• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

విషాదం.. ముగ్గురు సజీవదహనం

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, వ్యాన్ ఢీకొని.. నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

April 12, 2026 / 01:06 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు, వ్యాన్ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 12:28 AM IST

సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు లింగాపురంలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కర్నూలుకు చెందిన ప్రమీల, రంగస్వామిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వీరు ఇరువురు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమీల మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 11, 2026 / 08:36 PM IST

పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి

AP: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం నెలకొంది. పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై విద్యార్థి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బస్సులో సహాయకుడు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 11, 2026 / 06:24 PM IST

ఖాజీపేట ఘటన.. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతు కోసి యువకుడు చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్‌లో కీర్తన మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయింది. అనంతరం కీర్తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఖాజీపేటలోని అగ్రహారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

April 11, 2026 / 03:20 PM IST

ప్రేమికులే టార్గేట్.. ఏఎస్ఐ అరాచకం..!

PLD: మాచర్లలో ఓ ఏఎస్ఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్ సాయంతో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలను రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడని సమాచారం. వాటితో బెదిరించి డబ్బులు లాగడంతో పాటు యువతులు, మహిళలను వేధిస్తున్నాడని, ఇందుకు సంబంధించిన బెదిరింపు వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

April 11, 2026 / 10:19 AM IST

బాలికపై యువకుడు అత్యాచారయత్నం

AP: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బ్రిడ్జి కిందికి బాలికను తీసుకెళ్లి నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక తమ్ముడు కేకలు వేశాడు. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 11, 2026 / 08:56 AM IST

అంబులెన్స్‌ను ఢీకొట్టిన బస్సు.. ఇద్దరు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి సమీపంలో పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ఓ ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు పేషెంట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

April 11, 2026 / 08:09 AM IST

ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

TG: సూర్యపేట జిల్లా కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

April 11, 2026 / 06:48 AM IST

ఉగ్రకుట్ర భగ్నం.. 11 మంది అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. 11 మంది ISI ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బబ్సర్‌ఖల్సా టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల దగ్గరి నుంచి నాలుగు పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలో సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

April 10, 2026 / 07:55 PM IST

విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

AP: పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మణికంఠ రాజు, ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకుండా యువతికి వేరే వ్యక్తితో వివాహం చేశారు. ఈనెల 7న కొండవీడు కోటకు వెళ్లిన వీరు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

April 10, 2026 / 05:41 PM IST

BREAKING: 25 మంది గల్లంతు

ఉత్తరప్రదేశ్‌ మధురలోని యమునా నదిలో ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 04:52 PM IST

విషాదం: పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య

TG: జగిత్యాల జిల్లాలో విషాదం జరిగింది. రాయికల్ మండలం మైతాపూర్‌లో అక్షయ్(16) అనే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్షయ్.. ఇటీవల చదువుపై నిర్లక్ష్యం చూపుతున్నాడని పాఠశాల HM.. ‘ఇలా ఉంటే పదవ తరగతి ఫెయిల్ అవుతావ్’ అని మందలించాడట. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. గత నెల 26న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలాడు.

April 10, 2026 / 04:26 PM IST

ఫోన్ పాస్‌వర్డ్ అడిగిందని భార్య దారుణ హత్య

మధ్యప్రదేశ్‌లో మొబైల్ పాస్‌వర్డ్ గొడవ భార్య ప్రాణం తీసింది. ఫోన్ పాస్‌వర్డ్ అడిగిందనే కోపంతో దీపక్ మిశ్రా అనే వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ముగ్గురు పిల్లల కళ్ల ముందే జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.

April 10, 2026 / 02:38 PM IST

పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

AP: కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా.. యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాసులు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

April 10, 2026 / 02:04 PM IST