NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో గొర్రెల కాపరి జయవర్ధన్ అనే యువకుడు గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు జయవర్ధన్ అనే యువకుడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. కుందూ నది దాటే క్రమంలో నదిలో పడి మృత్యువాత పడ్డాడు. రేవనూరు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసుకున్నారు.
SRPT: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడిగుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గొర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.
నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో ఈ నెల 9న పామూరు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ వాసు అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశారు. ఈ కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ వాసు హత్య కేసులో 9మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్కు తరలించారు.
బుచ్చి మండలం నాయగుంట గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన రఫీ ఈ ఘటనలో మృతి చెందారు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన కొందరు కత్తులతో, కర్రలతో దాడి చేశారని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఈ శవాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి అనేక ఆధారాలను పరిశీలించి, ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: కాకినాడ YSR బ్రిడ్జిపై సోమవారం ఉదయం ప్రయాణిస్తున్న బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనంపై ప్రయాణిస్తున్న వారు బండిని అక్కడే వదిలేశారు. వాహనం మొత్తం పూర్తిగా మంటలో కాలిపోయింది. దీంతో బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: పెయింటింగ్ పనులు చేస్తున్న పెయింటర్కు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఏలూరు 1వ పట్టణ పరిధిలో సుబ్రహ్మణ్యం కాలనీలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు పోతునూరుకు చెందిన లింగాల పరశురాం(31)గా గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి ముత్తయ్య ఇంట్లో పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చివ్వెంల మండలం గుంజలూరు వద్ద చోటు చేసుకుంది. స్కూటీపై రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి దాసాయిగూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ADB: జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించిన కీర్తి హత్య అతి కిరాతకంగా హత్య చేసిన భర్త మారుతి కూడా స్థానిక వాగు పక్కన గల కాల్వలో శవమై తేలాడు. కీర్తిని హత్య చేసి పరారైన మారుతి అదే రోజు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కీర్తి మారుతి మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
WGL: వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.
TPT: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన సూత్రధారి మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ ఫామ్ హౌస్లో దాక్కున్న ఆయనను తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ పూర్తి చేసిన అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం రుయాకు తరలించారు. అనంతరం చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నారు.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో రాడపాక కొమురమ్మకు అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి, 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
JGL: జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పోచమ్మ వాడకు చెందిన ప్రసన్న లక్ష్మి అనే వివాహిత అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రసన్న లక్ష్మికి 2023లో గాంధారి తిరుపతి అనే వ్యక్తితో పెళ్లైంది. ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భర్త, అత్త మామల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
VZM: బొబ్బిలి సమీపంలో గురువారం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టాటా మ్యాజిక్, బైక్ను ఢీకొని ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దంపతులు ఇద్దరు బొబ్బిలి నుండి సీతానగరం కోవెలకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద బాధితులు బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తన్న ఆర్ఐ సురేష్ సోదరుడని గుర్తించారు.
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రుల నుండి ఎదురైన మందలింపులకు మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఈ ఘటన స్థానికంగా కన్నీరు మున్నేరు అయింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.