W.G: నర్సాపురం రూరల్ పోలీసులు గురువారం డ్రోన్ కెమెరాల సహాయంతో నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించిన కొందరు యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
NDL: స్థానిక నెరవాటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. అండర్ 13 బాలబాలికలకు నిర్వ హించే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 5వ తేదీలోపు ఏపీ చెస్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
AKP: కోటవురట్ల విద్యుత్ సబ్ స్టేషన్ రాజుపేట ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు పనులు జరుగుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ విఎన్ఎం అప్పారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
KDP: ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దాసర్ల దొడ్డి బేస్ క్యాంపులో ఐదుగురు పనిచేస్తున్నారు. వారిలో ప్రొటెక్షన్ వాచర్ D వెంకటయ్యపై ఎలుగుబంటి గురువారం దాడి చేయగా అతని కుడి మోకాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చింతరాజు పల్లె DY రేంజ్ అధికారి నాగూర్ నాయక్ తెలిపారు.
ELR: కుక్కునూరు మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఎక్సైజ్ అధికారులు గురువారం దాడులు జరిపారు. ఈ సందర్బంగా సీఐ శ్రీనుబాబు మాట్లాడుతూ.. పెద్దవాగు ఒడ్డున సారా తయారీ చేస్తున్నారనే సమాచారంతో దాడి చేశామన్నారు. 250 లీటర్ల పులిసిన బెల్లం ఊటను నేలమట్టం చేశామన్నారు. 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
KDP: కలసపాడు మండలం శంఖవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇంఛార్జ్ నితేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో అమలు చేయబోయే పథకాల గురించి ఆయన వివరించారు.
VSP: గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. గురువారం ఆయన విశాఖ కేజీహెచ్ను సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని కలిశారు. గిరిజన ప్రాంతం నుంచి కేజీహెచ్కు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం 9 గంటలకు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:30గం.లకు కృష్ణదేవిపేటలో అల్లూరి మెమోరియల్ పార్కులో అల్లూరి జయంతిని స్టేట్ ఫంక్షన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
W.G: నరసాపురంలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, గోడౌన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జరుగుతున్నాయన్న ప్రభుత్వ అదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్ కుమార్ సింగ్ చెప్పారు.
TPT: వాకాడు గ్రామంలోని మురారి వెంకటయ్య, దీనమ్మ దంపతులకు చెందిన పూరిగుడిసె గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గుడిసె పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న రూ.25వేల నగదు, విలువైన వస్తువులు, వంట సామగ్రి, విద్యార్థుల సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని ప్రమాదానికి తాము నిరాశ్రయులమయ్యామన్నారు.
కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారుల ఆమె తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు. ముందుగా ఆమెకు స్థానిక మహిళలు నాయకులు ఘనస్వాగతం పలికారు.
VSP: బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి మరొక లారీ డ్రైవర్ మరణానికి కారణమైన కేసులో నిందితుడికి విశాఖ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎం. ప్రదీప్ కుమార్ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. గురువారం సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ ఈ వివరాలు తెలిపారు. అప్పలరాజుకు ఏడాది కఠిన జైలు శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పాత కక్షల కారణంగా గురువారం ఆటో డ్రైవర్ జయరాముడుపై శ్రీనివాసులు అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జయరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
GNTR: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC నేతలు అన్నారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పని పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు ఏమాత్రం పెంపుదల చేయలేదని చెప్పారు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
KDP: ఆత్మీయంగా జీవిద్దాం మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం అని ఖాజీపేట CI మోహన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఖాజీపేట మండలంలోని ముత్తులూరుపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్యాక్షన్ కక్షల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.