ELR: బుట్టాయగూడెం మండలంలోని బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ సారధులను త్వరగా నియమించుకోవాలని సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.
ELR: జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బత్తిన లక్ష్మి పాల్గొన్నారు.
ATP: బొమ్మనహాల్ మండలం గోనెహల్ గ్రామానికి చెందిన పెద్ద లింగారెడ్డి కుమారుడు వివాహం వరుని స్వగృహంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఎలాంటి మనస్పర్థలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మెట్టు ఆశీర్వదించారు.
ATP: వాస్తవాలను చెక్ చేసుకోకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు, పోస్టులు పెట్టి ఇబ్బందులు పడద్దని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ .. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.
KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలకు విరామం కల్పించినట్లు అర్చకులు తెలిపారు. గురువారం ఏకాదశి సందర్భంగా నిత్య పూజలైన పంచామృత అభిషేకాలు, పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, అలంకరణలు ఉండవని పేర్కొన్నారు. బృందావనానికి మంగళ హారతులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి యథావిధిగా పూజలు ప్రారంభమవుతాయని వివరించారు.
NLR: పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు 15 రోజులుగా సమ్మె చేస్తూ ఏఎన్ఎంలు, సూపర్వైజర్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొదలకూరు CHC ఎదుట యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఎన్ఎంలు, సూపర్వైజర్లు నిరసన తెలిపారు. జీతాల వ్యత్యాసం గురించి అభ్యంతరకరంగా మాట్లాడడం తగదన్నారు. 20, 30 ఏళ్ల సర్వీసు చేస్తేనే తమకు అంత జీతం వస్తోందన్నారు.
ప్రకాశం: ప్రధాన మంత్రి నూర్య ఘర్ పధకాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ ఈఈ పి. శ్రీనివాసులు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో గురువారం ఈ పథరంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పథకం పొందు విధానాన్ని, ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ ఇమ్మాయిల్ బాబు, ఎల్.ఐ కాంతారావు, ఎల్ఎం నారాయణ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలో మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని, రెండు రోజులపాటు పుట్టపర్తిలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పుట్టపర్తిలో శాంతిభద్రతల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
KDP: పులివెందులలోని గుంత బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 11 కె. వి కళాశాల ఫీడర్ కింద ట్రాన్స్ ఫార్మర్ ఎరక్షన్ ఉన్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
KRNL: ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ నేతృత్వంలో బుధవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండ, హుస్సైనాపురం గ్రామాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చంద్ర హాస్ తెలిపారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల సంతపేట కాలనీకి చెందిన హుసేనాబాషా బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవన నిర్మాణ కార్మికుడైన ఇతడు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదని ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.
NLR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నగరంలోని బుజబుజ నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగను శాలువాతో ఘనంగా సత్కరించారు.
KKD: తలసీమియాతో బాధపడుతున్న పిల్లల కోసం గురువారం ఉదయం 10 గంటలు తుని పట్టణంలోని రెడ్ కాన్వెంట్ వీధిలోని రోటరీహాల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ మంగరాజు తెలిపారు. రోటరాక్ట్, ఇన్నర్పీల్ క్లబ్బులతోపాటు మమతా అసుపత్రి, మదర్ బ్లడ్ బ్యాంకు ద్వారా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
KKD:సామర్లకోట అయోధ్య రామపురంలో నేలబావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. బుధవారం గ్రామానికి సమీపంలో ఆటుకుంటుండగా ప్రమాదవశాత్తూ నేలబావిలో పడిపోయాడు.పోలీసులకు సమాచారం అందించగా రెస్క్యూ బృందాలు బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసిన రిస్క్యూం టీం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KDP: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్పై జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పౌర రక్షణ -ముందస్తు భద్రతా చర్యలపై సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప కలెక్టర్, ఎస్పీ కార్యక్రమంలో పాల్గొన్నారు.