TG: భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయి వారికి ఏ విధంగా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.