జర్మనీలోని ఓ బ్యాంకులో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గెల్సెన్కిర్చెన్ నగరంలో బ్యాంకులోని 3,200 సేఫ్టీ డిపాజిట్లను దొంగలు పగలగొట్టారు. ఇందులోని నగదు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు (రూ.316 కోట్లు) పైన ఉంటుందని అంచనా వేశారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించారు.
TG: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో దారుణం జరిగింది. తల్లిని కుమారుడు బండరాయితో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి హనుమమ్మ(75)ను ఆంజనేయులు(45) అనే కొడుకు బండరాయితో కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది.
తిరుపతి గరుడ వారధిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు గాయాలయ్యాయి. జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన చంద్రకళ తన భర్త నాగరాజుతో కలిసి అప్పలాయగుంట దైవ దర్శనానికి వెళ్లారు. బైకుపై తిరిగి ప్రయాణమవ్వగా గరుడ వారధి ఫ్లైఓవర్ పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంగ్లాదేశ్లో హిందూవులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. భజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని నూమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నూమన్ మియాను అరెస్ట్ చేశారు. కాగా.. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలు మరువక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.
బెంజి కారులో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. గుజరాత్లోని అహ్మదాబాద్ శివారులో ఓ కారు నుంచి రూ.15 లక్షల విలువైన డ్రగ్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పలు ఫామ్హౌజ్లకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు అగర్వాల్ కోసం గాలింపు కొనసాగుతోంది.
AP: నంద్యాల జిల్లాలో ఈనెల 28న కుటుంబకలహాలతో పిల్లలను కాల్వలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు SRBCలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గడివేముల మండలం మంచాలకట్ట SRBCలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. లక్ష్మి (23), వైష్ణవి (3) మృతదేహాలను NDRF బృందం వెలికి తీశాయి. మరో చిన్నారి సంగీత కోసం గాలింపు కొనసాగుతోంది.
TG: HYDలోని నాచారంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు యువకులు నాచారంలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో బంగారం కోసం యజమానురాలు సుజాతను హత్య చేశారు. అనంతరం డెడె బాడీని సూట్కేసులో తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. భండూప్ వెస్టులో రివర్స్ తీసుకుంటున్న బస్సు.. అటుగా వచ్చిన ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
SRD: వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతి చెందిన ఘటన కంగ్టి మండలం సర్దార్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తాండకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడు.
RR: తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు 3 తులాల బంగారం, రూ.40 వేలు దోచుకెళ్లిన ఘటన తలకొండపల్లి PS పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. చంద్రధన గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ ఆదివారం తన బంధువుల ఇంట్లో పూజకు వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ముంబైలోని ఓ వృద్ధురాలి నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ CJI, CBI అధికారులుగా నమ్మిస్తూ.. పోలీసుల తనపై చర్య తీసుకునే అవకాశం ఉందని బెదిరించారు. సుమారు 3.71 కోట్లు పంపింది. మళ్లీ మళ్లీ డబ్బులు అడగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మనసులను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి హిందూపురం ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. అయితే, ప్రసవం తర్వాత ఆమెకు రక్తపోటు పెరగడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలింత మరణించగా.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది.
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రావిన్స్ రాజధాని మనడో సులవేసిలోని నర్సింగ్ హోమ్లో జరిగిన ప్రమాదంలో 16 మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి 12 మందిని కాపాడారు.
TG: కామారెడ్డి భిక్కనూరులోని ర్యాగట్ల పల్లిలో జరిగిన యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అన్న రాజును అతని తమ్ముడు శివ కుమార్ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రాజు తమ సమీప బంధువైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో కుటుంబ పరువుకు భంగం కలిగిందని శివ కోపంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితుడిని రిమాండ్కు తరలించారు.
దక్షిణ అమెరికాలోని సూరినామ్లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో 9 మంది మరణించారు. రాజధాని పారమారిబో సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా నిందితుడి పిల్లలు, అతడి పొరుగువారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు దాడికి దిగాడని, మతిస్థిమితం లేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.