కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన గూల విట్టల్ కుమారుడు గుల గోవర్ధన్(28) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన యువకుడు చెన్నైలో ఉద్యోగం చేసి అనంతరం అమెరికా వెళ్లి ఉన్నత చదువులకై వెళ్లి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు బానిసై అప్పులు చేసిన కుమారుడు తండ్రిపై దాడికి దిగాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడ్డ తండ్రి కుమారుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అన్నమయ్య: మదనపల్లెలో టీడీపీ యువ నాయకుడిపై అల్లరి మూకలు దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం సాయంత్రం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక సైదాపేటకు చెందిన జబిఉల్లా ఖాన్ సీటీఎం రోడ్డులో వస్తుండగా.. గొడవ జరగడం చూసి సర్ది చెప్పేందుకు వెళ్లాడు. మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటూ అల్లరి మూకలలో మల్లి అతని కొడుకు పండు తదితరులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలిపాడు.
SDPT: వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగదేవపూర్ (M) చాట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ వివరాలు.. జనగామ మండలం వెంకిర్యాలకి చెందిన శిరీష(21)కి చాట్లపల్లికి చెందిన వంశీధర్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వంశీధర్ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో మంగళవారం మనస్తాపానికి గురైన శిరీష సూసైడ్ చేసుకుంది.
KDP: చాపాడు మండలం వీ రాజుపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు భూ తగాదాలు కారణమని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుతున్నట్లు చాపాడు పోలీసులు తెలిపారు.
BNG: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బీబీనగర్ సంజీవయ్య కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో గుడేకల్ తహేరా బీ అనే మహిళపై దున్నపోతు మంగళవారం దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయల కోసం వెళుతున్న తహేరా బీ పై ఒక్కసారిగా దున్నపోతు కొమ్ములతో కుమ్మేయడంతో రెండు కాళ్లకు, చేయికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గ్రామంలో దున్నపోతు హల్ చల్ చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) అనే యువ గొర్లకాపారి మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. లక్ష్మణ్ తలపైన పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
NLR: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలంలోని మోచర్ల వద్ద జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై లారీ వేగంగా దూసుకెళ్లింది. వెంకమ్మ(50), మమత(26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు రమణమ్మ, వైష్ణవిలు తీవ్రంగా గాయపడ్డారు. పోలేరమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా దర్యాప్తు ప్రారంభించారు.
NRML: బాసర గోదావరిలో స్నానానికి వచ్చి ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మహారాష్ట్ర పర్భని జిల్లా టాక్లికి చెందిన బాలాసాహెబ్(11), నిజామాబాద్ జిల్లా కమలాపూర్కి చెందిన మల్ల రాజు (40)అమ్మవారి దర్శనానికి వచ్చి స్నాన ఘట్టం వద్ద ప్రమాదవశాత్తు నదిలో మునిగి మరణించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
కృష్ణా: తాడిగడప సెంటర్ వద్ద సోమవారం విషాదకర ఘటన జరిగింది. ట్రాక్టర్పై వెళ్తున్న పెద్ద ఒగిరాల గ్రామానికి చెందిన ఘంటసాల రాధారాణి (38) ప్రమాదవశాత్తు జారి పడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో రైలు కిందపడి శ్రీనివాసులు అనే యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.
UPలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. సునీల్(45) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలోని చెట్టు కింద నిద్రిస్తున్నాడు. పారిశుద్ధ్య సిబ్బంది అతన్ని గుర్తించకుండా ట్రాక్టర్ మట్టి లోడ్ తీసుకొచ్చి అతనిపై పోసేశారు. దీంతో ఊపిరాడక సునీల్ మృతి చెందాడు. అనంతరం, కుమారుడు తన తండ్రి మృతదేహాన్ని గుర్తించి స్థానికుల సాయంతో వెలికితీశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMR:సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్వంచకు చెందిన చిన్న సిద్ధయ్య (57) నిన్న రాత్రి సైకిల్పై వెళ్తుండగా KMR వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సిద్ధయ్యకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అనిల్ తెలిపారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామాలో ఐదు జీవాలు గురువారం విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. మండల కేంద్రంలోని రాములు గొర్రెలు వర్షానికి డివైడర్ పైకి ఎక్కగా, మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలకు అమర్చిన ఏర్త్వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో రెండు గొర్రెలు, మూడు మేకలు గ్రామ శివారులో కరెంట్ షాక్తో మృత్యువాత పడ్డాయన్నారు.