• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అండర్-19 వన్డే ట్రోఫీకి కౌసల్య భాయి ఎంపిక

KRNL: వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామానికి చెందిన కౌసల్య భాయి బీసీసీఐ ఆధ్వర్యంలో జరగబోయే అండర్-19 ఉమెన్స్ వన్డే ట్రోఫీకి ఎంపికయ్యారు. ఈ టోర్నీ డిసెంబర్ 13 నుంచి 21 వరకు ముంబైలో జరగనుంది. కర్నూలులోని శిక్షకుడు శేఖర్ వద్ద కౌసల్య భాయి క్రికెట్ మెలకువలు నెర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

December 8, 2025 / 11:06 AM IST

‘పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి’

VZM: చెత్తను తమ ఇంటికి వచ్చే పారిశుద్ధ్య వాహనములకు అందజేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు సహకరించాలని రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు కోరారు. ఇవాళ పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కాలనీల్లోని డ్రైనేజీ సమస్యలు, పాడయిన రహదారులు, పారిశుద్ధ వం, పలు రకాల సమస్యలు ప్రజలను కలసి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి, సమస్యలు పరిష్కారిస్తామన్నారు.

December 8, 2025 / 11:04 AM IST

విజయవాడలో ద్విచక్ర వాహనాలు ఢీ.. బైక్ దగ్ధం

NTR: విజయవాడ కృష్ణలంక ఫ్లై ఓవర్‌పై సోమవారం ఉదయం బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. బైక్‌లో నుంచి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. బైక్, స్కూటీపై వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 8, 2025 / 11:04 AM IST

రాష్ట్రస్థాయి కౌశల్ పోటీలకు బోయినపల్లి విద్యార్థిని ఎంపిక

అన్నమయ్య: భారతీయ విజ్ఞానమండలి AP ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ క్విజ్ పోటీలలో రాజంపేట మండలం బోయిన పల్లె SJSM ZPHS పాఠశాల 8వ తరగతి విద్యార్థినీ ఎం.గోపిక జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి క్విజ్ పోటీలకు ఎంపికయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భారతి పాఠశాల సిబ్బంది కౌశల్ గైడ్ టీచర్ రాజయ్య,గోపికను అభినందించారు.

December 8, 2025 / 11:04 AM IST

రేపు వేలేరుపాడులో జనవాణి కార్యక్రమం

ELR: వేలేరుపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమంలో ప్రారంభం అవుతుందని అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు.

December 8, 2025 / 11:00 AM IST

భట్టిప్రోలు వీధుల్లో పందుల స్వైరవిహారం..!

BPT: భట్టిప్రోలులో వీధుల్లో పందుల సంచారం తీవ్రమైంది. ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో అవి విచ్చలవిడిగా తిరుగుతుండటంతో రోగాల భయం వెంటాడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఇప్పటికైన స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని సోమవారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.

December 8, 2025 / 10:59 AM IST

రూరల్ పోలీస్ స్టేషన్‌లో లోక్ అదాలత్

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై చంటిబాబు లోక్ అదాలత్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న వివాదాలు, పరస్పర అంగీకారంతో ఉండే కేసులను ఇరుపక్షాల సమక్షంలో పరిష్కరించారు. ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించి, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

December 8, 2025 / 10:59 AM IST

స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు అనూహ్య స్పందన

సత్యసాయి: పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘సాయి ఫ్రూడెంట్ స్కాలర్‌షిప్ టెస్ట్’కు విద్యార్థుల నుంచి అద్భుత స్పందన లభించింది. కర్నూలు, చిత్తూరు, కాకినాడ సహా పలు జిల్లాల నుంచి 4,300 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని ప్రిన్సిపల్ హేమచంద్ర తెలిపారు. అర్హత సాధించిన వారికి ఉచిత హాస్టల్, విద్య అందిస్తామని ప్రకటించారు.

December 8, 2025 / 10:54 AM IST

మద్దికేర యువకుల చొరవ.. స్థానికుల ప్రశంసలు

KRNL: మద్దికేర నుంచి గుంతకల్ రహదారిలో ఏర్పడిన అనేక గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోమవారం ఆ గుంతలను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేశారు. యువకుల ఈ చొరవను పలువురు వాహనదారులు, గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, వంశీ, నాగరాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

December 8, 2025 / 10:53 AM IST

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

E.G: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన నిమిత్తం సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఎమ్మెల్యే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 8, 2025 / 10:52 AM IST

పలాస సీఐ హెచ్చరికల జారీ

SKLM: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వై.రామకృష్ణ తెలిపారు. సోమవారం పలాస సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. స్థానికులు పోలీసులకు సహకరించాలన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.

December 8, 2025 / 10:49 AM IST

వైసీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు

ATP: వైసీపీ అనుబంధ కమిటీలలో జిల్లా నేతలకు చోటు దక్కింది. అనంతపురానికి చెందిన రాజేష్‌రెడ్డి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. కళ్యాణదుర్గానికి చెందిన రాము బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా, నాగలక్ష్మి మహిళా విభాగం జాయింట్‌ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

December 8, 2025 / 10:48 AM IST

గిరిజన బాలికల హాస్టల్‌పై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ఉదయమే గిరిజన బాలికల హాస్టల్‌ను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి, భోజనం, నీటి సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు సూచించారు. భద్రత, వంటగది శుభ్రత, వైద్య పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

December 8, 2025 / 10:45 AM IST

బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా సత్య సాయిరామ్

E.G: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా రాజమండ్రికి చెందిన కాలెపు సత్య సాయిరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రొంగాల గోపి శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. కాలెపు సత్య సాయిరామ్ గతంలో జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడుగా, బీజేపీ జిల్లా కార్యదర్శిగా, ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.

December 8, 2025 / 10:43 AM IST

శ్రీవారి సేవలో పలాస ఎమ్మెల్యే

SKLM: పలాస ఎమ్మెల్యే గౌత . శిరీష కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.

December 8, 2025 / 10:43 AM IST