• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు దాటుతున్న బాలుడిని ఢీ కొన్న కారు

GNTR: మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని నిడమర్రు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి వైపు నుంచి కురగల్లు దిశగా వెళ్తున్న కారు, రోడ్డును దాటుతున్న ఓ బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడి కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

November 23, 2025 / 04:38 PM IST

బస్సు, బొలెరో వాహనం ఢీ.. నలుగురికి గాయాలు

సత్యసాయి: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి సమీపంలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.

November 23, 2025 / 11:15 AM IST

BREAKING: నలుగురు మృతి

AP: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వెహికల్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడులో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖ నుంచి ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 23, 2025 / 08:31 AM IST

ప్రమాదం.. పేలిన డీజిల్ ట్యాంక్

AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బయోడీజిల్ బంక్‌లోని డీజిల్ ట్యాంక్ పేలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పాలువాయి జంక్షన్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలు అర్పేందుకు శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 23, 2025 / 07:41 AM IST

RTC డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు

AP: నెల్లూరులో రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బుచ్చిరెడ్డిపాలెంలో హారన్ కొట్టాడని RTC బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి దిగారు. కారులో ఆరుగురు యువకులు ఉండగా.. ఈ దాడి చేసిన తర్వాత వారంతా పరారయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

November 23, 2025 / 07:25 AM IST

బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: గన్నవరం వద్ద ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై-కోల్‌కతా హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పిస్తుండగా బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు పక్కకు దూసుకెళ్లగా ముందు భాగం దెబ్బతింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ఘటన జరగ్గా.. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు.

November 23, 2025 / 07:11 AM IST

యాజమాన్యం నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

TG: HYDలో ఓ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అమీర్‌పేటలోని  ఓ స్కూల్ యాజమాన్యం ట్రిప్‌లో భాగంగా విద్యార్థులను Wonderla తీసుకెళ్లారు. ఈ క్రమంలో పిల్లలతో టీచర్లు సరదాగా గేమ్స్ ఆడించారు. అయితే ఆటలు ఆడే క్రమంలో 8వ తరగతి విద్యార్థి సూర్యతేజ కిందపడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 22, 2025 / 08:23 PM IST

మూఢనమ్మకంతో ముగ్గురు ఆత్మహత్య!

TG: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య ఉండగా.. వీరి ఆత్మహత్యకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 22, 2025 / 07:27 PM IST

పిడుగుపడి యువకుడు మృతి

TPT: వెంకటగిరి మండలం యాతలూరులో శనివారం విషాదం నెలకొంది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలం పనులకు వెళ్లారు. ఈక్రమంలో పిడుగు పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరు గాయపడటంతో వెంకటగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రెడ్డిపల్లె మహేశ్ (24)గా గుర్తించారు.

November 22, 2025 / 06:16 PM IST

ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామం వద్ద స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 22, 2025 / 06:02 PM IST

ఉండవెల్లిలో డీసీఎం బోల్తా.!

GDL: ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ డీసీఎం టైరు పగలడంతో ప్రమాదవశాత్తు శనివారం బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఈ డీసీఎం రైలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్ అష్రఫ్, మరో డ్రైవర్ ఖాదర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

November 22, 2025 / 04:53 PM IST

BREAKING:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

CTR: GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GD నెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు GOVT ఆసుపత్రికి తరలించారు.

November 22, 2025 / 03:54 PM IST

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

CTR: GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GD నెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు GOVT ఆసుపత్రికి తరలించారు.

November 22, 2025 / 03:54 PM IST

పాఠశాలపై దాడి.. 227 మంది విద్యార్థుల అపహరణ!

ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం జరిగింది. అగ్వారా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలపై కొంతమంది దుండుగులు దాడి చేసి 227 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో 215 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు ఉన్నారు. అపహరణకు గురైన వారిని ఎక్కడుకు తీసుకెళ్లారనే దానిపై విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. త్వరలోనే వారిని విడిచిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

November 22, 2025 / 02:38 PM IST

మైనర్లతో దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

TG: ఇన్‌స్టాగ్రామ్‌లో కమిషన్‌ల ఆశ చూపించి హ్యాష్ ఆయిల్, గంజాయి రవాణా చేయిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ వద్ద రూ.1.15 కోట్ల విలువైన 5.1కిలోల హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తిసుకున్నారు. మరోవైపు విశాఖపట్నం రైలులో ఇద్దరు విద్యార్ధినుల వద్ద 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

November 22, 2025 / 11:39 AM IST