• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పదవితో పని లేకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గురువారం మున్సిపల్ తాజా మాజీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పదవితో పనిలేదని అన్నారు. పదవీకాలం ముగిసిన సరే ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

March 19, 2026 / 02:00 PM IST

‘మహనీయుల విగ్రహావిష్కరణకు తరలిరండి’

NTR: కంచికచర్ల మండలం అరుంధతి కాలనీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 31న వీరులపాడు మండలం వి.అన్నవరంలో జరగనున్న మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. “హలో మాదిగ-చలో వి.అన్నవరం” పేరిట రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు.

March 19, 2026 / 02:00 PM IST

ఈనెల 24న మండల సర్వసభ్య సమావేశం

ATP: పుట్లూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 24న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అలివేలమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు తప్పక హాజరుకావాలని సూచించారు.

March 19, 2026 / 01:50 PM IST

ఉగాది పర్వదినాన కాలజ్ఞాన సన్నిధిలో కర్ణాటక వాస్తవ్యులు

KDP: ఉగాది పండగ సందర్భంగా బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాస్తవ్యులు శ్రీమద్విరాట్ పోతులూరు ప్రియ శిష్యులు శ్రీ సిద్దయ్య స్వామి గురు భక్త సేవ మండలి ట్రస్ట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి దర్శించుకున్నారు.

March 19, 2026 / 01:50 PM IST

ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన కొత్తపల్లి

W.G: నరసాపురం అన్నపూర్ణ థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా గురువారం కోలాహలం నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

March 19, 2026 / 01:49 PM IST

కలెక్టరేట్ ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

తూ.గో: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని అధికారులతో, ఉద్యోగులతో కలిసి జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ కలెక్టరేట్ సిబ్బందిని అభినందించారు.

March 19, 2026 / 01:40 PM IST

నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

అనకాపల్లి: పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితోపాటు జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఆర్డీవో షేక్ ఆయిషా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష పాల్గొన్నారు.

March 19, 2026 / 01:38 PM IST

ఘనంగా సినీ నటుడి జన్మదిన వేడుక

TPT: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును శ్రీకాళహస్తి బీజేపీ ఇంఛార్జ్ కోలా ఆనందకుమార్ విద్యానికేతన్ కాలేజ్ నందు వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిశారు. ఈ సందర్భంగా గజమాలను వేసి శాలువాతో ఆయనను సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి స్వామి-అమ్మవార్ల తీర్థ ప్రసాదములు అందజేశారు.

March 19, 2026 / 01:33 PM IST

రాజవొమ్మంగి ఎస్సైగా లతశ్రీ బాధ్యతల స్వీకారం

ASR: రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎల్. లతశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఇక్కడి ఎస్సై శివకుమార్ లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎస్సై పదవికి లతశ్రీని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ నియమించారు. ఇప్పటివరకు పాడేరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎక్కడికి వచ్చారు.

March 19, 2026 / 01:25 PM IST

శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానికి రూ.40 వేల విరాళం

KRNL: మద్దికేర మండలం శ్రీ పెరవలిలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానికి గుడిపాడుకు చెందిన జక్కల రంగస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయంగా రూ.30 వేలు, జి.ఈశ్వరయ్య రూ.10 వేలు ఆలయ ఛైర్మన్ పారా రవికుమార్, ప్రధాన అర్చకుడు రంగనాథ స్వామి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ నగదును ఆలయ అభివద్ది కోసం ఉపయోగించాలని కోరారు.

March 19, 2026 / 01:23 PM IST

యువ రచయితల వేదికలో ఉగాది కవి సమ్మేళనం

శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించినట్లు యురవే అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ గురువారం తెలిపారు. యువ తెలుగు రచయితలను ప్రోత్సహించడానికి యురవే ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని, కొత్త భావాలను అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కవులు తమ కవిత్వాలను చదివి వినిపించారు.

March 19, 2026 / 01:22 PM IST

మోడల్ స్కూల్ అడ్మిషన్స్ ప్రారంభం

NDL: బేతంచెర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్‌లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దాస్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మే 5న మెరిట్ లిస్ట్, 6న సెలెక్షన్ లిస్ట్ విడుదల అవుతాయని వెల్లడించారు.

March 19, 2026 / 01:21 PM IST

‘క్రమ శిక్షణ, దానగుణం రంజాన్ పండుగ ప్రతిక’

PPM: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ పండగ ప్రతికని అని అన్నారు. నెలరోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమ శిక్షణతో కూడిన జీవనం సాగించడం అభినందనీయమన్నారు.

March 19, 2026 / 01:20 PM IST

కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

కడప: కలెక్టరేట్ సభా భవన్‌లో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుడు నాగాంజనేయ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించగా, నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం సభికులను అలరించాయి.

March 19, 2026 / 01:18 PM IST

జిల్లాలో గాలివాన బీభత్సం

KDP: కాశీనాయన(M) సావిశెట్టిపల్లెలో బుధవారం సాయంత్రం గాలితో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన అరటి, మొక్కజొన్న, సజ్జ కోత జరుగుతుండగా గాలివాన వర్షం బీభత్సం సృష్టించడంతో రైతులు కుదేలయ్యారు. కాశీనాయన మండలంలో దాదాపు 200 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అధికారులు న్యాయం చేయాలని రైతులు కోరారు

March 19, 2026 / 01:18 PM IST