• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శివారు ప్రాంతాల్లో డ్రోన్ సర్వేతో నిఘా పెట్టాలి.ఎస్పీ

VZM: ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం ఆకస్మిక డ్రోన్ సర్వే నిర్వహించారు. డ్రోన్ సర్వేలో బహిరంగ మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇకమీదట పోలీసు స్టేషన్ పరిధిలో శివారు ప్రాంతాలను ఎంచుకొని డ్రోన్ సర్వే విస్తృతం చేసి, నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

December 29, 2025 / 07:16 AM IST

జల్లికట్టు.. జగన్ ఫోటోను పట్టుకోవడానికి వెళ్తే..!

CTR: వెదురుకుప్పం మండలం చిన్నపోడుచేనులో ఆదివారం జల్లికట్టు ఘనంగా జరిగింది. కోడెగిత్తలను అదుపు చేయడానికి యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్ ఫొటోతో ఉన్న కోడెగిత్త ఓ యువకుడిని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని పక్కకు లాగడంతో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

December 29, 2025 / 07:12 AM IST

జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో సత్తా చాటిన లక్ష్మీ ప్రసన్న

కోనసీమ: అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన విద్యార్దిని లక్ష్మీ ప్రసన్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో గ్రీన్ బెల్ట్ సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఆదివారం రాత్రి జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

December 29, 2025 / 07:10 AM IST

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడానికి డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా పాల్గొన్నారు.

December 29, 2025 / 07:09 AM IST

క్రికెట్ ఆడి వెళ్తూ TDP యువ నేత దుర్మరణం

KRNL: ఆదోనికి చెందిన టీడీపీ యువ నాయకుడు బాలకృష్ణ (36) ఎమ్మిగనూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మిగనూరులో క్రికెట్ టోర్నీలో పాల్గొని తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

December 29, 2025 / 07:04 AM IST

రేపు గడిగరేవులలో కోలాటం పోటీలు

NDL: గడివేముల మండలం గడిగరేవులలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా మంగళవారం కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన కోలాటం గ్రూపులకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ. 15 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు, నాలుగో బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

December 29, 2025 / 07:02 AM IST

గుంటూరులో అత్యాధునిక శిక్షణ కేంద్రం

GNTR: గుంటూరు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో, ఎన్నారై దంపతులు బండారు అశోక్ కుమార్, జయలక్ష్మి పెదకాకానిలో ఒక అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై ఆదివారం వారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి చర్చించగా, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చారు.

December 29, 2025 / 07:01 AM IST

నేడు నూతన టీడీపీ కార్యాలయంప్రారంభం

ప్రకాశం: పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో నూతన టీడీపీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభిస్తారని మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు హాజరై కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

December 29, 2025 / 06:58 AM IST

నేటి నుంచి జిల్లా కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్‌’

PLD: ప్రజల భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం పల్నాడు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్‌’ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. నేటి నుంచి ప్రతి సోమవారం PGRS కార్యక్రమంతో పాటు దీనిని నిర్వహిస్తామన్నారు. అర్జీల పరిష్కారానికి జిల్లాలోని తహశీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయి రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

December 29, 2025 / 06:55 AM IST

ఆదిత్యుని ఆదాయం రూ 4.16లక్షలు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు , ప్రసాదాలు రూపంలో రూ.4.16 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNVD ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

December 29, 2025 / 06:47 AM IST

విజయవాడలో వ్యభిచార గృహంపై దాడి

NTR: విజయవాడ శాంతినగర్‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని మాచవరం పోలీసులు ఆదివారం బయటపెట్టారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించగా, ముగ్గురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిర్వాహకురాలిగా గుర్తించిన రమణమ్మపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

December 29, 2025 / 06:44 AM IST

నేడు ఉదయం 10 గంటలకే PGRS

 విజయనగరం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. 

December 29, 2025 / 06:43 AM IST

శ్రీకాకులేశ్వర స్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు

కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకులేశ్వర స్వామి ఆలయంలో 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర ద్వార దర్శనం, సహస్రనామార్చన, తీర్థ ప్రసాద వితరణ ఉదయం 10 గంటలకు ఆస్థాన పూజ అనంతరం గరుడ వాహన సేవతో గ్రామోత్సవం జరుగుతుంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

December 29, 2025 / 06:43 AM IST

‘స్దానిక సంస్దల ఎన్నికలకు జనసైనికులు సిద్దం కావాలి’

VZM: త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు జనసైనికులు సమాయత్తం కావాలని జనసేన ఎస్‌.కోట నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్.కోట పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. పలువురు నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ ఆసక్తిని తెలియజేశారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తదుపరి ప్రణాళికలు సిద్ధం చేస్తామని నాయకులకు తెలిపారు.

December 29, 2025 / 06:40 AM IST

అల్లూరి జిల్లా : కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు అరెస్టు

ASR: చింతపల్లి మండలంలోని బయలుకించంగి గ్రామ శివారులలో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సీఐ వినోద్ బాబు తెలిపారు. ఏఎస్పీ ఆదేశాలతో ఆదివారం ఎస్సైలు జీ. వీరబాబు, ఎం. వెంకటరమణ తమ సిబ్బందితో కలిసి కోడిపందాల శిబిరంపై దాడులు నిర్వహించగా, కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. 9 బైక్‌లు, 4 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

December 29, 2025 / 06:37 AM IST