VKB: గత ప్రభుత్వ నిర్మాణ పనుల బిల్లులు రాక తీవ్ర మనస్తాపానికి గురైన బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చింతకింది వెంకటప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే అతడిని వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు.
JGL: MPలోని రేవా ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల(58) మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఒక కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమీల అనే మహిళ మృతి చెందింది. ఇటీవలనే ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మందు తాగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలో మృతి చెందింది.
JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నిందితులు మాత్రం పరారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు,త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
గోవా మాజీ MLA, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్ (68) మృతిచెందారు. కర్ణాటకలోని ఓ హోటల్ నుంచి లావో బయటకు వస్తుండగా కారు ఢీకొట్టిందని ఆటోడ్రైవర్ గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. అనంతరం లావో లాడ్జిలోకి వెళ్లగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్ను అరెస్టు చేశారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామం సమీపంలో NH5 రోడ్డు పనులకు సూపర్వైజర్గా పని చేస్తున్న ఏనుగు ప్రతాప్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HYD: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును తల్లి హత్య చేయించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మ మూడో కుమారుడు శ్యాంబాబు మద్యానికి బానిసై దొంగతనాలు చేసేవాడు. ఇటీవల మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
SKLM: ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి సర్పంచ్ పిట్ట శశిరేఖ చెక్ పవర్ను రద్దు చేసినట్టు ఎంపీడీఓ రామారావు శుక్రవారం తెలిపారు. 2021 నుంచి 2025 వరకు నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య పనుల్లో సర్పంచ్ రూ.85 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్లు పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు.
కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AP: అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి ఘటన యువతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిని కత్తితో పొడిచి ముఖంపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసిన విషయం తెలిసిందే. గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 29న యువతి పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
HYD: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కవాగు సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.