అన్నమయ్య: రాష్ట్రవ్యాప్తంగా ఓ రోజు ముందే చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు అన్నమయ్య జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 30 మండలాల్లో 215650 పింఛన్లకు గాను 204317 పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ వార్డు సత్యవారి సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా పింఛన్ల పంపిణీ 94.74 శాతంలో నిలిచింది.
ASR: అరకులోయ మండల కేంద్రంలో రేషన్ షాప్ను అరకు నియోజవర్గం టీడీపీ ఇన్చార్జి దొన్నుదొర ఆదివారం కొబ్బరికాయ పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతుందన్నారు.
అన్నమయ్య: మంగళవారం కలికిరికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2:35 గంటలకు కలికిరి చేరుకోనున్నారు. బుధవారం స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని, తిరిగి గురువారం తిరుపతికి బయలుదేరి, అనంతరం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారన్నారు.
సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద పెట్రోల్ బంకులో పంప్ బాయ్గా పనిచేస్తున్న ఫకృద్దీన్పై దాడి చేసినందుకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంక్ మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణను నిందితులుగా చేర్చారు. బంక్ నిర్వహిస్తున్న హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు.
ASR: షెడ్యూల్ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు ధర్మన్నపడాల్, రామకృష్ణ కోరారు. ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ జూన్ 4వరకూ నిర్వహిస్తున్న జీపు యాత్ర విజయవంతం చేయాలన్నారు. ఈమేరకు ఆదివారం జీ.మాడుగులలో జీపు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మురుగు కాలువలు చెత్త, వ్యర్థాలతో పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద రాత్రిళ్లు అధికమైందని అంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగు నీటి కుళాయిలు, బావుల వద్ద బ్లీచింగ్ పౌడర్ను చల్లి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
SKLM: టెక్కలి మండలం శంభాన వీధిలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం. కృష్ణమూర్తి ఆదివారం ప్రభుత్వ పౌరసరఫరాల సరుకులను వినియోగదారులకు అందజేసారు. వినియోగదారులు షాపులు వద్ద తీసుకున్న సరుకులు తగిన కొలతల్లో ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ఆర్డీఓ అన్నారు. టెక్కలి మండలం టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అనంతరం ఎటువంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ పొందడం అదృష్టమని, భగవంతునికి రుణపడి ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న ఎనిమిది మంది సిబ్బందికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో సత్కారం చేసిన ఎస్పీ, వారి సేవలను కొనియాడారు.
VZM: విజయనగరం జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. ముఖ్యంగా వంగర, రేగిడి, తెర్లాం మండలాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని ఎదుర్కొనడానికి ఆయా మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ELR: వేసవి విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాలని డీఐఈవో టి. శేఖర్ బాబు తెలిపారు.
VZM: జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై ఎవరైనా లైంగిక పరమైన వేధింపులకు పాల్పడితే (POSH) లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. వారిపై శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిపారు.
NDL: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బనగానపల్లెకు చెందిన కాటసాని ఓబుల్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనమై నమ్మకం ఉంచి యువజన విభాగం బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, కాటసాని రామిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడతానని తెలిపారు.
W.G: పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చేస్తే పోష్ చట్టం ప్రకారం శిక్షార్హులని ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. శనివారం సుప్రీంకోర్టు ఆదేశాలతో భీమవరంలో 3వ అదనపు జిల్లా కోర్టులో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు పోష్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 2013 సంవత్సరం నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.
KRNL: క్రిష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల కొండలో చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం పొలాలకు వెళ్లిన రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. దీంతో పశువుల కాపర్లు, రైతులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ తక్షణమే స్పందించాలని యువత అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, సర్పంచ్ రవిమోహన్ డిమాండ్ చేశారు.
KRNL: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలు, జలాశయాలకు మరమ్మతులు నిర్వహణకు (ఓఅండ్ఎం) సంబంధించి 474 పనులకు రూ.37.31 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు నీటి సంఘాలు లేనిచోట స్వల్పకాలిక టెండర్లను ఆహ్వానించి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. KCC, LLC.. తెలుగుగంగ, SRBC మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేపట్టనున్నారు.