AP: విశాఖపట్నం స్లీట్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాటరీ-3 ఏరియాలోని ఓ ఛార్జింగ్ కారు మంటల్లో కాలిపోయింది. 305 నంబర్ ఓవెన్కు ఛార్జింగ్ పూర్తైన తర్వాత లిఫ్ట్ అవ్వకపోవడంతో ఓవెన్ నుంచి వచ్చిన మంటలు ఛార్జింగ్ కారుకు అంటుకున్నాయి. దీంతో ఛార్జింగ్ కారు సహా ఎంసీసీ పూర్తిగా కాలిపోయాయి.
BDK: పాల్వంచ మండలం దమ్మపేట సెంటర్లోని ఫ్రెండ్స్ నట్స్ అండ్ బోట్స్ షాపులో రాత్రి దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని భద్రం ఇవాళ తెలిపారు. సుమారు రూ. 27 వేలు దుండగులు దోచుకెళ్లినట్లు బాదితుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
గోవా అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. సిలిండర్ పేలిన సెకన్లలోనే మంటలు వ్యాపించడం, ఎగ్జిట్ పాయింట్ చిన్నగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 22 మంది ఊపిరాడక చనిపోగా ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు 2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోగా.. మరో 14 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అన్నానగర్లోని జీఎస్టీ ఆఫీస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు, మూడు అంతస్తులో మంటలు ఎగసిపడుతుండగా.. ఆరు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
కెనడాలో భారీ భూకంపం సంభవించింది. కెనడియన్ టెరిటరీ యుకోన్-US అలస్కా బోర్డర్లో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. లోకల్ టైమ్ 11:41AM తర్వాత దాదాపు 20 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. బోర్డర్ ప్రాంతం కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
గోవాలోని ఓ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు సహా 23 మంది మృతిచెందారు. ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ఘటనాస్థలిని పరిశీలించారు. క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో ముగ్గురు కాలి, మిగిలిన వారు ఊపిరాడక మృతిచెందారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర గోవాలోని అర్పోరాలో ‘బర్చ్ బై రోమియో లేన్’ బీచ్ వద్ద ఉన్న నైట్ క్లబ్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతిచెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ కుమార్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనాస్థలికి వెళ్లారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలి ముగ్గురు తీవ్రగాయలపాలయ్యారు. 108 ప్రోగ్రామ్ మేనేజర్ రవి, రత్నం తెలిపిన వివరాలు.. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణి సుజాత(28), మరో మహిళ అశ్వినితో పాటు ఆమె కొడుకు(11 నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రిస్టియన్పల్లి వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ క్రాస్ చేస్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు వ్యాపించి పోలీస్ ఇన్స్పెక్టర్ సజీవ దహనం అయ్యారు. గదగ్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి పక్కన ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు వ్యాపించి ఆయన మరణించారు.
మహారాష్ట్రలోని పూణెలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయసహాయం చేస్తానని నమ్మబలికిన ఓ మహిళ, తనకు మత్తుమందు ఇచ్చి మూడుసార్లు అత్యాచారం చేసిందని 37 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యాచార ఘటన తర్వాత.. రూ.2 లక్షలు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేసిందని పేర్కొన్నాడు. లేదంటే, తనపై అత్యాచారం కేసు వేస్తానని బెదిరించిందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫ్రాన్స్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ గ్వాడెలోప్లోని సెయింట్ ఆన్లో క్రిస్మస్ జరిగిన వేడుకల్లో జనసమూహంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కువైట్-శంషాబాద్(KU-373) విమానంతో పాటు బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కువైట్-శంషాబాద్ విమానం మస్కట్కు మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సేఫ్ ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.