ELR: పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ షీప్ ఫూట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సోమవారం సూచించారు. సాధారణంగా షీప్ ఫూట్ రోలర్లను మట్టిని పటిష్ఠంగా నొక్కడానికి ఉపయోగిస్తారు. ఈ రోలర్ డ్రమ్ చుట్టూ గొర్రె కాళ్ల ఆకారంలో ఉండే ఇనుప మేకులు ఉంటాయి. ఇవి బంకమట్టి వంటి మెత్తటి నేలలను లోతుగా నొక్కి, గాలి బుడగలు లేకుండా చేస్తాయి.
ASR: ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్డ పిక్కల సీజన్ మొదలైంది. అడవుల్లో సహజంగా విరివిగా లభించే ఈ పిక్కలను గిరిజనులు సేకరించి తమ ఆహారంగా వినియోగిస్తుంటారు. అడవుల్లో లభించే పచ్చి పిక్కలను కొందరు నేరుగా తినగా, మరికొందరు వంటల రూపంలో వాడుతుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని గిరిజనులు చెబుతున్నారు. సంతల్లో కూడా వీటి విక్రయం భారీగా ఉంటోంది.
ప్రకాశం: సింగరాయకొండలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహాస్వామి వారి దేవస్థానంలో ఇవాళ శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం 7 గంటలకి స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. అనంతరం తిరుప్పావడ సేవ జరుగుతుందని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకావాలన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు.
కడప: బ్రహ్మంగారి మఠం మండలంలోని దిరసవంచ పంచాయతీ ఎస్సీ కాలనీలో మోటార్ రిపేర్ రావడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాళ్ల పాటి అమీర్ భాష, ఆర్డబ్ల్యూఎస్ఏఈ వెంకటేష్ నూతనంగా మోటార్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేసి ప్రజలకు నీటి సమస్యను పరిష్కరించారు. నూతనంగా మోటార్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేసినందుకు గ్రామస్తులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు.
W.G: భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మీ అనే మహిళ కూల్ డ్రింక్ ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మీ కుమారుడు రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
KRNL: లంబాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆర్.కైలాష్ నాయక్ సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్సింగ్ ఆర్యా, జాతీయ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్లను కలిశారు. రాష్ట్రంలోని లంబాడీల ప్రస్తుత స్థితిగతులు, వారి హక్కుల పరిరక్షణపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
KDP: జనసేన పార్టీ నాయకుడు అతికారి వెంకటయ్య నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వెంకటయ్య మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించారు’ అని అన్నారు.
NDL: APSSDC ఆధ్వర్యంలో ఇవాళ డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 13 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
KRNL: జిల్లాలో FCI డివిజనల్ కార్యాలయం ఎక్కడికీ తరలిపోదని MP బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ఎఫీసీఐ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కార్యాలయాన్ని అనంతపురానికి తరలించే ప్రతిపాదన లేదని అన్నారు. చెన్నైలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్యాలయం కర్నూలులోనే ఉండాలని కోరగా కమిటీ సానుకూలంగా తీర్మానించిందని వివరించారు.
తూ.గో జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పండుగ 4 రోజుల్లో రూ. 17.20 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 25,755 బీరు కేసులు, 14,072 మద్యం కేసులు అమ్ముడయ్యాయన్నారు. జనవరి 1 – 13 వరకు 30,345 బీరు కేసులు అమ్ముడవగా.. పండగ 4 రోజుల్లోనే 25,755 కేసుల విక్రయాలు జరిగినట్లు వివరించారు.
NLR: చేజెర్ల మండలం నేర్నూరు, చిత్తలురూ గ్రామాలలో NFSM క్లస్టర్ డెమోస్ జొన్న, శెనగ పంటలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ADA (R) శివనాయక్, మండల వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చవుడును నిర్ములించాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO L.సుజాత, VAAలు నాగభూషణం, ఝాన్సీ, రైతులు పాల్గొన్నారు.
GNTR: వాణిజ్య పంటల అభివృద్ధికి కేంద్రం కొత్త మిషన్పై దృష్టి సారించింది. పత్తి, మిర్చి వంటి పంటలను ఒకే చట్రంలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇది అమలైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు పెద్ద లాభం చేకూరనుంది. గుంటూరు మిర్చికి జాతీయ స్థాయి మద్దతు లభించే అవకాశం ఉంది. పరిశోధనలు, ఎగుమతులు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
VSP: రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నట్లు సమాచారం. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1,500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటీసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts, 7-లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.
TPT: శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాక గ్రామంలో టీడీపీ నాయకుడు వజ్రం కిషోర్పై దాడి జరిగింది. బంధువుల పొలం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లగా, స్థానికేతరుడివి నీకేం పని అంటూ ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కిషోర్కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ATP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకాన్ని యుద్ధప్రతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కమిటీల ఏర్పాటులో జాప్యం లేకుండా సమర్థులకు అవకాశం కల్పించాలని సూచించారు.