AP: నెల్లూరు జిల్లాలో ఓ RTC బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. సంగం హైవేపై వెళ్తున్న బస్సుకు కింద భాగంలో మంటలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ గమనించి వెంటనే బస్సు డ్రైవర్కి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపి.. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించాడు. కాగా బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
HNK: జిల్లాలో లోన్ యాప్ వేధింపుల కారణంగా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వడ్డేపల్లి చర్చి సమీపంలోని బావిలో దూకి నవీన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నుంచి రుణం తీసుకున్న నవీన్ను అధిక వడ్డీ, నిరంతర బెదిరింపులు, అవమానకర సందేశాలతో రికవరీ ఏజెంట్లు వేధించారు. ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
BHNG: భువనగిరి- నల్గొండ బైపాస్ రోడ్డు బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దూకిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి భువనగిరి పట్టణం బహార్ పేటకు చెందిన బానుక సంతోష్గా గుర్తించారు. మృతునికి భార్య ఒక బాబు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
MBNR: కల్వకుర్తి నుంచి జడ్చర్ల వైపు వస్తున్న ఓ కారు గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోళ్ల దాణా కంపెనీ వద్ద బైక్ అకస్మాత్తుగా అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
MDK: ఏసీబీ అధికారులకు ఎస్సై పట్టుబడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో హార్వెస్టర్పై నమోదైన ఓ కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.20,000 డిమాండ్ చేశాడు. ఇవాళ బాధితుని వద్ద నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుజరాత్ అర్వల్లి జిల్లా మెడసాలో అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వైద్యులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు శిశువు, తండ్రి జిగ్నేష్, వైద్యుడు శాంతిలాల్ రెంటియా, నర్సు మనత్ ఉన్నారు. ఈ ఘటనలో వారంతా సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ సహా మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడి గాయాలతో చికిత్స పొందుతున్నారు.
BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. మార్కెట్ ప్రాంతంలో 15 మందిపై దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించి యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అధికారులు స్పందించి వెంటనే కుక్కల దాడుల నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 11 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. ఇందులో బెంగళూరులో 5 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల, గురుగ్రామ్లో 2 చోట్ల సోదాలు చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా కంపెనీ ప్రమోటర్లు మనీలాండరింగ్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పటియాలా హౌస్, సాకేత్ కోర్టులు బెదిరింపుల జాబితాలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్స్తో కలిసి కోర్టు భవనాలను ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పటియాలా హౌస్, సాకేత్ కోర్టులు బెదిరింపుల జాబితాలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్స్తో కలిసి కోర్టు భవనాలను ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీ పేలుడు ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి తరహాలో భారత్లో భారీ అటాక్కు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు NIA దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు డ్రోన్లను ఆయుధాలుగా, రాకెట్లను తయారు చేసేందుకు ప్రయత్నించారని అరెస్టయిన అనుమానితుడు డానిష్ చెప్పాడు. భారీ విధ్వంసం కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదించాయి.
NRPT: నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా వద్ద సోమవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా వల్లాంపల్లి నుంచి జాజాపూర్కు ఇసుకను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్ రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
SRD: కరెంట్ షాక్ తగిలి మేకపోతు మృతి చెందిన సంఘటన ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగరీ సాయిలు రోజువారీగా మేకలు మేపుకుంటూ సాయంత్రం వేళ ఇంటికి వెళుతున్నాడు. మార్గమధ్యలో ఓ రైతు పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలకు తగిలి మేక పొట్టేలు మృతి చెందిందని దీని విలువ రూ. 30 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
WNP: వరి కోత మిషన్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెద్దమందడి మండలంలో చోటు చేసుకున్నది. స్థానికుల వివరాలు.. అంకూరు గ్రామానికి చెందిన రాకాసి శ్రీనివాస్ రెడ్డి (45) జంగమయ్య పల్లి గ్రామ సమీపంలోని పొలంలో పంటను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్లో పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.