• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

అనుమానస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతి

ATP: గుత్తి పట్టణ శివారులోని చెట్నేపల్లి రహదారిలో ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

March 11, 2026 / 10:40 AM IST

ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. రాజధాని బెర్న్ నగరానికి పశ్చిమాన 25 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 11, 2026 / 10:06 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

ATP: గార్లదిన్నె వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతపురం నుంచి గుత్తికి బైక్‌పై వెళ్తుండగా ఐచర్ వాహనం ఢీకొట్టింది. బాధితులను సురేంద్ర, భాషగా గుర్తించారు. స్థానికులు వారిని గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 11, 2026 / 09:50 AM IST

ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

CTR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మినపల్లికి చెందిన భరత్ (20), శ్రీధర్ (22), గిరి పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చి మంగళవారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మదనపల్లె క్రాస్ వద్ద విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

March 11, 2026 / 09:14 AM IST

అద్దె ఇంట్లో ఉంటూ దొంగతనాలు.. మహిళా అరెస్ట్

తిరుపతి రూరల్‌లో అద్దె ఇంట్లో ఉండే సంధ్య (29) దొంగతనానికి పాల్పడింది. సాయినగర్‌లో నివసించే మౌనిక.. తన ఇంటి తాళాలను రోజు పూలకుండి వద్ద ఉంచే అలవాటును సంధ్య గమనించింది. ఈ నేపథ్యంలో గత నెల 8న, ఈ నెల 5న ఇంట్లోకి చొరబడి నగలు, నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రూ.1.40 లక్షల నగదు, రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

March 11, 2026 / 09:00 AM IST

వివాహిత అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు

CTR: శాంతిపురం మండలంలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శాంతిపురం మండలానికి చెందిన వివాహిత ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 11, 2026 / 06:00 AM IST

భార్యను దారుణంగా హతమార్చిన భర్త

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు.

March 10, 2026 / 06:50 PM IST

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

అన్నమయ్య: వాల్మీకిపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విఠలం గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి ట్రాక్టర్‌ను పొలం వద్దకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

March 10, 2026 / 05:18 PM IST

జమ్మలమడుగు వద్ద లారీ- ట్రాక్టర్ ఢీ

KDP: గొల్లపల్లి-జమ్మలమడుగు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది.  మైలవరం మండలం గొల్లపల్లి నుంచి జమ్మలమడుగు వెళ్లే రోడ్డుపై లారీ, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. లారీ ట్రాక్టరు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

March 10, 2026 / 03:59 PM IST

జమ్మలమడుగు వద్ద లారీ- ట్రాక్టర్ ఢీ

KDP: గొల్లపల్లి-జమ్మలమడుగు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది.  మైలవరం మండలం గొల్లపల్లి నుంచి జమ్మలమడుగు వెళ్లే రోడ్డుపై లారీ, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. లారీ ట్రాక్టరు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

March 10, 2026 / 03:59 PM IST

లారీ – బస్సు ఢీ.. డ్రైవర్ల ఘర్షణ.. అంతలోనే?

TG: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తూ.. తాకుతూ వెళ్లింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు పక్కకు వాహనాలను ఆపి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

March 10, 2026 / 11:28 AM IST

పిచ్చికుక్క స్వైరవిహారం 

TG: కామారెడ్డి దొనకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని హైదరాబాద్‌‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 10, 2026 / 09:33 AM IST

విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

తమినాడులోని చెన్నై శివారులో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఏసీ నుంచి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 10, 2026 / 09:19 AM IST

ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

AP: అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హరిప్రసాద్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 9, 2026 / 06:27 PM IST

విషాదం.. కుమారుడితో చెరువులో దూకిన తల్లి

AP: కాకినాడ(D) కోటనందూరు(M) కాకరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కుమారుడితో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, సాయిగా గుర్తించారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

March 9, 2026 / 06:04 PM IST