• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మారని గిరిజనుల తలరాత.. మళ్లీ డోలీ మోత

ASR: పెదబయలు మండలం వంచుర్భ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యంతో ఉన్న పోయిబ రాములమ్మను మంగళవారం ఉదయం డోలీలో ఆస్పత్రికి తరలించారు. సెంగెరెడ్డ వీధికి రహదారి లేకపోవడంతో గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. తరాలు మారుతున్నా.. తమ బతుకులు మారడం లేదని, అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

January 20, 2026 / 10:58 AM IST

కౌండిన్య అభయారణ్యంలో కలవరపెడుతున్న ఏనుగుల మృతి

చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో నిన్న ఒక ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందగా, గత పది ఏళ్లలోనే 15 ఏనుగులు కరెంట్ షాక్‌కు బలయ్యాయి. ఏనుగుల భద్రత కోసం అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే అవి క్షీనించిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. 

January 20, 2026 / 10:38 AM IST

‘టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి’

E.G: మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నూతన మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే విధంగా త్వరలో వచ్చే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

January 20, 2026 / 10:37 AM IST

నేటి నుంచి శ్రీ వీర వసంతేశ్వరుడి వార్షికోత్సవం

SKLM: గార మండలం శాలిహుండం శ్వేతగిరిపై వీరవసంతేశ్వరస్వామి ఆలయ సముదాయంలో స్వామివారి వార్షికోత్సవం నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త మహేంద్రాడ రవిశర్మ తెలిపారు. విశేష అర్చన, అభిషేకంతోపాటు హోమాది కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

January 20, 2026 / 10:31 AM IST

వెండి రథంపై అమ్మవారి ఊరేగింపు

AKP: అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ పురవీధుల్లో అమ్మవారిని వెండి రథంపై మేళతాళాలతో ఊరేగించారు. వాసవి మాత జై నామసంకీర్తనతో కార్యక్రమం సాగింది. అనంతరం మూలవిరాట్టుకు క్షీర, పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ మండపంలో 102 వెండి ప్రమిదలతో దీపారాధన చేశారు.

January 20, 2026 / 10:26 AM IST

వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం పూజలు

NLR: సీతారామపురం ప్రధాన వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పూజారి గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

January 20, 2026 / 10:25 AM IST

తెనాలిలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ అప్పల నాయుడు మంగళవారం సుల్తానాబాద్, బోసురోడ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. డ్రెయిన్ల నిర్వహణ, డంపింగ్ యార్డులో వ్యర్థాల తరలింపును పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ఫైకస్ పార్కును సందర్శించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని ఆదేశించారు.

January 20, 2026 / 10:24 AM IST

సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో సోమవారం రాత్రి సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సత్తెమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

January 20, 2026 / 10:20 AM IST

కొచ్చర్ల ప్రాథమిక పాఠశాలకు మరమ్మత్తులెప్పుడు..?

PLD: ఈపూరు మండలం కొచ్చర్లలోని ప్రభుత్వ పాఠశాల భవనం నాసిరకం పనుల వల్ల ప్రమాదకరంగా మారింది. ‘నాడు-నేడు’ కింద నిర్మించిన కొత్త భవనం పైకప్పు కొద్దికాలానికే ఊడిపడుతుండటంతో 87 మంది విద్యార్థులు ప్రాణభయంతో చదువుకుంటున్నారు. భవన నిర్మాణంపై విచారణ జరిపి, తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

January 20, 2026 / 10:16 AM IST

ముగ్గురు సస్పెండ్.. ఒకరి తొలగింపు

NDL: మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ చేసిన ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి పాఠశాల HMతో పాటు డిప్యూటీ వార్డెన్, మరో టీచర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఒక సీఈఆర్టీని విధుల నుంచి ఇవాళ పూర్తిగా తొలగించారు.

January 20, 2026 / 10:15 AM IST

‘ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి’

W.G: ఈ నెల 19 నుంచి 31 వరకు ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆకివీడు పశుసం వర్ధక శాఖ AD డాక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. పశు బీమా పథకం గురించి పశువుల యజమానులకు అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

January 20, 2026 / 10:13 AM IST

జిల్లాలో ఉద్యోగాలకు నేడే లాస్ట్!

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో (KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు అప్లికేషన్లను జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష కార్యాలయంలో అందించాలి.

January 20, 2026 / 10:12 AM IST

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలి: ఎమ్మెల్యే

NDL: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రాని వారికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. సమావేశాలకు హాజరుకాని 11 మంది YCP ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

January 20, 2026 / 10:10 AM IST

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్ఐ

అన్నమయ్య: తంబళ్లపల్లె ఎస్ఐ అనిల్ సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బందితో కలిసి తంబళ్లపల్లె రాగిమానుకూడలి ప్రాంతంలో సైబర్ నేరాలు, బెట్టింగ్, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని మెసేజ్‌లను క్లిక్ చేస్తే అకౌంట్లు ఖాళీ కావచ్చని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు.

January 20, 2026 / 10:05 AM IST

ఘనంగా రాజ్యశ్యామల నవరాత్రి ఉత్సవాలు

NTR: రామకృష్ణాపురంలో శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయములో మంగళవారం నాడు కణ్వాశ్రమవనము జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త అద్దంకి ఉమాప్రసాద్ నీరద రవి రాజు పాలొగొన్నారు. ప్రతి రోజు ఉదయం శ్యామలా అమ్మవారికి షోడశోపచార పూజ సామూహిక కుంకుమార్చన ప్రతి రోజు రాజ్యశ్యామలకి జరుగుతుంది.

January 20, 2026 / 10:04 AM IST