VSP: నగరంలోని పెదవాల్తేరులో గల కరకచెట్టు పాలమాంబను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో రాష్ట్ర, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.
VSP: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తాత్కాలిక పదోన్నతుల సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఓ కార్యాలయం నోటీస్ బోర్డ్లో కూడా ఈ లిస్ట్ ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోపు తెలియపరచాలని ఆయన కోరారు.
ప్రకాశం: కొమరోలు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి అంగన్వాడి కార్యకర్తలు కూడా హాజరుకావాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
NTR: 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్-18 కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, మల్కబ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఈనెల 16వ తేదీన ఎంపిక చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) వీసీ ఎండీ గిరీషా పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయన్నారు.
KRNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఉపాధికూలీ అడవి లక్ష్మన్న(58) సోమవారం కూలిపనిలో పాల్గొన్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ప్రాంతాల్లో శ్రమికులకు తగిన నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగింధన్నారు.
KRNL: జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం ఆదోని పట్టణం శివారు కొండల్లోని నాటుసారా స్థావరాలను ప్రోహిబిషన్, ఎక్సైజ్ సీఐ సైదుల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, 365 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: వెల్దుర్తి సమీపంలోని లిమ్రాస్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం రుషిబాబు (14) మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం తమ్ముడితో కలిసి పాలు పంపిణీకి బయలుదేరిన బాలుడు, కంటైనర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వారి బైక్ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు విక్కీబాబు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రకాశం: తాళ్లురులోని గుంటి గంగమ్మ జాతర తిరుణాల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి పరిశీలించారు. తిరుణాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిష్ఠ బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు.
VZM: జిల్లా ఎస్పీ ఆదేశాలతో పట్టణంలో ఉన్న అగ్నిమాపక సమీపంలో ఉన్న ఉల్లివీధి దగ్గర క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న సమాచారం మేరకు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాస్, సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి వార్డులో శానిటేషన్ బాగా లేదని, పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెక్యూరిటీ సమస్యలు లేకుండా చూడాలని, ICUలో ఫ్లోరింగ్ సరిగ్గా లేదని దాన్ని సరి చేయాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి సుందరయ్య భవన్లో సోమవారం విద్యుత్త్ సంస్కరణలు, ప్రజలపై భారాలు అనే అంశంపై ఆశా కార్యకర్తలకు స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తుందని ఆయన అన్నారు.
KRNL: సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి T.G.భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, MP బస్తిపాటి నాగరాజు, MLAలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా ఉన్న బెహరా భాస్కరరావు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణతో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని మండ్లి, ముద్దపుకుంట, కొల్లకుంట గ్రామాలలో రేపు, ఎల్లుండి విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 220 కెబి విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా ఈ మూడు గ్రామాలలో మంగళవారం, బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.