• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 5, 2025 / 07:09 AM IST

ఈతకు వెళ్లి బాలుడు మృతి

SRCL: ముస్తాబాద్ మండలంలో ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

February 4, 2025 / 07:12 PM IST

గంజాయి అమ్ముతున్న జంట అరెస్ట్

HYD: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

February 4, 2025 / 04:47 PM IST

రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

కృష్ణా: గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

February 4, 2025 / 08:33 AM IST

యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

February 3, 2025 / 11:15 AM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కొండాలమ్మ చింత వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడుని వేరే అంబులెన్స్‌లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

February 3, 2025 / 07:40 AM IST

‘అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి’

MDK: శివంపేట మండలం సామ్య తండాలో మదన్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా, కుటుంబ కలహాల కారణంగా మదన్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న మదన్ అనుమానస్పదంగా మృతి చెందారు. హత్య చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.

February 2, 2025 / 07:27 PM IST

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మిషన్ భగీరథ పైపులు

SRD: మునిపల్లి మండలం బుదేరా సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న మిషన్ భగీరథ పైపులకు మంటలు వ్యాపించడంతో మంటలు వ్యాపించాయి. అగ్నికి పైపులు దగనమవడంతో మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.

February 2, 2025 / 07:04 PM IST

భర్త కిడ్నీ అమ్మి.. ప్రియుడితో పరారైన భార్య

పశ్చిమ బెంగాల్‌ హౌరాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త కిడ్నీని బలవంతంగా రూ.10 లక్షలకు అమ్మించి డబ్బు తన వద్దే ఉంచుకుంది. తన కూతురి చదువుకు ఉపయోగపడుతుందని చెప్పడంతో భర్త గుడ్డిగా నమ్మాడు. కానీ, ఆ మహిళ తన భర్తను నిలువునా ముంచి రాత్రికి రాత్రే ప్రియుడితో డబ్బు తీసుకొని పరారైంది. దీంతో భర్త పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

February 2, 2025 / 11:16 AM IST

ఆశిల్ మెట్ట యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం

విశాఖలోని ఆశిల్ మెట్ట వద్ద గల యూనియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పి వేశారు. బ్యాంకులో ఏసీ ఆఫ్ చేయకపోవడం వల్లే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తేల్చారు. బ్యాంకులో ఏసీ, ఫర్నిచర్ మంటల్లో కాలిపోయాయి.

February 2, 2025 / 10:23 AM IST

క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడు అరెస్ట్

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్ శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామ్మన్నారు.

February 2, 2025 / 06:32 AM IST

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

KNR: శంకరపట్నం మండలం మక్త శివారులో శనివారం సాయంత్రం బైక్ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారంకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న మక్త గ్రామానికి చెందిన ఎలుకపల్లి నర్సమ్మను ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు.

February 2, 2025 / 04:59 AM IST

BREAKING: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

February 1, 2025 / 08:16 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి

కడప: వీరపునాయనపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాల వీరయ్య మృతి చెందాడు. ముకుంద ట్రావెల్స్‌కు చెందిన బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108లో సమీప ఆసుపత్రికి తరలించారు.

February 1, 2025 / 10:49 AM IST

కూలీల ఆటోను ఢీకొట్టిన బస్సు

కడప: వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.

February 1, 2025 / 10:08 AM IST