KDP: CM చంద్రబాబు, DY. CM పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్పై గతంలో అసభ్యకర పోస్టులు చేసిన YCP సోషల్ మీడియా కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని కడప పోలీసులు అరెస్టు చేశారు. బద్వేలుకు చెందిన అతడు ఎన్నికల తర్వాత కువైట్ వెళ్లగా.. భారత్కు వస్తున్నాడన్న సమాచారంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కడప కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: బాలికపై లైంగిక దాడి కేసులో దోషికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ పరిధిలోని రిసాల బజార్కు చెందిన యాసిన్ను 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి నిందితుడు రూ.2 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. 2018లో బాలిక పట్ల యాసిన్ అసభ్య ప్రవర్తన కేసులో అరెస్ట్ అయ్యాడు.
VKB: విద్యుత్ షాక్తో ఓ గేదె, ఆవు మృతి చెందిన ఘటన సోమవారం తాండూరు మండలంలోని అంతారం గ్రామంలో జరిగింది. గేదె, ఆవు మృతి చెందడంతో తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు పెండా స్వామిదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
AP: ప్రకాశం(D) ఎర్రగొండపాలెం(M) గడ్డమీదపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమణమ్మ అనే మహిళపై తన అల్లుడు నారాయణ కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయపడ్డ రమణమ్మను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద అల్లుడు నారాయణపై అత్త బంధువు ఎదురు దాడి చేశారు. కాగా, గతంలో రమణమ్మ కూతురు కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని చనిపోయింది.
NLR: మర్రిపాడు మండలం, డీసీపల్లి పొగాకు బోర్డు సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని టోల్ ప్లాజా అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మహేష్ వార్డు మెంబర్గా విజయం సాధించారు. అయితే, మహేష్ అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా, మహేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.
AP: శ్రీశైలం ఘాట్ రోడ్డులో 40 మందితో ప్రయాణిస్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లిన బస్సు రక్షణ గోడపై నిలవడంతో.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. వైజాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. పెద్ దోర్నాల- శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
AP: సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మిన ఓ సీనియర్ న్యాయవాది భారీ మొత్తంలో మోసపోయాడు. దీంతో సదరు న్యాయవాది తనకు న్యాయం చేయాలంటూ కడప జిల్లా బద్వేల్ పోలీసులను ఆశ్రయించాడు. తనను మాటల్లో పెట్టి విడతల వారీగా రూ.72 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియాలోని బొండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక తండ్రీకొడుకులు ఉన్నారని తేలింది. పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్(50), అతని కొడుకు నవీద్(24) కాల్పులకు తెగబడ్డారు. యూదుల ఉత్సవం జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు. ఈ ఘటనతో సిడ్నీ ఉలిక్కిపడింది.
AP: రాష్ట్ర లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో అరెస్టయిన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వీరికి బెయిల్ వస్తుందా లేక జైలు జీవితం కొనసాగుతుందా అనేది ఇవాళ తేలే అవకాశం ఉంది. దీంతో అందరి చూపు ఇప్పుడు సుప్రీం తీర్పుపైనే ఉంది.
AP: అనంతపురం జిల్లా పామిడిలో రవి అనే యువకుడు హల్చల్ చేశాడు. కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. పోలీసు వాహనం, షాపులు, ఆటోల అద్దాలు ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో పోలీసులపైనా దాడికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు.
ASF: ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన తారాబాయి (42) ఆదివారం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా స్కూటిపై వస్తున్న వ్యక్తి ఆమెను ఢీ కొట్టాడు. దాంతో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అంబులెన్స్ ద్వారా హుటాహుటిన వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలంలోని మాచవరంలో భార్యను భర్త హత్య చేశాడు. అనంతరం నిందితుడు బైక్పై మృతదేహంతో సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చినట్లు సమాచారం.