• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జేయియి మెయిన్స్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ ఏప్రీల్ 9), APEAPCET ( ఏప్రీల్ 24) ప్రక్రియ కొనసాగుతోంది.

April 7, 2025 / 08:00 AM IST

బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

NTR: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

April 7, 2025 / 07:59 AM IST

చెరువులో పడి బాలుడు మృతి

PLD: వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం పండుగ రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు (16) అనే బాలుడు చెరువులో ఉన్న తామర పువ్వు తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.

April 6, 2025 / 01:51 PM IST

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు

ప్రకాశం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకటకోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

April 6, 2025 / 07:08 AM IST

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో శనివారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందింది. సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7 ఆర్ హోటల్‌లో పని చేస్తున్న విజిత విధులకు వెళ్తూ హోటల్ దగ్గర రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందింది.

April 5, 2025 / 08:17 PM IST

ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్‌గా స్థానికులు గుర్తించారు.

April 5, 2025 / 07:40 PM IST

కత్తులు చూపించి 3.7 కిలోల బంగారం చోరీ

AP: చిత్తూరులోని వెంకటగిరికోటలో 3.7 కిలోల బంగారం దోపిడీ జరిగింది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్నాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కారును అడ్డగించి కత్తులు చూపించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

April 5, 2025 / 05:27 PM IST

రాజేంద్రనగర్‌ వెటర్నరీ కాలేజీలో కార్మికుడి మృతి

HYD: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

April 5, 2025 / 10:10 AM IST

ఒక్క రోజులోనే ఐదుగురు మృతి

ప్రకాశం: వేర్వేరు కారణాలతో శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. పెద్ద దోర్నాల మండలంలోని గుంటవానిపల్లె సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో ఢీకొనటంతో రైతు మృతి చెందాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం, గిద్దలూరులో వేరువేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

April 5, 2025 / 08:04 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

SRPT: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన యాతం సైదులుగా గుర్తించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్యం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

April 4, 2025 / 08:14 AM IST

రైలు కిందపడి కార్మికుడు మృతి

PDPL: ఉత్తరప్రదేశ్‌లోని జైతాపూర్‌కు చెందిన వరుణ్ కుమార్ సింగ్(30) అనే యువకుడు కూలీ పని చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రామగుండం రైల్వే స్టేషన్‌లో రైలు దిగే సమయంలో కాలుజారి పడిపోయాడు. వెంటనే రైలు కదలడంతో వరుణ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.

April 4, 2025 / 08:07 AM IST

కారు ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు స్థానిక టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2025 / 06:18 AM IST

నాగాలాపురం రోడ్డుపై ప్రమాదం

CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్‌పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్‌కు తలపై, కుడి భుజం ఎముకకు తీవ్ర గాయాలు, ముఖం చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.

April 3, 2025 / 05:05 PM IST

కన్న తల్లిని హతమార్చిన కొడుకు

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 3, 2025 / 02:01 PM IST

రైల్వే అధికారి ద్విచక్ర వాహనం చోరి

ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చి చూస్తే వాహనం కనబడలేదు. దీంతో ద్విచక్ర వాహనం చోరికి గురైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 3, 2025 / 01:21 PM IST