• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

RR: మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రమికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 9, 2025 / 05:18 PM IST

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి

మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.

February 9, 2025 / 01:34 PM IST

ఊరకొండ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ప్రకాశం: పామూరు మండలంలోని ఊరకొండ వద్ద ఉన్న మట్టి కుప్పల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతను సుమారు 2, 3 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి 60 నుంచి 65 సంవత్సరాల వయసు ఉంటుంది. కనిగిరి గవర్నమెంట్ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు.

February 9, 2025 / 10:52 AM IST

ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వేలూరు ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. రామసముద్రంలోని కర్నాల వీధికి చెందిన వేణు (25) వారం రోజుల క్రితం తమిళనాడులోని వేలూరులో బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వేణును స్థానిక వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువతో పోరాడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 8, 2025 / 04:24 PM IST

భైంసాలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం

ADB: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..నిర్మల్ నుంచి వస్తున్న కారును భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద కారును లారీ ఢీకొంది, కారులో ఉన్న భైంసా పట్టణానికి చెందిన శంకర్‌కు గాయాలు కాగా భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

February 8, 2025 / 11:21 AM IST

జనపాడులో బస్సు బోల్తా

పల్నాడు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

February 8, 2025 / 11:19 AM IST

పాత కక్షల కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హాబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 7, 2025 / 07:35 PM IST

కూసుమంచి ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు

KMM: కూసుమంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వైద్యాధికారిపై ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పల్స్ పోలియో నిధులు పల్లెదావఖాన నిధుల అక్రమ వినియోగంపై విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

February 7, 2025 / 12:33 PM IST

మహాకుంభమేళాలో మరో భారీ ప్రమాదం

యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 7, 2025 / 11:22 AM IST

మినీలారీని ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

ప్రకాశం: మినీలారీని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పామూరు మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు తాటాకులతో వెళ్తున్న రిక్షాను ఓవర్‌ టేక్‌ చేయబోయాడు. తాటాకులు తగిలి బైక్‌ అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని మృతి చెందాడు. మృతుడి వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

February 7, 2025 / 06:50 AM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

BDK: బూర్గంపాడు మండలం గొమ్మూరు ఇసుక ర్యాంపు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రలతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 7, 2025 / 06:30 AM IST

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు. డ్రైనేజీ కెనాల్ దగ్గర మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఆచూకీ తెలిసినవారు చేబ్రోలు పోలీసులను సంప్రదించాలని కోరారు.

February 7, 2025 / 04:10 AM IST

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 5, 2025 / 06:49 PM IST

గోడ కూలి.. ముగ్గురు మృతి

TG: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సితార హోటల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకోగా.. ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. మృతులు బీహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

February 5, 2025 / 11:25 AM IST

అగ్ని ప్రమాదంలో 2000 చీరలు దగ్ధం

ATP: వజ్రకరూరు మండలం చాకిరేవు వద్ద బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చీరలు పూర్తిగా కాలిపోయాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 2 వేలకు పైగా చీరలు కాలిపోయాయని, రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

February 5, 2025 / 11:24 AM IST