కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమతేజ(పండు) అక్కడకక్కడ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో బుధవారం కరెంట్ షాక్కు గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. అంతేకాక ఒక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయ ఎద్దుల బండితో ఐరన్ డబ్బాను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. రూ.2 లక్షల విలువైన ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గ్రామస్థులు ఆరోపించారు.
NDL: ఆళ్లగడ్డ గ్రామీణంలో ఎగువ అహోబిలం క్షేత్రంలోని మెట్ల మార్గంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాయి కిందపడడంతో ఒక చెట్టు, కరెంటు స్తంభం నేలకూలాయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
MNCL: జన్నారం మండలంలోని పాత పోన్కల్ గ్రామంలో బుధవారం పిడుగు పడి సర్వీస్ వైర్ కాలిపోయింది. పాత పోన్కల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మూలమలుపు వద్ద తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న ఉప్పర్ల లచ్చన్న ఇంటిలో సర్వీస్ వైరు కాలిపోయి ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంటిలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగడం లేదు.
KRNL: ఆదోని మండలం కుప్పగల్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతిచెందాడు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మేఘ్సార్కు చెందిన సౌమేన్ దాస్ (తండ్రి రామకృష్ణ దాస్) రైలు కిందపడి మృతిచెందినట్లు ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరాం తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
TG: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. నాగ్పూర్ వాగులో భారీ వరద కారణంగా ఓ కారు కొట్టుకుపోయింది. ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే, వరద ఎక్కువగా ఉందని డ్రైవర్కు రావద్దని చెప్పినా.. వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: నియోజకవర్గంలోని రాజంపేట మండల కేంద్రంలో భారీ వర్షాలతో దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో నీటి ప్రవాహానికి గోడ కూలి డాక్టర్ ఇప్పకాయల వినయ్ కుమార్ బుధవారం మృతి చెందాడు. రాజంపేట మండలం గుండారం, పల్లె దవఖాన రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు స్నేహితులు వినాయక చవితి పండగ సందర్భంగా ఇది బాధాకారం అన్నారు.
కోనసీమ: ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండల పరిధిలోని రహదారి పక్కన రాత్రి వేళల్లో పార్క్ చేసిన లారీల్లో చోరీకి గురైన బ్యాటరీల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆలమూరు పోలీసులు ఒక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టుగా ఎన్టీఆర్ జిల్లా చంద్రపాలెం మండలానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వారి వద్ద నుండచి బ్యాటరీలను రికవరీ చేశారు.
GDWL: అలంపూర్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. గొర్రెల కాపరులు ఈశ్వర్, కొండేరు సాయికి దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గంటల శివాలయం సమీపంలో కంచె వేసి కాపర్లు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన జరిగినట్లు కాపరులు వెల్లడించారు.
W.G: పెనుగొండ ఇండియన్ గ్యాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మంగళవారం మునమర్రు గ్రామానికి చెందిన తానేటి సత్యానందం(37) తన మోటార్ సైకిల్పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కూల్ డ్రింక్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై సత్యానందం అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
NLR: పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎన్టీఎస్ గేట్ వద్ద మంగళవారం రైలు ఢీకొని బి. శివనారాయణ్ (60) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పడుగుపాడుకు చెందినవాడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
GDWL: న్యూహౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న బీజేపీ నేత అనిల్ కుమార్ భార్య సుధపై మంగళవారం నలుగురు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె తలకు బలమైన గాయం కాగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేతలు రామాంజనేయులు, స్నిగ్ధ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NZB: ధర్పల్లి శివారులోని పొలాల్లో ఉన్న మూడు ట్రాన్ఫార్మర్లలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ధ్వంసం చేసి, రాగి వైరును చోరీ చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ చోరీలో రూ.4.20 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు కె.నాగేశ్వర్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కళ్యాణి తెలిపారు.
MDK: వారం రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి మంజీరా నదిలో గల్లంతైన ఎనగండ్ల గ్రామానికి చెందిన విష బోయిన దుర్గేష్(30) మృతదేహం మంగళవారం కొల్చారం మండలం కోనాపూర్ శివారులో లభ్యమైంది. రైతులు నది సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా గల్లంతైన దుర్గేష్గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న పరుశురాములు మంగళవారం తన కింది ఉద్యోగి వద్ద రూ.11,500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. దీంతో అతనిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచనున్నట్లు మెదక్ రేంజ్ ఎసీబీ డిఎస్పి సుదర్శన్ తెలిపారు.