ELR: మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసే షెడ్ అగ్ని ప్రమాదానికి గురి అయ్యింది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి ఆర్ఎస్లోని బాయ్స్ స్కూల్ సమీపంలో గోపి అనే భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 30 తులాల వెండి పట్టీలు, ఒక తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
GNTR: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన దారుణ ఘటన వేమూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఆంజనేయులు మండలంలోని జంపని గ్రామంలో ఈనెల 23వ తేదీన బంధువుల పెద్ద కర్మకు వచ్చాడు. అక్కడ అదే రోజు అర్ధరాత్రి కూతురు వరుసయ్యే మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ కథనం ప్రకారం ఆ గ్రామానికి చెందిన జి. పోచమ్మల్లు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామానులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ధాన్యం బస్తాలు కాలిపోయి రూ.మూడు లక్షల వరకు నష్టం వచ్చి ఉంటుందన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మనంతవాడి ప్రాంతంలోని డివిజన్ 1, 2, 36 ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు అమలులో కర్ఫ్యూ ఉండనున్నట్లు వెల్లడించారు.
E.G: బొమ్మూరుకు చెందిన పెనుమళ్ళ రమ్య స్మృతి(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చికిత్స కోసం వచ్చింది. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. పరిస్థితి విషమించడంతో KKD జీజీహెచ్లో చేర్చగా ఆదివారం మృతి చెందింది.
CTR: చిత్తూరులో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. చవటపల్లిలోని దుర్గమ్మ గుడి దేవస్థానం వద్ద ఆదివారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురికీ తరలించామన్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
KMM: ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని గోనబావి క్రాస్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఈ రోజు బోల్తా పడింది. ఈ ఘటనలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్న 6 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పెద్ద ప్రమాదం తప్పిందని పాఠశాల హెచ్ఎం తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పల్నాడు: గురజాల పట్టణంలోని కారంపూడి రోడ్లో యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ నీటిబావిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. 19వ మలుపు వద్ద స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వాసులు గాయపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి(25)ని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: HYD గుడిమల్కాపూర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో ఫిల్లర్ నం.111 వద్ద కార్ డెంటింగ్ కారాగారంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న సైన్ బోర్డు, వెల్డింగ్ కారాగారానికి వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లు రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
MNCL: జైపూర్లోని పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గూడూరు అజయ్ను గురువారం కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. విధుల్లో భాగంగా భోజన సమయంలో తన బైక్పై బయటకు వస్తున్న క్రమంలో ఎస్ ఈ ప్రసాద్ అనే సింగరేణి అధికారి కారు అజయ్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అజయ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.