• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచండి: AITUC

GNTR: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC నేతలు అన్నారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. పని పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు ఏమాత్రం పెంపుదల చేయలేదని చెప్పారు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

July 3, 2025 / 08:00 PM IST

బంగారు భవితకు బాటలు వేద్దాం: CI

KDP: ఆత్మీయంగా జీవిద్దాం మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం అని ఖాజీపేట CI మోహన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఖాజీపేట మండలంలోని ముత్తులూరుపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్యాక్షన్ కక్షల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.

July 3, 2025 / 07:58 PM IST

‘MEOలను వెంటనే సస్పెండ్ చేయాలి’

KDP: అవినీతికి పాల్పడుతున్న ప్రొద్దుటూరు కడప ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కడపలోని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డీఈవో శంషుద్దిన్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. వీరిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

July 3, 2025 / 07:57 PM IST

సీఎం ఆధ్వర్యంలోనే సంక్షేమం: మంత్రి

కోనసీమ: ఏడాది కాలంలోనే సీఎం చంద్రబాబు ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం మండలంలోని ఓదూరు గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి వారితో కలిసి భోజనం చేశారు.

July 3, 2025 / 07:50 PM IST

30 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

ATP: అనంతపురంలో 30 ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారు. ఇటీవల చంద్రబాబు నగర్‌లో ఎమ్మెల్యే పర్యటించగా.. ఇంటి పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మర్‌తోపాటు విద్యుత్ లైన్లన్నీ మార్చడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు.

July 3, 2025 / 07:45 PM IST

నూతన మోటర్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

ప్రకాశం: నూతన మోటర్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. గురువారం మండలంలోని వేములపాడు రోడ్డు నందు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఎస్సై చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.1000లు జరిమానా తప్పదని హెచ్చరించారు.

July 3, 2025 / 07:43 PM IST

శివయ్యను దర్శించుకున్న సినీ నటుడు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ప్రముఖ సినీ నటుడు బాలాజీ గురువారం విచ్చేశారు. ఆయనకు ఆలయ అధికారులు, స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.

July 3, 2025 / 07:26 PM IST

రోడ్డు కొలతలను పరిశీలించిన GVMC కమిషనర్

VSP: జగదాంబ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు విస్తరించిన రోడ్డు కొలతలను GVMC కమీషనర్ కేతన్ గార్గ్ గురువారం పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి TDRలు జారీ చేసే విషయంలో ఎటువంటి తేడాలు లేకుండా చూడాలని చీఫ్ సిటీ ప్లానర్ ఆదేశించారు. విస్తరణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

July 3, 2025 / 06:44 PM IST

దేవదాయ భూముల రక్షణకు చర్యలు

విశాఖ జిల్లాలోని దేవదాయ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో దేవాదాయ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. భూముల తాజా పరిస్థితులపై ఈనెల 20లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

July 3, 2025 / 06:37 PM IST

రాజవొమ్మంగిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

VSP: రాజవొమ్మంగి గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్ గురువారం కూటమి శ్రేణులతో కలిసి “సుపరిపాలనలో తొలి అడుగు”లో భాగంగా డోర్ టూ డోర్ పర్యటన నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి, ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన కల్పించారు.

July 3, 2025 / 06:33 PM IST

ఆవుపై పెద్దపులి దాడి..తృటిలో తప్పిన ప్రమాదం

ప్రకాశం: యర్రగొండపాలెం మండలం పాలూట్ల గ్రామంలో పెద్దపులి టెన్షన్ స్థానిక ప్రజలను వెంటాడుతూనే ఉంది. గురువారం మరో మారు స్థానిక అడవిలోకి మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పెద్దపులి ఆవుపై దాడి చేస్తున్న సమయంలో స్థానిక రైతులు గట్టిగా కేకలు వేయడంతో పెద్దపులి ఆవును వదిలి అడవిలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు.

July 3, 2025 / 05:14 PM IST

ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ధర్నా

W.G: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామ కాలువ గట్టుపై నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలంటూ సీపీఎం నాయకులు, బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బొడ్డుపల్లి రాంబాబు పాల్గొన్నారు.

July 3, 2025 / 05:12 PM IST

6న వేంపల్లిలో జాబ్ మేళా

KDP: వేంపల్లిలో ఈనెల 6వ తేదీన జాబ్ మేళా జరగనుంది. డిక్సన్ టెక్నాలజీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి( బీటెక్ రవి )వెల్లడించారు. ఆరోజు జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు హాజరు కావాలని పేర్కొన్నారు.

July 3, 2025 / 05:11 PM IST

‘5న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం’

E G: ఈ నెల 5వ తేదీన గోపాలపురం నియోజకవర్గ YCP విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలపురం YCP ఇంఛార్జ్ మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు బియర్నగూడెంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా YCP అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, జక్కంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్ తదితరులు హాజరవుతారన్నారు.

July 3, 2025 / 05:11 PM IST

‘పంచాయతీ కార్యదర్శులు పనివేళలు పాటించాలి’

VZM: గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా కార్యాలయ పనివేళలు పాటించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. గురువారం ఆమె MPDO, EO PRD, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

July 3, 2025 / 05:10 PM IST