W.G: ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఈవో రంగరాజు అన్నారు. గురువారం యలమంచిలి మండలంలోని కొంతేరు హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25వరకు జరిగే ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
CTR: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని టీడీపీ నాయకులు సి.వి.రెడ్డి, గిరిబాబు ఆకాంక్షించారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 74 మందికి విద్యార్థినులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
CTR: బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా, కార్యక్రమానికి ఆదితోపాటు మరో నటుడు రాంప్రసాద్ సైతం రానున్నారు.
TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు అందిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడ్డారు. చిన్నారుల తల్లి, తండ్రులు తక్షణమే తమ పిల్లలను స్వయంగా మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
PPM: వీరఘట్టం పంచాయతీ కార్యాలయం వద్ద ఓమిగో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాన్సర్ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. క్యాన్సర్ను ప్రాథమిక దశల్లో గుర్తించడం ద్వారా కాపాడుకోవచ్చని అన్నారు.
VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ని తొలగించి వాటిని రోడ్డు రోలర్తో ధ్వంసం చేశామన్నారు.
SKLM: డీ-మత్యలేశం ప్రజల నిజ జీవితం ఆధారంగా తండేల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మత్స్యకారుల జీవితాలను ప్రపంచానికి చూపించిన చిత్ర బృందం, నటీనటులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అభినందనలు తెలిపారు. అలాగే అసలైన తండేల్ రామారావు దంపతులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో గురువారం సత్కరించారు.
VZM: ఇమామ్, మౌజాన్ల గౌరవ వేతనాన్ని గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లులను విడుదల చేశారని విజయనగరం ఎమ్మెల్యే అతిది గణపతిరాజు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తప్పుడు హామీలిచ్చారన్నారు.
SKLM: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులకు ఇచ్చే దోబీలు, బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలను గురువారం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజక వృత్తుల వారికి కేటాయించిన దోబిలకు అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలకు రహదారి సౌకర్యాలు కలిపిస్తున్నామన్నారు.
ASR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్ అన్నారు. గురువారం హుకుంపేట మండలం ఉప్ప గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సత్యారావుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలన్నారు
CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.
పల్నాడు: మాజీ కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. ఆయన వర్దంతిని చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల కోసం, పార్లమెంటులో నైతిక విలువల కోసం ఆయన జీవితాంతం కృషి చేశార...
TPT: తిరుమలలో మరోసారి విమానం కలకలం సృష్టించింది. ఆలయ గాలిగోపురం మీది నుంచి ఫ్లైట్ వెళ్లడంతో అధికారులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా ఇటీవల కూడా తిరుమల ఆలయం పైన విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తరచూ విమానాల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది.