ఫ్రాన్స్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ గ్వాడెలోప్లోని సెయింట్ ఆన్లో క్రిస్మస్ జరిగిన వేడుకల్లో జనసమూహంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కువైట్-శంషాబాద్(KU-373) విమానంతో పాటు బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కువైట్-శంషాబాద్ విమానం మస్కట్కు మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సేఫ్ ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
MDK: సదాశివపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన మార్గం నర్సమ్మ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆమె భర్త మార్గం సత్తయ్య పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద విగత జీవిగా కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
JGL: సారంగాపూర్ మండలంలోని పెంబట్లశ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం డిస్కవర్, స్కూటీలు రెండు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. దీంతో బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామానికి చెందిన మంజుల తలకు గాయాలయ్యయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై గీత ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. HYDకు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఆ కాంప్లెక్స్లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన మిగిలిన విద్యార్థులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం.
MNCL: మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైన రైతు, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ASI మాజీద్ ఖాన్ వివరాలు ఈనెల 3న కంది ముకుంద రెడ్డి అనే రైతును పాము కాటేసింది. అప్రమత్తమైన తోటి రైతులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
TG: కరీంనగర్ జిల్లా సిర్సపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్-రజిత దంపతులు పెద్ద కుమారుడు అభిలాష్ (19) సింగాపురం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇవాళ ఇంట్లోని బాత్రూంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
BPT: చిన్నగంజాం మండల పరిధిలోని మసీదు పేటలో ఉన్న స్మశానం వద్ద రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు గురువారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న వ్యక్తుల నుంచి రూ. 3,200ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం శాంతినగర్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి చెన్నై వెళ్తున్న లారీ చక్రాయపాలెం సమీపంలో బ్రేక్ డౌన్ అయింది. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న పాల ఆటో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో అద్దంకి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ PS పరిధిలోని హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో మాబు సింగ్(54) అనే వ్యక్తిని కొంతమంది యువకులు చంపారు. చుట్టుపక్క సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. అరెస్టైన వారిని ఈస్ట్ జోన్ డీసీపీ ఇవాళ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
HYD: నగరంలో ఓ ఆటోలో మృతుదేహాలు కలకలం రేపాయి. చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఓ ఆటోలో రెండు మృతదేహాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమచామరం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను గమనించగా పలు మత్తు పదార్థాలు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
HYD: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజయ్ సవంత్(58) గుండె పోటుతో మృతి చచెందారు. బుధవారం అబ్దుల్లాపూర్ మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండడంతో మంగళవారం రాత్రి అయన పోలీస్ స్టేషన్లో నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండె పోటు రావడంతో అక్కడికడే ప్రాణాలు విడిచాడు. కాగా, SI నాచారంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
కేరళ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్కుటత్తిల్కు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పటికే రేప్ కేసులో పరారీలో ఉన్న ఆయనపై.. తాజాగా మరో 23 ఏళ్ల యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కాంగ్రెస్ కమిటీకి మెయిల్ చేసింది. ఇన్నాళ్లు ఆయన పవర్కు భయపడ్డానని వాపోయింది. ఈ ఫిర్యాదును పోలీసులకు పంపామని పార్టీ చీఫ్ జోసెఫ్ తెలిపారు.