NLR: చేజెర్ల మండలం నేర్నూరు, చిత్తలురూ గ్రామాలలో NFSM క్లస్టర్ డెమోస్ జొన్న, శెనగ పంటలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ADA (R) శివనాయక్, మండల వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చవుడును నిర్ములించాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO L.సుజాత, VAAలు నాగభూషణం, ఝాన్సీ, రైతులు పాల్గొన్నారు.
GNTR: వాణిజ్య పంటల అభివృద్ధికి కేంద్రం కొత్త మిషన్పై దృష్టి సారించింది. పత్తి, మిర్చి వంటి పంటలను ఒకే చట్రంలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇది అమలైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు పెద్ద లాభం చేకూరనుంది. గుంటూరు మిర్చికి జాతీయ స్థాయి మద్దతు లభించే అవకాశం ఉంది. పరిశోధనలు, ఎగుమతులు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
VSP: రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నట్లు సమాచారం. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1,500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటీసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts, 7-లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.
TPT: శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాక గ్రామంలో టీడీపీ నాయకుడు వజ్రం కిషోర్పై దాడి జరిగింది. బంధువుల పొలం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లగా, స్థానికేతరుడివి నీకేం పని అంటూ ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కిషోర్కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ATP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకాన్ని యుద్ధప్రతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కమిటీల ఏర్పాటులో జాప్యం లేకుండా సమర్థులకు అవకాశం కల్పించాలని సూచించారు.
ELR: జిల్లాలో జనవరి 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ సోమవారం గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పశువులను పరిశీలించి అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తాం అన్నారు. జిల్లాలోని ప్రతీ పాడిరైతు ప్రయోజనం పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
W.G: కొత్త ఉపాధిహామీ పథకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పొట్టకొడుతున్నాయని సీపీఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వీరవాసరం మండలంలోని ఉత్తరపాలెం, మత్యపురి పాలెం, మత్యపురి, గ్రామాల్లో ఉపాధి పథకం చట్టం పై అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
కర్నూలు: ప్రతి కుటుంబ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేయడమే లక్ష్యంగా ఏకీకృత కుటుంబ సర్వే చేపట్టినట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం తెలిపారు. డిసెంబర్ చివరి వారం నుంచి నగరవ్యాప్తంగా ఇంటింటా సర్వే జరుగుతోందన్నారు. అర్హులకు భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అందించేందుకు ఈ ప్రక్రియ కీలకమని పేర్కొంటూ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.
KKD: పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు చించివేశారని జనసేన నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షలకు పాల్పడటం సరికాదని, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.
PPM: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజల ముంగిటకే’ కార్యక్రమంలో ఆయన నేరుగా వినతులు స్వీకరించారు. వచ్చిన 15 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
VZM: మండల కేంద్రమైన మెరకముడిదాం ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు ప్రమాదకరంగా పడి ఉన్నాయి. విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు పడి ఉండడంతో కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ వైర్లపై పడిన చెట్టు కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.
కోనసీమ: అయినవిల్లి మండలం కొండకుదురు గ్రామంలో గోదావరి నది కోత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సారవంతమైన భూములు నదిలో కూలిపోతున్నాయి. కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోత నివారణకు చర్యలు తీసుకుంటామని పాలకులు చెబుతున్న ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యమని రైతులు వాపోతున్నారు.
PLD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై నరసరావుపేట కలెక్టరేట్లో ‘దిశ’ కమిటీ కీలక సమావేశం సోమవారం నిర్వహించింది. కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు,ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లాలోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
సత్యసాయి జిల్లాలోని పెనుకొండ వద్ద ఉన్న కియా అనుబంధ పరిశ్రమ జిన్ మ్యూంగ్ టెక్ ఇండియా లిమిటెడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్లకు సంబంధించిన స్టీల్ ప్లేట్ల కటింగ్, మౌల్డింగ్ పనులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
BPT: సంతమాగులూరు మండలం ITDP ఉపాధ్యక్షుడిగా కొప్పరం గ్రామానికి చెందిన నియమితులయ్యారు. ఈ మేరకు ఈ విషయాన్ని సంతమాగులూరు మండల TDP మండల అధ్యక్షులు వాసిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు కృషి చేస్తానని ఉపాధ్యక్షుడు మొగలి సుబ్బారావు తెలిపారు.