• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

లైబ్రరీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పితంపురాలోని గురుగోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లైబ్రరీలో మంటలు చెలరేగాయి.12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా వరకు లైబ్రరీలోని పుస్తకాలు, సామాగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. 

May 15, 2025 / 11:17 AM IST

భీమవరంలో వ్యభిచారం గుట్టు రట్టు

ELR: భీమవరం వన్ టౌన్‌ పరిధిలోని పలు లాడ్జిల్లో సీఐ నాగరాజు మంగళవారం రాత్రి సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొత్త బస్టాండ్ వద్ద ఎన్‌ఆర్‌కే లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా అనుచిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సూచించారు.

May 15, 2025 / 10:51 AM IST

కరెంట్ షాక్‌తో యువతి మృతి

KMM: కరెంట్ షాక్‌తో యువతి మృతిచెందిన ఘటన అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అబ్బుగూడెంకి చెందిన మామిడి రెమెల్య మర్రిగూడెంలో కూలీకి వెళ్లింది. ఈక్రమంలో ధాన్యం తూర్పార పోసే మిషన్ ద్వారా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె చెల్లికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.

May 15, 2025 / 10:12 AM IST

అనుమానంతో భార్యను చంపిన భర్త

HYD: భార్యను భర్త హత్య చేసిన ఘటన బాలాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం.. దంపతులు నజియాబేగం, జకీర్ న్యూ గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. గతంలో వీరు గోల్కొండ ప్రాంతంలో ఉండేవారు. కొద్ది రోజులుగా జకీర్‌కు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విచక్షణా రహితంగా ఆమెను కొట్టి చంపాడు. ఉదయం అత్త రుబీనాకు చెప్పి పారిపోయాడు.

May 14, 2025 / 05:23 PM IST

దోమకొండ మండలంలో మృతదేహం లభ్యం

KMR: దోమకొండ మండలం లింగుపల్లి శివారులో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సై స్రవంతి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బెస్త సురేశ్(45)గా గుర్తించారు. సురేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

May 14, 2025 / 04:25 PM IST

పిల్లర్ గుంతలో పడి ఇద్దరి మృతి

HYD: ఉప్పల్ భగాయత్‌లో విషాదం నెలకొంది. పిల్లర్ గుంతలోని నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుల సంఘాల భవన నిర్మాణం కోసం ఈ గుంతలు తీశారు. నిన్న అదృశ్యమైన మణికంఠ, అర్జున్ ఇదే గుంతలో విగతజీవులుగా కనిపించారు. డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మృతదేహాలను బయటకు తీశారు. వీరు సుజాత, వెంకటేశ్ దంపతులకు చెందిన పిలల్లుగా అని తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

May 14, 2025 / 01:36 PM IST

కంట్లో కారం కొట్టి మరి దొంగతనం

మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చేతికి ఉన్న బంగారు గాజులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

May 14, 2025 / 11:03 AM IST

గాలివానకు విరిగిన నూతన విద్యుత్ స్తంభాలు

SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట, రావికంటిపేట మార్గంలో గత రెండు రోజుల క్రితం వేసిన నూతన విద్యుత్ స్తంభాలు సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విరిగి నేల పడ్డాయని పలువురు స్థానికులు మంగళవారం తెలిపారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు పాత స్తంభాలు పడిపోగా.. వాటి స్థానంలో రెండు రోజుల క్రితమే కొత్త స్తంభాలు వేశారని తెలిపారు.

May 13, 2025 / 11:00 AM IST

గుండె పోటుతో అడ్డాకూలీ మృతి

BHNG: చిట్యాల పట్టణంలో గుండె పోటుతో దినసరి కూలి మంగళవారం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన పల్లపు కోటేశ్వరరావు ఉపాధి కోసం తన కొడుకుని వెంటబెట్టుకుని చిట్యాలకు వచ్చాడు. గుండె పోటు రావడంతో పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

May 13, 2025 / 07:45 AM IST

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

MBNR: జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి  ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినా సరఫరా జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు, మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

May 12, 2025 / 07:16 AM IST

శ్రీలంక రోడ్డు ప్రమాదంలో 22కు చేరిన మృతులు

శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది.  ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

May 11, 2025 / 08:19 PM IST

బైక్లు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ELR: వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాతిమాపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన బైక్ ను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని పట్టుకుని విచారించగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 35 కేసులు వరకు నమోదైనట్లు సీఐ తెలిపారు.

May 11, 2025 / 10:10 AM IST

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

KMM: పాల్వంచ మండలానికి చెందిన ఓ యువతి (19) వరంగల్లో డిగ్రీ చదువుతోంది. సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మన స్తాపానికి గురైంది. శనివారం ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే కుటుంబీకులు పాల్వంచ సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స చేశారు.

May 11, 2025 / 08:12 AM IST

రొంపిచర్లలో వరిగడ్డి వామి దగ్ధం

PLD: రొంపిచర్ల మండలంలోని నల్లగార్లపాడులో వరిగడ్డి వామి దగ్దమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఆంజనేయులకు చెందిన ఐదు ఎకరాల వరిగడ్డి విద్యుత్ తీగలు తాకి దగ్ధమైంది. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. నరసరావుపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

May 10, 2025 / 07:45 PM IST

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేశామన్నారు.

May 10, 2025 / 10:49 AM IST