TG: ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలింది. పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.
BDK: పినపాక మండలం టి కొత్తగూడెం గోదావరి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానికులు అటుగా వెళుతుండగా శవాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ ఉప్పరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డీసీఎం ఢీకొని అబ్దుల్ సత్తార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కొల్పోయాడు. అయినా డీసీఎం ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రోడ్డు ప్రమాద ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అనంతపురం జిల్లాలో ఓ తండ్రి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు కుమార్తెలను LLC కాలువలోకి తోసి చంపాడు. భార్యపై అనుమానంతో తండ్రి కల్లప్ప కుమార్తెలను చంపేశాడు. గుడికి వెళ్దామని చెప్పి కుమార్తెలను తీసుకెళ్లి కాలువలోకి తోశాడు. ఈ క్రమంలో ఒక చిన్నారి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TG: వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్లలో రాత్రి ఊరేగింపులో కారు కిందపడి చిన్నారి మృతి చెందింది. బాలిక మీద నుంచి మహిళా సర్పంచ్ కారు వెళ్లింది. ఈ క్రమంలో గాయపడిన ఏడేళ్ల బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
AP: మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా జనం తీరులో మార్పు రావట్లేదు. తాజాగా మద్యం మత్తులో బైక్ నడుపుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప. గో జిల్లా పెనుమంట్ర(M) పోలమూరులో అర్ధరాత్రి వేళ బైక్పై వెళ్తున్న యువకులు గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అదే గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది.
మెక్సికో నేవీకి చెందిన విమానం టెక్సాస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలింది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చిన్నారితోపాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖలోని పూర్ణ మార్కెట్లో అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆరు షాపులు మంటల్లో తగలబడగా.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు. న్యూఇయర్ సందర్భంగా వ్యాపారులు తీసుకొచ్చిన రంగులు, ఇతర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
TPT: తొట్టంబేడు మండలం పెద్దకన్నలి వద్ద సోమవారం ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు శ్రీకాళహస్తి నుంచి కన్నలి వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న 7 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా.. ప్రవళిక అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
KDP: బి.కోడూరు క్రాస్ రోడ్ వద్ద ముందు వెళ్తున్న ఆటోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బి. కోడూరు మండలం రామచంద్రాపురంకి చెందిన యాదగిరిది అని సమాచారం.
CTR: శాంతిపురం మండలం చెంగుబళ్లలో సుబ్బన్న ఆవుల షెడ్డు నిర్మాణం పైనుంచి పడి గాయపడిన తాపీ మేస్త్రి జయప్ప (65) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆవుల షెడ్డు నిర్మిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జయప్ప కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: గంజాయి కేసులో 17 సంవత్సరాల బాలుడిని అరెస్ట్ చేసినట్లు DSP భానోదయ తెలిపారు. గుంటూరు DSP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాకుమాను-అప్పాపురం రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోలోని వ్యక్తి పారిపోయాడని, బాలుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
TG: HYD మేడిపల్లి దగ్గర్లోని నారాపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో AR SI మృతి చెందాడు. రఘుపతి(59) ఖైరతాబాద్లో ఇంటెలిజెన్సీలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
KDP: వల్లూరు మండలం గణేష్పురం సమీపంలో కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం నుంచి కడప వైపు వెళ్తున్న బైక్ అకస్మాత్తుగా అడ్డు వచ్చిన పందిని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
HYD: మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎస్సై ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.