• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

KDP: రేపు ఉదయం 10:30 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమావేశపు అజెండాను కౌన్సిలర్లు, సభ్యులకు పంపామన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

February 20, 2026 / 02:49 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా’

E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని రూడా ఛైర్మన్, జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కోరుకొండ మండలం బూరుగుపూడిలో పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి సమస్యను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామన్నారు.

February 20, 2026 / 02:48 PM IST

‘ఈనెల 28లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి’

ASR: పట్టాదారు పాసుపుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతిరైతూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు మండల వ్యవసాయ అధికారి పీ. శివరామ్ ప్రసాద్ సూచించారు. డౌనూరు పంచాయతీలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ శుక్రవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈనెల 28లోగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు.

February 20, 2026 / 02:47 PM IST

శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న TG సీపీ సజ్జనార్

అన్నమయ్య: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ దంపతులు శుక్రవారం రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ మనోజ్ కుమార్, ఈఓ రమణారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:44 PM IST

‘అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి’

NDL: అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని డిప్యూటీ ఎంపీడీవోలు మల్లికార్జున పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు స్వర్ణ పంచాయతీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం పంచాయతీ పరిధిలో 100% ఇంటి పన్నుల వసూలు, ఆదాయం మార్గాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.

February 20, 2026 / 02:42 PM IST

పొన్నూరులో కంపోస్ట్ పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF సెంటర్‌లో పొడి వ్యర్థాల వర్గీకరణ తీరును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:40 PM IST

‘చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలి’

W.G: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబుని కలసి చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో, మారుమూల ఉండటం వలన సరైన ప్రయాణ సాధనాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం అందుకు అవసరమైన చర్యలు చేపడతామని కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు.

February 20, 2026 / 02:40 PM IST

ఆర్థిక సాయం చేసిన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారానికి చెందిన నిరుపేద నంచర్ల రాము కుమార్తె ఉమ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:39 PM IST

మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

W.G: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారని అన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

కొత్తవలస ఎమ్మార్వోగా రామలక్ష్మీ

VZM: కొత్తవలస మండల రెవెన్యూ అధికారిణిగా ఎస్. రామలక్ష్మీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోమవారం లేదా గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆ స్థానంలో విధులు నిర్వహించిన అప్పలరాజు జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

February 20, 2026 / 02:35 PM IST

యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

CTR:”ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు” అనేది ప్రతి విద్యార్థి నినాదం అవ్వాలని డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ పిలుపునిచ్చారు. కార్వేటినగరంలోని ఐటీఐ కళాశాలలో నగరి డీఎస్పీ, సీఐ హనుమంతప్ప, ఎస్సై తేజస్విని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే ర్యాగింగ్‌కు కళాశాలల్లో చోటు లేదని స్పష్టం చేశారు.

February 20, 2026 / 02:32 PM IST

తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించిన దద్దాల

ప్రకాశం: కనిగిరి 9 వ వార్డుకు చెందిన సయ్యద్ ఆలీ కుమారుడు తౌషిక్ సింగరాయకొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఎంతో బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

February 20, 2026 / 02:32 PM IST

యాప్ ద్వారా కిసాన్ డ్రోన్ బుకింగ్

SKLM: రైతులు కిసాన్ డ్రోన్ సేవలను సులభంగా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించిందని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు శుక్రవారం తెలిపారు. ప్లే స్టోర్‌‌లో లభ్యమయ్యే ‘డ్రీన్ మాట్’ యాప్‌‌ను డౌన్‌ లోడ్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీని ఆధారంగా రైతుల అవసరాలకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:32 PM IST

భవిత సెంటర్ అకస్మిక తనిఖీ

E.G: గోకవరం మండల కేంద్రంలో సర్వ శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత సెంటర్‌ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కనక బాబు శుక్రవారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవిత సెంటర్లో ( మానసిక విద్యార్థుల ) యాక్టివిటీస్‌ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ సేవలను విద్యార్థులకు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మద్దిపి గ్రామంలో కాలుష్య నీరు సమస్య

సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

February 20, 2026 / 02:30 PM IST