అధిక మాసంలో వచ్చే పౌర్ణమికి ఆధ్యాత్మికంగా రెట్టింపు విశిష్టత ఉంటుంది. ఇవాళ అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన నదీస్నానం, దీపదానం, అన్నదానం చేయడం అత్యంత శ్రేష్ఠం. ముఖ్యంగా పితృ దేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారికి అక్షయ పుణ్యలోకాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.