KRNL: జిల్లాలో ఈనెల 2న జరగనున్న డీఈఈ సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885716544 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. హాల్ టికెట్లను apdeecet.apcfss.inవెబ్సైట్ నుంచి పొందొచ్చని చెప్పారు.
W.G: మద్యానికి బానిసై భార్య, కుమారైపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన శనివారం ఇరగవరం మండలంలో జరిగింది. మండలంలోని అర్జునుడుపాలెంకు చెందిన రాంబాబు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీ తులసి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన వీరిని స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
WG: ప్రతికౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుందని జేసీ రాహుల్ అన్నారు. శనివారం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కౌలు రైతుకు పంట సాగుదారు హక్కు చట్టం 2019 లోబడి కొన్ని షరతులు వర్తిస్తాయన్నారు. పంటరుణం, పంట భీమా, నష్టము పొందడానికి వీలవుతుందన్నారు.
ELR: కలెక్టరేట్లో 4 కరోనా కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్వో మాలిణి శనివారం మీడియాకు తెలిపారు. సాధారణ మెడికల్ చెకప్లో భాగంగా సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరికి, ముసునూరుకు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
NLR: సంగం మండల వ్యాప్తంగా శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా పాల్గొని వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామని ఆనం పేర్కొన్నారు.
VZM: మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి రేషన్ వాహనాలు రద్దు చేయమని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాలు రద్దు చేయబోమని చెప్పి జిల్లా పరిషత్లో హామీ ఇచ్చిన మాట నేడు ఏమైనట్లని అన్నారు.
KRNL: కలెక్టరేట్లో జూన్ 2 సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రాలు మున్సిపాలిటీల్లోనూ వినతులు స్వీకరిస్తారు. అర్జీల స్థితి తెలుసుకోవాలంటే 1100 నంబరుకు కాల్ చేయవచ్చని, అలాగే meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు.
KRNL: కౌలు రైతులకు రుణాలు సులభంగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ డాక్టర్ బీ.నవ్య ఆధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన 6వ జిల్లా కోపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని ఆమె అధ్యక్షతన నిర్వహించి, మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా అందే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.
KRNL: కారుణ్య నియామకాల కింద 50 మంది అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ. రంజిత్ బాషా కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. గ్రామ వార్డు సచివాలయాలు పంచాయతీ మహిళా పోలీస్, రెవెన్యూ శాఖలలో వివిధ పోస్టులకు నియామకాలు జరిగాయని, వారి కెరీర్ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ASR: కొయ్యూరు మండలం గోపవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధవల ధారబాబు కుమార్తె యోధశ్రీ (6)అనే చిన్నారి చికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ మృతి చెందింది. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారికి తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరు అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాణిజ్యపరంగా ప్రొద్దుటూరు ఎంతో అభివృద్ధి చెందిందని దానిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
NLR: అల్లూరు పట్టణంలోని కోనేరు సెంటర్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలు జూన్ 1వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1న శ్రీ గణపతి స్వామికి విశేష పూజలు, గణపతి హోమం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 2న స్వామివారికి 108 లీటర్ల పాలతో అభిషేకం, అనంతరం సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.
కోనసీమ: దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, సినీ హీరో ఆర్యన్ రాజేష్ ఓ శుభకార్యం నిమిత్తం మండపేట విచ్చేసి పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మండపేట ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావును కలిసి తన కుమారుడు, కుమార్తె ల పంచె కట్టు, వోణీల వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ను ఎమ్మెల్యే సత్కరించారు.
NLR: టీడీపీ కూటమి ఏడాది పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.121 కోట్ల నిధులతో 685 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. శనివారం ముత్తుకూరు మండలం పిడత పోలూరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు.
NDL: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దు అని MCPI(U), CPIML పార్టీ నాయకులు అన్నారు. శనివారం మిడుతూరు మండలంలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని సందర్శించి, కూలీలకు చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా లిబరేషన్ నాయకులు పాల్గొన్నారు.