ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని, తమ్ముడిని హత్యచేసింది. అనంతరం వారి మృతదేహాలను సమీప కాలువలో పడేసింది. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తమ్ముడు ఈహేం పరిఢా(14) మృతదేహం లభ్యం కాగా.. తల్లి అనుష్క(45) బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.