TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి సమీపంలో పేషెంట్ను తీసుకెళ్తున్న అంబులెన్స్ను ఓ ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్తో పాటు పేషెంట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
TG: సూర్యపేట జిల్లా కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. 11 మంది ISI ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బబ్సర్ఖల్సా టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల దగ్గరి నుంచి నాలుగు పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలో సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
AP: పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మణికంఠ రాజు, ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకుండా యువతికి వేరే వ్యక్తితో వివాహం చేశారు. ఈనెల 7న కొండవీడు కోటకు వెళ్లిన వీరు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా నదిలో ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: జగిత్యాల జిల్లాలో విషాదం జరిగింది. రాయికల్ మండలం మైతాపూర్లో అక్షయ్(16) అనే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్షయ్.. ఇటీవల చదువుపై నిర్లక్ష్యం చూపుతున్నాడని పాఠశాల HM.. ‘ఇలా ఉంటే పదవ తరగతి ఫెయిల్ అవుతావ్’ అని మందలించాడట. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. గత నెల 26న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలాడు.
మధ్యప్రదేశ్లో మొబైల్ పాస్వర్డ్ గొడవ భార్య ప్రాణం తీసింది. ఫోన్ పాస్వర్డ్ అడిగిందనే కోపంతో దీపక్ మిశ్రా అనే వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ముగ్గురు పిల్లల కళ్ల ముందే జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.
AP: కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా.. యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాసులు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
TG: పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టి, ప్రియురాలి శరీరంలోకి బలవంతంగా HIV సోకిన రక్తాన్ని ఎక్కించాడు ఓ కిరాతకుడు. ఆ ద్రోహాన్ని, అనారోగ్యాన్ని తట్టుకోలేక పోచారం ఐటీ కారిడార్కు చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల జరిగిన ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు విడవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
AP: క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ యువకుడి నుంచి రూ.12.50 లక్షలు దోచుకున్నట్లు వెల్లడైంది. దీంతో సాయిగణేష్, అనిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
సత్యసాయి: హిందూపురానికి చెందిన ఫైనాన్స్ నిర్వాహకుడు మణికి చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. సరోజాబాయి, పవిత్ర నుంచి రూ. 5లక్షల రుణం తీసుకున్నాడు. ఆయన చెక్కు రూపంలో చెల్లించాడు. చెక్కు చెల్లకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయాధికారి రమణయ్య శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేశారు.
NLR: కలువాయి మండలం పెరంకొండకు చెందిన బి. వివేక్ (38) గురువారం సాయంత్రం తన బర్రెలు ఇంటికి రాకపోవడంతో ఎస్.వెంకటేశ్వర్లు 60తో కలిసి ముక్కు తిప్పు ప్రాంతంలో వెతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కండలేరు జలాశయం దాటడంలో వివేక్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పీ.మనోహర్ గురువారం హెచ్చరించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్పై డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపిన రామారావు, లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.11,500 చొప్పున జరిమాన విధించారు.
AP: ప.గో జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాష్పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.10 లక్షల నగదు, బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. శారీరకంగా, మానసికంగా వేధించాడని వీడియో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పోలీసులు అతడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
AP: తిరుమలలో VIP దర్శనం పేరుతో ఓ దుండగుడు మోసానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు సెంథిల్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. TTD లోగోతో నకిలీ ప్రకటనలు చేస్తూ.. ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసానికి తెర దించాడు. ఒక్కో టికెట్కు రూ.16,500 వరకు వసూలు చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి ల్యాప్టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.