శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను విలయం సృష్టిస్తోంది. వరద బీభత్సానికి మృతుల సంఖ్య 465కు చేరగా, మరో 366 మంది గల్లంతయ్యారు. కష్టకాలంలో లంకకు భారత్ అండగా నిలిచింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ చేపట్టి.. తక్షణ సాయంగా 53 టన్నుల నిత్యావసర సరుకులను పంపించింది. పక్క దేశానికి ఆపద వస్తే ముందుంటామని భారత్ మరోసారి నిరూపించుకుంది.
TG: మలక్పేటలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే సమయంలో రహదారిపై టిప్పర్ అదుపుతప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. బస్సు, లారీని ఢీకొడుతూ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
TG: iBOMMA రవి స్కిల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఏకంగా సైబర్ క్రైమ్లో జాబ్ ఇస్తాం అంటే.. రవి మాత్రం ‘నాకొద్దు’ అని చెప్పేశాడట. కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో రెస్టారెంట్ పెట్టి సెటిల్ అవుతానని పోలీసులకే చెప్పాడని తెలుస్తోంది. సంపాదించిన డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయడమే తన గోల్ అని చెప్పినట్లు టాక్. త్వరలోనే ఇతనికి బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
CTR: బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముందు వెళ్తున్న ప్రైవేట్ బస్సుని వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీ కొనడంతో వెనక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు.
SRD: జహీరాబాద్ శివారులోని పస్తాపూర్లో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్మశాన వాటిక చివర్లో కట్టెలతో కొట్టి చంపారు. మృతుడు జరా సంఘం మండలం గంగాపూర్కు చెందిన మహబూబ్(32)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.
SDPT: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహెడ మండలంలో జరిగింది. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి(40) మంగళవారం కుటుంబ కలహాలతో, తన స్వంత ఇంటిలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
SDPT: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన కోహెడ మండలం నారాయణపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టయ్య ఉపాధికోసం మండలంలో కట్టెలతో బొగ్గు తయారు చేసి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గ్రామ శివారులోని కాలువ పక్కన మట్టిగుట్టపై ఎక్కి పిట్టలను వేటాడే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ప్రమాదశాత్తు మృతి చెందినట్ల గ్రామస్థులు తెలిపారు.
SRPT: బాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అర్వపల్లిలోని జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి వద్ద నాగారం మండలం ఫణిగిరి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న గద్దకూటి మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు.
TG: మెదక్ జిల్లాలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం (40) మంజుల (35) భార్యాభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భర్త ఉరేసుకున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
AP: కడప హరిత ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర, కర్ణాటక బార్డర్లోని మంచినీళ్లకోట వద్ద డివైడర్ని ఢీకొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు.
TG: హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు MBNR జిల్లా మక్తల్కు చెందిన వర్షిత (16)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు HYD ప్రగతి కాలేజీకి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి మంజునాథ్ నిన్న సూసైడ్ చేసుకున్నాడు.
హాంకాంగ్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 151కి చేరింది. మరో 104 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రజలు సాయం చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.1029 కోట్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శారదానగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురు బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ATP: యువత, విద్యార్థులను గంజాయి బారిన పడకుండా కాపాడేందుకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. నవోదయ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న షికారి శీనా, షేక్ మహమ్మద్ ఖాన్ అనే ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది.
TG: కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఉదయం 8:10 గంటలకు శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్కు.. బాంబు ఉందని మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించారు. ప్రస్తుతం ఫ్లైట్ ఇంకా ల్యాండ్ కాకపోవడంతో.. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.