SKLM: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉగాది రోజు స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.