• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘CSR నిధులతో విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం’

E.G: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజమండ్రి సీటీ నియోజకవర్గానికి CSR నిధుల కింద రూ.7.39 కోట్లు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆ నిధులను ఉపయోగించామన్నారు. సోమవారం రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో CSR నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

December 29, 2025 / 11:14 AM IST

నరసాపురం మున్సిపల్ కమిషనర్ గా వెంకట రామిరెడ్డి

W.G: నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రామిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో నూజివీడు కమిషనర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకూ పనిచేసిన అంజయ్యను అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రభుత్వం బదిలీ చేసింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రామిరెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

December 29, 2025 / 11:14 AM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ.1,09,628 వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. ఇందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.45,370, ప్రసాదం విక్రయం ద్వారా రూ.14,830 ఆదాయం లభించిందన్నారు. అన్నదానానికి విరాళాల ద్వారా రూ.27,364, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ.22,064 ఆదాయం వచ్చిందని ఈవో వెల్లడించారు.

December 29, 2025 / 11:13 AM IST

‘అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలి’

VZM: అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని అంబేడ్కర్‌ పోరాట సమితి అధ్యక్షులు సోరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఇవాళ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతూ.. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు భూమి ఇవ్వాలని నినాదాలు చేశారు. SC, ST సబ్‌ ఫ్లాన్‌ నిధులు మంజూరు చేయాలని, బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

December 29, 2025 / 11:05 AM IST

ఆటో బోల్తా..ముగ్గురు కూలీలకు గాయాలు

BPT: అమృతలూరు మండలం మూల్పూరు వద్ద సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరమ్మతో పాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా పెరవలిపాలెం నుండి మొక్కజొన్న పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

December 29, 2025 / 11:04 AM IST

ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

VSP: గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 29, 2025 / 11:03 AM IST

నంద్యాలలో పర్యటించిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్లో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీ బైరెడ్డి శబరిని ఘనంగా సన్మానించారు.

December 29, 2025 / 11:03 AM IST

జిల్లాలో ఏడు రోజుల పాటు రథస్థప్తమి ఉత్సవాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిను అంగరంగవైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో సోమవారం సమీక్షించారు.

December 29, 2025 / 11:02 AM IST

విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి విరాళం

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు రామడుగుల వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులు రూ.1,16,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

December 29, 2025 / 11:00 AM IST

కాలేజీ ప్రిన్సిపల్‌పై యువకుడు కత్తితో దాడి

PLD: భావన కాలేజీ ప్రిన్సిపల్‌పై MSRపై ఓ యువకుడు కత్తితో దాడి చేశారు. వాకింగ్ చేస్తున్న సమయంలో మంకీ క్యాప్ ధరించి వెంకటేష్ అనే వ్యక్తి కత్తితో చంపేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. 2చోట్ల కత్తి గాయాలు, హటావుటిగా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ప్రస్తుతం 1 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నాడు. గత సంవత్సరం తన చెల్లి కాలేజీ భవనంపై నుంచి దూకింది.

December 29, 2025 / 10:57 AM IST

ఇస్తెమా భక్తుల కోసం ఉచిత బస్సులు: ఎమ్మెల్యే

SS: కదిరిలో జరుగుతున్న తబ్లిగ్ ఇస్తెమాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రెండు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా నేరుగా ఇస్తెమా ప్రాంగణానికి చేరుకునేలా ఈ సదుపాయం కల్పించామన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిం పెద్దలు, సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

December 29, 2025 / 10:54 AM IST

ఓం శక్తి భక్తులకు ఉచిత బస్సు యాత్ర

CTR: గుడిపాల మండలం నంగమంగళం, గట్రాళ్లమిట్ట గ్రామ పంచాయతీలకు చెందిన ఓం శక్తి మాలధారణ భక్తులు మేల్మరువత్తూరు వెళ్ళి రావడానికి ‘జీజేఎం ఛారిటబుల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం ఈ బస్సు యాత్రను ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో సంస్థకు ఓం శక్తి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు

December 29, 2025 / 10:47 AM IST

24 గంటల్లో సమస్యలకు పరిష్కారం: MLA

అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్ సోమవారం ఉదయం నిర్వహించారు. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన ప్రజలు తరలి వచ్చారు. సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు వివరించారు. భూమి, ఇంటి తదితర సమస్యలతో కూడిన 13 అర్జీలు వచ్చాయి. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

December 29, 2025 / 10:46 AM IST

విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే దాట్ల

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు వారికి శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

December 29, 2025 / 10:46 AM IST

వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదు: మంత్రి

SKLM: వైకుంఠ ఏకాదశి రోజుభక్తులు దర్శనాలకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రముఖ వైష్ణవాలయాలు వెంకటేశ్వర ఆలయాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉత్తర ద్వారం దర్శనాలు సాఫీగా సులభతరంగా జరిగేటట్లు చేయాలన్నారు.

December 29, 2025 / 10:46 AM IST