శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం చవితి: మ.12-01 తదుపరి పంచమి; అనూరాధ: రా. 12-59 తదుపరి జ్యేష్ట; వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: మ. 1-29 నుంచి 3-15 వరకు; దుర్ముహూర్తం: మ.12-26 నుంచి 1-15 వరకు; రాహుకాలం: సా. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.55; సూర్యాస్తమయం: సా.6.10.
➠ ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం విదియ: ఉ. 8-30 తదుపరి తదియ; ➠ స్వాతి: రా. 8-12 తదుపరి విశాఖ వర్జ్యం: రా. 2-20 నుంచి 4-05 వరకు ➠ అమృత ఘడియలు: ఉ. 10-42 నుంచి 12-25 వరకు ➠ రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు ➠ యమగండం: మ.1:30-సా.3:00 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ. 5-57 నుంచి 7-34 వరకు. ➠సూర్యోదయం: ఉ.5.57 ➠ సూర్యాస్తమయం: […]
తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని రాజ్యసభలో ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, NTPCని కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయాల అవసరానికి ఏపీకి విభజన హామీలు అమలు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. పంచగ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, టీజీలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్లను ఏపీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను అవమానిస్తుందన్నారు.
TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు భారీగా తరలొస్తున్నారు. ఇరుముడి ధరించి కాలినడకన భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
లోకమంతా రామ నామాన్ని స్మరిస్తూ, ఆ రామ భక్తుడైన హనుమంతుడిని కొలిచే పవిత్రమైన రోజు ఇది. బలం అంటే భయం లేకపోవడం మాత్రమే కాదు, ఎదుటివారికి సాయం చేసే గొప్ప మనసు అని నిరూపించిన వాడు మన ఆంజనేయుడు. ఆ స్వామి తన గదతో మన కష్టాలన్నింటినీ చెల్లాచెదురు చేసి, మన జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ HITTV తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవ వేడుకలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా చివరి రోజయిన ఇవాళ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు.
TG: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శివయ్య కోసం ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతర ఏప్రిల్ 3 వరకు జరగనుంది. జాతరకు లక్షలమంది భక్తులు తరలిరానున్నారు. అధికారులు ఇప్పటికే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం సప్తమి: సా.4-58 తదుపరి అష్టమి; మృగశిర: రా.8-36 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: తె.4-28 నుంచి 5-58 వరకు; అమృత ఘడియలు: మ.12-24 నుంచి 1-54 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-41 నుంచి 12-29 వరకు; రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6.04; సూర్యాస్తమయం: సా.6.07.
తెలంగాణ అమర్నాథ్గా పిలవబడే సలేశ్వరం లింగమయ్య జాతర ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నల్లమల అటవీ ప్రాంతంలో వైభవంగా జరగనుంది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా సుమారు 30 కిలోమీటర్ల కాలినడకన లేదా మన్ననూరు మీదుగా భక్తులు ఈ జాతరకు చేరుకుంటారు. హైదరాబాద్ వాసులు MGBS నుంచి శ్రీశైలం బస్సెక్కితే చాలు. ఆమ్రాబాద్ ఫారెస్ట్ వద్ద దిగితే స్పెషల్ సర్వీసులుంటాయి.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,774 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,447 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారిని నిత్యం మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ద్వాదశి: ఉ. 7-39 తదుపరి త్రయోదశి మఖ: సా. 3-18 తదుపరి పుబ్బ వర్జ్యం: రా. 11-18 నుంచి 12-54 వరకు అమృత ఘడియలు: మ. 12-56 నుంచి 2-30 వరకు దుర్ముహూర్తం: మ. 12-28 నుంచి 1-16 వరకు తిరిగి 2-53 నుంచి 3-42 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.6.00; సూర్యాస్తమయం: సా.6.08.
పూజ పుణ్యదాయకం. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో సూర్యోదయమైన తొలి 2/3 గంటల్లోనే పూజ ముగించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. 8, 8:30 గంటల లోపు అయితే మానసిక ప్రశాంతతతో పాటు దైవంపై ఏకాగ్రత కుదురుతుందట. ఉదయం వేళలో పూజ చేసేవారికి రోజంతా ఉత్సాహం, ఉల్లాసంగా గడుస్తుందని వివరిస్తున్నారు. సూర్యోదయానికి ముందే అయితే ఇంకా ఉత్తమమని సూచిస్తున్నారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ఏకాదశి: ఉ. 8-55 తదుపరి ద్వాదశి ఆశ్లేష: సా. 3-43 తదుపరి మఘ వర్జ్యం: ఉ.6-28 వరకు, తిరిగి తె.3-31 నుంచి 5-05 వరకు అమృత ఘడియలు: మ.2-11 నుంచి 3-43 వరకు దుర్ముహూర్తం: సా.4-31 నుంచి 5-19 వరకు రాహుకాలం: సా.4.30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.01; సూర్యాస్తమయం: సా.6.08 మతత్రయ ఏకాదశి, వాడపల్లి తీర్థం.