• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

విద్యుత్ షాక్‌తో 19గేదెలు మృతి

ప్రకాశం: మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డినగర్లో గురువారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై 19గేదెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. పొలంలో విద్యుత్ వైర్లు తెగి పడడంతో గేదెలకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు చెబుతున్నారు. సుమారు రూ. 13 లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

May 23, 2025 / 04:17 AM IST

సీఎం పేరు చెప్పి బెందిరింపు… మాజీ క్రికెటర్ అరెస్ట్

TG: రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ క్రికెటర్ నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఓఎస్డీ పేరుతో ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసి పలువురు హై ప్రొఫైల్ వ్యక్తులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా నాగరాజుపై కేసులు ఉన్నాయి.

May 22, 2025 / 08:25 PM IST

విషాదం.. చెట్టు మీద పడి మహిళ మృతి

MNCL: జన్నారం మండలం మహమ్మదాబాద్‌లో కురిసిన భారీ ఈదురుగాలులకు చెట్టు తలపై పడి సునీత అనే మహిళ (37) మృతి చెందినట్లు జన్నారం ఎస్సై రాజావర్ధన్ గురువారం తెలిపారు. దండేపల్లి నుంచి జగన్ అతడి భార్య సునీత కడెం మండలానికి వెళ్లి వస్తుండగా గాలివాన రావడంతో చెట్టుకింద ఆగారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. జగన్ స్వల్ప గాయాలపాలై చికిత్స పొందుతున్నాడన్నారు.

May 22, 2025 / 05:28 PM IST

హైవేపై యాక్సిడెంట్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలు

E.G: నల్లజర్ల హైవేపై గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కొరియర్ లోడు వ్యాను నల్లజర్ల వచ్చేసరికి అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ మేకల వెంకట్(35) తీవ్ర గాయాలతో పాటు కుడికాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందజేశారు.

May 22, 2025 / 05:00 PM IST

కొప్పోలి బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం

KDP: వల్లూరు మండల పరిధిలోని కొప్పోలి బస్టాండ్ సమీపాన బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఇటికల బట్టిలలో పనిచేస్తున్న చరణ్ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ ఢీకొట్టింది. దీంతో అతడికి, బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని కడప రిమ్స్‌కు తరలించారు.

May 22, 2025 / 07:26 AM IST

పిడుగుపాటుకు పాడి గెదెలు మృతి

NLG: పిడుగుపాటుకు రెండు పాడి గెదెలు మృతి చెందింన ఘటన క‌ట్టంగూర్‌ మండలం కురుమర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్మిడి దామోదర్ రెడ్డి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు బ‌ర్రెల‌ను కట్టేశాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపడటంతో రెండు బ‌ర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

May 21, 2025 / 07:20 PM IST

పంగులూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

BPT: పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న కారు డ్రైవర్ తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆపగా, వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, తాటి ముంజలు అమ్మే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యప్తు చేపట్టారు.

May 21, 2025 / 03:29 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి .స్థానికులు తెలిపిన వివరాలు. జడ్చర్ల రహదారి మయూరి పార్క్ దగ్గర బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తూ కిందపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 21, 2025 / 01:10 PM IST

పిడుగు పడి రెండు ఆవులు మృతి

NGKL: జిల్లా చారకొండ మండలం కమ్మలపూర్ తండాలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మంగ్య నాయక్ అనే రైతు పొలంలో రెండు పాడి ఆవులు మృతిచెందినట్లు బాధితుడు తెలిపారు. చనిపోయిన ఆవుల విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

May 21, 2025 / 10:45 AM IST

అదృశ్యమైన మహిళ మృతి.. పోలీసుల దర్యాప్తు

MDK: అదృశ్యమైన మహిళ మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నిజాంపేట మండలం రజాక్పల్లికి చెందిన బాల మల్లవ్వ (45) మార్చి 13న చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిర్తిపల్లిలోని తమ బంధువుల వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి అదృశ్యమైంది. ప్రస్తుతం ఆమె మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైంది.

May 20, 2025 / 07:46 PM IST

గొంతు పిసికి కూతురిని చంపిన తల్లి

NGKL: లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. ఎల్లమ్మ కన్న కూతురు నందినిని గొంతు పిసికి చంపి నీటి గుంతలో పడేసింది. ఐదు నెలల క్రితం భర్తను రోకలిబండతో చంపి జైలుకు వెళ్లొచ్చింది. నందిని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

May 20, 2025 / 11:16 AM IST

ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురికి గాయాలు

WNP: ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన ఘటన ఇవాళ ఉదయం కొత్తకోట మండలంలో జరిగింది. బస్సు కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా పాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

May 19, 2025 / 08:18 AM IST

రహదారిపై ప్రమాదం.. తృట్టులో తప్పిన తప్పింది

GDWL: జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారి 44పై ఆదివారం సాయంత్రం ఓ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంలో ఉన్న కంటైనర్ బెల్ట్ తెగి కారు మీద పడిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తెరిచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 18, 2025 / 08:05 PM IST

ఫైర్ ఇంజిన్లు టైంకి రాలేవు: స్థానికులు

TG: మీర్‌చౌక్ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్లు సమయానికి రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లలో ఆక్సిజన్ అందుబాటులో లేదన్నారు. అదేవిధంగా ప్రమాద తీవ్రతను అధికారులు అంచనా వేయలేదని విమర్శించారు. కాగా, ఈ ఘటనలో నాలుగు కుటుంబాలకు చెందిన వారు చనిపోయారు. వారంతా ఉమ్మడి కుటుంబసభ్యులుగా తెలుస్తోంది.

May 18, 2025 / 11:28 AM IST

FLASH: 17కి చేరిన మృతుల సంఖ్య

TG: మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. స్పాట్‌లో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున ఓ భవనంలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ పొగతో ఊపిరాడక పలువురు చనిపోయారు.

May 18, 2025 / 11:12 AM IST