AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గగుడి అధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఈనెల 8వ తేదీ వరకు అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈనెల 9వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.
కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ మేరకు 4 నెలల 18 రోజులకు గాను రూ.3,95,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకటరమణ మూర్తి తెలిపారు. పలివెల ఈవో పి.కామేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ, సర్పంచ్ పల్లి భీమారావు తదితరులు పాల్గొన్నారు.
నిన్న చంద్రగ్రహణం కావడంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
➠ తిథి: బహుళ పాడ్యమి సా.4:33 వరకు తదుపరి విదియ ➠ నక్షత్రం: పుబ్బ ఉ.7:37 వరకు, తదుపరి ఉత్తర ➠ శుభ సమయాలు: ఉ.6:17-8:14, ఉ.9:13-10:12, మ.12:33-మ.2:59, సా.4:39-5:02 వరకు ➠ రాహుకాలం: మ.12-1:30 వరకు ➠ యమగండం: ఉ.7:30-9 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.11:46-మ.12:32 వరకు ➠ వర్జ్యం: మ.3:00-సా.4:38 ➠ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు
TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సంవత్సరం మొదటి ఖగోళ అద్భుతం ముగిసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు. ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేశాడు. చాలా ప్రాంతాల్లో గ్రహణం చివరి దశలో ఉండగా చంద్రోదయం జరిగింది. గ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఆధ్యాత్మికంగా ‘సూతక కాలం’ ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో చంద్రగ్రహణం ముగిసింది. గ్రంథాల ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం, కొన్ని దానాలు చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఇది మానసిక అశాంతి, ప్రతికూలత, బాధలను తగ్గిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతిని కొనసాగిస్తుంది. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి.
➠ తిథి: పౌర్ణమి సా.4:53 వరకు తదుపరి పాడ్యమి ➠ నక్షత్రం: మఖ ఉ.7:31 వరకు, తదుపరి పుబ్బ ➠ శుభ సమయాలు: ఉ.8:15-8:37, ఉ.9:26-11:11, మ.12:09-మ.1:08, మ.3:05-3:32, సా.5:10-6.00 వరకు ➠ రాహుకాలం: మ.3-4:30 వరకు ➠ యమగండం: ఉ.9-10:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:38-9:25, రా.10:55-11:44 వరకు ➠ వర్జ్యం: మ.3:33-సా.5:09 ➠ అమృత ఘడియలు: ఉ.6:43 వరకు తిరిగి అర్ధరాత్రి రా.1:11 నుంచి 2.48 వరకు
✦ తిథి: శుద్ధ చతుర్దశి సా.5.42 వరకు తదుపరి పౌర్ణమి ✦ నక్షత్రం: ఆశ్లేష ఉ.7.51 వరకు, తదుపరి మఖ ✦ శుభ సమయాలు: ఉ.6.19-7.17, ఉ.8.16-9.14, ఉ.11.11-మ.12.30, మ.1.21-2.06, మ.3.40-సా.4.03 వరకు ✦ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ✦ యమగండం: ఉ.10.30-12.00 వరకు ✦ దుర్ముహూర్తం: మ.12.33-1.20, మ.2.53-3.40 వరకు ✦ వర్జ్యం: రా.7.41-9.16 ✦ అమృత ఘడియలు: ఉ.7.51 వరకు తిరిగి మరుసటి రోజు తె.5.09లకు.
AP: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా రేపు, ఎల్లుండి శ్రీవారి SSD టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ నిన్న ప్రకటించింది. అంటే 3వ తేదీకి ముందు ఇవాళ, రేపు తిరుపతిలో టోకెన్లు జారీ చేయరు. తిరిగి ఈనెల 4న దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఎల్లుండి జారీ చేస్తారు. ఎల్లుండి వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేయడంతో రేపు ఆ సిఫార్సు లేఖలు స్వీకరించరు.
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చింది.
TG: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమహోత్సవం జరగనుంది. అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో తిరుకళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
AP: ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు మార్చి 2 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం జరగనుంది. ఈ కారణంగా ఈనెల 28, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.