NLR: కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఓ మ్యాట్రిమోని ప్రొఫైల్లో కీర్తి రెడ్డి అనే మహిళ పరిచయం అయ్యింది. దీంతో ఆమె క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపి నమ్మించి రూ.14.50 లక్షల నగదు పెట్టుబడి పెట్టించింది. ఆ వ్యక్తికి ఎటువంటి ఆదాయం రాకపోవడంతో నకిలీ పోర్టల్ అని తెలుసుకుని మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
AKP: నాతవరం మండలం బెన్నవరం దగ్గర నర్సీపట్నం నుంచి వస్తున్న బైక్ తాండవ సెంటర్ నుంచి వస్తున్న బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్శింగ్ ఉద్యోగి సురేష్ రూ. 500 కట్టను ఎవరికీ కనిపించకుండా దాచే ప్రయత్నం చేశారు. సీసీటీవీలో గమనించిన ఈవో త్రినాథరావు అధికారులను తనిఖీ చేయమని ఆదేశించారు. తనిఖీలలో 111 ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించారు. దీంతో వారిని ఈవో విధుల నుంచి సస్పెండ్ చేశారు.
అఫ్గానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 800 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 2,500మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయబృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
KDP: కలసపాడు మండలం తంబళ్లపల్లెలో విద్యుదాఘాతంతో బర్రె మృతి చెందింది. పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ మరీ కిందకు ఉండడంతో అదే గ్రామానికి చెందిన రైతు నడిపి చించిరెడ్డి బర్రె మృతి చెందిందని అతను వాపోయారు. ఈ బర్రె సుమారు రూ. 50 వేలు విలువ చేస్తోందని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, ట్రాన్స్ఫార్మర్ కిందకు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట సమీపంలో ఇవాళ కడప నగరానికి చెందిన వ్యక్తులు కారులో రేణిగుంటకు వెళ్తుండగా.. ఆవు అడ్డం రావడంతో కారు అదుపు తప్పి ముళ్లపదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్ప గాయాలవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
NLR: అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైకు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది.
VSP: పెందుర్తి పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సరిపల్లికి చెందిన కండిపల్లి కన్నయ్య తన భార్య దేవి, కుమార్తె భారతి, కోడలు నాగమణితో కలిసి ఆటోలో అక్కిరెడ్డిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
E.G: కొవ్వూరులోని ఇందిరమ్మకాలనీకి చెందిన చెరుకూరి కరుణ (22) అదృశ్యంపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదు అయ్యింది. మహిళకు అదే ప్రాంతానికి చెందిన దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈమె గత నెల 30వ తేదీ రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని దుర్గారావు పోలీసులను ఆశ్రయించారు.
KKD: ప్రేమ విఫలమవడంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదివారం యూనివర్సిటీ బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మృతుడు మన్యం జిల్లా సాలూరు మండలం దేవ బుచమ్మపేటకి చెందిన గుంట్రెడ్డి మనోజ్గా గుర్తించారు.
కోనసీమ: మండపేట మండలం ఏడిద శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై వీ.కిషోర్ తెలిపారు. సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం దాడి పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.7,300 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామని ఎస్సై మీడియాకు వెల్లడించారు.
TG: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అడ్డాకుల మండలం కాటవరం దగ్గర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి బస్సు ప్రొద్దుటూరు వెళ్తుంది. కాగా ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
KKD: పెద్దాపురంలోని స్థానిక బ్యాంకు కాలనీలో కిరాణా దుకాణానికి సిగరెట్లు కావాలంటూ వచ్చిన ఇద్దరు.. దుకాణంలో ఉన్న ఊర్ల లక్ష్మి మెడలోని సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీ.మౌనిక తెలిపారు.
TG: మంచిర్యాల జిల్లాకు చెందిన SBI బ్యాంకు ఉద్యోగి రవీందర్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై నేరస్తుడిగా మారాడు. రూ.40 లక్షల అప్పులు తీర్చడానికి తాను పనిచేస్తున్న బ్యాంకులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. అతను తాకట్టులో ఉన్న బంగారం దొంగిలించి, ఇతరుల సహాయంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టాడు. నకిలీ రుణ ఖాతాలు సృష్టించి రూ.1.58 కోట్లు అక్రమంగా తీసుకున్నాడు.
VSP: పెద్ద రుషికొండలో భవనంపై నుంచి జారిపడి మృతి చెందింది. ఆరిలోవ ఉంటున్న చందక సత్యాలు (48) భవన నిర్మాణ కార్మికులరాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక ఉన్న భవనంలో మరమ్మతుల పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడడంతో మృతి చెందింది.