నైజీరియన్ దేశస్తుడి వద్ద నార్కొటిక్ బ్యూరో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నిందితుడి వద్ద రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. అలాగే అతని నుంచి 2 సెల్ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇమ్మాన్యుయేల్ అలియాస్ మ్యాక్స్వెల్గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విశాఖ బీచ్ రోడ్డులోని శాంతి ఆశ్రమ స్థల వివాదంలో శనివారం రౌడీషీటర్లు దౌర్జన్యం చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఈ వ్యవహారంలో ఉన్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 23 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఓ మహిళను ఉన్నారు.
W.G: మద్యానికి బానిసై భార్య, కుమారైపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన శనివారం ఇరగవరం మండలంలో జరిగింది. మండలంలోని అర్జునుడుపాలెంకు చెందిన రాంబాబు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీ తులసి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన వీరిని స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ELR: రాజాపోతేపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన ప్రకాష్ (30)గా స్థానికులు చెబుతున్నారు. బైక్పై వెళ్తుండగా రాజుపోతేపల్లి అడ్డురోడ్డు వద్ద వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తుతో పాటు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
NLR: సంగం మండలంలోని సిద్దిపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికుల సహాయంతో అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
CTR : చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. యాదమరి మండలం కొయ్యూరు వద్ద ఉన్న కొత్త చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు శుక్రవారం చనిపోయారు. మృతులు తుమ్మెదపాలేనికి చెందిన సిద్ధు (11), సోమిరెడ్డిపల్లికి చెందిన అభిలేశ్(13)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన గూల విట్టల్ కుమారుడు గుల గోవర్ధన్(28) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన యువకుడు చెన్నైలో ఉద్యోగం చేసి అనంతరం అమెరికా వెళ్లి ఉన్నత చదువులకై వెళ్లి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు బానిసై అప్పులు చేసిన కుమారుడు తండ్రిపై దాడికి దిగాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడ్డ తండ్రి కుమారుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అన్నమయ్య: మదనపల్లెలో టీడీపీ యువ నాయకుడిపై అల్లరి మూకలు దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం సాయంత్రం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక సైదాపేటకు చెందిన జబిఉల్లా ఖాన్ సీటీఎం రోడ్డులో వస్తుండగా.. గొడవ జరగడం చూసి సర్ది చెప్పేందుకు వెళ్లాడు. మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటూ అల్లరి మూకలలో మల్లి అతని కొడుకు పండు తదితరులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలిపాడు.
SDPT: వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగదేవపూర్ (M) చాట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ వివరాలు.. జనగామ మండలం వెంకిర్యాలకి చెందిన శిరీష(21)కి చాట్లపల్లికి చెందిన వంశీధర్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వంశీధర్ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో మంగళవారం మనస్తాపానికి గురైన శిరీష సూసైడ్ చేసుకుంది.
KDP: చాపాడు మండలం వీ రాజుపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు భూ తగాదాలు కారణమని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుతున్నట్లు చాపాడు పోలీసులు తెలిపారు.
BNG: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బీబీనగర్ సంజీవయ్య కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో గుడేకల్ తహేరా బీ అనే మహిళపై దున్నపోతు మంగళవారం దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయల కోసం వెళుతున్న తహేరా బీ పై ఒక్కసారిగా దున్నపోతు కొమ్ములతో కుమ్మేయడంతో రెండు కాళ్లకు, చేయికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గ్రామంలో దున్నపోతు హల్ చల్ చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) అనే యువ గొర్లకాపారి మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. లక్ష్మణ్ తలపైన పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
NLR: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలంలోని మోచర్ల వద్ద జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై లారీ వేగంగా దూసుకెళ్లింది. వెంకమ్మ(50), మమత(26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు రమణమ్మ, వైష్ణవిలు తీవ్రంగా గాయపడ్డారు. పోలేరమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా దర్యాప్తు ప్రారంభించారు.