KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్ ఆవరణలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఏపీవో నరసింహులు తనిఖీ చేశారు. పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూలీలకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి: ఓజిలి మండలం ఏకలవ్య పాఠశాలలో శనివారం సాయంత్రం ఒక విద్యార్థి చేసిన తప్పుకి తరగతులోని విద్యార్థులందరినీ చితకబాదిన వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. మానవత్వం లేని ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు.
KRNL: కర్నూలులోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. నిరుద్యోగులందరూ ఇంటర్వ్యూలకు హాజరై ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు.
PLD: బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. స్థానికుడైన ఓర్చు కృష్ణయ్యపై గోపాలకృష్ణ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణయ్యకు తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZM: ఈ నెల 7వ, తేదిన జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఇవాళ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు రావులపాలెం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన ఎరువులు షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పడవ పోటీల బ్రోచర్ ఆవిష్కరిస్తారు.
SKLM: పలాస M గరుడ ఖండిలో శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు సోమవారం ప్రారంభించారు. డా. కూన అరుణ కుమారి నేతృత్వంలో రోగులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల ఏపీ బేవరేజెస్ గోదాంలో నిల్వ స్థలం తగ్గడంతో లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు అన్లోడింగ్ ఆలస్యమవుతోంది. జిల్లాలోని మద్యం షాపులు, బార్లకు సరఫరా ఇక్కడి నుంచే కావడంతో వాహనాలు ఎక్కువగా చేరుతున్నాయి. కొన్నిసార్లు 10 రోజులు వరకూ వేచి చూడాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు.
అన్నమయ్య: 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యువగుణం పాదయాత్ర చేస్తున్నప్పుడు మదనపల్లెలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే పావని అనే మహిళను కలిశారు. మొత్తం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగినప్పుడు, తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు అని ఆమె చెప్పారు.
ప్రకాశం: పొదిలి మండలం కాటూరివారిపాలెంకు చెందిన మాదాల రాంబాబు (42) గుండెపోటుతో మృతి చెందారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే రాంబాబు జీవనాధారం కోల్పోవడంతో, ఆయన కుటుంబీకులు, స్థానికులు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ATP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం రోటరీపురం గ్రామంలోని ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ హాజరై సంతకాలు స్వీకరించారు.
E.G: రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెన్నాడ ఖ్యాతి లక్ష్మికి మంజూరైన రూ.80,406 విలువ గల CMRF చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా సోమవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పాల్గొన్నారు.
గుంటూరు బస్టాండ్ నుంచి హైకోర్టుకు (వయా తుళ్లూరు) నడుస్తున్న జనరల్ బస్సు సమయాన్ని 15 నిమిషాలు ముందుకు మార్చినట్లు గుంటూరు-1 డిపో మేనేజర్ రామకృష్ణ సోమవారం తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 8 గంటలకు బయలుదేరే బస్సు ఇకనుంచి 7.45 గంటలకే వెళుతుందని, నేటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని, మిగిలిన ట్రిప్పుల సమయం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
KDP: తాడిపత్రి జాతీయ రహదారిపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జంగంపల్లి గ్రామనికి చెందిన ప్రభు కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఓ ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆర్ అండ్ బీ రోడ్లు దుర్భరంగా మారాయి. బారాషహీద్ దర్గా ప్రాంతంలో ఇటీవల వేసిన రోడ్డు దెబ్బతిన్నప్పటికీ, ఆర్ అండ్ బీ అధికారులు ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పొట్టే పాలెం రోడ్డు కూడా అధ్వానంగా మారింది. రోడ్ల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.