జీప్, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు 10 మంది గ్రామస్థులు, పోలీసులు గాయపడ్డారు.

December 28, 2025 / 09:26 AM IST

BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బీహార్‌లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. టెల్వాబజార్ హాల్ట్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో 19 బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు సిమెంట్ లోడుతో అసన్‌సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

December 28, 2025 / 08:41 AM IST

అప్పు చెల్లించమంటే గొంతు కోశాడు!

AP: అనంతపురంలోని రాంనగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పవన్ అనే వ్యక్తికి కళ్యాణ్ అనే వ్యక్తి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే, తన డబ్బు తిరిగి ఇవ్వాలని కళ్యాణ్ అడగడంతో ఆగ్రహానికి గురైన పవన్.. కత్తితో కళ్యాణ్ గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన కళ్యాణ్‌ను ఆస్ప్రత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

December 27, 2025 / 06:44 PM IST

విషాదం.. AC పేలి కవలలు మృతి

TG: హైదరాబాద్ కాచిగూడలో నిన్న జరిగిన AC పేలుడులో ఓ బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న అతని కవల సోదరుడు కూడా రాత్రి మరణించాడు. రెండేళ్ల ఈ కవలలను రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు.. షార్ట్ సర్వ్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చిన్నారుల మృతిలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

December 27, 2025 / 08:53 AM IST

AC పేలుడు.. మరో చిన్నారి మృతి

TG: హైదరాబాద్ కాచిగూడ AC పేలుడులో మరో చిన్నారి మృతిచెండాదు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన రెండో చిన్నారి ఉస్మానియాలో చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. రెండేళ్ల ఈ కవలలను రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు.. షార్ట్ సర్వ్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

December 27, 2025 / 08:53 AM IST

ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

AP: ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రాంగ్ రూట్‌లో బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతులు ద్వారకతిరుమలకు చెందిన రఫీ, చరణ్, బన్నీగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 27, 2025 / 08:37 AM IST

కంపగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కంపగూడెం గ్రామం వద్ద ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో వెంకటేశ్వర్లు(60) మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

December 26, 2025 / 07:03 PM IST

ఏసీలో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

TG: HYDలో అగ్నిప్రమాదం జరిగింది. కాచిగూడలోని ఓ ఇంట్లో ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2025 / 07:02 PM IST