AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో దారుణం జరిగింది. అన్న దేవభక్తుడి(38)ని తమ్ముడు విజయరాజు రోకలి బండతో కొట్టి చంపాడు. పొలం పంపకాల విషయంలో అన్నదమ్ములైన దైవభక్తుడు, విజయరాజుకు తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరగగా విజయరాజు రోకలిబండతో అన్న దైవ భక్తుడుపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.