• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

భూకంపం.. 1,400కి చేరిన మృతులు

అఫ్గానిస్థాన్‌ను భూకంపం అతలాకుతలం చేసింది. భారీ భూకంపంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 1400కి చేరినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ వెల్లడించారు. మరో 3000 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయబృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

September 2, 2025 / 04:24 PM IST

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం

GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

September 2, 2025 / 02:40 PM IST

లండన్‌లో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి

TG: లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు హైదరాబాద్ వాసులు చనిపోయారు. మృతులను నాదర్‌గూల్‌కు చెందిన చైతన్య(22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. మరో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. గణేశ్ నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

September 2, 2025 / 09:57 AM IST

ఘోర విపత్తు.. 1000 మంది మృతి

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మర్రా పర్వతాల ప్రాంతంలోని ఓ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సూడాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ధ్రువీకరించింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

September 2, 2025 / 06:22 AM IST

బంగారు దుకాణం యజమాని దారుణ హత్య

AP: కర్నూలులో బంగారు దుకాణం యజమాని దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని రాధాకృష్ణ టాకీస్ వద్ద హిజార్ అనే యజమానిపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందతూ హిజార్ మృతిచెందారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, కర్నూలులో ఒకేరోజు 2 హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

September 1, 2025 / 08:55 PM IST

FLASH: గాంధీ ఆస్పత్రిలో దొంగ హాల్ చల్

HYD: గాంధీ ఆస్పత్రిలో సోమవారం బైక్ దొంగ హాల్‌చల్ చేశడు. యాదాద్రి జిల్లా ఆలేరు వాసి వినోద్ మధ్యాహ్నం గాంధీ మార్చురీ వద్ద పార్కింగ్ నుంచి హోండా బైకును భార్యతో కలిసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే MCH సమీపంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే పట్టుకున్నారు. విచారణలో గతంలో గాంధీ ఆస్పత్రి పరిధిలోనే రెండు బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.

September 1, 2025 / 06:07 PM IST

ఫ్లై ఓవర్ కింద బోల్తా పడిన ట్రాలీ ఆటో

RR: రాయదుర్గం ఫ్లైఓవర్ కింద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటో యూటర్న్ తీసుకుంటున్న కారుపై బోల్తా పడింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారికి ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆటోను స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 1, 2025 / 05:47 PM IST

మ్యాట్రిమోనిలో పరిచయం.. రూ.14.50 లక్షలు బురిడీ

NLR: కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఓ మ్యాట్రిమోని ప్రొఫైల్లో కీర్తి రెడ్డి అనే మహిళ పరిచయం అయ్యింది. దీంతో ఆమె క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపి నమ్మించి రూ.14.50 లక్షల నగదు పెట్టుబడి పెట్టించింది. ఆ వ్యక్తికి ఎటువంటి ఆదాయం రాకపోవడంతో నకిలీ పోర్టల్ అని తెలుసుకుని మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

September 1, 2025 / 05:28 PM IST

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

AKP: నాతవరం మండలం బెన్నవరం దగ్గర నర్సీపట్నం నుంచి వస్తున్న బైక్ తాండవ సెంటర్ నుంచి వస్తున్న బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 1, 2025 / 05:22 PM IST

సింహాచలం హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్శింగ్ ఉద్యోగి సురేష్‌ రూ. 500 కట్టను ఎవరికీ కనిపించకుండా దాచే ప్రయత్నం చేశారు. సీసీటీవీలో గమనించిన ఈవో త్రినాథరావు అధికారులను తనిఖీ చేయమని ఆదేశించారు. తనిఖీలలో 111 ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించారు. దీంతో వారిని ఈవో విధుల నుంచి సస్పెండ్ చేశారు.

September 1, 2025 / 05:20 PM IST

భూకంపం.. 800కి చేరిన మృతుల సంఖ్య

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 800 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 2,500మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయబృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

September 1, 2025 / 03:17 PM IST

విద్యుదాఘాతంతో బర్రె మృతి

KDP: కలసపాడు మండలం తంబళ్లపల్లెలో విద్యుదాఘాతంతో బర్రె మృతి చెందింది. పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ మరీ కిందకు ఉండడంతో అదే గ్రామానికి చెందిన రైతు నడిపి చించిరెడ్డి బర్రె మృతి చెందిందని అతను వాపోయారు. ఈ బర్రె సుమారు రూ. 50 వేలు విలువ చేస్తోందని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, ట్రాన్స్‌ఫార్మర్ కిందకు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

September 1, 2025 / 03:05 PM IST

అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట సమీపంలో ఇవాళ కడప నగరానికి చెందిన వ్యక్తులు కారులో రేణిగుంటకు వెళ్తుండగా.. ఆవు అడ్డం రావడంతో కారు అదుపు తప్పి ముళ్లపదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్ప గాయాలవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

September 1, 2025 / 02:55 PM IST

కారు-బైకు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైకు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది.

September 1, 2025 / 02:29 PM IST

పెందుర్తిలో ఆటో-బైక్ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

VSP: పెందుర్తి పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సరిపల్లికి చెందిన కండిపల్లి కన్నయ్య తన భార్య దేవి, కుమార్తె భారతి, కోడలు నాగమణితో కలిసి ఆటోలో అక్కిరెడ్డిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

September 1, 2025 / 09:19 AM IST