TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. విద్యార్థులను శ్రీజ(9), చైత్ర(9)గా గుర్తించారు. విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.