VZM: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.