AP: తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా TTD అడిషనల్ EO వెంకయ్యచౌదరి మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి దర్శనానికి చర్యలు చేపడతాం. నిన్న దర్శన సమయం తక్కువగా ఉన్నా.. 79 వేల మంది భక్తులకు దర్శనం కల్పించాం. ఈరోజు అభిషేక సమయంలోనూ 5850 మందికి దర్శనం కల్పిస్తాం. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.