తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఊటీకి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి 100 అడుగులు ఎత్తు నుంచి కిందపడింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రయాణీకులంతా తీవ్రంగా గాయపడగా వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
SRD: ఆందోల్ మండలంలోని సంగుపేట గ్రామ శివారులో ట్రాక్టర్పై వెళ్తున్న ఓ మహిళ జారీ కింద పడి మృతి చెందింది. పెద్ద శంకరంపేట నుంచి సంగారెడ్డికి గ్రానైట్ రాళ్లను ట్రాక్టర్లో తరలిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలిని శంకరంపేట గ్రామానికి చెందిన మల్లమ్మ (40)గా గుర్తించారు. సంఘటన స్థలానికి జోగిపేట్ పోలీసులు చేరుకొని ఘటనపై విచారణ ప్రారంభించారు.
AP: కాకినాడ జిల్లాలోని తుని రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ ఆర్చ్పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది సమాచారం అందించగానే.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడేలేదని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ KPHB పరిధిలోని సర్ధార్ పటేల్నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నగలు చోరీకి గురయ్యాయి. గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలను దుండగులు అపహరించారు. సుమారు రూ.50 లక్షల విలువైన వెండి నగలు ఎత్తికెళ్లినట్లు సమాచారం. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు మహబూబ్నగర్ జిల్లా ఫర్దిపూర్ వాసులుగా తెలుస్తోంది. ఉజ్జయిని పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి PS నుంచి పరారైన అంతర్రాష్ట్ర దొంగ తెలుగు నాగిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. పలు చోరీల్లో నిందితుడిగా ఉన్నాడు. కల్వకుర్తి పీఎస్లోనూ కేసులు ఉండటంతో నాగిరెడ్డిని గతేడాది నవంబర్ 11న కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 13న రాత్రి పరారయ్యాడు. నిన్న రాత్రి నాగిరెడ్డిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు.
జెరూసలెంలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు నిర్బంధ సైనిక విధులు కేటాయించడంపై ఆందోళనకారులు నిరసనలు చేపట్టగా.. వారి పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
KDP: మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
AP: ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తూ.గో.జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్పై పూర్తిగా దగ్ధమైంది. వేకువజామున ట్రావెల్స్ బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
TG: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రిని ఓ కుమారుడు కర్రతో కొట్టి చంపాడు. శ్రీకాంత్ అనే యువకుడు జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: బైక్ అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దన పాడు వద్ద జరిగింది. వీరపునాయునిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిశేఖర్(58)గా స్థానికులు తెలిపారు. వ్యక్తిగత పని నిమిత్తం ఎర్రగుంట్లకు బైక్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
AP: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్.రంగాపురంలో పొంగమంచుతో కనపడక ఎద్దులబండిని బైకు ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. వీరు స్థానిక పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని.. విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇరాన్లో ఆందోళనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అల్లర్లను అణచివేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, సుమారు 1200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘హ్యూమన్రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ వెల్లడించింది. దేశంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.
AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని సోమశేఖర్ అనే వ్యక్తి.. ఓ మహిళను గొంతు కోసి హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక కోర్లగుంట మారుతీనగర్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని.. ఇటీవల మహిళ ఈ బంధాన్ని నిరాకరించడంతో సోమశేఖర్ ఈ హత్య చేశాడని గుర్తించారు.