AP: బాపట్ల జిల్లా వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర(20) ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. HYDకి చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.