AP: విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆఫీస్ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగి 17 మంది మృతి చెందారు. చాలా మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాయి.
కరెంట్ వైర్లకు తగిలి విమానం కూలిన ఘటన మధ్యప్రదేశ్లోని సివనీ జిల్లాలో జరిగింది. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం ఎయిర్ పోర్ట్లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో 33KV హైటెన్షన్ తీగలకు తగిలి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
HYD: ఘట్కేసర్ మండల పరిధి అన్నోజిగూడలోని గ్యాస్ వెల్డింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్న గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో వంట చేసుకుంటున్న కార్మికుడు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్గా పోలీసులు గుర్తించారు.
తూర్పు కాంగోలోని సెంజ్ పట్టణం సమీపంలో బాంబు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికిపైగా ప్రజలు మరణించగా.. మరో 20మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ అనుకూల సాయుధ ముఠాలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రేమ పేరుతో వంచించి ఇద్దరు బాలికలను అత్యాచారానికి పాల్పడిన యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారికి చెందిన 17 ఏళ్ల బాలికను ఆ యువకుడు ప్రేమ పేరుతో తీసుకుపోయి లోబరుచుకున్నాడు. అనంతరం ఆ బాలిక తీసుకువచ్చిన బంగారం, నగదుతో ఉడాయించాడు. మైనర్ ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. కేరళలో ఇదే తరహాలో మరో బాలికను మోసం చేస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
AP: ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికలపాడు వద్ద ఆయిల్ ట్యాంకర్, అరటి పండ్ల లోడ్ లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాపూజీ నగర్లో పవిత్ర(18) అనే యువతిని సమీప బంధువైన ఉమాశంకర్ ఇంట్లోకి చోరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి పవిత్ర నిరాకరించింది. దీంతో కక్షతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యూపీకి చెందిన కాంట్రాక్టర్ ఇంతియాజ్ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇరపల్లి గ్రామంలో ఇంతియాజ్ రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. అయితే, రహదారి పనులు నిలిపివేయాలని మావోయిస్టులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా పనులు చేపడుతుండటంతో అతడిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చారు.
TG: హైదరాబాద్లోని జవహర్నగర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై రియల్టర్ వెంకట రత్నంను దుండగులు కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో కారు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సప్తశృంగి మాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను లోయలోనుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.
VKB: కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనాపూర్ ఎక్స్-రోడ్ వద్ద జరిగిన సెల్ఫ్-రోడ్ ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. కుల్కచర్ల నుంచి నంచర్ల వైపు వేగంగా వెళ్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి రాయిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
TG: హైదరాబాద్లో గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 532 గంజాయి పాకెట్లుగా ఉన్న 2.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పరిధిలోని బస్తీల్లో గంజాయి అమ్ముతుండగా పట్టుబడ్డారు. బాలువబాయి ఉపాధ్యాయ, గలన్బాయి కాంబ్లే అనే ఇద్దరు మహిళలు అరెస్టైనట్లు వెల్లడించారు.
VSP: పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.