సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురం పంచాయతీలో ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామస్తులు గురువారం ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.