• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

తల్లిదండ్రులు మందలించారని యువకుడి సూసైడ్

కోనసీమ: మద్యం అలవాటు మానుకోమని తల్లిదండ్రులు మందలించడంతో ఉప్పలగుప్తం(M) వాడపర్రుకు చెందిన సురేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 7న యువకుడు విషం తాగగా కుటుంబీకులు అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.

June 11, 2025 / 10:11 AM IST

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

SRPT: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలైన ఘటన సూర్యాపేట మండల తాళ్ళఖమ్మంపహాడ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సైదులు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారీ పడి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

June 11, 2025 / 05:11 AM IST

వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

కోనసీమ: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మండపేటలో వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన మోర్త సూరిబాబు మంగళవారం బురుగుంటచెరువు దగ్గర వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకాడు. స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై టౌన్ ఎస్సై జి.చంటి కేసు నమోదు చేశారు.

June 11, 2025 / 04:49 AM IST

డబుల్ మర్డర్‌ను ఛేదించిన పోలీసులు

HYD: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్య పేస్ -2 లో జరిగిన డబుల్ మర్డర్ను పోలీసులు ఛేదించారు. ఈరోజు రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.. హత్యకు గురైన దంపతులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా బేగంల వద్ద గతంలో మహమ్మద్ షకీల్ సల్మాన్ (33) డ్రైవర్‌గా పని చేశాడు. అతనిని తీసివేయడంతో హత్య చేసినట్లు తెలిపారు.

June 10, 2025 / 05:00 PM IST

గోదావరిలో పడి వ్యక్తి మృతి

కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన మోటుపల్లి స్వామినాయుడు(36) సోమవారం బహిర్భూమికి వెళ్లి గోదావరిలో పడి మృతి చెందాడు. హైదరాబాద్‌లో టైలరింగ్ చేస్తూ జీవనోపాధి పొందే స్వామినాయుడు శనివారం స్వగ్రామం వచ్చాడని స్థానికులు తెలిపారు. వేసవి సెలవులకు స్వగ్రామం వచ్చిన అతనికి ప్రమాదం జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

June 10, 2025 / 04:53 AM IST

లైంగికదాడికి యత్నం.. నిందితుడి అరెస్ట్

HYD: మహారాష్ట్రకు చెందిన యువతి(22) రాత్రి సమయంలో జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా నిల్చొని ఉండగా మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఆశ్రయమిస్తానని నమ్మించాడు. కమలాపురికాలనీలోని గదికి తీసుకెళ్లి భోజనం పెట్టి ఆకలితీర్చాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించగా యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు.

June 9, 2025 / 01:18 PM IST

నీటి సంపులో పడి కవలలు మృతి

KDP: చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. కవల పిల్లలైన రామ్, లక్ష్మణ్ నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీరు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందినవారు. చిన్నప్పుడే వీరి తండ్రి చనిపోవడం, తల్లి మరొకరితో వెళ్లిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

June 9, 2025 / 08:18 AM IST

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KKD: పిఠాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దుర్గాడకు చెందిన మమత కాకినాడ వెళ్తుండగా.. రాపర్తి రోడ్డు వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చెల్లి కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

June 9, 2025 / 07:50 AM IST

పిఠాపురంలో జనసేన నేతపై దాడి

KKD: పిఠాపురంలో బొజ్జ రాంప్రసాద్, బొజ్జ వీరబాబు అనే వ్యక్తులు ఆదివారం తనపై దాడి చేశారని జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ రాంబాబు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటిక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో తాను పాపిడి దొడ్డి చెరువు వద్దకు వెళ్లగా.. తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

June 9, 2025 / 07:34 AM IST

BREAKING: విద్యార్థిని దారుణ హత్య

AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మణిపాల్ స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. వారం ముందు విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కాగా వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

June 8, 2025 / 05:23 PM IST

విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి

సత్యసాయి: హిందూపురం రూరల్‌ మండలం మిట్టమీదపల్లిలో రైతు సురేశ్‌‌కు చెందిన పాడి ఆవు ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. రైతు సురేశ్‌ వివరాల మేరకు.. ఆదివారం పాడి ఆవును మేపడం కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ విద్యుత్‌ వైర్ తగిలి ఆవు మృతి చెందిందినట్లు తెలిపారు. తనకు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

June 8, 2025 / 05:10 PM IST

విద్యుత్ స్తంభానికి ఢీకొని ఒకరు మృతి

SKLM: గార మండలం కోళ్లపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం శ్రీకాకుళానికి చెందిన ఆనందరావు అతని స్నేహితుడు గణపతి రావు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ కోళ్లపేట వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందగా, గణపతి రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

June 8, 2025 / 05:01 PM IST

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మృతి

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నకిరేకంటి సైదులు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తిప్పర్తి మండలం తానేదారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన సైదులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చకిలం అనిల్ కుమార్ ప్రధాన శిష్యుడిగా స్వరాష్ట్ర సాధన కోసం శ్రమించారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నారు.

June 8, 2025 / 03:02 PM IST

ప్రాణం తీసిన సెల్ ఫోన్

TG: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం జరిగింది. సాయి అనే వ్యక్తి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని చూస్తుండగానే సాయి సజీవ దహనం అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు.

June 7, 2025 / 05:18 PM IST

కారు, లారీ ఢీ… ఒకరికి గాయాలు

ATP: గుత్తి ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శనివారం కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

June 7, 2025 / 02:09 PM IST