NZB: నిబంధనలను పాటించని ట్రావెల్స్, స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. కర్నూలులో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బోధన్ పట్టణంలో నేడు ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిబంధనలు పాటించని ఓ స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో ACB వలకు మరో అధికారి చిక్కాడు. ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ SE రామారావు రూ.1.9 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. యాదగిరిగుట్ట ఆలయంలో టెండర్ ద్వారా లడ్డూ తయారీ మిషనరీ సప్లై చేసినందుకు ఆయన 20% కమిషన్ డిమాండ్ చేయడమే కాక బిల్లులు నిలిపేశాడని ఓ కాంట్రాక్టర్ ACBని ఆశ్రయించాడు. ఆపై రామారావుని అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో గురువారం ఓ వ్యక్తి గుండ్లకమ్మ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను గుండ్లకమ్మ నదిలో దూకే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారించేలోపే అతను దూకేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
UP బహ్రైజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భరత్పుర్ సమీపంలోని కౌదియాలా నదిలో 22 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు పిల్లలు సహా 8 మంది గల్లంతయ్యారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మిగతా 13 మందిని రక్షించారు. నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గల్లంతైనవారు మరణించి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన శిరీష అనే వివాహిత గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియాల్సింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
KKD: ఈ నెల 27న మోటార్ బైక్ నుంచి కాలువలో పడి అదృశ్యమైన కాకినాడ రూరల్ సూర్యాపేటకు చెందిన బాలుడు పోలవరపు సాయి (13) మృతదేహం బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ గ్లాస్ బీచ్ వద్ద లభ్యమైంది. రెండు రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
E.G: ధవళేశ్వరం ఆనకట్టపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి దారవారానికి చెందిన షేక్ కాజా (42)గా గుర్తించినట్లు కొవ్వూరు రూరల్ SI కే. శ్రీహరి రావు తెలిపారు. ధవళేశ్వరంలోని HP గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్గా పనిచేస్తున్నారన్నారు. విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా వ్యాగన్-ఆర్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు.
సత్యసాయి: రామగిరి మండలంలోని ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. ఒక దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. వీఐపీ మార్గంలోని తాళాలు పగలగొట్టి హుండీని చోరీ చేశారు. అందులో రూ. 2 లక్షలు ఉన్నట్లు సమాచారం. హుండీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP: శ్రీ సత్యసాయి జిల్లా చౌళూరులో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికులు సమీప ఆస్పత్రులకు తరలించగా.. ఏడుగురు కోలుకున్నారు. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా డైజోఫాం వంటి రసాయనాలతో కల్తీ కల్లు తయారుచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తుండగా.. 5 రోజులుగా తాగుతుండటంతోనే బాధితులు ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ATP: సిటిజన్ ఈకేవైసీ ఓటీపీ కోసం ఫోన్ చేసిన మహిళా పోలీస్ను తాడిపత్రి ఎంఈవో-2 రామగోందరెడ్డి అసభ్యకరంగా తిట్టిన ఘటన జయనగర్ కాలనీలో జరిగింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఎంఈవో కార్యాలయానికి వెళ్లి వాగ్వాదం చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రామగోందరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
TPT: తిరుపతి DBR హాస్పిటల్ రోడ్డులోని ఓ హోటల్లో యువతి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరుకు చెందిన ద్రాక్షాయినికి పెళ్లి కాలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె హోటల్లో ఓ గది అద్దెకి తీసుకున్నారు. ఇంజన్ ఆయిల్ వంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అతివేగంగా ఆర్మూర్ వైపు నుంచి వచ్చిన తుఫాన్ వాహనం, నాగపూర్ గ్రామం నుంచి వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TPT: తిరుపతి DBR హాస్పిటల్ రోడ్డులోని ఓ హోటల్లో యువతి మృతి కలకలం రేపింది. తిరుచానూరుకు చెందిన ద్రాక్షాయిని ఓ గది అద్దెకి తీసుకున్నారు. ఈ మేరకు ఇంజిన్ ఆయిల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. 80 శాతం శరీరం కాలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
VKB: పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రైతు తమ్మన్న చంద్రశేఖర్కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. పొలం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.60 వేల విలువైన ఆవు మరణించడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. రైతుకు తగిన పరిహారం అందించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
AP: బాపట్ల జిల్లా అద్దంకి దగ్గర వరదల్లో ఆరుగురు గల్లంతు అయ్యారు. గుండ్లకమ్మ వరదలో ముగ్గురు ఉద్యోగులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు మరో ముగ్గురు పడవలో వెళ్లారు. అందరూ కలిసి తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో ఆరుగురు గల్లంతు అయ్యారు. అయితే ఆరుగురిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది మరో బోటును రప్పిస్తున్నారు.