TG: ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షలు, 204 సెల్ఫోన్లు, 141 సిమ్లు, అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్టాప్లు జప్తు చేశామని తెలిపారు.