AP: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువుహత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని యువతి సోదరులు కొట్టి చంపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున కోపంతో చెల్లెలి భర్తను దారుణంగా హతమార్చారు. సూర్యప్రకాష్ను రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని గంటలకే సంద్య సోదరులు దాడి చేసి హత్య చేశారు.