సత్యసాయి: పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామ పంచాయతీలోని శ్రీ సద్గురు షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయంలో సాయి భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు.
AKP: కె.కోటపాడు మండలం ఏ.కోడూరులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆదివారం ప్రారంభించారు. DCCB ఛైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NTR: విజయవాడ వెటర్నరీ కాలనీ యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కానీ కార్పొరేషన్ పాలకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
ప్రకాశం: ఉగాది పండగను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకోసం మార్కాపురం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM లావణ్య తెలిపారు. మార్చి 19వ తేదీ ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా సుమారు 25 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉందన్నారు.
కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి గ్రామాన్ని స్వచ్ఛ సుందర కూచిపూడిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గ్రామస్థులు సహకరించాలని అధికారులు ఈరోజు సూచించారు. కూచిపూడి గ్రామంలోని పసుమర్తి ధర్మచెరువు పరిసరాలు, ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన జరిగిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని కూచిపూడి ఎస్సై సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అంకబాబు కోరారు.
ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో రెండో రోజు ఆదివారం జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కోట ఉత్సవాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసి క్షుణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
PLD: మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఛైర్మన్ షేక్ మదార్ సాహెబ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఎమ్మెల్యే జూలకంటి హాజరుకానున్నారు. పట్టణాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కౌన్సిలర్లు, అధికారులు అందరూ సమయానికి హాజరుకావాలని కమిషనర్ వేణుబాబు సూచించారు.
ATP: గుత్తిలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. అనుమానితల ఇండ్లలో సోదాలు నిర్వహించామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ ప్రజలకు హెచ్చరించారు.
NLR: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల సాకుతో ఎగుమతిదారులు ధరలు తగ్గించడంతో ఇందుకూరుపేట ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలోకు రూ.40 వరకు తగ్గించడంతో ఎకరాకు రూ.80వేల నష్టం వాటిల్లుతోంది. ఖర్చులు పెరిగిన తరుణంలో కార్పొరేట్ కంపెనీల దోపిడీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మత్స్యశాఖ జేడీ తెలిపారు.
VZM: రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దని, ధైర్యంగా, సంతోషంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులందరికీ విజయం కలగాలని ఆకాంక్షించారు.
సత్యసాయి: చిలమత్తూరు మండలం లాలేపల్లి నుంచి చిన్నన్నపల్లి గ్రామానికి రహదారి లేక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు చిలమత్తూరు సీనియర్ నాయకుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో లాలేపల్లి–చిన్నన్నపల్లి తారు రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారి పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
GNTR: ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పన్నుల వసూళ్లను మున్సిపల్ అధికారులు వేగవంతం చేశారు. తెనాలి కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదివారం సెలవు రోజూ సిబ్బందితో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. మొండి బకాయిలపై దృష్టి సారించి, నేరుగా బాకీదారుల ఇళ్లకు వెళ్లి పన్నులు చెల్లించాలని కోరారు. ఇప్పటివరకు 75 శాతం మేర వసూళ్లు పూర్తయ్యాయని కమిషనర్ వెల్లడించారు.
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటీవల స్వర్గస్తులైన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొలిశెట్టి కలిసి పారమర్శించి, ఓదార్చారు. టీడీపీ నేత దాసరి అప్పన్న మావయ్య సూర్యనారాయణ, బీఎస్ఎన్ఎల్ యూనియన్ జిల్లా నాయకులు చింతా ప్రసాద్ భార్య సత్యవతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను కూటమి నేతలతో కలిసి పారమర్శించి సానుభూతి తెలిపారు.
KDP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ భాగాల కమిటీల నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా పోరుమామిళ్లకు చెందిన చాపాటి లక్ష్మీనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
CTR: కాణిపాక వరసిద్ధుడి ఆలయ పాలకమండలి అత్యవసర సమావేశాన్ని ఈనెల 17న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ శనివారం తెలిపారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆలయానికి అవసరమైన సరుకులు, ప్రసాదం తయారీకి ఉపయోగించే గ్యాస్ సరఫరా ఏర్పాట్లను సమీక్షించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.