• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంత్రి సవితను కలిసిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్

SS: మంత్రి సవితను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 3న నిర్వహించనున్న కమ్మ కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ఆమెతో చర్చించారు.

December 29, 2025 / 11:37 AM IST

కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికల వచ్చిన అధ్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార విధి కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజలు వారి వారి సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు.

December 29, 2025 / 11:35 AM IST

పెనుమంట్రలో NCD సర్వే

W.G: పెనుమంట్రలో సోమవారం ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివిధ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని ఏఎన్ఎంలు భాగ్య కుమారి గ్రామస్థులకు సూచించారు.

December 29, 2025 / 11:35 AM IST

‘రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి’

E.G: చాగల్లులోని మసీదు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీటీసీ ఇంటి వీర్రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆయన సూచించారు. అలాగే పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని పేర్కొన్నారు.

December 29, 2025 / 11:34 AM IST

మహానందిలో తెలంగాణ కమిషనర్ పూజలు

NDL: తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పీవీ శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున కుటుంబసమేతంగా మహానందిలో పూజలు నిర్వహించారు. శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

December 29, 2025 / 11:32 AM IST

ఫ్లెక్సీలపై రక్తం ఘటనపై కేసు నమోదు

SS: రొళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.గొల్లహట్టికి చెందిన వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌతమి తెలిపారు. ఈ నెల 21న వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో గొర్రెను కోసి రక్తం ఫ్లెక్సీలపై చల్లిన ఘటనపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.

December 29, 2025 / 11:32 AM IST

పోలీసుల ఆంక్షలు పాటించాలి: సీఐ

CTR: పుంగనూరులో ఈ నెల 31 తేదీ రాత్రి పోలీసుల ఆంక్షలను ప్రజలు పాటించాలని అర్బన్ CI సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. పబ్లిక్ స్థలాలలో వేడుకలు అనుమతించబడవని, టపాసులు కాల్చడం నిషేధమని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిప రాదని, స్పీడ్‌గా బైక్స్ నడపడం వంటివి చేయరాదన్నారు. పట్టణంలో పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

December 29, 2025 / 11:29 AM IST

ఆలూరులో ట్రైనీ కలెక్టర్ ‘ప్రజా ఫిర్యాదుల’ స్వీకరణ

ATP: తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ రహార్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. అధికారులతో కలిసి గ్రామస్థుల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

December 29, 2025 / 11:28 AM IST

బాలుడిని ఢీకొట్టిన టిప్పర్

NLR: సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్ (5) పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 29, 2025 / 11:27 AM IST

28 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అప్ గ్రేడ్

SKLM: కొత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 28 మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో కొత్తూరు-14, హిరమండలం-11, ఎల్.ఎన్.పేట-3 మినీ అంగన్వాడీ కార్యకర్తలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

December 29, 2025 / 11:26 AM IST

పుట్లూరు మండలంలో వరుస కేబుల్ చోరీలు

ATP: పుట్లూరు మండలంలో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా సంజీవపురం, సూరేపల్లి గ్రామాల మధ్య ఎనిమిది బోరు బావుల వద్ద విద్యుత్ వైర్లు కత్తిరించి దోచుకెళ్లారు. వరుస దొంగతనాలతో పెట్టుబడి నష్టపోతున్నామని రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు.

December 29, 2025 / 11:26 AM IST

అగ్ని ప్రమాదం తర్వాత బోగీలు ఇలా..!

VSP: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఎలమంచిలి సమీపంలో మంటలు రావడాన్ని లోకో పైలట్లు గుర్తించి వెంటనే రైలును ఆపేశారు. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి అగ్నికీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు రెండు బోగీలు కాలిపోయాయి.

December 29, 2025 / 11:26 AM IST

హుండేశ్వరపురంలో CMRF చెక్కులు పంపిణీ

E.G: సీతానగరం మండలం హుండేశ్వరపురం గ్రామానికి చెందిన అయినపేట స్వాతికి రూ. 76,835, నేరుగోండుల వీరరాఘవులుకి రూ.35,000 మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సమరం అందజేశారు. వైద్య సహాయం నిమిత్తం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో CMRF నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు.

December 29, 2025 / 11:20 AM IST

బాక్సింగ్ కోచ్‌గా ఎంపికైన కృష్ణవేణిని.. అభినందించిన స్పీకర్

AKP: ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా ఎంపికైన నేషనల్ బాక్సర్ కే. కృష్ణవేణి సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సీపట్నం ప్రభుత్వ బాలికల విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె అక్కడే బాక్సింగ్‌లో తొలి అడుగులు వేసి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. స్పీకర్ ఆమెను అభినందిస్తూ, కోచ్‌గా మంచి విజయం సాధించాలన్నారు.

December 29, 2025 / 11:17 AM IST

ఆకివీడులో తిరిగి ప్రారంభమైన రహదారి పనులు

W.G: ఆకివీడు మెయిన్ రోడ్డు నుంచి శ్మశాన వాటికకు వెళ్లే రహదారి నిర్మాణ పనులు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ప్రోటోకాల్ పాటించలేదనే కారణంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ గతంలో ఈ పనులను నిలిపివేయగా, స్థానిక కూటమి నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు పనులను తిరిగి మొదలుపెట్టారు.

December 29, 2025 / 11:17 AM IST