VZM : గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద శర్మ చదివి వినిపించారు. పరాభనామ సంవత్సర విశిష్టతను తెలియజేయడంతో పాటు ఏడాదిలో జరిగే అంశాల గురించి వివరించారు.