KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి ప్రధాన అర్చకులు జె.ఈరప్ప స్వామి ఉగాది పురస్కారం గురువారం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాల కార్యక్రమంకు ప్రధాన అర్చకుడు ఈరప్ప స్వామి ఎంపిక అయ్యారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.