SRPT: రోడ్డు ప్రమాదంలో శనివారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందింది. సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7 ఆర్ హోటల్లో పని చేస్తున్న విజిత విధులకు వెళ్తూ హోటల్ దగ్గర రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందింది.
NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్గా స్థానికులు గుర్తించారు.
AP: చిత్తూరులోని వెంకటగిరికోటలో 3.7 కిలోల బంగారం దోపిడీ జరిగింది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్నాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కారును అడ్డగించి కత్తులు చూపించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
HYD: రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం: వేర్వేరు కారణాలతో శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. పెద్ద దోర్నాల మండలంలోని గుంటవానిపల్లె సమీపంలో బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో ఢీకొనటంతో రైతు మృతి చెందాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం, గిద్దలూరులో వేరువేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
SRPT: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన యాతం సైదులుగా గుర్తించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్యం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
PDPL: ఉత్తరప్రదేశ్లోని జైతాపూర్కు చెందిన వరుణ్ కుమార్ సింగ్(30) అనే యువకుడు కూలీ పని చేసేందుకు హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రామగుండం రైల్వే స్టేషన్లో రైలు దిగే సమయంలో కాలుజారి పడిపోయాడు. వెంటనే రైలు కదలడంతో వరుణ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు స్థానిక టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్కు తలపై, కుడి భుజం ఎముకకు తీవ్ర గాయాలు, ముఖం చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చి చూస్తే వాహనం కనబడలేదు. దీంతో ద్విచక్ర వాహనం చోరికి గురైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం: జిల్లాలో నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. పొన్నలూరులోని ముత్తరాజుపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మార్కాపురంలో ఓ వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడు. ముండ్లమూరు మండలంలోని చంద్రగిరిలో ప్రమాదవశాత్తు కాలుజారటంతో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్దిపాడులో సీతారాంపురం గ్రామనికి చెందిన వృద్ధుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
KKD: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరిలో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
SDPT: జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కారు, 3 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.