అన్నమయ్య: రాజంపేట మండలం నూనెవారి పల్లెలో సాయంత్రం 6:30 గంటలకు బీవీఎన్ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద మహిళ మెడలోని సరుడును ఎర్ర చొక్కా ధరించిన దొంగ పల్సర్ బైక్పై వచ్చి లాక్కెళ్లాడు. సరుడులో రూ.1.50 లక్షల విలువైన బంగారు పుస్తెలు ఉన్నాయి. ఘటనలో మహిళకు మెడ గాయం కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
VSP: మద్దిలపాలెం ఆటోమోటివ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలు శుక్రవారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆమెను కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పట్టపగలే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన సోమలలో చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డమ్మ వివరాల మేరకు.. పిండి మిషన్కు వెళ్లేందుకు సాయిబాబా ఆలయం పక్కన ఉన్న దారిలో వెళ్తుండగా, బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.
TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
VSP: అగనంపూడి నుండి స్టీల్ ప్లాంట్ వెళ్లే ఏలేరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం కాల్వలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కేశవరావు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ ఎన్ఏడీ ప్రాంతంలో యువకుడు దిలీప్పై దాడి జరిగింది. స్నేహితులతో మద్యం సేవించిన తర్వాత బాలరాజు, రమణ వెళ్లిపోగా దిలీప్ రక్తమడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పాత కక్షలే కారణమని భార్య చంద్రిక అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అనుమానితులను ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
TG: ఖమ్మం బురాన్పురంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో నారాయణరావు దంపతులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీకేజ్ వల్ల పేలుడు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఇళ్లలోని తలుపులు, కిటికీలు పగిలిపోయాయి.
TG: హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రశాంతినగర్లో అగ్నిప్రమాదం జరిగింది. రెండు దుకాణాల్లో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వాపురం మండలం మొండికుంటలో KLR ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోర విషాదం జరిగింది. క్రాన్స్-మోంటానా రిసార్ట్లోని బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 47 మంది సజీవదహనమయ్యారు. మరో 115 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. పరిమిత స్థలంలో మండే పదార్థాల వల్లే ‘ఫ్లాష్ ఓవర్’ జరిగి మంటలు వ్యాపించాయి. దేశ చరిత్రలోనే ఇది భారీ విషాదం.
TG: హైదరాబాద్ ముసారాంబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులు తిరుమల రావు, వెంకటమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. అన్నంలో పరుగులమందు కలిపి ఆమె తిని, పిల్లలకు తినిపించింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు తల్లి ప్రసన్న(40), కుమార్తె మేఘన(13)గా పోలీసులు గుర్తించారు. 2 నెలల కిందట ప్రసన్న భర్త గుండెపోటుతో చనిపోయాడు.
AP: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో తుడుములదిన్నెలో సురేంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా పోలీసులు గుర్తించారు. అయితే, 8 నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయింది.
రష్యాలోని ఖేర్సన్ రీజియన్లో ఒక కేఫ్ అండ్ హోటల్పై ఉక్రెయిన్ దళాలు డ్రోన్తో దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. పౌరులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఈ దాడి జరిగినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో, రష్యా ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.