VKB: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దేముల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తండాలో ఆదివారం భార్యను భర్త అత్యంత దారుణంగా పారతో కొట్టి హత్య చేశాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో భార్యను హతమార్చినట్లు తెలుస్తోంది. గమనించిన గ్రామస్థులు నిందితుడైన భర్తను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజస్థాన్లో జాతీయ రహదారి రక్తమోడింది. రతన్పురా క్రషర్ సమీపంలోని దౌసా-మనోహర్పూర్ NH-148పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రక్ను కారు ఢీ కొట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
UKలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్సర్లో హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్(30)ని NOV 25న గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆకాశంలో కలకలం జరిగింది. గాల్లోనే రెండు విమానలు ఢీకొన్న ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విమానం కూలి పైలట్ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే మరో విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో మరో పైలట్కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో చిన్నారి బర్త్డే పార్టీ జరుగుతుండగా.. దుండగులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చిన్నారులతో సహా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
శ్రీలంకలో దిత్వా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు శ్రీలంకకు భారత్ సాయం చేస్తుంది. తాజాగా 21 టన్నుల నిత్యావసర సరకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలను ఆ దేశానికి సరఫరా చేసింది.
ఇండోనేషియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు సుమత్రా ద్వీపంలో కొండచరియలు విరిగిపడి 303 మందికిపైగా మృతి చెందారు. మూడు ప్రాంతాల్లో 80వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో 279 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ల ద్వారా అక్కడి ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
TG: HYDలోని పోచారం ఇన్ఫోసిస్ పక్కన అర్ధరాత్రి కలకలం రేగింది. గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ గుంతలు తవ్వుతున్న 8 మంది ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కారు, బైకులు, పూజా సామాగ్రిని సీజ్ చేశారు. సులువుగా డబ్బు పొందేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వరంగల్, ఇప్పుడు సిటీలో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.
TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో నలుగురు మృతిచెందారు. ప్రమాదవశాత్తు చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అన్నా చెల్లి సహా నలుగురు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 20కి పైగా దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. కాగా, ఆగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద శనివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చింది. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామానికి చెందిన రైతు చంద్ర శనివారం పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న చంద్రాను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: విశాఖ కేజీహెచ్లో అగ్నిప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్ణాటకలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.200 కోట్ల విలువ చేసే 273 కేజీల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు విదేశీయులతో పాటు 32 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.