• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బోధిధర్మ అవార్డు గ్రహీతకు ఎమ్మెల్యే ఘన సన్మానం

కోనసీమ: ఇటీవల విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోధిధర్మ అవార్డుకు ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన కుంగ్ ఫూ మాస్టర్ సత్తిబాబు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలో ఆదివారం బోధిధర్మ అవార్డు గ్రహీత సత్తిబాబును అభినందించి, ఘనంగా సత్కరించారు.

September 7, 2025 / 08:00 PM IST

కన్నంపేటలో లబ్ధిదారునికి సీఎం సహాయనిధి అందజేత

AKP: కన్నంపేట జనసైనికుడు శియాద్రి నానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 95వేలు చెక్కును నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ పీవీఎస్ఎన్.రాజు ఆదివారం అందజేశారు. నాని కుమారుడు మణికంఠ దీర్ఘకాలిక వ్యాధితో ఇటీవల మృతి చెందాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని జిల్లా జనసేన అధ్యక్షుడు పి.రమేశ్ బాబు తెలిపారు

September 7, 2025 / 07:52 PM IST

పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ రైతులకు అవగాహన

ASR: పాడేరు మండలంలోని కుజ్జెలి పంచాయతీ గొర్రెలగొంది, కొత్తఊరు గ్రామాల్లో ఐటీడీఏ కాఫీ విభాగం ఆధ్వర్యంలో మండల కాఫీ ఫీల్డ్ కన్సల్టెంట్ విజయ్ కాంత్, లైజన్ వర్కర్ కృష్ణ కాఫీ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులతో కలిసి కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ బెర్రీ బోరర్ తెగులు సోకినప్పుడు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు గురించి అవగాహన కల్పించారు.

September 7, 2025 / 07:51 PM IST

ఎస్.రాజంపేటలో అక్రమ మద్యం పట్టివేత

KDP: సిద్దవటం మండలంలోని ఎస్.రాజంపేట సమీపంలో శనివారం రాత్రి అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వంతాటిపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అక్రమ మద్యం విక్రయిస్తుండగా అతని వద్ద 65 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం పట్టుబడిన మధ్య విలువ రూ. 10 వేలు ఉంటుందని SI తెలిపారు.

September 7, 2025 / 07:42 PM IST

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే

KDP: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఈద్‌గా మైదానంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు మానవాళిని రక్షిస్తాయన్నారు. ముస్లింలు సోదరులకు ప్రార్థనలు చేయడానికి చెట్లు నీడనిస్తాయన్నారు.

September 7, 2025 / 07:42 PM IST

పోగొట్టుకున్న బ్యాగ్ తిరిగి అందజేసిన ఆర్టీసి సిబ్బంది

TPT: శ్రీకాకుళం నుంచి వచ్చిన అరుణ, అన్నపూర్ణమ్మ శ్రీవారి, అమ్మవారి దర్శనానంతరం తిరుచానూరు పల్లెవెలుగు బస్సులో హడావిడిలో తమ లగేజీ సంచులు మరిచి దిగారు. ఈ మేరకు ఏడుకొండల బస్ స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకు సమాచారం ఇవ్వగా, కండక్టర్ లత, డ్రైవర్ బుచ్చిబాబు, సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంతో సంచులు వెతికి భద్రంగా అప్పగించారు. అనంతరం భక్తులు కృతజ్ఞతలు తెపిపారు.

September 7, 2025 / 07:40 PM IST

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు: డాక్టర్ అపర్ణ

గుంటూరులోని పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో ఇవాళ పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ, సీపీఎం నాయకులు నళినీకాంత్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వయసు పైబడిన వారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు.

September 7, 2025 / 07:36 PM IST

ఏఎంసీ ఏఐటీయూసీ సమావేశం

ELR: కార్మికులంతా తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ సమావేశం కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో జరిగింది. కార్మికుల హక్కుల కోసం పోరాడి 44 చట్టాలను సాధించుకుంటే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాటిని నీరుగార్చిందని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాల పరిరక్షణకు పోరాటం అవసరమని ఆయన అన్నారు.

September 7, 2025 / 07:35 PM IST

యూరియాపై అపోహలు పెట్టుకోవద్దు: కలెక్టర్

కృష్ణా: జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ఆదివారం గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి యూరియా సరఫరా పరిస్థితులపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రైతులకు ఆయన స్పష్టం చేశారు.

September 7, 2025 / 07:35 PM IST

‘ఎరువుల అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు’

SKLM: లావేరు మండలం పరిధిలోని వెంకటాపురం సెంటర్ వద్ద ఎరువుల దుకాణాంపై ఆర్డీవో సాయి ప్రత్యూష ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని యజమానిని హెచ్చరించారు. రైతులు మోతాదులలో యూరియా వాడాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, బయటకి తరలిస్తే చర్యలు తప్పవన్నారు.

September 7, 2025 / 07:35 PM IST

UPDATE: పెట్రోలియం కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి ఆరా

VSP: విశాఖలోని ఈస్ట్‌ ఇండియా పెట్రోలియం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి అనిత ఆదివారం స్పందించారు. ఈ ఘటనపై ఆమె అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని ఆమె తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి పేర్కొన్నారు.

September 7, 2025 / 07:34 PM IST

ఆదివాసి జిల్లా ఏర్పాటుచేయాలని వినతి

ELR: రంపచోడవరం కేంద్రంగా మరొక ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండలం మర్రిగూడెంలో ఆదివారం జరిగిన ఆదివాసి జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రెండు మన్యం జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలన్నారు.

September 7, 2025 / 07:32 PM IST

ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు

ELR: ఆగిరిపల్లి మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో ఉన్న ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హనుమాన్ ఏజెన్సీలో రూ.2.75 లక్షల విలువైన 12.65 టన్నుల కాంప్లెక్స్, సూపర్ ఎరువుల నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ దుకాణాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.

September 7, 2025 / 07:26 PM IST

స్వామివారి సేవలో విశాఖపట్నం అడిషనల్ జడ్జి

TPT: ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరసు రామేశ్వర స్వామి వారిని విశాఖపట్నం అడిషనల్ జడ్జ్ సీకే గాయత్రీ దేవి ఆదివారం దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

September 7, 2025 / 07:22 PM IST

రేపు ‘అన్నదాత పోరు’ కార్యక్రమం

NLR: రైతు సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం కందుకూరు కలెక్టరేట్ వద్ద ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. వైసిపి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

September 7, 2025 / 07:21 PM IST