కడప: వీరపునాయనపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాల వీరయ్య మృతి చెందాడు. ముకుంద ట్రావెల్స్కు చెందిన బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108లో సమీప ఆసుపత్రికి తరలించారు.
కడప: వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.
BDK: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన మణుగూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. సమితి సింగారం రామాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణం చేస్తున్న పున్నం ప్రణీత్, పున్నం పవన్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: అత్తిలి మండలం మంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈఘటనలో శరీరం నుంచి తల వేరైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేపట్టారు. సుమారు 35 సంవత్సరాల వయసు కలిగిన ఈ వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
KDP: కమలాపురం మండల పరిధిలోని గొల్లపల్లి సమీపాన శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలకు, ఒక పురుషునికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారు పందిర్ల పల్లె గ్రామ వాసులుగా గుర్తించారు.
W.G: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
GNTR: ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్డేన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.
SKLM: కోటబొమ్మాళి మండలం నరసింగుపల్లి గ్రామం సమీపంలో గురువారం జూద శిబిరంపై గురువారం పోలీసులు దాడిచేశారు. కోటబొమ్మాళి ఎస్ఐ వీ. సత్యనారాయణ వివరాల మేరకు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో మేరకు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారని తెలిపారు. రూ.2.21లక్షల నగదను స్వాదీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి ఓబుల నాయుడుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వస్తున్న ఇరువురు యువకులు డివైడర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఓ యువకుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి సర్వీస్ రోడ్డు కిందకు పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో యువకుడికి చేతికి గాయం అయ్యింది.
HYD: బాలానగర్ పీఎస్ పరిధి గాంధీనగర్ చెత్తకుండీలో గురువారం పేలుడు సంభవించింది. దీంతో చెత్త క్లీన్ చేస్తున్న మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై క్లూస్ సేకరిస్తున్నారు.
KKD: ప్రేమ పేరుతో బాలికను మోసగించి వ్యభిచారంలోకి దింపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు ఇన్ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలు భరించలేని బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది’. అని తెలిపారు.
మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు(బుధవారం) ఇద్దరు ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వివేకానందనగర్లో కృష్ణ చైతన్య రెడ్డి(34), మహంకాళినగర్ శంషీగూడలో నవీన్(18) అనే ఇద్దరు మృతి చెందారు. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
BHPL: జాతీయ రహదారి 353(సీ)పై మహాదేవపూర్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కాటారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు, అతడి బంధువైన మరో వ్యక్తితో కలిసి సూరారం వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి మైలురాయికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని మీర్పేట్ హత్య కేసులో నిందితుడిని రిమాండ్కు తరలించారు. నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.
NZB: జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.