VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం 9 గంటలకు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:30గం.లకు కృష్ణదేవిపేటలో అల్లూరి మెమోరియల్ పార్కులో అల్లూరి జయంతిని స్టేట్ ఫంక్షన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
W.G: నరసాపురంలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, గోడౌన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జరుగుతున్నాయన్న ప్రభుత్వ అదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్ కుమార్ సింగ్ చెప్పారు.
TPT: వాకాడు గ్రామంలోని మురారి వెంకటయ్య, దీనమ్మ దంపతులకు చెందిన పూరిగుడిసె గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గుడిసె పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న రూ.25వేల నగదు, విలువైన వస్తువులు, వంట సామగ్రి, విద్యార్థుల సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని ప్రమాదానికి తాము నిరాశ్రయులమయ్యామన్నారు.
కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారుల ఆమె తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు. ముందుగా ఆమెకు స్థానిక మహిళలు నాయకులు ఘనస్వాగతం పలికారు.
VSP: బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి మరొక లారీ డ్రైవర్ మరణానికి కారణమైన కేసులో నిందితుడికి విశాఖ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎం. ప్రదీప్ కుమార్ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. గురువారం సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ ఈ వివరాలు తెలిపారు. అప్పలరాజుకు ఏడాది కఠిన జైలు శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పాత కక్షల కారణంగా గురువారం ఆటో డ్రైవర్ జయరాముడుపై శ్రీనివాసులు అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జయరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
GNTR: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC నేతలు అన్నారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పని పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు ఏమాత్రం పెంపుదల చేయలేదని చెప్పారు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
KDP: ఆత్మీయంగా జీవిద్దాం మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం అని ఖాజీపేట CI మోహన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఖాజీపేట మండలంలోని ముత్తులూరుపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్యాక్షన్ కక్షల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
KDP: అవినీతికి పాల్పడుతున్న ప్రొద్దుటూరు కడప ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కడపలోని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డీఈవో శంషుద్దిన్కి వినతి పత్రాన్ని అందజేశారు. వీరిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: ఏడాది కాలంలోనే సీఎం చంద్రబాబు ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం మండలంలోని ఓదూరు గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి వారితో కలిసి భోజనం చేశారు.
ATP: అనంతపురంలో 30 ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారు. ఇటీవల చంద్రబాబు నగర్లో ఎమ్మెల్యే పర్యటించగా.. ఇంటి పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మర్తోపాటు విద్యుత్ లైన్లన్నీ మార్చడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం: నూతన మోటర్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. గురువారం మండలంలోని వేములపాడు రోడ్డు నందు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఎస్సై చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.1000లు జరిమానా తప్పదని హెచ్చరించారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ప్రముఖ సినీ నటుడు బాలాజీ గురువారం విచ్చేశారు. ఆయనకు ఆలయ అధికారులు, స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.
VSP: జగదాంబ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు విస్తరించిన రోడ్డు కొలతలను GVMC కమీషనర్ కేతన్ గార్గ్ గురువారం పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి TDRలు జారీ చేసే విషయంలో ఎటువంటి తేడాలు లేకుండా చూడాలని చీఫ్ సిటీ ప్లానర్ ఆదేశించారు. విస్తరణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
విశాఖ జిల్లాలోని దేవదాయ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో దేవాదాయ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. భూముల తాజా పరిస్థితులపై ఈనెల 20లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.