SKLM: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కలెక్టర్ను ఆదేశించారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో IFWJ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించగా, మంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
GNTR: దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ఆవిష్కరించారు.
NDL: ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురం గ్రామంలో ఈనెల 11వ తేదిన జరిగిన హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోస్సా తెలిపారు. ఇవాళ ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు కు వెళ్లే రహదారి లో ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆమె వివరించారు.
NDL: అసమానతలు రూపుమపి, ప్రతిఒక్కరి కి స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన వ్యక్తి డాక్టర్ B.R అంబేద్కర్ అని నంది కొట్కూరు MLA గిత్త జయసూర్య అన్నారు. అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ను స్ఫూర్తిదాయకoగా తీసుకొని సమసమాజo దిశగా అడుగులు వేద్దాo అన్నారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆరు కిలోల గంజాయి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజ్జాయిని పట్టుకున్నారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
CTR: శాంతిపురం(M) గొల్లపల్లిలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘గొల్లపల్లి ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో అమిగోస్- 11 టీంపై భగత్ సింగ్- 11 టీం ఘన విజయం సాధించింది. అనంతరం విజేతలకు గ్రామస్థులు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల ద్వారా ఐక్యతను చాటడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
SKLM: హఠాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటబొమ్మాలి అగ్నిమాపకాధికారి రెడ్డి కోరారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగునున్న అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ ప్రారంబించారు. అగ్నిమాపక కేంద్రంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తు జెండా ఎగురవేసి నివాళులర్పించారు.
BPT: బల్లికురవ మండలంలోని కుమ్మినేనివారిపాలెం గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా వరి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రబి సీజన్లో పండించిన వరిని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. సాధారణ రకం వరికి రూ.2369, ఏ-గ్రేడ్ వరికి రూ.2389 మద్దతు ధరను నిర్ణయించారు.
VSP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చినవాల్తేరులో ఒక గృహంపై ఏర్పాటు చేసిన ప్లాంట్ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ…. 3,595 మందికి 7.19 మెగావాట్ల ప్లాంట్లు కేటాయించామని తెలిపారు.
కర్నూలులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ మంత్రి టీజీ భరత్ గుప్తా నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం దేశ అభివృద్ధికి పునాది అని, ప్రభుత్వం హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగావకాశాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మండలం గాజులపల్లిలో పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీతో సోలార్ వ్యవస్థ అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2438 మందికి 27.50 కోట్ల వ్యయంతో ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.
E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో పంగిడిగూడెం నుంచి ద్వారకా తిరుమల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాట స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
W.G: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘటితంగా ఉండటం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని సామాజిక సమానత్వం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.
GNTR: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా 21 మంది విద్యార్థులతో కూడిన బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 16 రోజులపాటు జరిగే ఈ యాత్రలో విద్యార్థులు ఖాట్మండు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.
ELR: ఏపీ కో-ఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరుకు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ర్యాలీ భీమడోలు చేరుకుంది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్నివీరాంజనేయులు వారికి స్వాగతం పలికి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉద్యోగులపై అన్యాయపు కేసులు రద్దుచేసి రాజకీయ ప్రేరేపిత విచారణలు నిలిపివేయాలని కోరారు.