AP: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువుహత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని యువతి సోదరులు కొట్టి చంపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున కోపంతో చెల్లెలి భర్తను దారుణంగా హతమార్చారు. సూర్యప్రకాష్ను రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని గంటలకే సంద్య సోదరులు దాడి చేసి హత్య చేశారు.
ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ ఉండటం గమనార్హం. 188 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, 52 మందికి జరిమానా.. మరో నలుగురికి 2 రోజుల జైలు+జరిమానా విధించారు.
AP: అన్నమయ్య జిల్లా గాలివీడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 17న జరిగిన రామకృష్ణారెడ్డి హత్య కేసులో మహేశ్వర్ రెడ్డి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలు సుపారీ తీసుకుని రామకృష్ణారెడ్డిని హత్య చేసినట్లు గుర్తించారు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని వెల్లడైంది. రామకృష్ణా రెడ్డి భార్య ఫిర్యాదు చేయడంతో.. CC ఫుటేజీ, సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.
AP: బాపట్ల జిల్లా వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర(20) ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. HYDకి చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.
AP: ఆంధ్ర- ఒడిశా బోర్డర్లో భారీగా గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1800 కేజీల హాష్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. హాష్ ఆయిల్తో పాటు రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాన్యవర్ బట్టల షోరూమ్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భవనంలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విశాఖలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరఫీ సెకండ్ ఇయర్ చదువుతున్న రజిని అనే విద్యార్థిని ప్రేమించిన యువకుడు వదిలేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. ‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. అతన్ని మర్చిపోలేకపోతున్నా’ అంటూ లెటర్లో పేర్కొంది.
TG: భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయి వారికి ఏ విధంగా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా పురానీబస్తీలో విషాదం నెలకొంది. ఆన్లైన్ గేమ్లో సర్వం కోల్పోయిన శంకర్ లాల్ కుటుంబం.. కూల్డ్రింక్లో విషం కలుపుకుని తాగారు. ఈ క్రమంలో కూతురు స్వాతి, శంకర్ లాల్ మృతి చెందారు. భార్య రాజకుమారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: కర్నూలు జిల్లా పత్తికొండలోని కొండగేరివీధిలో విషాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి(26) అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త, అత్తమామలు కొట్టి ఉరివేసి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్ల ఉరివేసుకుని మృతిచెందినట్లు భర్త బంధువులు చెబుతున్నారు.
W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
W.G: తణుకు (M) ఇరగవరం కాలనీకి చెందిన రౌడీషీటర్ వల్లూరి పండుబాబుపై పోలీసు ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ ఉపయోగించి జైలుకు తరలించారు. 12 తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పండుబాబు తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా హత్యయత్నాలు, దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నాడని అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీఐ డి. వెంకటేశ్వరరావు తెలిపారు.