KDP: కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పి.రాజా, ఎస్సై జయరాముడు పాల్గొని సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి ప్రశాంత వాతావరణం కాపాడాలని సూచించారు.
NDL: నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ గౌడన్ ప్రాంగణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి NMD ఫరూక్తో కలిసి మంగళవారం నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
TPT: శ్రీకాళహస్తిలో ఇటీవలి వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రెండు నెలల వ్యవధిలో శ్రీరామనగర్ కాలనీలో రెండు చోట్ల దొంగతనాలు జరగగా, బహదూర్పేటలోని ఓ ఇంట్లో కూడా చోరీ జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలతో స్థానికులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
NDL: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన టంగుటూరి సీనయ్యను మంగళవారం జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. జనసేన నేత భాస్కర్ ఆధ్వర్యంలో సీనయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. సీనయ్య సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
TPT: టీటీడీ పరకామణి తొలి మహిళా మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొమ్మారెడ్డి శారద (68) మృతిచెందారు. 2011 నవంబరులో టీటీడీ.. పరకామణి డిప్యూటీ ఈవోగా ఆమెను నియమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు టీటీడీ అధికారులు సంతాపం తెలిపారు.
NDL: డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సౌకర్యం కల్పించడం సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చలివేంద్రం ద్వారా ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్యాధికారి డా. కె.వి.ఎస్ పద్మావతి మంగళవారం సందర్శించారు. గర్భిణీల నమోదు, అందుతున్న వైద్య సేవలు, టీబీ, మలేరియా కేసులు, రక్తహీనత పరిస్థితులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డా. సిహెచ్ వెంకటేష్, సిబ్బంది వినోద్, జె. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
NLR: కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న భూమి పూజకు ముందుగా సభా ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలతో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు.
ATP: గుత్తి మండలం ఎస్ ఎస్ పల్లి గ్రామంలో మంగళవారం శ్రీ అంకాలమ్మ తల్లి ఊరిదేవర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఊరి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని పూజించమన్నారు.
E.G: కడియం మండలం దుళ్ల రైతు సేవా కేంద్రం వద్ద జరుగుతున్న జాతీయ సేవా పథకం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎ.విశాలాక్షి దేవి మాట్లాడుతూ.. మట్టి నమూనాల సేకరణ పైన రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించారు. మితిమీరిన పురుగు మందులు, ఎరువులు వినియోగం వల్ల పంటకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందన్నారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆఖరి మజిలీ స్మశాన వాటిక నిర్మాణానికి కలెక్టర్ బాలాజీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రతీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లోను స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
CTR: కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పచ్చికాపల్లం అంగన్వాడి కేంద్రంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సూపర్వైజర్ శకుంతల నేతృత్వంలో పోషకాహారం, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నిషేధం, సెల్ఫోన్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై తల్లిదండ్రులు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్కే హైమావతి, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: కవిటి మండలం చిన్న మెలియాపుట్టుగలో శ్రీ అన్నపూర్ణేశ్వరి సంబరంలో చిన్నారుల నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇచ్చాపురం చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, జానపదాలు, ఒడియా, సంబల్పురి, సినీ రీమిక్స్ పాటలతో ఆహుతులను అలరించారు. నాట్య గురువు బలివాడ శృతి పట్నాయక్, డాన్స్ టీచర్స్ కావ్య, జయ, శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు.
NDL: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ముక్తర్ బాషాకు మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజ్లో 4 ఏళ్ల నుంచి ఆలమూరు సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు.. ఉన్నతాధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించి, కడప డివిజన్ సిద్ధవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు.
VSP: భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోడమెట్టపాలెం కమ్యూనిటీ హాల్లో ‘కిశోర వికాసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర బాలికలకు లైఫ్ స్కిల్స్, స్వీయ అవగాహన, లక్ష్య నిర్ధారణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆర్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. బాలికల సాధికారత, వ్యక్తిత్వ వికాసానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.