TG: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తూ.. తాకుతూ వెళ్లింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు పక్కకు వాహనాలను ఆపి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.