NDL: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు నివాళులర్పించారు. బనగానపల్లె పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన అన్నారు.
PPM: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చైత్య భూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు మరువరానివని అన్నారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన బండి వినోద్ కుమార్తె బండి రిషికా (9) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. కష్టకాలంలో తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ASR: కొయ్యూరు మండలం మంపలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన చెందారు. తరచూ సిగ్నల్స్ రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెలలో వారం రోజులు కూడా సిగ్నల్ ఉండడం లేదన్నారు. తమను ఆర్ధిక దోపిడీ చేస్తున్న బీఎస్ఎన్ఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం మంప ఎస్సై కే.శంకరరావుకు ఫిర్యాదు చేశారు.
BPT: ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలను బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సోమవారం ఆవిష్కరించారు. అగ్ని ప్రమాద నివారణ, సురక్షిత పద్ధతులపై అవగాహన కల్పించే ఈ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
VZM: డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చునని స్పష్టం చేశారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణ అన్నారు.
VZM: విజయనగరం, కంటోన్మెంట్ రెల్లివీధిలో జరిగిన బాబాసాహెబ్ 134వ జయంతి వేడుకలకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావిభారత నిర్మాణంలో ముఖ్యమైన రాజ్యాంగ నిర్మాణ బృందంలో అంబేద్కర్ కీలకంగా వ్యవహరించారని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకాలన్నారు.
W.G: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి మందిరంలో జరిగే 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సోమవారం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ELR: అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్దగల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇంఛార్జి కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడటంతో పాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడని పేర్కొన్నారు.
ASR: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలోని పారిశుద్ధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో కురుస్తున్న వర్షాలకు అది మొత్తం తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
GNTR: అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో మంత్రి లోకేష్ ఆయన చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన దేశ సేవను, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషిని గుర్తుచేశారన్నారు. అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమని లోకేష్ అన్నారు.
ELR: ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం నందు గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలుగా ముందుగా రక్తదానం చేయడం జరిగింది. తొలిత అంబేడ్కర్ విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు.
PPM: పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలాల్లో వివిధ గ్రామాల్లో మొక్కజొన్న ధర నేల చూపు చూస్తోంది. పది రోజుల వరకూ క్వింటాల్ రూ. 2,400 వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 2 వేలు పలుకుతోంది. మరింతగా ధర తగ్గుతుందని వ్యాపారులు అంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ .2,225 ప్రస్తుతం ఉంది.
కృష్ణా: చల్లపల్లిలో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ జగన్నాధరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు విచ్చేసి శంకుస్థాపన చేశారు.
BPT: బల్లికురవ మండలం వి.కోప్పెరపాడు పరిధిలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పత్తి వేసిన దశలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలకూలిపోయింది. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30,000 పైగా ఖర్చుపెట్టినట్లు రైతులు వాపోయారు. సుమారు 30 నుంచి 50 ఎకరాల మేర పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.