ప్రకాశం: జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని, పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శరీరం కొంత భాగం కాలిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.
NZB: రుద్రూర్ మండలం అంబం క్రాస్ రోడ్లో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో వర్నికి చెందిన హఫీజ్కు తీవ్ర గాయాలయ్యాయి. రుద్రూర్ నుంచి వర్ని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు 108 అంబులెన్స్లో బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండగా.. కుడి చేతికి రబ్బర్ కడియం, నలుపు రంగు టీ షర్ట్ ధరించాడు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలోని జిల్లా కోర్టు హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో కృష్ణను దుర్గారావు కత్తితో మెడ మీద పొడిచి తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో నేరం రుజువు కావడంతో జిల్లా అడిషనల్ జడ్జ్ సీ.కే గాయత్రీ దేవి దుర్గారావుకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు నిచ్చింది.
MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. బీ జోన్లోని శ్రీనివాస నగర్కు చెందిన కుశనపల్లి నవీన్ బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: సారవకోట మండలం అవలింగి గ్రామంలోని ఓ మద్యం దుకాణంలో 205 లీటర్ల నకిలీ మద్యం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నట్లు ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. సూపరింటెండెంట్ పీ.మురళీధర్ ఆధ్వర్యంలో బృందం తనిఖీలు నిర్వహించి, నిందితులు మణికంఠ, సుందరరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశామన్నారు.
కృష్ణా: బంటుమిల్లి మండలం పెదతుమ్మిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి సెప్టిక్ ట్యాంక్లో ఝార్ఖండ్కు చెందిన కార్మికుడు వికాస్ కుమార్ శర్మ (45) బుధవారం దుర్మరణం చెందాడు. భోజనం తర్వాత టాయిలెట్కు వెళ్తుండగా ట్యాంక్లో పడిపోయిన అతన్ని సహచరులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 29 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పడవలో అధిక సంఖ్యలో ప్రయాణికులతో పాటు సరుకులు కూడా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
RR: 23 ఏళ్ల అరిఫుద్దిన్ హిమాయత్ సాగర్లో అనుకోకుండా మునిగిపోగా మృతదేహాన్ని బయటకు తీసినట్టు TG ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. బృందం ADFO రాజేంద్రనగర్ శ్రీనివాస్ నాయకత్వంలో గాలింపు చర్యలు ప్రారంభించి, రాత్రంతా శోధన కొనసాగించి మృతదేహాన్ని వెలికితీసి సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.
VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 డిఫెన్స్ బాటన్స్తో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎస్సై భరత్ తన సిబ్బందితో బుధవారం సాయంత్రం దారపాలెంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జీవన అనే వ్యక్తి ఇంట్లో 20 డిఫెన్స్ బాటిల్స్ను గుర్తించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.
TG: మహబూబాబాద్ జిల్లా గంగారంలో అడవి పంది దాడి కలకలం రేపింది. అందులగూడెం గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా.. పంది దాడి చేసి గాయపరిచింది. అతడు కేకలు వేయడంతో సమీప రైతులు వచ్చి పందిని తరిమేశారు. గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో రైతులు, స్థానికులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు.
AP: NTR జిల్లా జూపూడిలోని ఓ ఇంట్లో ఇవాళ రాత్రి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం కాగా, ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: అమీన్పూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి (31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్ (7), సాత్విక్ (6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KMM: ఏన్కూరులోని సాగర్ కాలువలో పడి ఓ మహిళ మృతి చెందిందని ఎస్ఐ రఫీ తెలిపారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన దుగ్గిరాల శిరీష(24) బట్టలు ఉతకడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లగా, ప్రమాదపుషాత్తు కాలువలో పడి గల్లంతైంది. భర్త నాగరాజు కాలువ వద్దకు వెళ్లి చూడగా కనిపించకపోవడంతో స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం శిరీష మృతదేహం లభ్యమైంది.
ATP: గుత్తి ఆర్ఎస్కు చెందిన యువతి 2 రోజుల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై గౌతమ్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, మహాలక్ష్మి నిఘా ఏర్పాటు చేసి విజయవాడలో ఉన్న ఆ యువతిని గుర్తించారు. బుధవారం పోలీసులు యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.