KKD: తాళ్లరేవు మండలం సీతారామపురం గుడ్డివానితూము కూడలిలోని ఒక భవనంపై బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఎర్రని బనియన్ ధరించి, చేతికి కడియం కలిగి ఉన్నాడు. వారం రోజుల కిందటే మృతి చెంది ఉంటాడని కోరింగ పోలీసులు భావిస్తున్నారు.