‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత వేణు ఊడుగుల, సంధ్యా భాను చల్లా నిర్మాణంలో మరో సందేశాత్మక చిత్రం రాబోతోంది. మధుకర్ రెడ్డి కొమిరెడ్డి దర్శకత్వంలో యదార్థ గాథ ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. అన్నదమ్ముల గొడవలు ఒక ఊరి రాతను ఎలా మార్చాయనే కథాంశంతో ఈ మూవీ రాబోతుంది. ‘ఇల్లు, ఊరు ఓడిపోయిన కథ’ అంటూ మేకర్స్ భావోద్వేగ నోట్ విడుదల చేశారు. ఈ కుటుంబ కథా మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.