కడప: YCP గ్రామ కమిటీలో ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులకు చోటు కల్పించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లె గ్రామంలో సోమవారం YCP గ్రామస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి కమిటీలను నియమించామన్నారు. అందరూ కష్టపడి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సత్యసాయి: పరిగి మండలంలో మరణించిన భజంత్రి గోపాల్ కుటుంబాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం ఉదయం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆదుకుని అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గోపాల్ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
KKD: ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్గా నియమితులైన సౌమ్య సోమవారం MLA వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో రోగులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి చేస్తామని సౌమ్య హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కోటపాటి బ్రహ్మారెడ్డి తండ్రి అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే, అన్నా రాంబాబు సోమవారం HYD హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం సమీపంలోని వెంకటరెడ్డి కాలనీ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని కిరణ్ అనే 6వ తరగతి చదివే విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించారు.
తిరుపతి: ఓజిలి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ వాతలు తేలేలా కొట్టిన ఘటన తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ్ను సస్పెండ్ చేస్తూ AP ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
PPM: ఫెన్సింగ్ అండర్ -14 స్కూల్ గేమ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు జియ్యమ్మవలస మండలం పెదమేరంగి తిరుమల సాయి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి నిమ్మల జితేంద్ర ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు రైన్ బో ఉన్నత పాఠశాల, నెల్లూరు జిల్లాలో పాల్గొననున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 09 నుంచి 11వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు.
CTR: కుప్పం RTC బస్టాండ్లో అపస్మారక స్థితిలో దొరికిన సుమారు 60 ఏళ్ల వృద్ధురాలిని స్థానికులు 108 అంబులెన్స్తో ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఇంకా మాట్లాడలేదని వైద్యులు తెలిపారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో, ఆచూకీ తెలిసినవారు కుప్పం పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అర్బన్ సీఐ శంకరయ్య విజ్ఞప్తి చేశారు.
SKLM: పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పట్టణ సీఐగా ఇటీవల వై.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పలాస టీడీపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, పలాస PACS అధ్యక్షులు వంకల కూర్మారావు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సహకారంతో పట్టణంలో శాంతిభద్రతలను కాపాడుతామని సీఐ అన్నారు.
E.G: సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిడదవోలు డీసీసీబి కార్యాలయం వద్ద సహకార సంఘం ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేశ్ కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
కృష్ణా: సహకార కేంద్ర బ్యాంకులో విధులు నిర్వహించే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గుడివాడ లీలామహల్ రోడ్డులోని సహకార కేంద్ర బ్యాంకు వద్ద ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగాల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు గ్రాడ్డ్యూటీ చట్టం అమలుపరచాలని, 36 జీవో అమలు చేయాలన్నారు.
విశాఖ గాజువాక ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం అధ్వర్యంలో ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు రూ. 25 వేలు ప్రతి ఆర్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకి ఇవ్వాలన్నారు.
ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ముఖ్యఅతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. అంతకుముందు వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతంపై కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, కోటి సంతకాల సేకరణ అంశాలపై వారు చర్చించుకున్నారు.
కోనసీమ: రైతు నిలదొక్కుకోవాలి, రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మార్కెట్ యార్డులో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షులు కె.వి.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాలన్నారు.
VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్కు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి కొత్తూరు రెల్లి గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న ఖచ్చితమైన సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచి సిబ్బందితో దాడులు చేపట్టారు. దాడుల్లో కోడిపందేలు ఆడుతున్న తొమ్మిది మందిని ఎస్. బి సిబ్బంది అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి రూ. 16,870 నగదు, ఒక కోడిపుంజు,10 చరావణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.