VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండువగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్వర్ణపుష్పార్చన చేశారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జనరేటర్ను ఏర్పాటు చేసి కొన్ని నెలలు గడుస్తున్న వాడుకలోకి తీసుకు రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. సుమారు రూ. 34 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించి, జనరేటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి, జనరేటర్ను వెంటనే వాడుకులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
NLR: గుంటూరు రూరల్ మండలానికి చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
CTR: కర్ణాటక అత్తిబెలే వద్ద మిస్సైన కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత నెల 27 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అత్తిబెలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడే శ్రీనాథ్ మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు బయటపడింది.
ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టారు. 4 అంతస్తుల వరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించి, వాటిని తొలగించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే నిర్మాణాలను కూల్చివేస్తామని కమిషనర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
KDP: మున్సిపల్ ఎగ్జిబిషన్ డబ్బు చెల్లింపు విషయంలో టీడీపీ నేత కొండారెడ్డి చేసిన ఆరోపణలకు వైసీపీ నేత రాచమల్లు శనివారం ప్రొద్దుటూరులో స్పందించారు. 2014 -19 వరకు వైసీపీ హయాంలో చెల్లించని ఎగ్జిబిషన్ జీఎస్టీ రూ.1,500,000 చెల్లించామని తెలిపారు. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన జీఎస్టీ రూ. 6,500,000 చెల్లిస్తారా అంటూ రాచమల్లు కొండారెడ్డికి సవాల్ విసిరారు.
E.G: సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కోరుకొండ MRO కార్యాలయం వద్ద “ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తులు రామకృష్ణ తెలిపారు. నియోజవర్గం ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని సూచించారు. సంబంధిత అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు.
అనంతపురంలో ‘అనిమల్ బర్త్ కంట్రోల్’ (ఏబీసీ) కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తిరిగి ప్రారంభించడంపై నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం మండిపడ్డారు. గతంలో తాము ప్రారంభించిన దానినే MLA మళ్లీ ప్రారంభిస్తూ ‘వింత వ్యవహారానికి’ తెరలేపారని విమర్శించారు. గతంలో ఈ కేంద్రం ఏర్పాటును ప్రశ్నించిన వారు ఇప్పుడెక్కడికి వెళ్లారని మేయర్ ప్రశ్నించారు.
CTR: SR.పురం మండలం టీడీపీ అధ్యక్షుడిగా గంధమనేని జయశంకర్ నాయుడు మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గంధమనేని జయశంకర్ నాయుడు పార్టీ ఏర్పడిన నుంచి ఎన్నో సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్య కర్తలు, నాయకులను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
CTR: జిల్లా పాలసముద్రం టీడీపీ మండల అధ్యక్షుడిగా తాళ్లూరి శివ నాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కార్యకర్తలు నాయకులను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదివారం గాలివీటి కృష్ణ మోహన్ నాయుడు తండ్రి గాలివీటి శ్రీరాములు నాయుడు వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాములు నాయుడు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
CTR: UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం BC స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు BC సంక్షేమశాఖ అధికారి రబ్బానీబాషా పేర్కొన్నారు. SC,ST,BC అభ్యర్థులకు విజయవాడలో శిక్షణ ఉంటుందని, అర్హత కలిగిన వారు ఈ నెల 17 నుంచి 25 లోగా కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు ఈ నంబర్ను 9177429494 సంప్రదించాలని తెలిపారు.
WG: సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మీ తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
NLR: ఇందుకూరుపేట పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రంథాలయ పితామహులు డాక్టర్ రంగనాథన్, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.