CTR: పూతలపట్టులోని తవణంపల్లి(M) కృష్ణాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.పి. హరి రెడ్డి క్రీడలను ప్రారంభించి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పరిసర ప్రాంతాల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక క్రమశిక్షణకు తోడ్పడతాయన్నారు.