ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
MNCL: జైపూర్లోని పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గూడూరు అజయ్ను గురువారం కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. విధుల్లో భాగంగా భోజన సమయంలో తన బైక్పై బయటకు వస్తున్న క్రమంలో ఎస్ ఈ ప్రసాద్ అనే సింగరేణి అధికారి కారు అజయ్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అజయ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TG: బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడి ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYDలో జరిగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్క.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న ఆందోళనలో జామై ఉస్మానియా రైల్వే ట్రాక్పై పడి ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. మిర్చి కోతకు ఆటోలో కూలీలు పనికి వెళ్తుండగా తిరువూరు నుంచి ఉమ్మడిదేవరపల్లి వెళుతున్న బస్సు ఢీ కొట్టింది. కూలీలలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన మిగిలిన కూలీలు 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మంచు ప్రభావంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రకాశం: కొండేపిలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ముండ్లమూరు మండలం శంకరాపురంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
కర్ణాటకలోని సింధనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా వాసులు మరణించారు. తుఫాను వాహనం బోల్తా పడి డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు రాత్రి మంత్రాలయం నుంచి హంపికి బయలుదేరారు. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉన్నారు. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: చల్లపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణరావునగర్ కాలనీకి చెందిన పెయింటర్ దేవనమైన వెంకట వరప్రసాద్(21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. గత రెండు వారాలుగా పనికి వెళ్ళటం లేదని తల్లి మందలించటంతో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కంసాన్పల్లికి చెందిన నారమ్మ(32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
E.G: గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు, రూ. 22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి లలిత విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. 2015లో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేయగా.. రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది.
KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: బాసర గోదావరి నదిలో సోమవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వయస్సు సుమారు 65 సంవత్సరాల ఉంటుందని, మృతుడు నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ వాసిగా గుర్తించారు.
శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి పూజారి కళావతి హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఘటన స్ధలాన్ని పరిశీలించి హత్యకు కారణాలపై ఆరా తీశారు. క్లూస్ టీమ్తో ఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో ( సోమవారం తెల్లవారుజామున) గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేశారు. తిరుపతిరావు ఆంధ్రపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KRNL: పాణ్యంలోని జాతీయ రహదారిపై సాయిబాబా నర్సరీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో దిగి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై ప్రయాణిస్తున్న వారికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొక్కిలి జంపాల రవి(48) ఆదివారం మృతి చెందాడు. మృతుడిని కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా రవికి తన సోదరులతో ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.