• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

E.G: నల్లజర్ల మండలంలోని పోతవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 6, 2025 / 04:10 PM IST

నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి.. వ్యక్తి మృతి

NRPT: నారాయణపేటలో వినాయక నిమజ్జన ఉత్సవాల సమయంలో అపశృతి చోటుచేసుకుంది. బురుడు వాడి శాసనపల్లి శేఖర్(45) గుండెపోటుతో మృతి చెందాడు. మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయిన శేఖర్ నృత్యం చేస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై, మాజీ ఛైర్మన్ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అధిక శబ్దం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని ఆరోపణలు వస్తున్నాయి.

September 6, 2025 / 03:49 PM IST

BREAKING: 12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు అయింది. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ సీజ్ చేసింది.

September 6, 2025 / 03:09 PM IST

కాలువలో బైక్ పడి యువకుడు మృతి

MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి-ధర్మారం మధ్యలో బైక్ కాలువలో పడి పూడూరి నరేష్ మృతి చెందాడని స్థానిక ఎస్సై అనూష తెలిపారు. బీర్పూర్‌కు చెందిన నరేష్, విష్ణువర్ధన్ బాదంపల్లిలోని అక్క ఇంటికి వచ్చి రాత్రి తిరిగి వెళుతున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కాల్వలో పడడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విష్ణువర్ధన్ కు గాయాలయ్యాయని ఎస్సై అనూష వివరించారు.

September 6, 2025 / 03:06 PM IST

స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

VSP: స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం మృతి చెందాడు. పెద గంట్యాడ నడుపూర్‌కు చెందిన సిహెచ్ అప్పలనాయుడు సీడీసీపీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆసుపత్రికి తరలించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 6, 2025 / 02:23 PM IST

బొలెరో బోల్తా.. 10 మందికి గాయాలు

ELR: కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి తుని వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తుని నుంచి 15 మంది వలస కూలీలు బొలెరోలో ప్రయాణం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

September 6, 2025 / 10:07 AM IST

ఇరువర్గాల మధ్య ఘర్షన.. మాజీ కౌన్సిలర్‌కు గాయాలు

GDWL: పట్టణంలోని రెండు కాలనీలకు చెందిన ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజా మాజీ కౌన్సిలర్, వారి తండ్రికి కూడా గాయాలైనట్లు స్థానిక సమాచారం. ఈ ఘర్షనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 6, 2025 / 09:38 AM IST

డివైడర్‌ను ఢీకొన్న కారు ముగ్గురికి గాయాలు

ATP: గుత్తి శివారులోని కాశేపల్లి టోల్గేట్ ప్లాజా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

September 6, 2025 / 08:32 AM IST

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

E.G: రాజమండ్రి శివారు కొంతమూరు గ్రామానికి చెందిన తేజ కుమార్ (30) DSC పరీక్షలో మెరిట్ సాధించలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. B.Ed పూర్తి చేసి జిరాక్స్ దుకాణం నిర్వహిస్తున్న అతను గతంలో DSC రాసినా ఉద్యోగం రాలేదు. ఇటీవల జరిగిన పరీక్షలోనూ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు.

September 6, 2025 / 06:45 AM IST

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కోనసీమ: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను రాజోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజోలు, అమలాపురం క్రైం సీఐలు నరేశ్ కుమార్, గజేంద్ర శుక్రవారం తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దొంగతనాలు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 64 గ్రాములు బంగారం, 2 కేజీల వెండి, స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు.

September 6, 2025 / 06:41 AM IST

జూద శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

E.G: జూద శిబిరంపై దాడిచేసి అయిదుగురిని అరెస్టు చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రాధేయపాలెం-చక్రద్వారబంధం మధ్య తోటల్లో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గండేపల్లి, రాజానగరం, సామర్లకోటకు చెందిన వారిటగా గుర్తించారు. వారి నుంచి ఒక కారు, ఆటో, మూడు ద్విచ క్రవాహనాలు, ఏడు చరవాణులు, రూ.5,500 స్వాధీనం చేసుకునట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

September 6, 2025 / 06:17 AM IST

యాపట్లలో పిచ్చి కుక్క స్వైర విహారం

NGKL: పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో శుక్రవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని చిన్నారి, బాలమని, అనూషలను ఇంటి దగ్గర పనిచేస్తుండగా పిచ్చి కుక్క వీరిపై దాడి చేసి కరిచింది. బాధితుల చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామ యువకులు పిచ్చి కుక్కను చంపేశారు.

September 5, 2025 / 08:58 PM IST

భర్తను కడతేర్చిన భార్య

కోనసీమ: అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కట్టుకున్న భార్య కడతేర్చింది. తన పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాడని హత్యకు పాల్పడినట్లు భార్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం అమలాపురం రూరల్ నడిపూడి శివారు మెట్ల రాంజీ కాలనీలోని భర్త దొమ్మేటి రాంబాబుపై భార్య అతి కిరాతకంగా దాడి చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 5, 2025 / 07:33 PM IST

‘అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తే చర్యలు’

E.G: అధిక ఇసుక లోడుతో రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని లాలాచెరువు రహదారిలో అధిక లోడుతో నిలిపి ఉన్న రెండు లారీలను శుక్రవారం రాత్రి పోలీసులు గుర్తించారు. రెండు లారీలపై రూ.1,29,000 అపరాధ రుసుము విధించారు.

September 5, 2025 / 07:30 PM IST

రోడ్డు ప్రమాదంలో విశ్వనాధపల్లి వాసి మృతి

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారిపై జరిగింది. శుక్రవారం కోడూరు మండలం విశ్వనాధపల్లికి చెందిన బత్తుల నాగరాజు(46) అవనిగడ్డ వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ప్రమాదంలో తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే నాగరాజు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

September 5, 2025 / 06:45 PM IST