VZM: లక్కవరపుకోటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం అని అన్నారు.
KKD: ప్రత్తిపాడు(మం) పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వరుపుల ప్రభ ఆధ్వర్యంలో సీవీఏపీ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న పీ4 కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో మానసిక ఆరోగ్య అవగాహన కోసం గోడపత్రికలను జిల్లా వైద్యాధికారి డా.పి.జగదీశ్వరరావు ఆవిష్కరించారు. వాసవ్య మహిళా మండలి, దీపిక పదుకొనే లివ్ లవ్ లవ్ ఫౌండేషన్, HDFC బ్యాంకు సహకారంతో ఆనందపురం, పెందుర్తి, సింహాచలం మండలాల్లో కమ్యూనిటీ మానసిక ఆరోగ్య ప్రాజెక్టు నిర్వహిస్తోందన్నారు.
కృష్ణా: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కుటుంబం కృషి చేస్తుందని పెనమలూరు MLA బోడె ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు(M) కాటూరులో PHC సెంటర్లో 15వ ఫైనాన్స్ నిధులు రూ.50 లక్షల వ్యయంతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
E.G: TDP కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు TDP మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ మెంబర్ హోదాలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. నూతన మండల పార్టీ అధ్యక్షులకు రాబోయే ఎన్నికలలో విజయం దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని స్పష్టం చేశారు.
PLD: సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో 10 కంపెనీలు పాల్గొంటాయని, అర్హతను బట్టి నెలకు రూ.35 వేల వరకు జీతం లభిస్తుందన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి No Helmet-No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా,హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. వాహనం నడుపుతున్నవారు, వెనుక కూర్చునే వారు ఇద్దరూ హెల్మెట్ తప్పనిసరన్నారు.
VSP: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేసి, వాటి విలువకు సమానమైన భూమి ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సోమవారం అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
VSP: జీవీఎంసీలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 86 వినతులు స్వీకరించినట్లు అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తెలిపారు. జోన్లు, విభాగాల వారీగా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అన్ని విభాగాధిపతులు సమావేశంలో పాల్గొన్నారు.
ELR: ఉపాధి కార్యాలయం, నేషనల్ సర్వీస్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12న సత్రంపాడులోని ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ సోమవారం తెలిపారు. బజాజ్ ఫైనాన్స్, మోహన్ స్పిన్ టెక్స్, ఎస్వీసీ సినిమాస్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. పది-డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు అర్హులన్నారు.
TPT: సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025–2030 పై ఉన్నతస్థాయి సమావేశం సోమవారం శ్రీసిటీలో నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డా. పి.కృష్ణయ్య (మాజీ ఐఏఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులు,పరిశ్రమల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు.
కోనసీమ: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు, ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంత్రి వాసనశెట్టి సుభాష్ చేతుల మీదుగా రూ. 66 వేల విలువైన క్రీడా పరికరాలు అందజేశారు.
TPT: విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదలియార్ కార్పొరేషన్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ ఛైర్మన్ త్యాగరాజన్ సమక్షంలో బీసీ సంక్షేమ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి పర్యవేక్షణలో డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. రేణిగుంటకు చెందిన బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
కడప: సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను రాయచోటిలో విలీనం చేయడంపై ఆ ప్రాంత వాసులు సోమవారం PGRS వేదికలో కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు వినతిపత్రం ఇచ్చారు. సంస్థ ఛైర్మన్ మాట్లాడుతూ.. తల్లీ బిడ్డలను వేరు చేసినట్లు జిల్లాలో ఉన్న రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో విలినం చేయడం పట్ల ప్రజలు రగిలిపోతున్నారన్నారు. యథావిధిగా 2 మండలాలు జిల్లాలోనే ఉంచాలన్నారు.
కడప: గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై కడప పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం కడప టూ టౌన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. మార్కెట్ యార్డ్, అల్మాస్ పేట, దేవుని కడప చెరువు కట్ట ప్రాంతాల్లో సోమవారం విస్తృత దాడులు చేశారు. బహిరంగంగా మద్యం తాగినా, గంజాయి వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.