PPM: వీరఘట్టం పంచాయతీ కార్యాలయం వద్ద ఓమిగో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాన్సర్ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. క్యాన్సర్ను ప్రాథమిక దశల్లో గుర్తించడం ద్వారా కాపాడుకోవచ్చని అన్నారు.
VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ని తొలగించి వాటిని రోడ్డు రోలర్తో ధ్వంసం చేశామన్నారు.
SKLM: డీ-మత్యలేశం ప్రజల నిజ జీవితం ఆధారంగా తండేల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మత్స్యకారుల జీవితాలను ప్రపంచానికి చూపించిన చిత్ర బృందం, నటీనటులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అభినందనలు తెలిపారు. అలాగే అసలైన తండేల్ రామారావు దంపతులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో గురువారం సత్కరించారు.
VZM: ఇమామ్, మౌజాన్ల గౌరవ వేతనాన్ని గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లులను విడుదల చేశారని విజయనగరం ఎమ్మెల్యే అతిది గణపతిరాజు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తప్పుడు హామీలిచ్చారన్నారు.
SKLM: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులకు ఇచ్చే దోబీలు, బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలను గురువారం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజక వృత్తుల వారికి కేటాయించిన దోబిలకు అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలకు రహదారి సౌకర్యాలు కలిపిస్తున్నామన్నారు.
ASR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్ అన్నారు. గురువారం హుకుంపేట మండలం ఉప్ప గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సత్యారావుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలన్నారు
CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.
పల్నాడు: మాజీ కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. ఆయన వర్దంతిని చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల కోసం, పార్లమెంటులో నైతిక విలువల కోసం ఆయన జీవితాంతం కృషి చేశార...
TPT: తిరుమలలో మరోసారి విమానం కలకలం సృష్టించింది. ఆలయ గాలిగోపురం మీది నుంచి ఫ్లైట్ వెళ్లడంతో అధికారులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా ఇటీవల కూడా తిరుమల ఆలయం పైన విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తరచూ విమానాల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
TPT: గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.
CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.
CTR: ప్రజల ఇంటి భద్రత ఇప్పుడు వారి చేతిల్లోనే ఉందని కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. రూ.2000లకు కూడా కెమెరాలు అందుబాటులో వున్నాయని ఎవరైనా సీసీ కెమెరాలు అమర్చుకోవాంటే తమను సంప్రదించాలని కోరారు.
కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఆర్ కిషోర్ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల మందికి ఆరోగ్యాన్నిస్తున్న క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.