ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఇప్పటి వరకు 630 క్యూసెక్కుల నీరు వదలగా, ప్రస్తుతం దాన్ని 300 క్యూసెక్కులకు కుదించారు. కాలువ పరిధిలోని 49 చెరువులు పూర్తిగా నిండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.