ATP: తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని నోటితో కొరికి గాయపరిచిన వింతైన ఘటన బొమ్మనహాళ్ మండలంలో చోటుచేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం రాజన్న వద్ద రూ. 5000 అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీధర్.. రాజన్న చెంపపై నోటితో తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: కరీంనగర్లోని గోపాలపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు బైక్ అడగడంతో పంట డబ్బులు వచ్చాక కొనిస్తానని తండ్రి మాటిచ్చాడు. అయితే అడిగిన వెంటనే కొనివ్వలేదని మనస్తాపానికి గురైన రిత్విక్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో విద్యార్థి కౌశిక్ మృతిపై చిక్కుముడి వీడింది. తోటి విద్యార్థి నాటు తుపాకీతో కాల్చడంతోనే కౌశిక్ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. తుపాకీతో ఆటలాడుతుండగా ఈ ఘటన జరిగిందని తేల్చిన అధికారులు.. సదరు విద్యార్థి, అతని తండ్రి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
TG: సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. షాద్నగర్లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న ఇద్దరిని ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. SR ఇన్నోవేషన్స్ సంస్థ నిషేధిత కెమికల్స్ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్కు చెందిన నిందితులకు SR ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ నిషేధిత కెమికల్స్ను సరఫరా చేస్తున్నాడు.
TG:: హైదరాబాద్లోని ముషీరాబాద్లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రదీప్, విజయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి హాష్ ఆయిల్ను విజయ్ కుమార్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 367 గ్రాముల హాష్ ఆయిల్, బైక్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
TG: హైదరాబాద్లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. CBI అధికారులమని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్కు పాల్పడ్డారు. బెంగళూరు ఇందిరానగర్లో ఆయనపై కేసు నమోదు అయిందని సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో అతని నుంచి రూ.1.66 కోట్లను కొట్టేశారు.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 9 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకోవాడానికి నిందితులను విచారిస్తున్నారు.
AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే అనుమానంతో భార్య శ్రీలేఖను హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం పెద్దపప్పూరు PSలో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని విచారిస్తున్నారు.
AP: తిరుపతి జిల్లా యర్రావారి పాల్యం మండలంలో విషాదం నెలకొంది. నెరబైలు పంచాయతీ పరిధి పొలాల్లో రెండు ఏనుగులు మృతిచెందాయి. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల కంచె తగిలి ఏనుగులు మరణించినట్లుగా తెలుస్తోంది. నెరబైలు ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డయేరియా కలకలం రేగింది. 25 మంది హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందరికీ ఎయిమ్స్లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతోంది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో తెలుసుకునేందుకు 40 చోట్ల శాంపిల్స్ తీసుకున్నారు.
TG: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ను కారుతో ఢీకొట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ క్రమంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక బళ్లారిలోని ఓ స్కూల్ హాస్టల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి హేమంత్ను భరత్ కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన ఆరుగురు 9వ తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే హేమంత్ది కర్నూలు జిల్లా సమ్మతగేరి స్వగ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. పోలవరం కాలువ దగ్గర మృతదేహం ఉన్న ఫొటోలు SMలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వెళ్లేలోపు బాలుడి మృతదేహం మాయమైంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు కొండకింద పొదల్లో మృతదేహం గుర్తించారు. మరకలు శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో నాటుతుపాకీతో కాల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
TG: ఆగ్రాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరకు రవాణా చేస్తున్న డెన్ను ఆగ్రాలో ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేసింది. ఐదుగురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు అప్పగించింది.
AP: మార్కాపురం జిల్లా చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ మినీ వ్యాన్ ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ వెంకన్న(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కాన్వాయ్ బైకర్ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం.