• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం

PLD: కారంపూడి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో అనిల్ కుమార్, రవికుమార్‌లు తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.

March 15, 2026 / 09:45 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం తనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతని  పేరు వెంకటేశ్వర్లు అని మాత్రం వైద్యులకు తెలిపినట్లు ఎస్సై అన్నారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.

March 15, 2026 / 09:40 AM IST

బాలికను వేధించిన యువకుడు అరెస్ట్

గుంటూరు నల్లపాడు పరిధిలో బాలికను మోసగించి లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న యాకసిరి ఆనంద్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ బి.వి. మధుసూదనరావు తెలిపారు. బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

March 15, 2026 / 09:36 AM IST

నేటి నుంచి పైడితల్లి అమ్మవారి జాతర

SKLM: పొందూరులో ఇవాళ్టి నుంచి మంగళవారం వరకు 3 రోజులపాటు పైడితల్లి అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. 15 ఏళ్ల తర్వాత జరిగే జాతర కావడంతో మండలంలో ప్రత్యేకత చోటుచేసుకుంది. 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.

March 15, 2026 / 09:31 AM IST

34 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

కడపలోని పలు హోటళ్లు, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై V&E, Civil Supplies అధికారులు శనివారం అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గృహ వినియోగానికి ఇచ్చే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వివిధ చోట్లలో 8 కేసులు నమోదు చేసి, మొత్తం 34 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 15, 2026 / 09:28 AM IST

వైసీపీ అసెంబ్లీ పరిశీలకలుగా BVR చౌదరి

ELR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా బి.వి.ఆర్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.

March 15, 2026 / 09:26 AM IST

విద్యుత్ బిల్లుల పేరుతో మోసాలు.. జగ్రత్త.!

TPT: విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి తెలిపారు. బిల్లు బకాయి ఉందని మెసేజ్‌లు పంపి OTP అడుగుతున్నారని, ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని తెలిపారు.

March 15, 2026 / 09:23 AM IST

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.38.75 లక్షల చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్ అండ్ బి వసతిగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 450 మందికి రూ.3.97కోట్ల సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

March 15, 2026 / 09:22 AM IST

రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్

CTR: చిత్తూరు రైల్వేస్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు అనుమతిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం ఉదయం 9.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం రాత్రి 8.38 గంటలకు చిత్తూరులో ఆగి వెళ్తాయని అధికారులు పేర్కొన్నారు.

March 15, 2026 / 09:21 AM IST

అధికారుల పనితీరుపై కమిషనర్ అసహనం

KRNL: డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం సమీపంలో నందికొట్కూరు రహదారి నుంచి నంద్యాల రహదారికి అనుసంధానమైన బీటీ రహదారిని ఆయన పరిశీలించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారిలో తుది దశ పనులు సక్రమంగా చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

March 15, 2026 / 09:15 AM IST

దేవాలయ టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు నిమిత్తం టెండర్లు పిలుస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు పేర్కొన్నారు. ఈ నెల 20న టెండర్ తెరవబడునని టెండర్ దాఖలు చేయుటకు ధరావత్ చెల్లించాలన్నారు. వివరాలకు ఆలయం కార్యాలయంను సంప్రదించాలన్నారు.

March 15, 2026 / 09:13 AM IST

నేతి వెంకన్న ఒక్క రోజు ఆదాయం ఎంతంటే..?

PLD: దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయానికి ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ.19,67,938లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.11.25 లక్షలు, లడ్డూ ప్రసాదం, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 8.42 లక్షలు లభించాయి. ఈవో సురేష్ సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.

March 15, 2026 / 09:06 AM IST

లోక్ అదాలత్‌లో 860 కేసుల పరిష్కారం

E.G: కొవ్వూరులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా 860 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి అనురాధ తెలిపారు. ఇందులో 50 సివిల్, 77 క్రిమినల్ కేసులతో పాటు పాత కేసులు కూడా పరిష్కరించగా, మొత్తం రూ.3,24,795 కక్షిదారులకు చెల్లించేలా ఒప్పందాలు కుదిరాయన్నారు. రాజీ మార్గం వల్ల సమయం-ధనం ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.

March 15, 2026 / 09:03 AM IST

లారీ పైనుంచి జారిపడి క్లీనర్ మృతి

కోనసీమ: రాయవరంలో లారీ పైనుంచి ప్రమాదవ శాత్తు జారిపడి గుంటూరుకి చెందిన లారీ క్లీనర్ చింతల నరేష్ కుమార్ మృతి చెందాడు. శనివారం ధాన్యం లోడు అన్‌లోడ్ చేసే క్రమంలో తాడు విప్పుతుండగా పైనుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని స్థానికులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 15, 2026 / 09:02 AM IST

టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: ఎస్పీ

NLR: జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం రాత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

March 15, 2026 / 08:59 AM IST