• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

స్నేహితుల మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి

KKD: తాళ్లరేవు మండలం కోరంగి పీఎస్ పరిధిలో మంగళవారం యానాంకిపాలెపు శ్రీను (45) హత్యకు గురయ్యాడు. శ్రీను అతని స్నేహితుడికి మధ్య సెల్ ఫోన్ విషయంలో మురళీనగర్ వద్ద ఘర్షణ జరిగింది. శ్రీనుని అతని స్నేహితుడు తలపై రాయితో మోది చంపాడు. అనంతరం ఇసుక గుట్టలో మృతుడి తలను కప్పేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

August 26, 2025 / 08:15 PM IST

వ్యాన్ ఢీకొని ఆవు మృతి

KKD: గండేపల్లి మండలం మల్లేపల్లి-గండేపల్లి గ్రామానికి మధ్యలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూగజీవి మృతి చెందింది. మంగళవారం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వ్యాన్ ఆవును ఢీకొంది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆవు మృతదేహాన్ని తరలించే చర్యలు చేపట్టారు.

August 26, 2025 / 07:25 PM IST

PVNR ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్..!

HYD: మెహదీపట్నం నుంచి ప్రారంభమయ్యే PVNR ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. ఆరంఘర్ వైపు వెళ్లే మార్గంలో కాస్తంత ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ప్రస్తుతానికి క్లియర్ చేయడం కోసం శ్రమిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 26, 2025 / 07:21 PM IST

అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య

KMR: అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం బిక్కనూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35) గత కొంత కాలం కింద హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరూ పిల్లలు ఉన్నారు.

August 26, 2025 / 07:10 PM IST

NH-44పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

GDWL: ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా వద్ద మంగళవారం 44వ జాతీయ రహదారిపై బోలెరో వాహనం లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోలెరో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, క్లీనర్‌కు చేయి విరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 26, 2025 / 05:18 PM IST

పూల కోసం వెళ్ళిన వ్యక్తి గల్లంతు

VKB: చెరువులో తామర పూల కోసం వెళ్లి వ్యక్తి గల్లంతయ్యాడు.దోమ మండలం ఉదన్ రావుపల్లి గ్రామానికి చెందిన బాలయ్య(60) మంగళవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామ చెరువులో తామర పూల కోసం దిగాడు.పూల కోసం కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళి కొద్దిసేపటికి చెరువులో గల్లంతయ్యాడు. రేపు జరగబోయే వినాయక చవితి పండుగ కోసమని చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు.

August 26, 2025 / 03:28 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

W.G: నర్సాపురం నిడదవోలు ప్రధాన రహదారిపై పెనుగొండ – అయితం పూడి మధ్య ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మునమర్రు గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.

August 26, 2025 / 03:27 PM IST

ఆస్తి కోసం భర్తను దారుణంగా చంపిన భార్య

KRNL: ఆస్తి కోసం భర్తను హతమార్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మద్దికేర మండలంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో భార్య సరస్వతి తన భర్త వెంకటేష్‌ను మూడు రోజుల క్రితం దారుణంగా హత్య చేసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా, వెంకటేష్ విగతజీవిగా పడిఉన్నాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, నిందితురాలు సరస్వతి పోలీసులకు లొంగిపోయింది.

August 26, 2025 / 03:04 PM IST

కత్తిపోట్ల దాడిలో యువకుడు మృతి

SKLM: కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్‌, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్‌ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజేశేఖర్‌పై దాడి చేశారు.

August 26, 2025 / 12:05 PM IST

పోక్సో కేసులో ఇద్దరికీ జీవిత ఖైదీ

CTR: పోక్సో కేసులో ఇద్దరు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. 2019 నవంబర్‌లో మదనపల్లెకి చెందిన బాలిక(16) తిరుమలకు వచ్చింది. అనంతరం తిరుపతి నుంచి తిరుచానూరుకు కాలినడకన బయలుదేరగా, మార్గమధ్యంలో వెంకటేశ్‌ను బైక్ లిఫ్ట్ అడిగింది. బైక్‌పై ఆమెను తీసుకెళ్లి స్నేహితుడు రాజా మోహన్ నాయక్‌తో కలిసి అత్యాచారం చేశారు.

August 26, 2025 / 11:51 AM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన అజ్మీరా సుఖేందర్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

August 26, 2025 / 11:47 AM IST

రేబీస్ భయంతో బిడ్డను చంపి, తల్లి ఆత్మహత్య

TG: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల కూతురుకు రేబీస్ సోకిందని భ్రమపడి.. ఓ తల్లి కూతురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. తన భార్య యశోద మతిస్థిమితం కోల్పోయిందని, కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ వచ్చిందని ఆమె అనుమానించిందని భర్త తెలిపాడు. టీకాలు వేయించినా అనుమానం పోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడిందని ఆయన ఆవేదనకు గురయ్యారు.

August 26, 2025 / 11:47 AM IST

యువకుడు అనుమానాస్పద మృతి

ATP: యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 15 ఏళ్ల రాకేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెల్లవారుజామున గ్రామంలోని మెకానిక్ జాఫర్ షాప్ వద్ద అతను విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

August 26, 2025 / 11:00 AM IST

చిలమత్తూరులో ఉరేసుకుని వ్యక్తి మృతి

సత్యసాయి: చిలమత్తూరు మండలంలోని లాల్లేపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్ రెడ్డి (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. కొంతకాలంగా మృతుడు సోమందేపల్లిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామమైన లాలేపల్లి వద్ద ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటననపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

August 26, 2025 / 10:35 AM IST

విష జ్వరంతో విద్యార్థి మృతి

ASF: తిర్యాణి మండలంలోని పంగిడి మాదరా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆత్రం అనురాగ్ అనే విద్యార్థి విష జ్వరంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజులు తిర్యాణి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి నిన్న మృతి చెందినట్లు తెలిపారు.

August 26, 2025 / 09:58 AM IST