మన్యం జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
W.G: ఆకివీడులో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆకివీడులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
NLR: నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యురాలు అంబటి హేమలత రెడ్డి పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. విజయనగరం జిల్లా రాజాంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 63 కేజీల మాస్టర్స్ కేటగిరీలో ఆమె విజయం అందుకున్నారు. హేమలత రెడ్డి ప్రస్తుతం న్యూరో వైద్యురాలిగా నిర్వహిస్తుండగా.. ఆమె భర్త పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు.
VZM: ఒడిశా నుంచి విశాఖకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించగా, ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
CTR: కుప్పంలో పోలీసులు హత్య కేసు ఛేదించారు. భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు. మోట్లచెరువు గ్రామానికి చెందిన భూపతి (38) మార్చి 24న బిక్కలగట్టు సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్న స్థితిలో మృతిగా కనిపించాడు. పోలీసుల దర్యాప్తులో భూపతి భార్యతో పాటు ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచారు.
CTR: జగ్జీవన్ రామ్ 119వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష శనివారం తెలిపారు. నగరంలోని గంగినేని చెరువు కట్ట వద్దగల జగ్జీవన్ రామ్ విగ్రహాం వద్ద నివాళులర్పించిన అనంతరం బీ. ఆర్. అంబేద్కర్ భవనము వరకు, చిత్ర పటములతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల అధికారులు హాజరుకావాలని కోరారు.
VSP: కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) సధారాణి రేలంగి ఈ నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆరో తేదీన ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. అనంతరం ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
VZM: రేగిడి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సేవలు కొనసాగించాలని ఆయన సూచించారు. ఎంపీపీ అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీ అచ్చెం నాయుడు, ఎంపీడీవో శ్యామల కుమారి తదితరులు హాజరయ్యారు.
TPT: మాయాపూర్ హరే రామ హరే కృష్ణ ఆలయ రెండవ పీఠాధిపతి జననీవాస్ మహరాజ్, తిరుపతి హరే రామ హరే కృష్ణ ఆలయ పీఠాధిపతి నీలా పారాయణ ప్రభు నాగలాపురం వేదనారాయణ స్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ ప్రాధాన్యంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
KKD: సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద పశువులకు మేత పట్టుకుని వెళుతుండగా, బొలెరో వ్యాన్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి , ఆయనను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
W.G: పెనుమంట్ర మండలం మాముడూరులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) మృతి చెందారు. సత్తెమ్మ తల్లి ఆలయ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద మట్టి పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్ను రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు.
NDL: నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన చాకలి తిప్పన్నకు రూ.55,000, పందిపర్తి గ్రామానికి చెందిన ఉప్పర వసంత కుమారికి రూ.66,750 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు సహాయంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆదుకుంటామన్నారు.
E.G: ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న కడియం మండలం జేగురుపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శనివారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసరావు ఆద్వర్యంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, వార్డు సభ్యులను, ఎంపీటీసీలు నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, ఆకుల సుధాకర్లను ఘనంగా సత్కరించారు.
BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా పని చేయాలన్నారు.