• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాకు రక్షణ కల్పించండి: సంగా తేజస్విని

ATP: తన కారుపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద పార్కింగ్ చేసిన AP39 RY 9709 నంబర్ కారుపై దుండగులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించారు.

November 17, 2025 / 02:16 PM IST

కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

CTR: చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికుల వివరాలు.. కొంత కాలంగా కార్యాలయాల చుట్టూ తిరిగినా తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట (M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 17, 2025 / 02:15 PM IST

అర్జీలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

November 17, 2025 / 02:13 PM IST

‘గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తక్షణమే చెల్లించాలి’

VZM: గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని CITU జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు సోమవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెర్లాం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి వేతనాలను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

November 17, 2025 / 02:12 PM IST

ఓ ఇంట్లో విద్యుత్ పరికరాలు చోరి చేసిన దుండగులు..!

ప్రకాశం: కనిగిరి అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లో రూ. 250,000 విలువ చేసే విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యాయి. కాలనీలో నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్న K. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి కరెంట్ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉంచిన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు, గోడలకు అమర్చిన వైర్లను కూడా గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు పేర్కొన్నాడు.

November 17, 2025 / 02:12 PM IST

శివాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

W.G: పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలోని శ్రీ ఉమా వాసుకి సోమేశ్వర స్వామిని కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

November 17, 2025 / 02:11 PM IST

CMRF చెక్కులను అందించిన డిప్యూటీ స్పీకర్

WG: సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇవాళ పెద అమిరంలోని అతని క్యాంప్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఉండి నియోజక వర్గంలో 550 మందిని రూ.4 కోట్ల 6 లక్షలను అందించామన్నారు.

November 17, 2025 / 02:08 PM IST

‘న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి’

E.G: ఇటీవల న్యాయవాదులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కోర్టు, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారన్నారు.

November 17, 2025 / 02:07 PM IST

యూనిటీ మార్చ్ దేశ ఐక్యతకు దిశానిర్దేశం: ఎమ్మెల్యే పల్లా

VSP: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్, నెహ్ర యువ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పాత గాజువాక జంక్షన్‌లో సర్దార్హీ 150 యూనిటీ మార్చ్(ఐక్యత నడక) ర్యాలీని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందరర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఐక్యత, దేశభక్తి పెంపొందించవచ్చున్నరు.

November 17, 2025 / 02:01 PM IST

‘ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి’

ATP: గుత్తి రైతు సేవా కేంద్రంలో సోమవారం ఈ-క్రాప్ బుకింగ్ నమోదుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు తమ పేర్లు నమోదును సరిచూసుకోవాలని, ఈ క్రాప్ బుకింగ్ నమోదులో ఏమైనా అపోహలు ఉంటే రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని సంప్రదించాలని రైతులకు సూచించారు.

November 17, 2025 / 02:00 PM IST

‘గేట్ వే ఇండియాగా విశాఖపట్నం మారనుంది’

PPM: దేశంలో విశాఖపట్నం త్వరలో గేట్ వే ఇండియాగా మారనుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే సోమవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో జరిగిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు.

November 17, 2025 / 02:00 PM IST

‘చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ’

NLR: విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు.

November 17, 2025 / 01:38 PM IST

రైతులకు డ్రోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెంలో పీఏసీఎస్ వద్ధ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయ డ్రోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రైతు సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని విశేషంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

November 17, 2025 / 01:38 PM IST

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..!

KDP: ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పని చేసిన 43 మంది అధికారులను ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటుని ఆరోపణలు వెలువడుతున్నాయి.

November 17, 2025 / 01:33 PM IST

వసతి గృహాలలో వసతులు కల్పించాలని వినతి

ATP: గుత్తిలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుత్తి తహసీల్దార్ పుణ్యవతికి వినతి పత్రం అందజేశారు. వసతి గృహాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తహసీల్దార్‌కు వివరించారు.

November 17, 2025 / 01:32 PM IST