TG: మహబూబాబాద్ జిల్లా గంగారంలో అడవి పంది దాడి కలకలం రేపింది. అందులగూడెం గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా.. పంది దాడి చేసి గాయపరిచింది. అతడు కేకలు వేయడంతో సమీప రైతులు వచ్చి పందిని తరిమేశారు. గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో రైతులు, స్థానికులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు.
AP: NTR జిల్లా జూపూడిలోని ఓ ఇంట్లో ఇవాళ రాత్రి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం కాగా, ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: అమీన్పూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి (31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్ (7), సాత్విక్ (6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KMM: ఏన్కూరులోని సాగర్ కాలువలో పడి ఓ మహిళ మృతి చెందిందని ఎస్ఐ రఫీ తెలిపారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన దుగ్గిరాల శిరీష(24) బట్టలు ఉతకడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లగా, ప్రమాదపుషాత్తు కాలువలో పడి గల్లంతైంది. భర్త నాగరాజు కాలువ వద్దకు వెళ్లి చూడగా కనిపించకపోవడంతో స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం శిరీష మృతదేహం లభ్యమైంది.
ATP: గుత్తి ఆర్ఎస్కు చెందిన యువతి 2 రోజుల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై గౌతమ్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, మహాలక్ష్మి నిఘా ఏర్పాటు చేసి విజయవాడలో ఉన్న ఆ యువతిని గుర్తించారు. బుధవారం పోలీసులు యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.
AKP: బుచ్చయ్యపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేపీ అగ్రహారానికి చెందిన జొన్నపల్లి ఈశ్వర రావు బుచ్చయ్యపేట మెయిన్ రోడ్డులో నడిచి వెళుతుండగా బస్సు ఢీ కొట్టింది. బస్సు వెనక చక్రాల కింద పడడంతో ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
SKLM: చర్లపల్లి డివిజన్ చిన్న చర్లపల్లికి చెందిన శంకర్ రావు అప్పుల భారంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం స్థానికులు వివరించారు. గత కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం చర్లపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ELR: ఏలూరు కర్రవంతెన కృష్ణా కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడా? లేక ఎక్కడి నుంచి అయినా కొట్టుకు వచ్చిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: కన్న తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన కరప(M) ఉప్పలంక మొండిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డబ్బుల విషయంలో తండ్రి కే.సూర్యచంద్రకు కుమారుడు చంద్రశేఖర్కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్ తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ స్కామ్పై ఇవాళ లోకాయుక్త విచారణ జరపనుంది. ఈ మేరకు ఐదుగురు అధికారులకు లోకాయుక్త నోటీసులు అందజేసింది. అన్ని రకాల రిపోర్టులతో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశాలిచ్చింది. డీఎస్సీ-2014 ఎస్జీటీ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగింది. ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
కోనసీమ: రామచంద్రపురం మండలం చినతాళ్లపొలం శివారులో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ద్రాక్షారామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఎం. లక్ష్మణ్ తన సిబ్బందితో దాడి చేసి రూ. 14,830 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని బుధవారం కోర్టులో హాజరు పరచనున్నట్టు ఎస్సై తెలిపారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పాకిస్థాన్లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా రాజకీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనాస్థలంలోనే పలువురు ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద భూక్యా పెంటనాయక్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ వాసి అయిన పెంటనాయక్, చర్లపల్లిలోని తన సోదరి వద్ద ఉంటూ ఐటీ కారిడార్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
KKD: ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారి-16పై మంగళవారం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సును తమిళనాడుకు చెందిన ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని దాకారాయి గ్రామానికి చెందిన కుంజం నూకాలమ్మ స్వల్పంగా గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫ్గనిస్థాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఆఫ్గనిస్థాన్లో వరుస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కాగా, ఆ దేశంలో ఇటీవల సంభవించిన భూకంపం వాళ్ళ 1400 మందికిపైగా మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.