E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష సమావేశం కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. లెటర్ ఆఫ్ యాక్సఫ్టన్స్ వారం రోజుల్లో ప్రారంభం కావాలని అన్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా తమ వద్దకు వచ్చిన ఫైళ్లను 24 గంటల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు.
కృష్ణా: ఉగ్రవాదంపై భారత్ పోరు అద్వితీయం అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో విజయ సింధూరం – జయహో మోదీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి, జయహో భారత్ అంటూ నినదించారు.
NTR: నందిగామ ఏరియా హాస్పిటల్లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరావు, సూపరిండెంట్ డి. వెంకటేశ్వరావు కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇలాంటి యుద్ద వాతావరణం వచ్చినప్పుడు పార్టీలన్నీ ఏకమై ఒకటిగా నిలబడాలని కోరారు.
కృష్ణా: గుడివాడ పురపాలక సంఘంలో అన్ని రిజర్వాయర్లకు హెడ్ వాటర్ వర్క్స్లో 24/7 మోటార్లతో పూర్తిస్థాయి మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇవాళ కురిసిన అకాల వర్షం కారణంగా హెడ్ వాటర్స్ వర్క్కు వచ్చే పవర్ సప్లైకు అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం పట్టణంలో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు.
ASR: హుకుంపేట ఎంపీపీ కూడా రాజుబాబు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీవో నెంబరు-3కి ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకు రావాలని ఎంపీపీ రాజుబాబు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గిరిజన ప్రాంతంలో 100శాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని తీర్మానించారు.
VZM: జిల్లా పోలీసుశాఖలో కమ్యూనికేషన్ ఇన్స్పెక్టరుగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన రమణమూర్తికి SP వకుల్ జిందల్ అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ప్రదానం చేశారు. క్రమశిక్షణతో సంతృప్తి కరంగా విధులు నిర్వహించి, నిస్వార్థంగా సేవలందించే పోలీసు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవా పతకం అందిస్తుందని SP అన్నారు.
కృష్ణా: జగ్గయ్యపేట మండలంలోని మల్కాపురం గ్రామ సర్పంచ్ అంబోజి పుల్లారావు ( జాన్ ) ఆకస్మికంగా మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం జాన్ మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అయన వెంట పట్టణ కూటమినేతలు పాల్గొన్నారు.
ELR: వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామానికి చెందిన షకీల్ రెహ్మాన్ గురువారం నియమితులయ్యారు. వైసీపీ అనుబంధ విభాగాల నియామకంలో భాగంగా అధినేత వైఎస్ జగన్ రెహ్మాన్ను నియమించారు. పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వాసుబాబు పిలుపునిచ్చారు.
W.G: పెనుమంట్ర మండలం పెనుమంట్ర 2 సచివాలయ పరిధిలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ 3.0 సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి వారికి అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా అశ్రద్ధ వహించకుండా తమను సంప్రదించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.
NTR: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు సమాజంలోని ప్రజలకి ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం చిట్యాలలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 14వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త మారెళ్ల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
కృష్ణా: విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడితే అర కిలోమీటర్ పైగా ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు తెలిపారు. నేడు క్యాబినెట్ భేటీ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు విజయవాడ నగరం మీదుగా అమరావతికి వెళుతుండగా పోలీసు వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ద్విచక్ర వాహనదారులు వాపోయారు.
కృష్ణా: ఈ ఏడాది ఇప్పటికే వివిధ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.. ఇదే విధంగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్...
PLD: దాచేపల్లిలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో గురువారం గురజాల నియోజకవర్గ హజ్ యాత్రికుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. హజ్ యాత్ర ఇస్లాంలో పవిత్రమైందని, ప్రతి ముస్లిం దానిని ఆకాంక్షిస్తారని కృష్ణమూర్తి అన్నారు.
PLD: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంఘం ఎడ్లపాడు మండలం గోపాలపురంలో ఆస్తి నష్టం వాటిల్లింది. చెట్లు విరిగి ఇళ్లపై పడటంతో పాటు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎమ్మార్వో విజయశ్రీ, వీఆర్వో, టీడీపీ నాయకులు పర్యటించి జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు.
GNTR: పట్టణ సీతమ్మ కాలనీలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.