KDP: మైలవరం మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ పార్క్లోని JCBల నుంచి డీజిల్, ఇనుప కడ్డీలు, దొడియం, వద్దిరాల గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీల అపహరణతో పాటు పలు దుకాణాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. SI శ్యాంసుందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.