W.G: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవాలని,సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం మండలం ఈలంపూడి సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఛైర్మన్గా మంతెన త్రినాథ రాజు, డైరెక్టర్లుగా యర్రంశెట్టి లక్ష్మణ్, బొక్కా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.
ATP: జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘అనంత పాల ధార’ పేరిట జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు-2026 నిర్వహించనున్నారు. ఈ పోస్టర్ను కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆవిష్కరించారు. జనవరి 7 నుంచి 9 వరకు ఆకుతోటపల్లిలో ఈ పోటీలు జరుగుతాయి. సంకర జాతి ఆవులు, దేశీయ ఆవులు, గేదెల విభాగాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల యజమానులకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్లు పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 56 వినతులు వచ్చినట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విజయనగరం: వంగర మండలానికి 6 వెల్నెస్ సెంటర్లు మంజూరైనట్లు వైద్యాధికారిణి CH సుస్మిత దయాన సోమవారం తెలిపారు. వంగర మండలంలోని కింజంగి, కొప్పర, మడ్డువలస, మరువాడ, వీవీఆర్ పేట, శ్రీహరిపురం గ్రామాలకు వెల్నెస్ సెంటర్లు మంజూరయ్యయన్నారు. రూ.2.16 కోట్లతో వాటి సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఇంజినీర్ అధికారి ప్రభాకర్ రావు చెప్పారు.
GNTR: తెనాలి యడ్ల లింగయ్య కాలనీలో నివసిస్తున్న 30 గిరిజన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్, ఆధార్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా వ్యర్థాలు సేకరిస్తూ జీవిస్తున్న ఈ పేదలకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేదని, అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.
KRNL: సాయుధ దళాల ఫ్లాగ్ డే నిధి కోసం పట్టణ మహిళా సంఘాలు సేకరించిన రూ. 2 లక్షల చెక్కును మెప్మా పీడీ, మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ ఏ. సిరికి అందజేశారు. ఫ్లాగ్ డే నిధికి విడివిడిగా విరాలాలు అందజేయాలని కలెక్టర్ కోరారు. సాయుధ దళాల సంక్షేమానికి మహిళా సంఘాల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
సత్యసాయి: కదిరిలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈనెల 30న ఉదయం 3.30 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 4,000 మంది అంగనవాడీ వర్కర్స్కు ఈఎస్ఐ కల్పించాలంటూ ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సామయ్య డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్లో సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ తీవ్ర అనారోగ్యాలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, స్త్రీ ఈఎస్ఏ పథకం వర్తింప చేయాలని కోరారు.
BPT: రేపల్లె ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4 ఫిర్యాదులు స్వీకరించామని ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. చెరుకుపల్లి, నగరం, కొల్లూరు, రేపల్లె మండలాల నుంచి ఒక్కొక్క ఫిర్యాదు వచ్చిందన్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
KRNL: ఆదోని యువ ప్రతిభావంతుడు, పద్మగిరి ఈవెంట్స్ అధినేత ఉదయ్ కిరణ్, ఈవెంట్ మేనేజ్మెంట్లో చూపిన ప్రతిభకు జాతీయ గుర్తింపు పొందారు. సోమవారం బెంగళూరులో “ఇండియా బిజినెస్ ఐకానిక్ అవార్డు ” గ్రాండ్ అవార్డ్స్కి ఆయన ఎంపికయ్యారు. ప్రత్యేక పనితనం, నాణ్యత, కస్టమర్ నమ్మకం, అత్యుత్తమ సేవల కారణంగా అతనికి ఈ అవార్డు లభించడం విశేషం.
కృష్ణా జిల్లాలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ బాలాజీ ప్రత్యేక చర్యలు చేపట్టారు.’రెవెన్యూ క్లినిక్’ పేరుతో కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 7 కౌంటర్లను ఏర్పాటు చేసి రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన, 22A సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు,పాస్ బుక్స్, రీసర్వే తదితర సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు.
ASR: అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉన్నా గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాటుధర లభించడం లేదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. సోమవారం అరకులోయ గిరిజన భవనంలో విలేకరుల సమావేశంలో బాలదేవ్ మాట్లాడారు. కేజీ కాఫీ గింజలకు రూ. 600లు, చెర్రీ కాపీ రూ. 300లు, కాఫీ పండ్లకు రూ.150లు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి 4వ సోమవారం కలెక్టరేట్లో, మిగిలిన వారాల్లో డివిజన్ స్థాయిలో ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మ్యుటేషన్లు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూముల ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
PPM: భద్రగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మహా ప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల భద్రగిరి ఆసుపత్రి నుంచి మహిళ మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోవాలన్నారు.
GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి మార్కెట్ యార్డులో సోమవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, రైతుల మధ్య చర్చ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మిరపలో నల్ల తామర పురుగు, వైరస్ నివారణ పద్ధతులు, పత్తిలో గులాబీ రంగు కాయదులుచు పురుగు నియంత్రణపై అవగాహన కల్పించారు.