రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్ వద్ద పద సంచలనం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరువూరు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గురువారం బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
SKLM: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉగాది రోజు స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
VZM: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
PPM: బామిని మండలం తహసీల్దార్ శివన్నారాయణను తక్షణమే సస్పెండ్ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలను తహసీల్దార్ తన ఇంటీ, సొంత పనులకు వాడు కోవడం, దూషణలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే తహసీల్దార్ పై అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయని అన్నారు.
W.G: చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామశాస్త్రి అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులను రామశాస్త్రి అందుకున్నారు.
CTR: మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సర శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురం పంచాయతీలో ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామస్తులు గురువారం ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
PPM: జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన్యం లీగ్స్-2026’ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి రోజు మొత్తం నాలుగు ఉత్కంఠభరిత మ్యాచ్లు జరిగాయి.
CTR: పూతలపట్టులోని తవణంపల్లి(M) కృష్ణాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.పి. హరి రెడ్డి క్రీడలను ప్రారంభించి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పరిసర ప్రాంతాల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక క్రమశిక్షణకు తోడ్పడతాయన్నారు.
VZM : గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద శర్మ చదివి వినిపించారు. పరాభనామ సంవత్సర విశిష్టతను తెలియజేయడంతో పాటు ఏడాదిలో జరిగే అంశాల గురించి వివరించారు.
E.G: పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కృష్ణా: గుడివాడ కార్మిక నగర్లో షేక్ నాగూర్ భాషా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సేవా భావానికి ప్రతిక అని, పేద కుటుంబాలకు ఈ రంజాన్ తోఫా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నేత బాబ్జి పాల్గొన్నారు.
ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ముండ్లమూరు పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. వాహనదారులకు ఆతరాయం కలిగింది. సాధారణంగా ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ వర్షం పడటం వలన ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికింది.
KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి ప్రధాన అర్చకులు జె.ఈరప్ప స్వామి ఉగాది పురస్కారం గురువారం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాల కార్యక్రమంకు ప్రధాన అర్చకుడు ఈరప్ప స్వామి ఎంపిక అయ్యారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
TPT: ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ యాత్ర విశాఖపట్నంలో ముగిసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో 48 సభలు నిర్వహించగా, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.