• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

కొండగట్టు ఘాట్‌పై రోడ్డుపై ప్రమాదం

JGL: కొండగట్టు ఘాట్ రోడ్డులో గురువారం ప్రమాదం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఘాటు రోడ్డు దిగే సమయంలో వాహనం పైకి ఎక్కిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 27, 2025 / 11:27 AM IST

మేదరమెట్ల దగ్గర ఘోర ప్రమాదం

ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం మొత్తం చిత్తడిగా మారిపోవడంతో మృతుడు ఎవరనేది తెలియరాలేదు. ఏదైనా వాహనం ఢీకొట్టిందో తెలియాల్సి ఉంది.

March 27, 2025 / 08:17 AM IST

తిరుపతి-పుత్తూరు హైవేపై పల్టీలు కొట్టిన కారు

TPT: పుత్తూరు మండలం గోవిందపాలెం హైవేపై బుధవారం కారు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుపతికి వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 26, 2025 / 12:53 PM IST

వేడి నీటిలో పడి బాలుడి మృతి

మేడ్చల్: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లేన్‌లో కాటి నర్సింహా భార్య సుమలత, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టగా బన్నీ(4) ఆడుకుంటూ అందులో పడిపోయి మృతి చెందాడు.

March 25, 2025 / 04:53 PM IST

ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ నీట మునిగి చనిపోయాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

March 25, 2025 / 07:56 AM IST

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

WGL: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఇవాళ సంగెం మండలంలోని ఆశాలపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజమహకూర్ తన కుటుంబంతో కలిసి మూడు నెలలుగా ఆశాలపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. వారి ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. వేంటనే MGM ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 24, 2025 / 07:42 PM IST

దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి

KDP: తమిళనాడులోని రాణిపేట వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కడప జిల్లా వేపరాల గ్రామానికి చెందిన బడి గింజల నాగేంద్ర, గంజికుంట శేషయ్యలు అరుణాచలం దర్శనానికి బైక్‌పై వెళ్తుండగా రాణిపేటలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు కిందపడగా మరో కారు వారిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

March 24, 2025 / 04:58 PM IST

‘గంజాయి విక్రయం నిందితుడు అరెస్ట్’

HYD: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై మధురానగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాదగిరినగర్‌లో నివాసముంటున్న షేక్ ఫైజల్ మత్తు పదార్ధాలను విక్రయిస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఇంటిపై దాడిచేసి 155 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నుంచి కొనుగోలు చేసిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 24, 2025 / 12:36 PM IST

జంట హత్యలు చేసింది సిక్కోలు వాసే!

SKLM: రాజమహేంద్రవరంలో జంట హత్యలకు పాల్పడిన జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందిగాం(M) కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్‌లో శివకు సనా(16) పరిచయమైంది. ఈ నేపథ్యంలో యువతి వేరొకరితో చాటింగ్ చేయడాన్ని సహించని శివ యువతితో పాటు తల్లిని హత్య చేశాడు.

March 24, 2025 / 10:28 AM IST

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన ముడిపదార్థాలతో యథేచ్చగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నారు. తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. కల్తీ అల్లం పేస్ట్‌ను అధికారులు మూసీలో పారబోశారు.

March 23, 2025 / 11:19 AM IST

అల్లాడుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం

KDP: చాపాడు సమీపంలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీపేటకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డి, సీతారామపురానికి చెందిన ఓబుల్ రెడ్డికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి సీతారామపురం రోడ్డు వైపు బైకుపై తిరుగుతుండగా, ఇదే క్రమంలో వెనక వైపు నుంచి వస్తున్న మహేశ్వర్ రెడ్డి బైకు ఢీకొంది. ఇరువురికి గాయాలయ్యాయి.

March 23, 2025 / 07:33 AM IST

ఇద్దరు బాలికలపై అత్యాచారం

KKD: పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి శనివారం బాలికల బంధువులు నడిరోడ్డు పైనే దేహశుద్ధి చేశారు. 7, 13 ఏళ్ల బాలికలకు కొన్ని రోజులుగా 53 ఏళ్ల వయసున్న వ్యక్తి స్వీట్లు, రూ.10 ఇస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటికొచ్చింది.

March 23, 2025 / 07:01 AM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సత్యసాయి: పరిగి మండలం జయమంగలి నదిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జగదీష్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి సమీపంలో కూల్ డ్రింక్ బాటిల్, పురుగుల మందు బాటిల్ లభించాయి. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పరిగి ఎస్సై రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

March 22, 2025 / 02:10 PM IST

బైక్ బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

TPT: రాయల చెరువు నుంచి ఇద్దరూ బైక్‌పై వస్తూ పీవీ పురం దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన కేశవ, దీపిక అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

March 22, 2025 / 09:37 AM IST

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్‌ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.

March 22, 2025 / 07:42 AM IST