• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి చెందారు. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు టాంజానియా పౌర విమానయానశాఖ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొంది.

December 25, 2025 / 01:53 PM IST

బాంబు పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైదుగురిలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాదు పేలుడు ధాటికి మసీదు ధ్వంసమైంది. ఇది ఉగ్రవాదుల చర్య అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

December 25, 2025 / 12:01 PM IST

లారీ ఢీకొట్టడంతోనే బస్సు ప్రమాదం!

డిజిల్ ట్యాంకర్ NH48పై డివైడర్‌ను దాటి రాంగ్ రూట్‌లో బస్సును ఢీకొట్టడం కారణంగానే కర్ణాటక రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దహనమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

December 25, 2025 / 07:36 AM IST

వివాహేతర సంబంధం.. ప్రాణాలు తీసిన టీచర్స్

TG: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది ఓ టీచర్. నాగర్ కర్నూల్(D) అచ్చంపేటలో NOV 25న లక్ష్మణ్ నాయక్(38) మరణించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆయనను భార్య పద్మ ఊపిరాడకుండా చేసి చంపిందని తేల్చారు. రాత్లావత్ గోపి అనే మరో ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె ఈ హత్య చేసిందని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

December 25, 2025 / 07:13 AM IST

BREAKING: 17 మంది సజీవదహనం

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 17 మంది సజీవదహనం అయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 25, 2025 / 06:10 AM IST

BREAKING: ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌ను రైలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 24, 2025 / 09:49 PM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 24, 2025 / 09:26 PM IST

విషాదం.. తల్లీకుమార్తె ఆత్మహత్య

AP: ఏలూరు జిల్లా పెనుమాకలంకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన తల్లి పార్వతి, కుమార్తె నాగమణి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు కాస్త తీవ్రం కావడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 24, 2025 / 08:37 PM IST

పసి పిల్లాడి ప్రాణం తీసిన పెన్సిల్

TG: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాయకన్ గూడేనికి చెందిన ఓ యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని చనిపోయాడు. విహార్(6) అనే విద్యార్థి టాయిలెట్‌కి వెళ్లి తిరిగి పరిగెత్తుకుంటూ తరగతి గదికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో అతని చేతిలో ఉన్న పెన్సిల్ చిన్నారి గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.

December 24, 2025 / 07:50 PM IST

భార్యపై భర్త హత్యాయత్నం

BDK: భద్రాచలం పాత మార్కెట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఆదివాసి మహిళ లక్ష్మీపై బుధవారం సాయంత్రం భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 24, 2025 / 06:32 PM IST

ఓ నిరుపేద కుటుంబాన్ని విషాదంలో ముంచిన అగ్ని ప్రమాదం

BDK: సుజాతనగర్ రూప్ల తండాలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న సమయంలో తాత్కాలికంగా ముందు భాగంలో వేసుకున్న రేకుల షెడ్డులో కరెంట్ షాక్ కారణంగా గ్యాస్ అంటుకుని మంటలు చెలరేగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో షెడ్డులో దాచుకున్న నగదు కాలి బూడిద అయినట్లు పేర్కొన్నారు.

December 24, 2025 / 06:20 PM IST

పెన్సిల్ ఛాతీలో గుచ్చుకుని విద్యార్థి మృతి

KMM: పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుని విద్యార్థి మృతి చెందిన ఘటన కూసుమంచి మండల పరిధిలోని, నాయక్ గూడెం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం జరిగింది. యూకేజీ చదువుతున్న విద్యార్థి మేడారపు విహార్ మధ్యాహ్న సమయంలో ఆడుకుంటుండగా జేబులో ఉన్న పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుంది. దీనిని గమనించిన పాఠశాల సిబ్బంది 108 సహాయంతో హాస్పిటల్‌కి తరలిస్తుండగా మృతి చెందాడు.

December 24, 2025 / 05:25 PM IST

మహిళపై కౌలు రైతు దాడి

VKB: బషీరాబాద్ మండలంలో దారుణం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు, రేణుక తమ పెదనాన్న దేవప్ప పొలంలో ఇసుక తవ్వుతున్నారు. ఈ క్రమంలో కౌలు రైతు అశోక్, కృష్ణ ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో రేణుక గాయపడ్డారు. ఆమెను తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

December 24, 2025 / 04:27 PM IST

ట్రైన్ ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: శ్రీకాకుళం జీఆర్‌పీ పరిధిలోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఈరోజు తిరుచునాపల్లి నుండి హౌరా వెళ్లే ట్రైన్ వస్తున్న సమయంలో సదరు వ్యక్తి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వివరాలకు 9493474582, 9110305494 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

December 24, 2025 / 03:11 PM IST

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

కేరళలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. తప్పతాగి ఓ ఆటో డ్రైవర్ రైలుపట్టాలపై ఆటోను నిలిపివేశాడు. ఈ క్రమంలో అదే ట్రాక్‌పై వస్తున్న కాసర్‌గోడ్-తిరువనంతపురం రైలు ప్రమాదానికి గురైంది. అయితే, లోకోపైలట్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

December 24, 2025 / 11:50 AM IST