GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వివరాల ఇలా ఉన్నాయి. అత్యధికంగా రెంటచింతలలో 39 డిగ్రీల గరిష్ఠ, 23 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38, కనిష్ఠంగా 23 డిగ్రీలుగా రికార్డైంది. నరసరావుపేటలో 38-22, తెనాలిలో 36-23 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.