KRNL: కోసిగి మండలంలో ఎమ్మిగనూరు ఆర్కే కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 50 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు. సీఐ మంజునాథ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డా. హేమంత్ కుమార్ నిరుపేదలకు సేవలు కొనసాగిస్తామని తెలిపారు.
CTR: పుంగనూరు నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
SKLM: పలాసలో ప్రతిపాదిత కార్గో ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ అంశంపై మెట్టూరులో ఆదివారం రాత్రి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. గ్రామ ప్రజలు, భూములు కోల్పోయే రైతులు, మహిళలు, పాల్గొన్నారు. భూమి కోల్పోయే కుటుంబాలకు ప్రత్యేక రక్షణతో పాటు అదనపు రూ. 2.30 లక్షల సహాయం ఇవ్వాలని ప్రతిపాదించారు.
కృష్ణా: మచిలీపట్నంలోని మహతి కళా వేదికలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ జల వాయు కాలుష్య నివారణపై నివేదిక అనే సందేశాత్మక నాటక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి సంరక్షణ, కాలుష్య నియంత్రణపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
AKP: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా విద్యార్థులు తరలిరావడంతో పరిసరాలు కోలాహలంగా మారాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
CTR: సోమల (M) నంజంపేట పోస్టుమాస్టర్ చిదానందంను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆదివారం గుంటూరులో జీడీఎస్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్ సేవకులను సన్మానించారు. వారిలో చిదానందం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.
BPT: నగరంలోని SVRM డిగ్రీ కళాశాలలో ఈ నెల 26వ తేదీన భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,450కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 ఏళ్ల పైబడిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి, ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉచిత చిన్న పిల్లలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ATP: నార్పలలోని సుల్తాన్పేట పెట్రోల్ బంకు వద్ద దొంగలు బరితెగించారు. వడ్డే మహేష్ అనే వ్యక్తికి చెందిన బొలెరో వాహనానికి ఉన్న రూ. 45 వేల విలువైన రెండు టైర్లను అపహరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే రెండోసారి ఇలా జరగడంతో బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. పోలీసులు గస్తీ పెంచి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
GNTR: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.
ప్రకాశం: ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
PLD: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుడు కేశవరావు కుమారుని వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాటసాని జయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.
PPM: ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఆంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే మీ భవిష్యత్ బాగుండడంతో పాటు కుటుంబానికి, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళవుతారన్నారు.