• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న పయ్యావుల

ATP: మంత్రుల కమిటీ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి మెజారిటీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టడం లేదన్నారు.

March 10, 2025 / 08:00 PM IST

పేదరిక నిర్మూలనకు P-4 విధానం అమలు: కలెక్టర్

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లాలో స్వర్ణాంధ్ర-2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ-4 విధానం అమలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ టీ.ఎస్. చేతన్ ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.

March 10, 2025 / 07:28 PM IST

‘సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి’

ప్రకాశం: అద్దంకిలో అంబేద్కర్ భవనం వద్ద సోమవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని అన్నారు.

March 10, 2025 / 07:27 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు వేయించండి: ఏడీ

NDL: సంజామల మండల కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సోమవారం ఏడీ డా. మోహన్ రావు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీ పేర్కొన్నారు. పశు వైద్యాధికారి డా. రాఘుబాలకృష్ణ, పశుసంవర్ధక కార్యదర్శులు మహబూబ్ బేగ్, ప్రభాకర్, అనిత పాల్గొన్నారు.

March 10, 2025 / 07:09 PM IST

‘అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలి’

NDL: నకిలీ పట్టాలు రద్దు చేసి, అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నందికోట్కూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఎంసీపీఐ(యూ) డివిజన్ సహాయ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించి, తహసీల్దార్ శ్రీనివాసులుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కన్వీనర్ లాజరెస్ మాట్లాడుతూ.. పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అందజేయాలని కోరారు.

March 10, 2025 / 07:05 PM IST

బేస్తవారిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని ఒంగోలు హైవేపై సోమవారం ఎస్సై రవీంద్రారెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రూల్స్‌ను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

March 10, 2025 / 06:48 PM IST

వైభవంగా మరుపల్లి ఎల్లారమ్మ సినిమానోత్సవం

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎల్లారమ్మ సినిమానోత్సవం వైభవంగా జరిగింది. పూజార్లు సినిమాలను అధిరోహించి మూడుసార్లు తిరిగే సమయంలో భక్తులు అరటి పండ్లు దుంపలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఎల్లారమ్మ, పరశురామన్న ఆలయాల వద్ద భక్తులతో కిటకిట లాడాయి.

March 10, 2025 / 06:37 PM IST

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

KRNL: ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జరిగింది. ఇందులో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణుసూర్య, డీఎల్పీవో నూర్జహాన్ పాల్గొన్నారు.

March 10, 2025 / 06:30 PM IST

రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

NLR: ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.

March 10, 2025 / 06:22 PM IST

జగదాంబ జంక్షన్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవం

VSP: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జగదాంబ జంక్షన్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని జనసేన పార్టీజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలతో కలిసిభారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఠాపురంలో 14వ తేదీన జరిగే భారీ సదస్సుకు భారీగా తరలి రావాలని ఆవిష్కరించారు.

March 10, 2025 / 06:20 PM IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

March 10, 2025 / 06:11 PM IST

‘శ్రీ సత్యసాయి జిల్లాలో 103 మంది గైర్హాజరు’

సత్యసాయి: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జువాలజీ, గణితం 2B, పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు సెట్-2 ప్రశ్నాపత్రాలను వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6,339 మంది విద్యార్థులకు గానూ 6,236 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు.

March 10, 2025 / 05:16 PM IST

అర్జీలను స్వీకరించిన కలెక్టర్

CTR: చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించి, జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

March 10, 2025 / 04:50 PM IST

బీఈడీ కోర్సుపై లోక్ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రశ్న

NLR: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(NCTE) రెండేళ్ల B.Edకు బదులుగా ఒక సంవత్సరం బీఎడ్‌ కోర్సును ప్రతిపాదించింది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఆయన లోక్‌సభలో దీనిపై పలు ప్రశ్నలు వేశారు.

March 10, 2025 / 04:43 PM IST

ఎమ్మెల్సీ అభ్యర్థులకు సోమిరెడ్డి అభినందన

NLR: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన బీద రవిచంద్ర, బీటీ నాయుడుతో పాటు కావలి గ్రీష్మను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ అభినందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించిందన్నారు. బీద రవిచంద్ర యాదవ్‌తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

March 10, 2025 / 04:27 PM IST