AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మరణించారు. పన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా మరొకరు బయటకు వచ్చి కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు ఒకరిని కాపాడారు. మిగిలిన ముగ్గురూ మృతిచెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), బబులు (10)గా గుర్తించారు.