PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన మహాలక్ష్మమ్మ పనులు చేసుకొని ఆ వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఆమెకు తెలియకుండా ఎవరో బ్యాంక్ ఖాతా నుంచి నాలుగు విడతలుగా రూ.31వేల నగదు బదిలీ చేసుకున్నారు. గురువారం కొంత డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్కు వచ్చి ఖాతాలో ఎంత ఉన్నాయని వివరించగా, ఖాతాలో నగదు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: ఆగిరిపల్లి మండలం వడ్లమాను రైతు సింహాద్రి జగన్మోహనరావు తన కుమారుని వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగా, బైకు చోరీ జరిగిందని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పెదవుటుపల్లి పిన్నమనేని ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్ళగా, పార్కింగ్ చేసిన బైక్ను అగంతకుడు దర్జాగా చోరీ చేసి వెళ్లిన సంఘటన సీసీ ఫుటేజ్లో రికార్డయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.
KRNL: పత్తికొండ పట్టణంలో ఎండ వేడికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా గురువారం ఒక మొబైల్ ఫ్రూట్ జ్యూస్ వాహనం దగ్ధమైంది. హోసూరు రోడ్డులో నివసించే రాజస్తాన్కు చెందిన షోభాలాలికి చెందిన ఈ వాహనం ఇంటి వద్ద నిలిపిన సమయంలో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రాకముందే వాహనం పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.8లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామంలో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో చిదంబరయ్య అనే రైతుకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి చెందాయని కన్నీరుమున్నీరయ్యాడు.
KNR: ట్రాక్టర్తో పాటు ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్లో బహదూర్ ఖాన్ పేటలో చోటుచేసుకుంది. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ సీటులో కూర్చుని తాళం తిప్పడంతో ట్రాక్టర్తో సహా బావిలో పడి మృతి చెందింది.
PDPL: పెద్దపల్లి టీచర్స్ కాలనీలో కూతురిని చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో రామడుగుకు చెందిన సాహితికి పెళ్లైంది. బుధవారం రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చే సరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి పట్టణ శివార్లోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం బొలెరో వాహనం బైక్ ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 172.310 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ పీ.వెంకటరమణ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ మేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
NDL: డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది. ప్రయాణికులు స్థానికులు మృతదేహాన్ని గమనించి రైల్వే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆయన వయసు 50 ఏళ్లు ఉండొచ్చు అని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: నరసన్నపేట మండలం లుకలాంలో చింత చెట్టుపై నుంచి జారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. బొత్స శ్రీరాములు (52) మంగళవారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కింద పడ్డాడు. స్థానికులు గమనించి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని ఈ నెల 3వ తేదీ ప్రేమికుడిని కొట్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేసి వృద్ధురాలిని హత్య చేశారని తెలిపారు.
GNTR: పొన్నూరు నిడుబ్రోలు వద్ద విషాదం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి అన్నవరపు ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.
KDP: మైదుకూరు మండలం వనిపెంట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో తీవ్ర గాయాలైన యువకుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తన కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.
కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి పక్కన మలుపులో ఉన్న చెత్త నుంచి మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. చెట్లకు మంటలు అంటుకోవటంతో స్థానికులు సర్పంచ్ దాసరి విజయ్ కుమార్కు సమాచారం అందించారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందికి విషయం తెలపటంతో వారు వచ్చి మంటలు ఆదుపు చేశారు.