AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాడేరు మండలం బంట్రోతుపుట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్ లోయలోపడి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.