• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ గోడ పత్రిక ఆవిష్కరణ

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా స్కిల్ కాంపిటీషన్-2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను వీసీ గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.

September 9, 2025 / 09:41 PM IST

టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధరలు నిర్ణయం: కలెక్టర్

అన్నమయ్య: సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.8, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా ఎగుమతి ధరలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం ప్రకటించారు. మార్కెట్‌లో వ్యాపారులు నిర్దేశిత ధరల కంటే తక్కువకు అమ్మితే, వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లు 95739 90331 / 90303 15951లను సంప్రదించాలని రైతులకు సూచించారు.

September 9, 2025 / 08:56 PM IST

చీకటి రోజుకు రెండేళ్లు: ఎమ్మెల్యే

CTR: నాటి వైకాపా సర్కార్ అక్రమంగా కేసులు నమోదు చేసి CM చంద్రబాబును అరెస్టు చేసిన చీకటి రోజులకు రెండేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఒక ప్రకటనలో గుర్తుచేశారు. అరెస్టును రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారంతా తీవ్రంగా ఖండించారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను తెప్పించి ఇస్తున్నా.. వైకాపా నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

September 9, 2025 / 08:50 PM IST

49వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని 49వ డివిజన్లో ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో మంగళవారం సాయంత్రం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు సూచనలు ఇచ్చారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీలు నిర్మించాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని తదితర సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

September 9, 2025 / 08:50 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా

TPT: ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా లాంటిదని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చెప్పారు. ఇవాళ సాయంత్రం పుత్తూరు పట్టణంలోని 2 వ వార్డ్, కె.యం. అగ్రహారానికి చెందిన చిరంజీవికి ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 4,83,226 మంజూరు చేయించారు. అయితే ఇవాళ చెక్కును ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు.

September 9, 2025 / 08:43 PM IST

నిరంతరాయంగా యూరియా సరఫరా

కృష్ణా: కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని ఎస్పీ ఆర్.గంగాధరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 3,180 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, టోకెన్ విధానం ద్వారా అర్హులందరికీ యూరియా అందజేస్తున్నామని చెప్పారు. అక్రమ నిల్వలు, రవాణా లేదా అపోహలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

September 9, 2025 / 08:39 PM IST

బంగారు వ్యాపారి హత్య కేసులో ఇద్దరు అరెస్టు

SKLM: నరసన్నపేటలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి పొట్నూరు గుప్త హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ లక్ష్మణ తెలిపారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హత్య కేసులో మురళి అప్పలరాజ జవ్వాది సంతోష్ కుమార్‌లను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుండి కేజీ 33 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

September 9, 2025 / 08:36 PM IST

‘పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత’

ELR: పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం నూజివీడులోని ఆయన కార్యాలయంలో ఆగిరిపల్లి మండలం కొత్త ఎదర గ్రామానికి చెందిన బెక్కం మంగాకుమారికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ.50 వేలు విలువైన LOC పత్రాలను మంత్రి పార్థసారధి అందచేశారు.

September 9, 2025 / 08:33 PM IST

ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు జాబ్ మేళా

SKLM: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 28 ఏళ్ల వయసు గల యువతీ, యువకులు, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.

September 9, 2025 / 08:30 PM IST

ప్రతిరోజూ చెత్త సేకరణ తప్పనిసరి: కలెక్టర్

అన్నమయ్య: ములకలచెరువు మండలం, సోంపల్లి పంచాయతీలోని ఎస్డబ్ల్యూపీసీ చెత్త సేకరణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి పొడి చెత్త విభజన పనులు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ వర్కర్ల సంఖ్య, జీతాలు, ట్రైసైకిళ్లు, డంపింగ్ పద్ధతులపై పంచాయతీ ప్రశంసించారు.

September 9, 2025 / 08:28 PM IST

రైతులను పట్టించుకోకుండా నిద్రపోతున్న ప్రభుత్వం

KDP: రైతులను పట్టించుకోకుండా నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళ కట్టెతో తట్టి లేపాల్సిన దుస్థితి రాష్ట్ర రైతులకు వచ్చిందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ పిలుపు మేరకు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు.

September 9, 2025 / 08:28 PM IST

సీఎం దృష్టికి అప్పసముద్రం ఘటన

NLR: ఉదయగిరి(M) అప్పసముద్రంలో వినాయక నిమజ్జన సందర్భంగా బాణసంచా పేలుళ్లలో గాయపడిన 9 మంది బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సహకారంతో సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

September 9, 2025 / 08:27 PM IST

ఎక్సైజ్ అధికారులు దాడులు.. బెల్లపు ఊట ధ్వంసం

ELR: చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఇస్లావతు బాలాజీ, దేశావతు శ్రావణికి చెందిన 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇరువురిపై పరారీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. పాత కేసులో పరారీలో ఉన్న వాక దేవాంజనేయులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచామన్నారు.

September 9, 2025 / 08:24 PM IST

ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

KDP: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లాలో తనకల్లు మండలంలోని కొక్కంటి సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కడప జిల్లా కొండప్పగారిపల్లి, బురుజుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్రహారంపల్లిలో టమాటా తోటలో పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

September 9, 2025 / 08:23 PM IST

రాజంపేటలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

అన్నమయ్య: రాజంపేట అటవీ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం ప్రత్యేక దాడిలో 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు, డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్, ఆర్ఎస్సై వినోద్‌కుమార్ బృందం చేపట్టింది.

September 9, 2025 / 08:23 PM IST