• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తండ్రిపై కుమారుడు దాడి

అన్నమయ్య: పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ ఎన్ఆర్ బైలులో తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. లక్ష్మన్న (56) మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుండగా కుమారుడు గంగాధర్ అడ్డుకున్నాడు. అయినా తండ్రి ఆగకపోవడంతో గంగాధర్ కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన లక్ష్మన్నను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 24, 2026 / 06:05 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుర్రంకొండ మండలం రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు రోడ్డు దాటుతుండగా, నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లికి చెందిన మంజు, సుదర్శన్ కర్ణాటక నుంచి బైకుపై వస్తూ అతన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడగా, వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 24, 2026 / 06:04 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికే బీజేపీ జనతా వారధి’

కోనసీమ: అమలాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న మండల అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తీసుకుని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.

April 24, 2026 / 06:02 PM IST

అచ్చంపేటలో టీడీపీ జెండా ఆవిష్కరణ

PLD: కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు అచ్చంపేట మండలం చింతపల్లి, సండ్రతండా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన TDP జెండా ధిమ్మెల వద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

April 24, 2026 / 06:02 PM IST

మహిళా డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ అభివృద్ధి, విద్యార్థుల్లో చదవడం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు లైబ్రేరియన్ మాదల మోహన్ కుమార్ చెప్పారు. పోటీ పరీక్షలకు, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి గ్రంథాలయం తోడ్పడుతుందని ప్రిన్సిపాల్ పి చలపతిరావు తెలిపారు.

April 24, 2026 / 06:01 PM IST

మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిడిపివోలు, సూపర్వైజర్లతో జరిగిన ఈ భేటీలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పోషకాహార పంపిణీపై దిశానిర్దేశం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

April 24, 2026 / 06:00 PM IST

‘ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలి’

NLR: సంగం మండలంలోని పెరమణా గ్రామంలో శుక్రవారం స్థానిక వైద్య సిబ్బంది మెగా వైద్య ఆరోగ్య శిబిరం, ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ… ప్రతి నెల గ్రామానికి వచ్చే 104 వాహనంపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఎండల పట్ల ప్రతి అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 24, 2026 / 06:00 PM IST

అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి

KKD: తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, పిఠాపురంలో పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండటంపై SFI మండల కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. MEO షేక్ నాగిన్‌కు నాయకులు వినతి పత్రం అందించారు. ​ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ తరగతులు నిర్వహిస్తున్న స్కూల్స్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 24, 2026 / 06:00 PM IST

కొత్తచెరువు లో పండ్ల మొక్కలు పంపిణీ

శ్రీ సత్యసాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తచెరువులో శుక్రవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యామిని శృతి ప్రజలకు 15 వేల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.

April 24, 2026 / 06:00 PM IST

‘బాలల హక్కులకు భంగం కలగకుండా చూడాలి’

ELR: బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బాల్య వివాహ నిషేధచట్టం, దత్తత విధానం, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు, అందించే సేవలుపై గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇవాళ దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. జిల్లాలో బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలన్నారు.

April 24, 2026 / 05:59 PM IST

గంజాయి నియంత్రణలో మన్యం నెంబర్ వన్

PPM: గంజాయి నియంత్రణలో మన్యం జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ, ఇతర విభాగాల కృషిని అభినందించారు. విద్యాసంస్థల వద్ద మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

April 24, 2026 / 05:59 PM IST

ఏరాల నియంత్రణకు సీసీ కెమెరాలు

VZM: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని గజపతినగరం సీఐ జిఏవి రమణ చెప్పారు. శుక్రవారం గజపతినగరం సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ జంక్షన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

April 24, 2026 / 05:58 PM IST

మంగళగిరిలో ప్రజల వినతులు స్వీకరించిన సీఎం

GNTR: సీఎం చంద్రబాబు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి వినతులు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న సీఎం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 24, 2026 / 05:55 PM IST

ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

AKP: నర్సీపట్నంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ షేక్ గఫూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో నక్కపల్లికి చెందిన అనుమాను శ్రీను పట్టుబడగా, విచారణలో ఒక మైనర్ పాత్ర కూడా బయటపడింది. వీరి వద్ద నుంచి 8 దొంగిలించిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

April 24, 2026 / 05:55 PM IST

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి: తులసిరెడ్డి

KDP: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు లేదా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని మాజీ ఎంపీ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య, విద్యకు దూరమవుతారని, రోగులకు ఉచిత వైద్యం అందదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

April 24, 2026 / 05:54 PM IST