E.G: వైసీపీ ఆధ్వర్యంలో యూరియా బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే నినాదంతో రైతుపోరు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవరపల్లి మండల వైసీపీ శ్రేణులకు ఎంపీపీ కేవీకే దుర్గారావు పిలుపునిచ్చారు. పెద్దఎత్తున పార్టీలకతీతంగా రైతులు పాల్గొని, వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
VZM: ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మేడ మీద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి నుండి రూ 7,200 నగదు, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని సీఐ వి.నారాయణమూర్తి ఆదివారం తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
KDP: వైసీపీ, టీడీపీ కూటమి పార్టీలు వేంపల్లె గ్రామ ప్రజలకు శాపంగా మారాయని ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా పారిశుధ్య, వాటర్ స్కీమ్ సిబ్బందిలకు జీతాలు చెల్లించలేదని, దీంతో వారు సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. కాగా, వీరికి జీతాలు చెల్లించక పోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.
ELR: డబ్బులిస్తామని ఎవరైనా అడిగితే మీ ఆధార్, ఇతర వ్యక్తిగత డాక్యుమెంట్ల కాపీలను షేర్ చేయవద్దని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. ఇలా డాక్యుమెంట్లను షేర్ చేయడంతో వాటితో దొంగ లోన్లు తీసుకోవడం లేదా మీ ఆస్తికి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
TPT: రేణిగుంట సర్కిల్లో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ జయచంద్ర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రికార్డులు సక్రమంగా లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ పోలీసులు పాల్గొన్నారు.
ELR: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి ఏలూరులో నిర్వహించిన స్కానింగ్ పరీక్షలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజబాబు ఆదివారం పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్కానింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. 7,078 మంది హాజరు కావాల్సి ఉండగా 6,128 మంది హాజరయ్యారన్నారు. అలాగే ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగలేదన్నారు.
PLD: మాచర్ల మండలం విజయపురి సౌత్లోని సాగర్ క్యాంప్, లంకమోడు తదితర ప్రాంతాలలో దాదాపు రూ.3.59 కోట్ల వ్యయంతో సీసీ, బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనుల పురోగతిని వార్డుల వారీగా ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు రవాణా సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కృష్ణా: జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ డీకే.బాలాజీ, అధికారులుతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా యూరియా సరఫరా చేయాలని ఆయన సూచించారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబరుకు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు.
ATP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభా వేదికను పరిశీలించారు. జిల్లా నేతలు ఆయనకు ఏర్పాట్లను వివరించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారని, పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన సమీకరణపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు.
SKLM: రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎంపికైన కరిమి రాజేశ్వరరావును వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఆదివారం నరసన్నపేటలో జరిగిన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు.
KRNL: ద్వారక తిరుమల వేదికగా ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు పాల్గొని 25 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర యోగ సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో సాధన చేసి పథకాల సాధించడం గర్వకారణమని తెలిపారు.
కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డికె.బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
ఎన్టీఆర్: విజయవాడ 33వ డివిజన్లో నూతన వాటర్ ప్లాంట్ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రారంభించారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్. రాజు పర్యవేక్షణలో శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అతిధులుగా హాజరయ్యారు.
VZM: వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.