• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

సత్యసాయి: హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.

March 15, 2026 / 08:58 AM IST

పామూరులో కార్డెన్ సెర్చ్ నిర్వహణ

ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక గణేష్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహన పత్రాలను పరిశీలించారు. ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఇంటింటా తనిఖీలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

March 15, 2026 / 08:53 AM IST

పక్షుల దాహార్తిని తీరుస్తున్న యువత

ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల యువకులు వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. అటవీ ప్రాంతంలో పక్షుల కోసం నీటి సౌకర్యం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవరాశుల రక్షణకు వారు చూపుతున్న చొరవను ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి అభినందించారు. సామాజిక బాధ్యతతో స్పందించిన ఎల్లుట్ల యువతపై ప్రశంసలు కురుస్తున్నాయి.

March 15, 2026 / 08:53 AM IST

జిల్లాలో మాంసం ధర ఎంతంటే..?

పల్నాడు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 278, స్కిన్‌లెస్ చికెన్ రూ. 317, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ. 900-1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.

March 15, 2026 / 08:52 AM IST

తోటపల్లి పరిసరాల్లో ఏనుగుల గుంపు

PPM: తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గల మొక్కజొన్న, అరటి తోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

March 15, 2026 / 08:51 AM IST

నేడు ఒంటిమిట్టలో బండలాగుడు పోటీలు

KDP: ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీర గంగమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వార్షిక మహోత్సవాల్లో ఆఖరి 3వ రోజు బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ పోటీలను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరగనుంది.

March 15, 2026 / 08:50 AM IST

కర్లపాలెంలో పోలీసుల కార్డన్ సెర్చ్

BPT: కర్లపాలెంలోని ‘వజ్రపహార్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ వెల్లడించారు. 39 మంది పోలీసు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు.

March 15, 2026 / 08:50 AM IST

గిట్టుబాటు ధర కోసం రైతుల ఎదురుచూపు.!

CTR: టమాటాకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 30 కిలోల టమాటా ట్రే రూ. 200 తిరుపతి మార్కెట్‌లో పోతుండడంతో గిట్టుబాటు ధర లేదని రైతులు విలపిస్తున్నారు. మూరేవాళ్లపల్లికి చెందిన రైతు కోదండరామిరెడ్డి రూ. 6 లక్షలు ఖర్చుపెట్టి 2 1/2 ఎకరా టమాటా సాగు చేశాడు. ట్రే రూ. 200 అమ్మితే ఖర్చులు పోను రూ. 70 చేతికి వస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

March 15, 2026 / 08:48 AM IST

వాహనాల తనిఖీల్లో 36 మద్యం సీసాలు పట్టివేత

SKLM: మెలియాపుట్టి మండల పట్టు పురంలో ఎస్సై మహ్మద్ అమీర్ ఆలీ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు చాపర గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్ ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తీసుకెళ్తుండగా, అతనిని తనిఖీ చేయగా 36 మద్యం సీసాలు అతని నుంచి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

March 15, 2026 / 08:42 AM IST

‘విద్యార్థుల ఏకాగ్రతకు యోగా ఎంతో మేలు’

W.G: విద్యార్థులు పరీక్షల్లో సత్ఫలితాలు సాధించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఉద్యోగి రుద్రరాజు బలరామరాజు రూ.3 లక్షల సొంత వ్యయంతో నిర్మించిన యోగా శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు రోజూ అరగంట పాటు యోగా సాధన చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని మంత్రి సూచించారు.

March 15, 2026 / 08:41 AM IST

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ATP: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై ఆర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు.

March 15, 2026 / 08:39 AM IST

మళ్లీ ఊర్లోకి పులి.. భయాందోళనలో ప్రజలు

KKD: పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. 

March 15, 2026 / 08:38 AM IST

మానవత్వం చాటుకున్న ఎస్సై

ELR: పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు 36 అనే వ్యక్తి గత కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ.. ఈనెల 5వ తేదీన మృతి చెందాడు. ఆ కుటుంబ పరిస్థితిని గ్రామ పెద్దలు, పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మృతుని దశదిన కార్యక్రమం నిమిత్తం పెదపాడు పోలీస్ స్టేషన్ తరఫున 75 కిలోల 3 బియ్యం బస్తాలను అందజేసినట్లు తెలిపారు.

March 15, 2026 / 08:35 AM IST

సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర: ఎస్సై నరేంద్ర

కోనసీమ: గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలమూరు ఎస్సై నరేంద్ర అన్నారు. మండలంలోని చింతలూరులో ఆయన శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఉగాది సందర్భంగా నిర్వహించే శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

March 15, 2026 / 08:34 AM IST

అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. నగదు స్వాధీనం

E.G: రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30.36 లక్షల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. మలికిపురంలో అర్జున్‌ను అరెస్ట్ చేసి రూ. 17.15 లక్షల సొత్తును, రామచంద్రపురంలో సీతారాముడును అదుపులోకి తీసుకుని రూ. 13.21 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

March 15, 2026 / 08:21 AM IST