• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బిల్లులను చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండండి’

CTR: ఉమ్మడి చిత్తూరులో జిల్లాలో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని తెలినపారు.

December 29, 2025 / 06:37 AM IST

గుంటూరు విద్యుత్ వినియోగదారులకు ఊరట

GNTR: ప్రాంత వినియోగదారులకు విద్యుత్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు మీ ఇంటి అదనపు విద్యుత్ లోడును (Additional Load) కేవలం రూ. 1,250 (కిలోవాట్‌కు) చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చు. 50% రాయితీతో లభిస్తున్న ఈ అవకాశాన్ని మీ సేవ లేదా APCPDCL వెబ్‌సైట్ ద్వారా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

December 29, 2025 / 06:35 AM IST

క్రీడాయ్ ప్రతినిధులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

EG: రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన క్రీడాయ్ ప్రతినిధులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిడింగొయ్యిలోని క్రీడాయ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. బిల్డర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.

December 29, 2025 / 06:32 AM IST

నేడు మడకశిర ఉచిత పశువైద్య శిబిరం

SS: మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో ఇవాళ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ అమర్ తెలిపారు. ఈ శిబిరంలో పశువులకు సంబంధించిన సాధారణ వ్యాధులకు చికిత్సలు, గర్భకోశ సమస్యలపై సేవలు అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

December 29, 2025 / 06:30 AM IST

సంతల ద్వారా ఆదాయం ఎంతంటే..?

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన వారం సంతల ద్వారా మొత్తం రూ.3,42,700 ఆదాయం లభించింది. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.2,04,100 ఆదాయం వచ్చింది. ఆదివారం నిర్వహించిన పశువుల సంత ద్వారా రూ.1,38,600 ఆదాయం సమకూరిందని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు రాఘవేంద్రకుమార్ తెలిపారు.

December 29, 2025 / 06:28 AM IST

25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

ATP: తాడిపత్రి పట్టణంలోని శ్రీవాణి విద్యాసంస్థల 2000 సంవత్సరపు బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల నాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

December 29, 2025 / 06:28 AM IST

నేడు మంత్రాలయంలో హుండీ లెక్కింపు

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని మేనేజర్ ఎస్.కే శ్రీనివాసరావు తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 నుంచి 28వ తేదీ (20 రోజుల) వరకు హుండీలను లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం హుండీల లెక్కింపును ప్రారంభిస్తామని చెప్పారు.

December 29, 2025 / 06:27 AM IST

నేడు డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ

KDP: విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారానికి తమ కార్యాలయంలో నేడు డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 వరకు వినియోగదారులు ఫోన్ నెంబరు 08562-242457ను సంప్రదించవచ్చని చెప్పారు.

December 29, 2025 / 06:26 AM IST

10.150 కిలోల గంజాయి స్వాధీనం

ELR: జిలుగుమిల్లీలో పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీలు చూసి ద్విచక్ర వాహనంపై పారిపోతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. బండిని తనిఖీ చేయగా సుమారు 10.150 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రాజపుత్ కమల్ సింగ్, ఆకుల వంశీ కృష్ణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

December 29, 2025 / 06:23 AM IST

విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

కోనసీమ: అల్లవరం గ్రామంలో 2 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

December 29, 2025 / 06:21 AM IST

జిల్లాలో ఎమ్మెల్యే ఒక దారి.. ఇన్‌ఛార్జ్‌ది మరో దారి

ELR: పార్టీ అధినేతలు 15 సంత్సరాలు కలిసి ఉంటామని ప్రకటిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. నరసాపురం, పోలవరం సహా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కూటమి ఇన్‌ఛార్జ్‌లు వేర్వేరుగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధినేతల ఆదేశాలున్నా.. స్థానిక నేతలు కలిసి సాగకపోవడంతో ఎవరికి వినతులు ఇవ్వాలో తెలియక ప్రజలు అయోమయవుతున్నారు.

December 29, 2025 / 06:17 AM IST

అగ్నిప్రమాద బాధితుడ్ని పరామర్శించిన జెడ్పీ చైర్మన్

VZM: ఇటీవల విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన గుర్ల మండలానికి చెందిన జమ్ము వెంకట అప్పలనాయుడిని ఆదివారం ZP  ఛైర్మన్, YCP జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వివరాలు, చికిత్సపై కుటుంబ సభ్యులతో చర్చించారు. అతడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

December 29, 2025 / 06:14 AM IST

కరాటే పోటీల్లో నగరి విద్యార్థులు ప్రతిభ

CTR: తమిళనాడు తిరువళ్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నగరి విద్యార్థులు ప్రతిభకనబరిచారు. నగరి పట్టణ పరిధి నుంచి కరాటే మాస్టర్ రాజ్ కోటి ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులు ఈ పోటీలకు హాజరుకాగా, వీరిలో ఐదుగురు ప్రథమ స్థానాన్ని, ఇద్దరు ద్వితీయ స్థానాన్ని, ముగ్గురు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

December 29, 2025 / 06:10 AM IST

నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం: కలెక్టర్

EG: ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా భూసంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్జీదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.

December 29, 2025 / 06:07 AM IST

నేటి నుంచి ప్రారంభం కానున్న పంటు ప్రయాణం

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు నుంచి కోటిపల్లి వెళ్ళుటకు పంటు ప్రయాణం నేటి నుంచి ప్రారంభమవుతుంది. గత 5 నెలల క్రితం వచ్చిన వరదలకు తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో పంటు ప్రయాణం నిలిపివేశారు. దీంతో అమలాపురం వాసులు కోటిపల్లి, ద్రాక్షారామం, రామచంద్రపురం వెళ్ళుటకు సుమారు 50 కిలోమీటర్లు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

December 29, 2025 / 06:05 AM IST