• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యార్థినులకు కిట్లు పంపిణీ

CTR: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని టీడీపీ నాయకులు సి.వి.రెడ్డి, గిరిబాబు ఆకాంక్షించారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 74 మందికి విద్యార్థినులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

February 20, 2025 / 07:40 PM IST

ఈనెల 22న కుప్పానికి రానున్న హైపర్ ఆది

CTR: బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా, కార్యక్రమానికి ఆదితోపాటు మరో నటుడు రాంప్రసాద్ సైతం రానున్నారు.

February 20, 2025 / 07:35 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే సునీల్

TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు అందిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

February 20, 2025 / 07:26 PM IST

కోడిగుడ్లు తిన్న చిన్నారులకు ఫుడ్ పాయిజన్

 కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడ్డారు. చిన్నారుల తల్లి, తండ్రులు తక్షణమే తమ పిల్లలను స్వయంగా మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

February 20, 2025 / 07:10 PM IST

ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: వీరఘట్టం పంచాయతీ కార్యాలయం వద్ద ఓమిగో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాన్సర్ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశల్లో గుర్తించడం ద్వారా కాపాడుకోవచ్చని అన్నారు.

February 20, 2025 / 02:16 PM IST

‘సైలెన్సర్లను ద్వంసం చేసిన పోలీసులు’

VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్‌ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్‌ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్‌ని తొలగించి వాటిని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశామన్నారు.

February 20, 2025 / 02:01 PM IST

తండేల్ రామారావు దంపతులను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: డీ-మత్యలేశం ప్రజల నిజ జీవితం ఆధారంగా తండేల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మత్స్యకారుల జీవితాలను ప్రపంచానికి చూపించిన చిత్ర బృందం, నటీనటులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అభినందనలు తెలిపారు. అలాగే అసలైన తండేల్ రామారావు దంపతులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో గురువారం సత్కరించారు.

February 20, 2025 / 01:52 PM IST

‘మైనార్టీలకు తప్పుడు హామీలిచ్చిన గత ప్రభుత్వం’

VZM: ఇమామ్, మౌజాన్‌ల గౌరవ వేతనాన్ని గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లులను విడుదల చేశారని విజయనగరం ఎమ్మెల్యే అతిది గణపతిరాజు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తప్పుడు హామీలిచ్చారన్నారు.

February 20, 2025 / 01:44 PM IST

‘కులవృత్తుల వారికి మౌలిక సదుపాయాలు కల్పన’

SKLM: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులకు ఇచ్చే దోబీలు, బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలను గురువారం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజక వృత్తుల వారికి కేటాయించిన దోబిలకు అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలకు రహదారి సౌకర్యాలు కలిపిస్తున్నామన్నారు.

February 20, 2025 / 01:42 PM IST

‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి’

ASR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్ అన్నారు. గురువారం హుకుంపేట మండలం ఉప్ప గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సత్యారావుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలన్నారు

February 20, 2025 / 01:38 PM IST

దక్షిణామూర్తికి విశేష పూజలు

CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.

February 20, 2025 / 01:03 PM IST

ఇంద్రజిత్ గుప్తా ఆశ‌యాల‌ను కొనసాగించాలి

పల్నాడు: మాజీ కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. ఆయన వ‌ర్దంతిని చిలకలూరిపేట పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల కోసం, పార్ల‌మెంటులో నైతిక విలువ‌ల కోసం ఆయ‌న జీవితాంతం కృషి చేశార...

February 20, 2025 / 12:48 PM IST

తిరుమల ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు

TPT: తిరుమలలో మరోసారి విమానం కలకలం సృష్టించింది. ఆలయ గాలిగోపురం మీది నుంచి ఫ్లైట్ వెళ్లడంతో అధికారులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా ఇటీవల కూడా తిరుమల ఆలయం పైన విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తరచూ విమానాల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

February 20, 2025 / 11:26 AM IST

రేపు గూడూరులో జాబ్ మేళా

TPT: గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 20, 2025 / 11:14 AM IST

గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

February 20, 2025 / 11:01 AM IST