• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

VZM: గంట్యాడ మండలం వసాది సమీపంలో గురువారం ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నీలావతి గ్రామానికి చెందిన అప్పయ్యమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

November 27, 2025 / 07:23 PM IST

ఈర్నపాడులో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో రైతు పొలంలో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడు అప్పుల బాధ తట్టుకోలేక పొలంలో ఉరి వేసుకొని మృతి చెందాడని పేర్కొన్నారు. భార్య బాల వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

November 27, 2025 / 07:05 PM IST

దారుణం.. యువతిని నరికి చంపిన యువకుడు

తమిళనాడులోని తంజావూర్‌లో దారుణం జరిగింది. అజిత్ కుమార్ అనే యువకుడు యువతిని నరికి చంపాడు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుంటుందని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

November 27, 2025 / 06:24 PM IST

చాపాడు కేసీ కాలువలో వృద్ధురాలి మృతదేహం లభ్యం

KDP: చాపాడు మండలం ఏటూరు రహదారిలో కేసీ కాలువలో మృతదేహం గురువారం లభ్యమైంది. మృతురాలు దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలిగా గుర్తించారు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లగా, మతిస్థిమితం లేక నీళ్లలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 27, 2025 / 03:06 PM IST

బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం

AP: శ్రీ సత్యసాయి జిల్లా గరికపల్లెలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. 2 రోజుల క్రితం మిస్ అయిన కొమ్మెర హర్షవర్ధన్(4)ను మేనమామ ప్రసాద్ దారుణంగా హత్య చేశాడు. ఎన్పీ కుంట మండలం జౌకల గ్రామ సమీపంలో హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అనుమానంతో ప్రశ్నించగా ప్రసాద్ నేరం అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 27, 2025 / 10:58 AM IST

లారీ, ట్యాంకర్ ఢీ.. డ్రైవర్ సజీవ దహనం

TG: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద NH-167పై ఘోర ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్ పూర్తిగా దగ్ధమవ్వగా.. లారీ డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అగ్నికీలలు ఎగిసిపడటంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

November 27, 2025 / 06:40 AM IST

ఢిల్లీ పేలుడు కేసు.. NIA కస్టడీకి సోయాబ్

ఢిల్లీ పేలుడు బ్లాస్ట్ కేసులో NIA కీలక ముందడుగు వేసింది. ఫరీదాబాద్‌లో 7వ నిందితుడు సోయాబ్‌ను అరెస్టు చేయగా.. పాటియాలా హౌస్ కోర్టు అతన్ని 10 రోజుల NIA కస్టడీకి పంపింది. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు అమీర్ రషీద్ అలీ కస్టడీని కూడా కోర్టు 7 రోజులు పొడిగించింది. పేలుడు వెనుక ఉన్న కుట్ర కోణాలపై NIA అధికారులు వీరిని విచారించనున్నారు.

November 26, 2025 / 09:25 PM IST

13కు చేరిన మృతుల సంఖ్య

హాంకాంగ్‌లోని భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 13కు చేరగా, 15 మంది గాయపడ్డారు. 31 అంతస్తుల ఎత్తున్న 8 టవర్లలో మంటలు వ్యాపించడంతో.. లోపల వందలాది మంది చిక్కుకున్నారు. దాదాపు 4,600 మంది నివసిస్తున్న ఈ సముదాయంలో మంటలను అదుపు చేసేందుకు 700 మంది ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

November 26, 2025 / 09:03 PM IST

ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సీటీఎం సమీపంలోని నాగలరాళ్ల వద్ద ఆటో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

November 26, 2025 / 07:40 PM IST

ఆటో బోల్తా .. ముగ్గురికి గాయాలు

అన్నమయ్య: కె. వి. పల్లి మండలం కుప్పం వారి పల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మారేళ్ల నుంచి పీలేరు వైపు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

November 26, 2025 / 07:19 PM IST

భారీ అగ్నిప్రమాదం.. బిక్కుబిక్కుమంటూ వందల మంది..!

హాంగ్‌కాంగ్‌లోని తైపో జిల్లాలో ఓ హైరైజ్ నివాస సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్‌లో సుమారు 2000 మంది నివసిస్తుండగా.. వందల మంది మంటల్లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మంటల ధాటికి లోపల ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.

November 26, 2025 / 04:46 PM IST

రూ.20 లక్షల సిగరెట్లు సీజ్

AP: నెల్లూరు వెంకటరమణాపురంలో పోలీసులు భారీగా సిగరెట్లను పట్టుకున్నారు. గోదాములో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువ చేసే బిల్లులు లేని సిగరెట్లను సీజ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

November 26, 2025 / 04:38 PM IST

పరిశ్రమలో సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

AP: చిత్తూరు జిల్లాలోని టైల్స్ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో జరిగింది. ఇందులో పోతురాజు, పాండు అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

November 26, 2025 / 04:07 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. సీనియర్ IAS మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీనియర్ IAS మృతిచెందాడు. గౌనహల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో KSMCL MD, సీనియర్ IAS అధికారి మహంతేశ్ బిళగి మరణించారు. ఓ వేడుకకు కారులో వెళ్తుండగా.. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై CM సిద్ధరామయ్య, Dy. CM డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

November 25, 2025 / 11:25 PM IST

డ్రైనేజీలో మృతదేహం లభ్యం

KMM: ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

November 25, 2025 / 04:41 PM IST