TG: నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. పట్టాలపై ఉన్న గేదెను రైలు బలంగా ఢీకొనడంతో, ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. సిబ్బంది ప్రస్తుతం మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంతో నల్గొండ – మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
TG: హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ బహదూర్పల్లిలోని డెకరేషన్ సామగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. కాలనీలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
TG: హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ సాల్వెంట్స్ గోదాంలో మంటలు చెలరేగడంతో, లోపల ఉన్న డ్రమ్ములు రహదారిపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
E.G: ధవళేశ్వరం హత్య కేసులో మైనర్ నిందితుడికి రాజమండ్రి జువెనైల్ బోర్డు 28 నెలల కమ్యూనిటీ సర్వీస్తో పాటు రూ.1500 జరిమానా విధించింది. అక్బర్ ఖాన్పై కత్తితో దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడి వయస్సును పరిగణనలోకి తీసుకొని బోర్డు ఈ తీర్పు ఇచ్చింది. ఘటన సమయంలో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే వందకు పైగా ఎయిర్ స్ట్రయిక్స్ జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 254 మంది మరణించగా, వందలాది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 1982 తర్వాత లెబనాన్పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు.
AP: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లోని నల్లమల అడవిలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. రాత్రి మోకాళ్ళ తిప్ప, దయ్యాలతిప్ప ప్రాంతాల్లో మంటలు దిగువ నుండి ఎగువకు పాకాయి. వీటిని అదుపు చేయడం అటవీశాఖకు సాధ్యపడకపోవడంతో వన్యప్రాణులు ప్రాణభయంతో వణికిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పి అడవిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
AP: తూ.గో జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం సంభవించగా.. భారీగా మంటలు వ్యాపించి ఔషధాల విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచర్, ఇతర పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
AP: ప.గో. జిల్లా ఆచంట మండల పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దుకాణానికి వచ్చిన ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. సదరు వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VSP: జీవీఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోపాలకృష్ణ, వీర్రాజు కలిసి డాబా గార్డెన్ ప్రాంతానికి చెందిన శివకుమారు వద్ద ఉద్యోగం పేరుతో రూ.5 లక్షలు తీసుకొని మోసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఇద్దరికీ రెండేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చరు.
TG: సికింద్రాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడు కేరళంకు చెందిన నసీముద్దీన్గా గుర్తించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి 2025 నుంచి పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: హైదరాబాద్ హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బైకును, నడిచి వెళ్తున్న మరో యువకుడిని కారు ఢీకొట్టడంతో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ ECE విద్యార్థులు శివ, సందీప్ మృతిచెందారు. కారు ఢీకొని రోడ్డుపై నడిచి వెళ్తున్న మరో యువకుడు కూడా మృతిచెందాడు. కారు డ్రైవర్ తీరుపై కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: గాజువాకలో యువతి మౌనికని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిన కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. నిందితుడు రవీంద్రని గాజువాక పోలీసులు 3 రోజులు కష్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు బయటపడ్డాయి. మౌనికను తన స్నేహితుడి ఇంట్లోనే చంపి ట్రాలీ సూట్ కేసులో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ముక్కలు చేసినట్లు వెల్లడించాడని సమాచారం .
VSP: విశాఖ రైల్వే స్టేషన్లో నార్కోటిక్ డాగ్ ‘లైకా’ సహాయంతో 30 కేజీల గంజాయి పట్టుబడింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో సూట్కేస్లో గంజాయి తీసుకెళ్తున్న వ్యక్తిని లైకా వాసన చూసి గుర్తించింది. పోలీసులను చూసి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.
Vsp: గాజువాకలో ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితుడికి మూడు రోజుల కస్టడీ మంజూరైంది. ఈ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికితీయనున్నారు.
PPM: సంకాడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న కడుగుల వాసి ధనుష్ అకస్మాత్తుగా అడ్డువచ్చిన ఆవులను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యింది. స్థానికులు గమణించి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబుల్స్లోనే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.