KRNL: ఆస్పరిలో శుక్రవారం భారత్ గ్యాస్ వినియోగదారులు ప్రమాదం అంచున ఉండి గ్యాస్ సిలిండర్లను తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆస్పరి నుంచి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ రహదారి పక్కనే ఉన్న RJR ఫంక్షన్ హాల్ దగ్గర గ్యాస్ సిలిండర్లతో వచ్చిన వాహనం ఆపి, గ్యాస్ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ రహదారిలో రద్దీ మరింత పెరిగింది.
తిరుపతిలో జరిగిన సమావేశంలో జిల్లా YCP నేత భూమన బూత్ లెవల్ నాయకులు, కార్యకర్తలకు పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని, డబుల్ ఓటింగ్ నివారించడానికి, ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి మీటింగ్ కి హాజరు కావాలని కోరారు. బీఎల్డీ ద్వారా లేనివారిని గుర్తించి డిలీట్ చేయడం,దొంగ ఓట్లను కట్టడి చేయడం అవసరమని రోజా స్పష్టం చేశారు.
ASR: విద్యార్థులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డుంబ్రిగుడ ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. శుక్రవారం స్థానిక ఏకలవ్య మోడల్ రెషిడెన్సియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. బాలికలు, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
GNTR: పొన్నూరు డంప్యార్డ్లో పేరుకుపోయిన అరటి వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అరటి తొండమాలను చిన్న ముక్కలుగా చేసే ‘బనానా స్టెమ్ కట్టర్’ యంత్రం కొనుగోలుకు ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ రూ.25 వేల విరాళాన్ని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబుకు అందజేసింది. ఈ యంత్రం ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చవచ్చని, తద్వారా తరలింపు సులభమవుతుందని అధికారులు తెలిపారు.
ATP: గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి పామిడి మండలం జి కొట్టాల గ్రామంలో సుదర్శన్ రెడ్డి అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి అక్కడికి వెళ్లి మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
CTR: సోమల మండలం పెద్దఉప్పరపల్లి M.P.P. స్కూల్లో ఈనెల 22న ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు శుక్రవారం నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం పుంగనూరులో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానా బాల గణేష్, రాజారెడ్డి మాట్లాడారు. దగ్గర చూపు, దూరపు చూపు, కంటి పొర ఇలా కంటికి సంబంధించి వివిధ జబ్బులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
BPT: అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని సింగరకొండ బ్రాహ్మణ సత్రంలో జమ్మలమడక కుటుంబం నిర్వహించిన ఉపనయన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వేద పండితుల ఆశీస్సులు తీసుకుని, బాలుడికి ఆశీర్వాదాలు అందించారు.
సత్యసాయి: రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి వద్ద అధిక ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఎనిమిది స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో ప్రయాణం కష్టంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన ప్రమాణాలతో అవసరమైన చోట్ల మాత్రమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కృష్ణా: గుడివాడలో వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో గవర్నమెంట్ హాస్పిటల్ టీమ్, బాపూజీ నగర్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో బాపూజీ నగర్ స్టార్స్ జట్టు విజయం సాధించింది. విజేతలకు జనసేన ఇంఛార్జ్ శ్రీకాంత్ కప్ను అందజేశారు.
కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కొత్తపేట MLA బండారు సత్యానందరావు ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించి, పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
NLR: ఆత్మకూరులోని ఈద్గా మైదాన్లో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగించి షామియానాలు ఏర్పాటు చేశారు. నమాజ్కు వచ్చే వారికి తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు 5,000 మంది ప్రార్థనలు చేసేందుకు వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలో గేట్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు శుక్రవారం హెచ్చరించారు. ఓ మహిళా చిరు వ్యాపారి వద్ద రూ. 40 వసూలు చేసిన ఘటనపై స్పందించి మార్కెట్ను సందర్శించారు. రూ. 2 వసూలు చేయాల్సిన చోట అధికంగా వసూలు చేస్తున్నారని చమర్తికి మండిపడ్డారు.
ASR: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
SKLM: టీడీపీ పార్టీకి నిబద్ధతతో సేవలందించిన మోహన్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని స్థానిక ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అతని పాడెను స్వయంగా మోశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఏలూరు జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని అన్నే భవనంలో అకాల వర్షాల పంట నష్టాలపై ఆయన మాట్లాడారు. నిన్న, మొన్న కురిసిన అకాల వర్షాలకు, ఈదురు గాలులకు జిల్లాలో అనేక తోటలు నేలకొరిగాయి చెప్పుకొచ్చారు.