• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలే నా ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే

PLD: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటికి త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

January 19, 2026 / 12:40 PM IST

శ్రీ సునామా జకినీ మాత జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను గుత్తి ఆరెకటిక సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 29న జరిగే శ్రీ సునామా జకినీమాత అమ్మవారి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా అమ్మవారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. జాతర మహోత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యేని విజ్ఞప్తి చేశారు.

January 19, 2026 / 12:36 PM IST

ప్రతిరోజు చెత్తను సేకరించాలి: డిప్యూటీ ఎంపీడీవో

ప్రకాశం: వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లిలో డిప్యూటీ ఎంపీడీవో రాంప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరించే విధానంపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు చెత్త బండి ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ వద్ద వేయాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ధనుంజయ్, జి. గిరిధరు పాల్గొన్నారు.

January 19, 2026 / 12:30 PM IST

డిగ్రీ కళాశాలలో శాస్త్రీయ ప్రాజెక్టుల సందడి

SKLM: రథసప్తమి ఉత్సవ్‌లో భాగంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. జిల్లా వృత్తి విద్యాధికారి సురేష్ కుమార్ ఈ ప్రదర్శనను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

January 19, 2026 / 12:30 PM IST

ప్రజల సమస్యలపై స్పందించిన చిలకం మధుసూదన్

సత్యసాయి: ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రజల సమస్యలను విన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలపై వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.

January 19, 2026 / 12:27 PM IST

‘వ్యభిచార ఆరోపణలు.. పట్టించుకోని పోలీసులు’

CTR: గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఓ మహిళ గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉండగా, సంవత్సరాలుగా చర్యలు లేకపోవడంతో కాలేజీ విద్యార్థులు, బయటి విటుల రాకతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

January 19, 2026 / 12:20 PM IST

సంక్రాంతి సంప్రదాయాలు మంట కలిపారు: మాజీ మంత్రి

W.G: సంక్రాంతి పేరుతో సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం మంట కలిపిందని మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం తణుకు YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల నృత్యాలు, పేకాట, జూదం విచ్చలవిడిగా నిర్వహించారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు.

January 19, 2026 / 12:20 PM IST

నేడు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

GNTR: తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

January 19, 2026 / 12:19 PM IST

రేపు జిల్లా స్థాయి మట్టి కుస్తీ ఎంపిక పోటీలు

ATP: పామిడిలో ఈనెల 20 నుంచి జిల్లాస్థాయి మట్టి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు శాప్ కోచ్ రాఘవేంద్ర సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హతగల వారు ఆధార్ కార్డు, జనన ధృవీకరణపత్రం, క్రీడా సామగ్రితో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో చిలకలూరుపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.

January 19, 2026 / 12:18 PM IST

అప్పల సూర్యనారాయణ మరణం తీరని లోటు: ఎమ్మెల్యే

SKLM: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యే శిరీష ఇవాళ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అప్పల సూర్యనారాయణ మరణం తీరని లోటు అని MLA అన్నారు.

January 19, 2026 / 12:06 PM IST

నౌలేకళ్ పాఠశాలకు 20 కుర్చీలు అందజేత

KRNL: పెద్దకడుబూరు మండలం నౌలేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డీవైఎఫ్ఐ గ్రామ కమిటీ సహకారంతో సోమవారం కుర్చీలను విరాళంగా అందజేశారు. డీవైఎఫ్ఐ నాయకుడు రాజేంద్ర మాట్లాడుతూ.. జెడ్పీ పాఠశాలలో సిబ్బందికి కుర్చీల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణమే డీవైఎఫ్ఐ గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో 20 కుర్చీలను విరాళంగా అందజేశామన్నారు.

January 19, 2026 / 12:02 PM IST

యాగంటి ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NDL: బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఆలయ అభివృద్ధికి విజయవాడకు చెందిన జి. శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు రూ.10116లు విరాళం అందచేసినట్లు ఆలయ ఈఓ పాండురంగా రెడ్డి, చైర్మన్ బండి మౌలీశ్వర్ రెడ్డి తెలిపారు. దాతకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.

January 19, 2026 / 11:58 AM IST

రేపు జంగాలపల్లిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ

ప్రకాశం: పీసీపల్లి మండలం జంగాలపల్లి గ్రామ కూడలి వద్ద మంగళవారం 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ మండల టీడీపీ అధ్యక్షులు వేమూరి రామయ్య ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు. రేపు జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి హాజరుకానున్నట్లు తెలిపారు.

January 19, 2026 / 11:55 AM IST

నవీన్‌కు అండగా మంత్రి నారా లోకేశ్

ATP: గుంతకల్లుకు చెందిన నవీన్ అనే వ్యక్తి పేగు సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గోవర్ధన్ అనే వ్యక్తి మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. బాధితుడికి త్వరితగతిన సాయం అందేలా తన కార్యాలయం అధికారులతో సమన్వయం చేస్తోందని లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా భరోసా ఇచ్చారు.

January 19, 2026 / 11:53 AM IST

హోసూరు పాఠశాలలో దుండగుల విధ్వంసం

KRNL: పత్తికొండ మండలం హోసూరులోని MPP పాఠశాలలో సంక్రాంతి సెలవుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల గేటు, తరగతి గది తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి పుస్తకాలను చిందరవందరగా చేసి ధ్వంసం చేశారు. అలాగే మద్యం తాగి ఖాళీ సీసాలు, వాటర్ ప్యాకెట్లను పాఠశాల ఆవరణలో పడేశారు. దీనిపై మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ బ్రహ్మయ్య, ప్రజలు బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

January 19, 2026 / 11:50 AM IST