• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. 30వ మలుపు వద్ద అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు తమిళనాడు అరక్కోణంకు చెందిన నటరాజన్‌గా పోలీసులు గుర్తించారు.

February 26, 2026 / 08:33 AM IST

అల్లూరు గ్రామంలో దొంగతనం

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో దొంగతనం జరిగినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 తులాల వెండి, అర తులం బంగారం,15 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:26 AM IST

సెల్‌ఫోన్ దొంగిలించి రూ.3.18 లక్షలు కాజేశారు.!

NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి సెల్ఫోన్ దొంగిలించి, దుండగులు ఫోన్ పే యూపీఐ ద్వారా పలు దఫాలుగా రూ.3,18,000 నగదు కాజేశారు. బుధవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మహాశివరాత్రి సందర్భంగా కాల్వబుగ్గ ఉత్సవాలకు వెళ్లిన సమయంలో రథోత్సవం ముగించుకుని వస్తుండగా ఫోన్ అపహరించారు. బాధితుడు పాణ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

February 26, 2026 / 07:20 AM IST

మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

అన్నమయ్య: రాయచోటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన దేరంగుల శ్రీనివాసులు అనే వ్యక్తికి కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. బుధవారం ట్రాఫిక్ సీఐ కుళాయిప్ప విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడటంతో అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం జైలు శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 07:10 AM IST

తాళం పగలగొట్టి ఆభరణాలు చోరీ

KDP: తాళం పగలగొట్టి 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు కాలనీకి చెందిన ప్రభావతి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం టౌన్‌లోకి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉంది. బీరువా పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు గుర్తించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 26, 2026 / 07:10 AM IST

లాడ్జిలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

AP: కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. 22 గదులకు మంటలు వ్యాపించడంతో ఒకరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో లాడ్జీలో ఉన్న 33 మందిని పోలీసులు కాపాడారు. మృతుడు ప్రొద్దుటూరు కొర్రపాడు‌కు చెందిన వెంకటశ్రీనివాస్‌గా గుర్తించారు.

February 26, 2026 / 06:29 AM IST

ఎక్సైజ్ అధికారుల దాడులు.. స్కూటీ సీజ్

NLR: మిడుతూరు మండలం తిమ్మాపురం వద్ద స్కూటీపై 5 లీటర్ల నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు. ఈ ఘటనలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి స్కూటీని వదిలి పరారైనట్లు చెప్పారు. అదేవిధంగా లక్ష్మాపురంలో కాలియ అనే వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 06:00 AM IST

విషాదం.. ప్రేమికుల ఆత్మహత్య

TG: వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పులేదనే మనస్తాపంతో అప్పాయిపల్లి కీర్యానాయక్ తండాకు చెందిన క్యాబ్ డ్రైవర్ గణేష్ నాయక్(21) సూసైడ్ చేసుకున్నాడు. ఇది తెలిసి పాన్‌గల్ మండలం అన్నారం తండాకు చెందిన ఆ యువతి వసంత(18) కూడా భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు గణేష్ మేనత్త కొడుకే కాగా వీరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

February 26, 2026 / 05:52 AM IST

శక్తి డెయిరీలో పేలుడు.. నలుగురికి గాయాలు

TG: జనగామ జిల్లా శక్తి డెయిరీలో పేలుడు సంభవించింది. ఒవెన్ పేలడంతో నలుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ఓవెన్ చల్లారకముందే ఓపెన్ చేయడంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం దాటికి బాదం సీసాలు పగిలిపోయి సీసాల ముక్కలు కార్మికులకు గుచ్చుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 25, 2026 / 09:19 PM IST

భారీ స్కాం.. ఫాల్కాన్ సీవోవో అరెస్ట్

TG: ఫాల్కాన్ సీవోవో వికాస్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లను ఫాల్కాన్ సంస్థ వసూలు చేసింది. రూ.792 కోట్ల స్కామ్‌కు ఫాల్కాన్ సంస్థ పాల్పడింది. దేశవ్యాప్తంగా ఫాల్కాన్‌పై 10 కేసులు నమోదు అయ్యాయి.

February 25, 2026 / 08:55 PM IST

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 175 దుకాణాలు ఉన్న భవన సముదాయంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. నగరంలోని చిక్కపేట పరిధిలోని కుంబారపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 03:34 PM IST

లండన్‌లో తెలుగు వ్యక్తి మృతి

AP: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్(28) అనే వ్యక్తి లండన్‌లో మృతి చెందాడు. లండన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 02:22 PM IST

సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి పరిస్థితి విషమం

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గు సైడ్ ఫాల్ కావడంతో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నడుము, కాలికి దెబ్బలు తగలడంతో వెంటనే గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYDకు తరలించారు. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.

February 25, 2026 / 01:05 PM IST

బాసర ఐఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

TG: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. విద్యార్థిని బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 12:33 PM IST

దారుణం.. తండ్రిని చంపి డ్రమ్ములో దాచాడు

తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో పెట్టిన ఘటన యూపీలో జరిగింది. అక్షత్ అనే యువకుడు తన తండ్రి మానవేంద్ర సింగ్(50)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టాడు. మర్నాడు తన తండ్రి కనబట్లేదని పోలీసుల ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

February 25, 2026 / 11:56 AM IST